Tamil Nadu: Family Issues Woman Ends Her Life - Sakshi
Sakshi News home page

కొద్ది రోజులుగా స్విచ్‌ ఆఫ్‌.. వీడియో బయటకు రావడంతో

Published Thu, Aug 17 2023 1:40 PM | Last Updated on Mon, Aug 21 2023 11:16 AM

Tamil Nadu: Family Issues Woman Ends Her Life - Sakshi

తిరువొత్తియూరు: చైన్నె వ్యాసర్‌పాడిలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీడియో ఆధారంగా రెండో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె వ్యాసర్‌పాడి ఎంకేబీనగర్‌కు చెందిన ముత్తులక్ష్మి (38), సురేష్‌ దంపతులకు కుమారులు కృష్ణమూర్తి (19), రామమూర్తి (16) ఉన్నారు. వివాహమైన ఐదేళ్లకు సురేష్‌ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో 2019లో సుధాకర్‌ (36)ను రెండో వివాహం చేసుకుంది. కొద్ది రోజులుగా సుధాకర్‌ ముత్తులక్ష్మి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

తీవ్ర మనస్తాపం చెందిన ముత్తులక్ష్మి ఈ నెల 11వ తేదీ రాత్రి తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు కేబీనగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముత్తులక్ష్మి సెల్‌ఫోన్‌ కొద్ది రోజులుగా స్విచ్‌ ఆఫ్‌ అయి ఉండడంతో మంగళవారం ముత్తులక్ష్మి కుమారుడు కృష్ణమూర్తి తల్లి సెల్‌ఫోన్‌ను చార్జర్‌ చేసి ఆన్‌ చేశాడు.

తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన మృతికి సుధాకర్‌ కారణమని వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోను ఎంకేబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కృష్ణమూర్తి అప్పగించాడు. తన తల్లి మృతికి కారణమైన సుధాకర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు కారణమైన సుధాకర్‌ను బుధవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి:  నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement