ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణలో వ్యాపారం దృక్పధం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. రాజధాని ఏర్పాటు వల్ల దక్కే ప్రయోజనాలు రైతులకు మాత్రమే చెందాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ప్రకటన ద్వారా ఇందులో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. రాజధాని నిర్మాణం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్నారు. చట్టాలు ఉన్నది పేదల ప్రయోజనాల కోసంమేనని చెప్పారు. రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాలలోని చాలా మంది రైతులలో అయోమయ స్థితి నెలకొందని ధర్మాన పేర్కొన్నారు.
Published Tue, Dec 9 2014 2:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement