Dharmana Prasada Rao
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ):ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితమని, ప్రస్తుతానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికొస్తే దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందన్నారు. ఈ స్టాంపింగ్ విధానం టీడీపీ హయాంలో 2016లోనే పైలెట్ ప్రాజెక్టుగా మొదలైందన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. కరణాలు, మునసబులతో నడుస్తున్న వ్యవస్థను 1984లో రద్దు చేశారని, 1985ృ86లో విలేజ్ అసిస్టెంట్లను రిక్రూట్ చేసుకోవడంతో రెవెన్యూ వ్యవస్థలోకి వచ్చారని తెలిపారు. 1988 89లో కొంతమంది విలేజ్ అసిస్టెంట్లను నియమించారని, కరణాలు, మునసబుల్లో కొందరు 1992లో మళ్లీ విధుల్లోకి చేరారని, ఈ రకంగా అనేక మార్పులు చేయడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో రికార్డుల అప్డేషన్ సక్రమంగా జరగలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2002లో వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వీరందరినీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కలిపేశారని తెలిపారు. ఆ సమయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ బాధ్యతలను అనుభవం లేని పంచాయతీ సెక్రటరీలకు కూడా అప్పజెప్పడంతో చాలా తప్పిదాలు జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రెసెంపటివ్ ల్యాండ్ టైట్లింగ్ సిస్టమ్ వల్ల సబ్డివిజన్ పనులు, వంశపారంపర్యంగా వచ్చే మార్పులు, లావాదేవీలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయాలంటే దరఖాస్తుదారు పలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉందన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 (ఆర్ఓఆర్) అమలుపరిచిన ఈ చట్టం పూర్తిగా విజయవంతం కాలేదదన్నారు. భూముల నిర్వహణ, మార్పులు, కొనుగోలు అమ్మకాలు, అలాగే భూ రికార్డుల నిర్వహణ, వివాదాల పరిష్కారానికి ఒక సంపూర్ణ చట్టం అంటూ లేదన్నారు. వీటన్నింటి కోసం అనేక చట్టాల మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. చట్టాల్లో కొన్ని కేంద్రప్రభుత్వం, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు సవరణలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోందని తెలిపారు. 2003లో బయటపడిన తెల్గీ స్టాంప్ పేపర్స్ స్కామ్ భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసిందని పేర్కొన్నారు. ఈ స్కామ్తో స్టాంప్ పేపర్ల నిర్వహణలో ఉన్న లోపాలు బట్టబయలయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈృస్టాంపింగ్ ప్రక్రియను అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వాలు ఆలోచించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలోనే 2016లో ఈృస్టాపింగ్ పైలెట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారన్నారు. 2007లో ప్రపంచ బ్యాంకు అధ్యయన ప్రకారం మన దేశంలో సివిల్ కోర్టులందు ఉన్న కేసుల్లో 66% సివిల్ కేసులు భూతగాదాలకు సంబంధించినవేన్నారు. దేశంలో భూములకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించలేకపోవడం వల్ల, భూ యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు అధికంగా ఉండడంతో భూమిపై ఆధారపడి జీవించేవారి జీవన విధానం సరిగ్గా జరగడం లేదని భారత ప్రభుత్వము/నీతి ఆయోగ్ గ్రహించి, దీనిపై అనేక సమావేశాలు నిర్వహించి నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సంయుక్తంగా ఒక మోడల్ చట్టం, నిబంధనలతో తయారు చేసి డిసెంబర్ 2019 లో రాష్ట్రాలన్నింటికీ పంపించారన్నారు. దీని ఫలితంగా ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక ప్రత్యేక చట్టం అవసరమైందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ సంస్థలకు చెందిన భూములతో సహా, సమగ్ర సమాచార సేకరణ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు వివాదాలు లేని భూ యాజమాన్య హక్కులు నిర్ధారించుటకు ఈ చట్టం అవసరమైందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించే సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డులను తారుమారు చేసేందుకు అవకాశం లేని విధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ చట్టం ద్వారా రైతులకు, భూ యజమానులకు, భూభాగాలకు సంబంధించి పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి జరిగే మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయడమే కాకుండా హక్కుదారు భూ హక్కులను రక్షిస్తూ వివాదాలు లేని భూ పరిపాలన అందించడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో రెవెన్యూ రికార్డుల, భూహక్కుల పరిరక్షణ అంశంపై రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని భావించిందన్నారు. అన్ని స్తిరాస్థిలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ సంస్థలకు చెందిన భూముల సహా సమగ్ర సమాచార సేకరణ, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, వివాదాలు లేని భూయాజమాన్య హక్కులు నిర్ధారించుట జరుగుతోందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించు సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డ్స్ తారుమారు చేసేందుకు అవకాశం లేని రీతిలో నిర్వహించబడుతుందన్నారు. ∗ భూయాజమాన్య హక్కుల్లో జరిగే మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు రికార్డ్స్ నందు నమోదవుతూ ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగు సమస్యను తొలగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భూయాజమాన్య హక్కులకు సంబందించిన మార్పులు చేర్పులన్నీ నిర్ధారిత కాలవ్యవధిలో నమోదు చేస్తుందని పేర్కొన్నారు.∗ హక్కుదారుల భూహక్కులను పరిరక్షిస్తూ, వివాదాలు లేని భూపరిపాలన చేసేందుకే ఉపయోగపడుతుందన్నారు. ∗ ఈ చట్టం ద్వారా రైతులకు, భూయజమాన్యులకు, భూభాగానికి సంబందించి పూర్తి హక్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు.∗ ఈ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ తయారు చేయలేదని, ఈ చట్టం పరిధి (ఏరియాస్ కవర్డ్) ని నిర్ధారించలేదన్నారు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేసిన అధికారులను ఇంకా అపాయింట్ చేయలేదని, ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను,సూచనలను తీసుకొని అవసరమైన మార్పులను, చేర్పులను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూల్స్ తయారు చేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ∗ న్యాయవాదుల సంఘాలు, వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయగా ఆ పిటిషన్లన్నింటినీ విచారించి, ఈ చట్టాన్ని ప్రస్తుతం అమలుపరచడం లేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులను విచారిస్తూ, కొత్త కేసులను కూడా తీసుకోవాల్సిందిగా సివిల్ కోర్టులను ఆదేశించి ఉన్నారన్నారు. ఇంకా రీృసర్వే పూర్తి కాలేదని దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఏపి ప్రభుత్వం ఈ చట్టం అమలుపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేంద్ర నిర్ణయం
శ్రీకాకుళం క్రైమ్: నూతన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని చెప్పారు. అయినా మన రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పామని ధర్మాన స్పష్టంచేశారు. కానీ, కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలుచేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ నేతలు ఈ చట్టంపై వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘1989 నుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను దేశంలో అమలుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాయి. రకరకాల అ«ధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ వంటి ఉన్నతమైన సంస్థతో ఓ మోడల్ యాక్ట్ తయారుచేయించింది. అదే కొత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మాత్రమే మన రాష్ట్రంలో అమలుచేస్తామని గతంలోనే స్పష్టంగా చెప్పాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, ఇక్కడ అమలు చేయబోమని మరోసారి చెబుతున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐదేళ్లలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు అమలుచేశారు. వందేళ్ల తర్వాత చేపట్టిన భూ సమగ్ర సర్వే ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతోంది. దీనివల్ల భూ రికార్డులు అప్డేట్గా ఉంటాయి. కానీ టీడీపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక సర్వే రాళ్లపై వైఎస్సార్ బొమ్మ ఉందని విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్ బొమ్మ ఉంటే తప్పేంటని నేను ప్రశ్నిస్తున్నాను. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకువచ్చిన కార్ట్–2.0 అనే ప్రాజెక్టుపై విపక్షాలకు వత్తాసు పలికే మీడియా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. వాస్తవానికి దీనివల్ల ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజి్రస్టేషన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. గ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్ కార్యాలయాలు వచ్చి మొత్తం కంప్యూటరీకరణ జరుగుతోంది. ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగి ఈసీ జారీ చేయడం, స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ వంటివి అందుబాటులోకి వస్తాయి. ఇంతకుముందు ఐదేళ్లు పరిపాలించిన టీడీపీ ప్రభుత్వం రాజధాని వెనకపడి రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది.’ అని ధర్మాన తెలిపారు.జగన్ ఎలాంటివారు అనేది ఐదేళ్ల పాలనే చెబుతుంది ‘సీఎం వైఎస్ జగన్ భూములు తీసుకునేవారా.. భూములు పంచేవారా.. అన్నది ఈ ఐదేళ్ల పాలనే చెబుతుంది. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది వైఎస్ జగన్ కాదా.. అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవారిలా కనిపిస్తున్నారా..? రూ.12,800 కోట్లు ఖర్చు పెట్టి భూములు కొని 31లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవారిలా కనిపిస్తున్నారా..? రెండు లక్షల ఎకరాల శివాయ్ జమాదార్ (పేదల సాగులో ఉండి హక్కులు లేని) భూములకు పట్టాలిచ్చింది సీఎం జగన్ అని గుర్తుంచుకోండి. ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు చేసుకునే భావజాలం టీడీపీది. రైతులకు వ్యతిరేకంగా మేం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను.’ అని ధర్మాన ప్రసాదరావు స్పష్టంచేశారు. -
టీడీపీ కుట్రల వల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు చేసే టక్కు టమారాలు, దొంగవిధానాలు, అబద్ధపు హామీలు, బూటకపు కూటములు ఈ ఎన్నికల్లో పనిచేయబోవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ ఆదివారం పేట పరిసర ప్రాంతంలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. వలంటీర్లపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి, కుట్రలు కుతంత్రాలు పన్నిన కారణంగా పంపిణీలో జాప్యం చోటుచేసుకుందని మండిపడ్డారు. లబ్ధిదారులంతా ఇప్పుడు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. జాతీయ సంస్థల సర్వేల్లో ఏపీ బెస్ట్ 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిపై జాతీయ సంస్థలు అనేక సర్వేలు చేశాయని, జీఎస్డీపీ టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే ఈ ఐదేళ్లలో 5వ స్థానానికి వచి్చందన్నారు. తలసరి ఆదాయం 17 నుంచి 9వ స్థానానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఇవన్నీ అభివృద్ధి సూచికలు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్ను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్న సమయంలో 70 ఏళ్ల వృద్ధురాలు కూర్మాపు లకు‡్ష్మమమ్మ మధ్యలో లేచి మైక్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ‘మీ అందరికీ దండంబాబు.. ఏ దిక్కు మొక్కులేని నాకు జగన్బాబు దయవల్ల వలంటీర్ ఇంటికొచ్చి పెన్షన్, బియ్యం ఇస్తున్నారు. నాకు భర్తలేడు. కోడలు చనిపోయింది. నా కొడుక్కి, ఇద్దరు మనవళ్లకు నేనే గంజి పోస్తున్నాను. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్బాబును, పెసాదుబాబును గెలిపిస్తా’ అంటూ తన యాసలో చెప్పి అందరినీ ఆకట్టుకుంది. -
అసెంబ్లీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్
-
అసెంబ్లీ బరిలో అభ్యర్థులు వీళ్ళే..
-
చంద్రబాబు బీసీ వ్యతిరేకి: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: బీసీల వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకుండా.. జయహో బీసీ ఎలా అవుతుంది బాబూ? అంటూ ప్రశ్నించిన ధర్మాన.. బాబు మాటలతో సామాజిక న్యాయం జరగదు.. సీఎం జగన్లా చేతల్లో చూపిస్తేనే సాధ్యమవుతుందన్నారు. శ్రీకాకుళం టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఏమన్నారంటే.. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాయ మాటలు చెప్పే వారే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి హామీలు ఓటర్లకు ఇస్తారే తప్ప స్వతహాగా బ్యాక్ వర్డ్ క్లాస్ వాళ్లు సామాజికంగా ఎదగాలన్న ఆలోచన అన్నది ఆయనకు లేదు. వారికి అవసరం అయిన రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచన ఏనాడూ ఆయన చేయలేదు. చేయరు కూడా, అటువంటి దాఖలాలు కూడా లేవు. ఆయనేమీ ఇప్పుడొచ్చినటువంటి నాయకుడేమీ కాదు కదా ఆయన ఆల్మోస్ట్ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. నలభై సంవత్సరాలు రాజకీయాలలో అనుభవం ఉన్నవారు. ఆయన భావజాలం మీరు చూస్తే ఏనాడూ అతడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెబుతాను. ఈ దేశంలో రాజ్యసభకు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా బ్యాక్ వర్డ్ క్లాసెస్కు చెందిన వారిని చంద్రబాబు పంపించలేదంటేనే.. ఆయన రాజకీయ అధికారం బీసీలకు ఇస్తారంటే ఎవ్వరయినా నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలెవ్వరయినా, బ్యాక్ వర్డ్ క్లాసెస్కు చెందిన వారెవ్వరయినా నమ్ముతారా?. ఆయన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన రాజ్యసభకు నలుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్కు చెందిన వారిని పంపించారు. ఐదు సంవత్సరాలలోనే ఐదుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారిని పెద్దల సభకు పంపించారు. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు. ఏనాడయినా మీరు ఈ విధంగా రాజకీయ అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదే ? అంటే ఏంటి ?. చంద్రబాబు భావజాలంలోనే బ్యాక్ వర్డ్ క్లాసెస్కు చెందిన వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్న కోణం లేదు మొదట్నుంచి. వీళ్లకు అధికారం ఇచ్చి వాళ్లను బలోపేతం చేసే పనులు మీరు ఏనాడూ చేయలేదు. నేను ఎనలైజ్ చేసిన విషయాలైతే ఇవి. అధికారాన్ని అలాంటి వారికి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నారు మీరు. అందుకే ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవ్వరైనా అత్యున్నత న్యాయస్థానానికి బ్యాక్ వర్డ్ క్లాస్ వారు జడ్జీలుగా పనికి రారు అని ఉత్తరం రాస్తారా? అంటే కరడుగట్టినటువంటి బ్యాక్ వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీలో నాటుకుని ఉన్నాయి కనుక, అలాంటి పొజిషన్లలోకి బ్యాక్ వర్డ్ క్లాసెస్ వారు రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు మీరు. మీ పార్టీ పక్కన బెట్టండి. అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు వ్యతిరేకి మీరు(చంద్రబాబు). అది మేం చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కాని, గడిచిన ఐదేళ్లలో మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్గా చెబుతోంది కదా. నిన్న జయహో బీసీ అని అన్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఇస్తే ఆటోమెటిక్ గా సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది. బ్యాక్ వర్డ్ క్లాసెస్కు సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, తెలుగు దేశం పార్టీకీ ఒక డిబెట్ కనుక మీరు పెడితే,డిబెట్కు మీరు వస్తామన్నా, మీ తాలుకా వ్యక్తులు ఎవ్వరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేందుకు సిద్ధం. ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్దంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారం ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగించి, సామాజిక న్యాయం అందించినటువంటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరెవ్వరయినా చర్చకు వస్తే, మాట్లాడేందుకు నేను సిద్ధం. మీరెవ్వరని అయినా చర్చకు పంపించినా,లేదా మీరొచ్చినా మాట్లాడేందుకు నేను సిద్ధం అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఒక వేదిక మీదకు రావాలని చెబుతున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు. చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ, ఎన్నికలు అయిపోయాక అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర. ఇలాంటి జయహో బీసీ సభలు ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నిక అయిపోగానే సంబంధిత కాగితాలు చింపి అవతల పారేశారు. డిక్లరేషన్ల ఊసే లేదు. ఇవాళ మిమ్మల్ని నమ్మమంటే ఏ బీసీ నమ్ముతాడు. మా పార్టీలో లోక్సభలో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు, నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. బీసీలకు చెందిన వారే వారంతా. చూస్కోండి. ఎప్పుడయినా మీరు ఆ విధంగా పార్లమెంట్కు సంబంధించి ఎగువ సభకు కానీ దిగువ సభకు కానీ ఆ విధంగా పంపగలిగారా ? అని ప్రశ్నిస్తున్నాను. చేయగలిగారా ?.11 మంది మంత్రులు రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నారు. సరే ఇతర కార్పొరేషన్లు అంటే యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సంబంధిత వర్గాలకు లీడర్ షిప్ ఇచ్చారు. మీరు దానిని విమర్శిస్తారు. విమర్శించడం కాదు లీడర్ షిప్ను డెవలప్ చేయాలి. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు, బడ్జెటింగ్ వీటికి సంబంధించిన సమాచారం తదితర వివరాలు తెలుసుకునేటటువంటి లీడర్ షిప్ను డెవలప్ చేయాలి. మీరెప్పుడూ అది చేయలేదే ? ఎన్నికలు వస్తున్నాయి కనుక జయహో బీసీ అంటే అవుతుందా ? నిజంగా మీరెప్పుడయినా బీసీ సంక్షేమం కోసం పాటుపడ్డారా? పాల వ్యాపారం చేసుకునే వారుంటే వారికొక డొక్కు సైకిల్ ఇవ్వడం, ఇస్త్రీ పెట్టె ఇవ్వడం.. వాటిపై మీ బొమ్మలు వేసుకోవడం..ఇవా బీసీల సామాజిక స్థితిగతులు మారడానికి సహకరిస్తాయా ? ఇవి కాదు కదా ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికంగా వారిందరికీ చేయూత ఇవ్వగలగాలి. కానీ ఆ రోజు ప్రొగ్రాంలు పెట్టడం వాటిలో కొన్నింటిని మాత్రం పంచి మిగిలినవి సొంత మనుషుల ఖాతాల్లోకి చేర్చేయడం వంటి పనులెన్నింటినో గత ప్రభుత్వ హయాంలో మీరు చేశారు.అలాంటివి మీరు ఈ ఐదేళ్లలో చూశారా ? డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు ఇచ్చిన డబ్బెంతో తెలుసా ? లక్షా 22 వేల కోట్ల రూపాయలు అందించాం. ఇంత మొత్తాన్ని బ్యాక్ వర్డ్ క్లాసెస్ అకౌంట్లలోకి చేరవేశాం. ఇందుకుగాను మీలా ఏ ఒక్కరు కూడా ఒక్క నయాపైసా లంచం అని,కమీషన్ అని,మధ్యవర్తి అని లేకుండా చేశాం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాన్ డీబీటీ ఇంకా వేరుగా ఉంది. మీరు సబ్ ప్లాన్ అంటున్నారు. సబ్ ప్లాన్ అంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి చూపించిన ప్రభుత్వం ఇది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. ఆ అర్హత మీకు లేదు. వెనుకబడిన వర్గాలను మోసగించినటువంటి ప్రభుత్వం మీది. ఇప్పటికీ మీరు అదే చెబుతారు సైకిళ్లు ఇస్తాం..డొక్కులు ఇస్తాం.. కత్తులు ఇస్తాం అని చెబుతారు. ఇవి కాదండి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. రాజకీయ స్వాతంత్ర్యం కావాలి. సమాజంలో వారి స్థితి పెరిగేందుకు ఏమయినా అవకాశం ఉంటే అందుకు తగ్గ పనులు చేయగలగాలి. నాయీ బ్రాహ్మణులను తీసుకోండి. వారి ఆర్థిక స్థోమత పెరిగేందుకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి సహకారం అందించాం. వారికి ఒక క్షౌరశాల ఉంటే డైరెక్టుగా డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేశాం. ఏడాదికి పదివేలు రూపాయలు అందించాం. వారి విద్యుత్ బిల్లులను కొంత తగ్గించి,ఊరట ఇచ్చాం. చేస్తున్న వృత్తికి సంబంధించి ఛార్జీలు పెంపు చేసేందుకు అనుమతి ఇచ్చాం. వృత్తిని ఎవ్వరైనా అగౌరవ పరిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరించాం. ఇవాళ ప్రతి దేవాలయంలో చివరికి తిరుపతిలో కూడా ఓ నాయీ బ్రాహ్మణుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్ గా ఉండే అవకాశం ఇచ్చాం. ఇది కదా సామాజిక న్యాయం అందించడం అంటే.. అని మీకు విన్నవిస్తూ ఉన్నాను. మీరు మామాలుగా మాటలు చెబితే సామాజిక న్యాయం దక్కదు. అలానే తీసుకోండి ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి. శెట్టి బలిజలలో రాజ్యసభ మెంబర్ ఉన్నారు. యాదవులకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్లు. అసెంబ్లీలో ఎన్నడూ లేనివిధంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు సీట్లు ఇచ్చింది. ఏనాడూ చంద్రబాబును ఈ పద్ధతుల్లో చూడలేదే ? ధనవంతులను ఎంపిక చేసే పనిలోనే చంద్రబాబు ఉన్నారే తప్ప నిజమయిన సంప్రదాయ రీతులలో ప్రజల తరఫున పోరాడుతున్న బ్యాక్ వర్డ్ క్లాసెస్ లీడర్లను ఎప్పుడూ ఆయన గుర్తించ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ అంటారు. ఎందుకు అంటారో తెలియదు. ? ఏ వర్గం ప్రయోజనం ఆశించి అంటారో కూడా తెలియదు ? ఏమిటి బీసీ ? ఏమిటి జయహో బీసీ ? మీరు చెప్పండి. రాజ్యాధికారం దక్కించడంలో విశాల భావం ఉండాలి. మీకు ఆ దృక్పథం లేదు. మీ మాటలను ఎవ్వరూ నమ్మే విధంగా ప్రజలు లేరు అని మనవి చేస్తున్నాను. ఎంత కాంట్రడక్షన్ ఉంది మీ మాటలలో.. జగన్ పాలకు సంబంధించి మొదటి ఏడాది మీరు ఏం చెప్పారు ? ఆ రోజు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు సాధ్యం కాదని చెప్పారు. అనుభవం ఉన్నవాడిగా చెబుతున్నాను ఇవన్నీ అసాధ్యం అని చెప్పారు. అమలు చేస్తున్న సందర్భంలో మళ్లీ మాట మార్చారు. ఇంకెన్నాళ్లు చేస్తారు మరో ఆరు మాసాలలో సంక్షేమ పథకాల అమలు ముగిసిపోతుంది మరి చేయలేడు అని చెప్పారు. అయినా మీరు చెప్పిన విధంగా ఆగిపోలేదు. జగన్ పాలనలో రెండున్నర, మూడు సంవత్సరాల తరువాత మళ్లీ మీరు చెప్పారు. ఇలా చేసుకుంటూ పోతున్నారు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని.. వెనుజులా అవుతుందని... దివాలా తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ప్రకటించిన సూచీలు (ఇండికేటర్స్) మీరు చూస్తే జీడీపీ బ్రహ్మాండంగా మీ టీడీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ వృద్ధి మా ప్రభుత్వంలో నమోదు చేసింది అని కేంద్ర ప్రభుత్వ సూచీలు చెబుతున్నవి. అన్ని రంగాలలో మీ కంటే అనేక స్థాయిలలో వృద్ధి పెరిగి అనేక రాష్ట్రాలను నెట్టుకుని ముందుకు వచ్చింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. మరి మీరేమో ఈ రాష్ట్రం వెనుజులా అయిపోందని అన్నారు. శ్రీలంక అయిపోతుందని అన్నారు. నాలుగేళ్లు అయిపోయింది. అప్పుడు మళ్లీ మీరు మాట మార్చారు. రాజమండ్రిలో సభ పెట్టి నేను కూడా ఇంత కన్నా ఎక్కువ ఇస్తానని మాట మార్చారు. ఆ నాలుగు సంవత్సరాలలో నాలుగు దఫాలుగా మాట మార్చారు. ఇప్పుడు ఐదో సంవత్సరం చెప్పినటువంటి మాట మార్చరని ఏంటి గ్యారంటీ ? ఇప్పుడు జయహో బీసీ అంటూ చెబుతున్న మాటలు మార్చరని ఏంటి గ్యారంటీ ? మీరు సిగ్గుపడడం లేదా దీనికి. అనుభవం లేని వారా మీరు ? ఇప్పుడే మీరు పార్టీ పెట్టారా ? మీదేమయినా కొత్త పార్టీనా ? ఈ రాష్ట్రానికి ఏమి వనరులు సమకూరుతాయి అన్నది మీకు బాగా తెలుసు కదా..ప్రభుత్వంలో బడ్జెటింగ్ ఎలా ఉండాలి ? దానికి లిమిటేషన్లు ఏంటన్నవి ? మీకు బాగా తెలుసు కదా..ఎందుకు మీరు చేయలేకపోయారు. చేయలేకపోయారు అంటే మీ భావజాలంలోనే ఆ విధం అయిన ఆలోచన లేదు అని అంటాను నేను. ఆ విధం అయిన దృక్పథం మీలో లేదు అని అంటాను నేను. ఎప్పుడూ మీరు చెప్పుకునే మాటలకూ చేతలకూ సంబంధమే ఉండదు. అభివృద్ధి అంటే ఓ కుటుంబం అన్ని రంగాలలో సాధించినటువంటి అభివృద్ధిని మీరు చూడడమే లేదు. ప్రపంచంలో ఉన్న సంస్థలన్నీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అభివృద్ధికి..? వారు ఆరోగ్యంగా జీవించే స్థితి ఉండాలి. చక్కగా చదువుకుని పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలను అందుకునేటటువంటి విద్యా విధానం ఉండాలి. మంచి పోషకాహారం లభించాలి. నివాస యోగ్యం అయిన ఇల్లు ఉండాలి. పరిసరాలు బాగుండాలి. మంచి నీరు ఉండాలి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి అనేదానికి అర్థం ఏముందని ? ఇవేవీ కాకుండా ఎవరి కోసం అభివృద్ధి. అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఏ కొద్దిమంది ధనవంతుల కోసమో..పెద్ద పెద్ద భవంతులు చూపించి,రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటటువంటి మీ తత్వానికి మీ సిద్ధాంతానికి మా పార్టీ సిద్ధాంతానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతానికి ఎక్కడా పొంతనా లేదు. జగన్ గారి పాలన రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగిన పాలన.ప్రపచంలో ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలుకా జీవన ప్రమాణాలు పెంచే పాలన. మీకూ మాకూ ఎక్కడా పొంతన లేదు. ఈ విషయమై మీరు వైఎస్సార్సీపీ తో పోల్చి చూసుకోకూడదు. మీకు సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలం వేరు. మీ భావజాలంలో ప్రజలకు మేలు చేద్దాం జీవన ప్రమాణాలు పెంచుదాం అన్నవి లేవు. ఇటువంటి ఉన్నత స్థాయి ఆలోచనలు లేనే లేవు. మీరు ఇవ్వలేరు. ఇదే మాట నేను పదే పదే చెబుతున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడూ చేయలేదు. మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కూటమి. ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల జీవన ప్రమాణాలను మీరు పెంచలేరు. మీ చుట్టూ ఉన్న కోటరీని మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల విషయమై ఆలోచన చేయలేరు. ఇదే విషయం అన్నింటా కనిపిస్తూనే ఉంది గత పాలనలో మీరు అందించిన పాలనలో. అందుకే అప్పుడూ ఇప్పుడూ అవే మాటలు చెబుతున్నారు. అత్యంత వెనుకబడిన నార్త్ కోస్టల్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాం అంటే మీరు అంగీకరించడం లేదు. మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్ ? విశాలం అయిన భావం ఎక్కడుంది మీకు. అందుచేత జయహో బీసీ లేదు.మీ కపట మాటలూ ఎవ్వరూ నమ్మరు. మీరు చెప్పే మాటలు అన్నీ ఎన్నికల్లో ఓటు పొంది తద్వారా అధికారం దక్కించుకునేందుకు కాక మరొకదానికి కాదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోయేందుకు ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు. మీరు కనుక చర్చకు వస్తే,ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో వాదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేసిన పొరపాట్లు అన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచీలు నేను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ జయహో బీసీని ప్రజలెవ్వరూ నమ్మవద్దు అని సూచన చేస్తూ బ్యాక్ వర్డ్ క్లాస్ కు చెందిన నేతగా, చాలా కాలం ప్రభుత్వాలలో పనిచేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. టీడీపీ జయహో బీసీలో కపటం ఉంది. అందులో మాయ ఉంది. అందులో మోసం ఉంది. అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయి తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం,రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించే ఆలోచనలు అందులో లేవు. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయకత్వానికి లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. -
చంద్రబాబుకు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్
-
శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో మంత్రి ధర్మాన పర్యటన
-
అభివృద్ధి మీ కళ్లకు కనిపించడం లేదా చంద్రబాబూ..: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో అభివృద్ధి చూసి ప్రతిపక్ష నేతలు మాట్లాడాలంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లని.. కళ్లు ఉన్నా చూడలేని వాళ్లని.. చెవులు ఉండి వినలేని వాళ్లని, నిద్ర నటించే వాళ్లను ఏం అనగలం అంటూ ఆయన దుయ్యబట్టారు. శ్రీ పురం(సానివాడ) పంచాయతీలో రూ. 80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాష్ట్రం కోసం మాట్లాడుతున్న విపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్లో (పక్క రాష్ట్రంలో) ఉంటున్నారు. ఆయన వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రంలో ఉంటే అదనంగా ఇక్కడ సీఎం పదవి కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ‘‘ఇవాళ మన రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అంట! టీడీపీ యువ నాయకుడు లోకేష్ చెబుతున్నారు. పథకాల అమలులో భాగంగా గ్రామాల్లో ఏనాడైనా వర్గాలు చూశామా ? పార్టీ చూశామా ? ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులా? కాదా ? అన్నదే చూశాం. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఎందుకు ఈ మాట చెప్పలేకపోయారు. చెప్పు లోకేష్..?’’ అంటూ మంత్రి ధర్మాన నిలదీశారు. ‘‘గత టీడీపీ హయాంలో జన్మభూమి కార్యకర్తలు దోచుకున్నారు. పథకాల వర్తింపు కోసం ప్రజలు అర్జీలు పెట్టుకుంటే కలెక్టర్లు సైతం జన్మ భూమి కమిటీ సభ్యులను కలవమని చెప్పేవాళ్లు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటు వేసి అధికారంలోకి వచ్చి చంద్రబాబు చేసిన పని ఏముందని? ఇవాళ వివక్ష, కక్ష సాధింపు ఉన్నాయని అంటున్నారు లోకేష్. గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది వాస్తవాలేంటన్నది. ప్రజలకు లోకేష్,చంద్రబాబు ఎప్పుడో దూరం అయిపోయారు. కేవలం ఏబీఎన్, ఈనాడు, టీవీ5 మీడియాలతో మాత్రమే వారిద్దరూ బతుకుతున్నారు’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని అంటున్నారు. ఇవాళ విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి, ఇంటర్నేషనల్ సిలబస్ తీసుకు వచ్చి పాఠాలు చెప్పిస్తున్నాం. కానీ వాస్తవాలు గుర్తించకుండా ఆ ఇద్దరూ (చంద్రబాబు, లోకేష్) అబద్ధాలు, అన్యాయాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. కొంతమంది సినీ యాక్టర్లు వస్తుంటారు. వాళ్లంతా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. వాళ్లే వలంటీర్లు వద్దని అంటున్నారు. వలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏంటన్నది పక్క రాష్ట్రంలో ఉన్నవారికి ఏం అర్థం అవుతుంది? ఈ రోజు ఇంతమంది సంతోషంగా ఉంటున్నారంటే దానికి కారణం జగన్ ప్రభుత్వం కాదా.. అందరి క్షేమం కోరుకున్నది,అందుకు తగ్గ విధంగా పాలన చేస్తున్నది జగన్ ప్రభుత్వం కాదా.. టీవీలలో, పత్రికల్లో ఈ ప్రభుత్వంపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను అందరూ తిప్పి కొట్టాలి. మాట్లాడితే చాలు జగన్ డబ్బులు పంచేస్తున్నారు.. పంచేస్తున్నారు.. అంటున్నారే కానీ ఆయనను ఉద్దేశించి.. తినేస్తున్నారు..తినేస్తున్నారు అని అనడం లేదు ఎందుకు..? ఈ ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టాం. చంద్రబాబు ఇంతకు ముందు ఐదేళ్లలో ఏం చేశారో చెప్పగలరా..? కిడ్నీ బాధితుల కోసం 200 కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్ను పలాసలో నిర్మించాం. ఉద్దాన ప్రాంతానికి రక్షిత మంచి నీటి పథకం 700 కోట్ల రూపాయలతో అందించాం. అలానే 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూలపేట పోర్టు నిర్మాణపు పనులను త్వరలో పూర్తి చేస్తాం. బుడగుట్ల పాలెంలో 350 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం దిద్దాం. ఇవన్నీ ఐదేళ్లలో మేం చేశాం. విపక్ష నేత చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ వారి హయాంలో ఏం చేశారో చెప్పగలరా.?’’ అంటూ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చాం. 56 వేల ఉద్యోగాలను వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేశాం. వీటి విషయమై ఎవరైనా, ఎక్కడైనా లంచం ఇచ్చారా? పథకాల అమలు కోసం లేదా ఇతర అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులు చేశాం. వారు దోచుకు తింటే.. ఈ ప్రభుత్వం హయాంలో ప్రజల ఖాతాల్లోకి నగదు వేసి ఆ కుటుంబం బాగుండాలి అని భావించాం. గత పాలకులు రాష్ట్ర ఖజానాను లూటీ చేశారు. వంశధార ప్రాజెక్ట్ కోసం.. ఒడిశాతో ఉన్న వివాదం నేపథ్యంలో పరిష్కారం కోసం సీఎం జగన్ చొరవ చూపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను కలిశారు. నేరడి బ్యారేజీ విషయమై చర్చలు చేపట్టారు. అయిన కూడా ఆ వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో గొట్టా దగ్గర లిఫ్ట్ పెట్టి ప్రాజెక్ట్ను నింపబోతున్నాం. 185 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పూర్తి అవుతాయి. ఇదంతా సీఎం జగన్ చేసిన కృషి కాదా..? ఇది కాదా అభివృద్ధి..? అని నేను మిమ్మల్నిఅడుగుతున్నాను. కొంతమంది కళ్లు ఉన్నా చూడలేని, చెవులు ఉండి వినలేని వాళ్ళు, నిద్ర నటించే వాళ్లను ఏం అనగలం అని అన్నారు. గతంలో పండే పంట అమ్ముకోవాలి అంటే ఎవరో వ్యాపారి కోసం వేచి ఉండాలి. ఈ రోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం ఏర్పాటుతో అక్కడే పంట కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకున్నాం. ఇంకా రైతులకు చేరువగా ఉండే విధంగా ఆర్బీకేలు ఏర్పాటు చేసి,వ్యవసాయానికి అవసరం అయిన విత్తనాలు,ఎరువులు అందించాం. రైతు మేలు కోరి,ఇంకా అన్ని వర్గాల మేలు కోరి సంక్షేమం,అభివృద్ధి అన్నవి ధ్యేయంగా, ఎప్పటికప్పుడు ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ.. పనిచేస్తూ ఉన్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. -
ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకు ఆమోదం
-
చంద్రబాబు హామీలపై మంత్రి ధర్మాన సెటైర్లు
-
రాగోలు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం
-
‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పుస్తకాన్ని సీఎం జగన్కు అందజేసిన ధర్మాన
సాక్షి, అమరావతి: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో ‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆయన కలిసి పుస్తకాన్ని అందించారు. ఇదీ చదవండి: అభిమానులపై ‘పంజా’! -
చోడవరంలో సాధికార స్వరం
సాక్షి, అనకాపల్లి: అనకాపలి జిల్లా చోడవరంలో మంగళవారం సాధికార నినాదం హోరెత్తింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నియోజకవర్గంలో కదం తొక్కాయి. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. ఇది బడుగు, బలహీన వర్గాల విజయయాత్రలా సాగింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. వందలాది బైక్లు, కార్లు, ఆటోలతో ప్రారంభమైన బస్సు యాత్రలో నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కొత్తకోట జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బుచ్చెయ్యపేటలో జల్జీవన్ మిషన్ను ప్రారంభించారు. అనంతరం వేలాదిమందితో వడ్డాదిలో భారీ బహిరంగ సభ జరిగింది. జయహో జగన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినదించారు. పేదల స్థితిగతులు మార్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదల స్థితిగతులను మార్చారని, ఆర్థికంగా బలోపేతం చేసి సంఘంలో గౌరవాన్ని పెంచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల రూపంలో రూ.2.60 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జమ చేశారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం దయనీయంగా ఉండేదని, వ్యవసాయ వృద్ధి రేట్లో 16వ స్థానంలో ఉండేదని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రైతులకు అండదండలందించారని, దాంతో వ్యవసాయ రంగంలో ఏపీ 4వ స్థానానికి ఎదిగిందని వివరించారు. కోట్లాది రైతులు, పేదల కుటుంబాలలో వెలుగులు నింపిన వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి కారుమూరి జగన్ పథకాలతో పేదరికం తగ్గింది : ఎంపీ నందిగం సురేష్ వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు వస్తే అప్పటి సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లను దాచిపెట్టారని, ఇలా పేదరికాన్ని దాచకూడదని, తగ్గించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడం ద్వారా సీఎం జగన్ పేదరికాన్ని రూపుమాపుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అద్భుతమని చెప్పారు. దళిత రైతు బిడ్డనైన తనను సీఎం జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టారన్నారు. ఒకప్పుడు ఏ ప్రధానిని చూడాలనుకున్నానో.. అదే ప్రధాని పక్కన కూర్చున్నానంటే ఇది కాదా సామాజిక సాధికారత అని అన్నారు. ఒంటరిగా పోరాటం చేసిన దళిత బిడ్డ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్కు తెలంగాణలో రాలేదని, వారు వచ్చే ఎన్నికల్లో ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. అందరి సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం: మంత్రి కారుమూరి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ సంక్షేమాన్ని అందించడంలో కుల, మత, పార్టీ, ప్రాంతీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పైసా అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు కదిలి మరోసారి జగన్ను సీఎంగా ఎన్నుకోవాలన్నారు. చోడవరంలో రూ.1,900 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి : కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సీఎం జగన్ చోడవరం నియోజకవర్గంలో 90 శాతం రాజకీయ, నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే అందించారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.1,900 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రధానంగా రూ.80 కోట్లతో రోడ్లు, నాడు – నేడు ద్వారా రూ.87 కోట్లు విద్యా రంగంలో ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. -
సీఎం జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది
-
విశాఖలో ‘ఫైనాన్షియల్ హబ్’ ఏర్పాటుకు వినతి
సాక్షి, అమరావతి : ఉత్తర కోస్తా జిల్లాల్లో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు విశాఖపట్నంలో ‘ఫైనాన్షియల్ హబ్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం లేఖ రాశారు. ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ధర్మాన.. రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచీలో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన (2014) తర్వాత విశాఖపట్నం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగిందని, అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కేంద్రమైందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ హబ్ కోసం విశాఖపట్నంలో 100 ఎకరాలు కేటాయించాలని సీఎంను అభ్యర్థించారు. ఈ ప్రాంతంలో అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు, ఇతర లీడ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల జోనల్ హెడ్ క్వార్టర్స్ వస్తాయన్నారు. వీటితోపాటు ఆర్థిక సేవల సంస్థలు, ప్రముఖ న్యాయ సంస్థలు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మద్దతుగా విశాఖపట్నంలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరాలని విజ్ఞప్తి చేశారు. ‘సోషల్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ’ నెలకొల్పండి విశాఖ ప్రాంతంలో అత్యధిక కంపెనీలు ఉన్నాయని, కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు సైతం సేవలు అందిస్తున్నాయని మంత్రి ధర్మాన తెలిపారు. వీటికి అనుబంధంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ’ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్లు ఏటా దాదాపు రూ.1,000 కోట్లను సీఎస్ఆర్ ఫండ్స్ ఇస్తున్నాయని, విశాఖలోని కార్పొరేషన్లు, కంపెనీలు అందించే సీఎస్ఆర్ నిధులు కూడా ఈ అథారిటీకి వస్తాయని సూచించారు. ఈ నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ తరహాలో వినియోగించవచ్చన్నారు. -
స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం చంద్రబాబు కి ఇష్టం ఉండదు
-
తునిలో జనహోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం కాకినాడ జిల్లా తునిలో విజయయాత్ర చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. పరిసర ప్రాంత గ్రామాలన్నీ తుని బాటపట్టాయి. కొట్టాం సెంటర్ వద్ద ప్రారంభమైన యాత్రకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీనివాససెంటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, శాంతినగర్ మీదుగా రాజా కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తుని ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలు, సాధికారతకు చేస్తున్న కృషిని నేతలు వివరించారు. సభ ఆద్యంతం ‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. సీఎం జగన్తోనే అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు : మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్తోనే రాష్ట్రంలో అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు వచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దశాబ్దాలుగా నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచి, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. సంస్కరణలకు నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో 30 ఏళ్ళు సీఎంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అంతరాలను తగ్గించడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. చంద్రబాబును రాజకీయాలకు దూరం చేద్దాం: మంత్రి అప్పలరాజు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ వర్గాలను అక్కున చేర్చుకొని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను నీచంగా చూసి, హేళనగా మాట్లాడిన చంద్రబాబుకి మరోమారు గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన జగన్: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే వంటి సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన సీఎం దేశంలో జగన్ ఒక్కరేనని తెలిపారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవన ప్రమాణాలను సీఎం జగన్ మెరుగు పరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం అందని ఇల్లు లేదంటే అది సీఎం జగన్ సుపరిపాలనే అని తెలిపారు. వంచనకు గురైన వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. గత పాలనలో వంచనకు గురైన సామాజిక వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. సామాజిక సాధికారత అంటే ఏమిటో దేశానికి చూపించారని తెలిపారు. బీసీల్లో మార్పు కోసం సీఎం జగన్ కుల గణన చేపడుతున్నారన్నారు. మోసం, అబద్దం, కుట్ర, కుతంత్రం అంటే చంద్రబాబేనన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్: మంత్రి అనిల్కుమార్ అన్ని పదవుల్లో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి, ఈ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. సీఎం జగన్ను మనమంతా గుండెల్లో పెట్టుకోవాలన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు అంతకు ఐదు రెట్లు పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారని, మరోసారి మోసం చేసేందుకే ఈ రకమైన హామీలిస్తున్న ఆ ఇద్దరినీ ఎప్పటికీ నమ్మొద్దని చెప్పారు. ఎంపీ వంగా గీత, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని సామాజిక సాధికార సభలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి, సభకు పోటెత్తిన అశేష జన సందోహంలో ఓ భాగం -
వెనుకబడిన వర్గాలను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు జగన్
-
చంద్రబాబును ఒక ఆట ఆడుకున్న మంత్రి ధర్మాన
-
టీడీపీకి ఓటు వేస్తే మీకు బోడిగుండె: ధర్మాన ప్రసాదరావు
-
జగన్ పాలనలోనే గిరిజనులకు మేలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే గిరిజనులకు మేలు జరిగిందని, వారి జీవితాలు బాగుపడ్డాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సామాజిక సాధికారయాత్రలో భాగంగా బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ వచ్చిన తర్వాతే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయని తెలిపారు. కేబినెట్, ఇతర పదవుల్లో 70 శాతం బడుగు, బలహీనవర్గాలకే అందించిన ఘనత దేశంలో ఒక్క జగన్కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, అలా తొలుత పుష్పశ్రీవాణి, తర్వాత తనకు ఆ గౌరవం దక్కిందన్నారు. అడగకుండానే ఎస్టీ కమిషన్ వేశారని, గిరిజన సలహామండలిని నియమించారని, జీసీసీ, ట్రైకార్ సంస్థలకు చైర్మన్ పదవులను భర్తీచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో గిరిజనులనే కాదు ఎస్సీలు, బీసీలనూ చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఓ అనామకుడిని తీసుకొచ్చి ఈయనే గిరిజనశాఖ మంత్రి అన్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లోనూ చంద్రబాబుకు, జగన్కు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. పింఛన్లు, ఇళ్లు, చేయూత, వైఎస్సార్ రైతుభరోసా.. వంటి ఎన్నో పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సామాజిక న్యాయం, సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాలూరులో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం అర్హులందరికీ సంక్షేమం: మంత్రి ధర్మాన జీవితాలను బాగు చేసుకోవడానికి పాలనలో భాగస్వామ్యం, రాజ్యాధికారం కోసం తరాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎవరూ ఉద్యమాలు చేయకుండానే పాలనలో పెద్దపీట వేశారని వివరించారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు అంటూ వివక్ష, ఆశ్రిత పక్షపాతం, లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగనే అని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుచేసి, సామాజిక న్యాయాన్ని సుసాధ్యం చేసి చూపిన నవతరం నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. మూడుసార్లు అవకాశం ఇచ్చినా బీదల సంక్షేమం గురించి ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. హామీలన్నీ తూచా తప్పకుండా అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్ను కాదని, చంద్రబాబు మాయలో పడి ఓటేస్తే మన పీక మనమే కోసుకున్నట్లేనని ధర్మాన హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్పాదాయ వర్గాలకు ఎంతో అవసరమని చెప్పారు. చిన్నచూపున్న బాబుకు ఓటెందుకు వేయాలి? నాయీ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తానని, మత్స్యకారులను చితక్కొట్టిస్తానని, బీసీలు ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిలుగా పనికిరారంటూ చిన్నచూపు చూసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిరావు పూలే ఆశయాలను సాకారం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, అలజంగి జోగారావు, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్తురాజు, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి రహిత సంక్షేమాన్ని సాధ్యం చేసిన జగన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘సంక్షేమ పథకాలను బీదలకు నేరుగా అందించలేకపోతున్నామని గతంలో ఓ ప్రధాన మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఉన్న వారు తినేస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేశారు. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైసా అవినీతి జరగకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లక్షల కోట్లు బీదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇలా అవినీతి రహిత సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తున్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో ధర్మాన ప్రసంగించారు. గత టీడీపీ పాలనలో పచ్చ జెండా కట్టిన వాడికి, జన్మభూమి కమిటీలకు, డబ్బులిచ్చిన వారికే పథకాలు అందేవని మంత్రి ధర్మాన చెప్పారు. ఇప్పుడు అర్హుడైతే చాలు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వివరించారు. ఎక్కడా ఏ అధికారీ, వైఎస్సార్సీపీ కార్యకర్త నయా పైసా లంచం అడిగిన దాఖలాల్లేవన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో జరిగిన భూసర్వేతో కలుగుతున్న అవస్థల నుంచి తప్పించడానికి తమ ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. ఏ రైతునూ సర్వే రాళ్లు, పాసు పుస్తకం కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు. ఇటువంటి పరిపాలనే కదా ప్రజలు కోరుకుంటారని చెప్పారు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను నమ్మించి వంచించిన చంద్రబాబు ముఠాకు ఎవరైనా ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీ పాలనలో చూపించడానికి లోపాల్లేక.. దేశమంతా పెరిగిన కరెంట్ బిల్లులు, పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు చూపిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్ర ప్రజలను అడిగితే వాస్తవమేమిటో చెబుతారని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత దశాదిశా మార్చడానికి, ఇక్కడి పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖలో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తన పాలనలో ఏనాడూ ఏ ఒక్క మేలూ చేయకపోయినా ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీని ఆదరించారని, వారినే చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. బాబుకు, టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని, అన్ని వర్గాల సంక్షేమ సారథి వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పాముల పుష్ప శ్రీవాణి, కంబాల జోగులు, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి : బొత్స పజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స చెప్పారు. రాష్ట్రంలో సామాజిక సాధికారత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. నిష్పక్షపాతంగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. చంద్రబాబు గిరిజనులకు, మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసిన మోసాన్ని మరిచిపోలేమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఈ వర్గాలకు మేలు చేకూరిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో బీసీలకు టికెట్టు ఇచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే అప్పలనర్సయ్య సవాలు విసిరారు. యాత్ర సందర్భంగా మీడియాతో బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు నిత్య నయవంచకుడు అని, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. -
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు అగ్రస్థానమిచ్చి, ఆ వర్గా లకు రాజకీయ, సామాజిక సాధికారత సాధించిన సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా గురు వారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత, పారదర్శకమైన సుపరిపాలన అందిస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పాలన సాగించామని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదా రుల్లో వైఎస్సార్సీపీ వారితో పాటు అన్ని పార్టీల వారూ ఉన్నారని తెలిపారు. పేదలకు ఇస్తున్న స్థలం దేనికీ పనికిరాదని చంద్రబాబు విమర్శించారని, కానీ తామిచ్చిన స్థలమే పేదలకు పెద్ద ఆస్తి అయిందని వివరించారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. 2024కి వైజాగ్ రాజధానిగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్దానంలో ఎంతో మంది యాక్టర్లు తిరిగినా ఏమీ చేయలేదని, వైఎస్ జగన్ మాత్రమే కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా నిలి చారని చెప్పారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలను అవమానించారని తెలిపారు. పేదలకు మేలు చేస్తే టీడీపీ ఓర్చుకోలేదని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో 98 శాతం హామీలను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, కుంభా రవిబాబు, లేళ్ల అప్పిరెడ్డి, వరు దు కల్యాణి, ఎమ్మె ల్యేలు విశ్వాసరాయి కళావతి, గొర్లె కిరణ్కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యమవుతుందని సీఎం జగన్ నిరూపించారని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చెప్పారు. గురువారం నుంచి చేపట్టనున్న ‘సామాజిక సాధికారత’ బస్సు యాత్రను జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తదితరులు శ్రీకాకుళంలో జెండా ఊపి ప్రారంభించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మరి కొన్ని హామీలు కూడా నెరవేర్చారని జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స చెప్పారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2019 నాటికి పేదరికం 12 శాతం ఉండేదని, ఇప్పుడు 6 శాతానికి తగ్గించామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ బీసీల సాధికారతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఐదుగురు బీసీ ఉప ముఖ్యమంత్రులు, 56 కార్పొరేషన్ చైర్మన్లను నియమించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్కు ప్రజల దీవెనలు ఉండాలని పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు. -
Skill Scam: ‘ఆ ఇద్దరి వ్యక్తులకే మొత్తం డబ్బులు వెళ్లాయి’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: చంద్రబాబు కేసులను ఇన్కమ్టాక్స్, ఈడీ వంటి కేంద్ర సంస్థలే మొదట దర్యాప్తు చేసిన విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. జర్మనీలో ఉన్న సీమెన్స్ సంస్థతో పేమెంట్ జరిగినట్లు నాటి ప్రభుత్వం చెబుతుందని, మరి దానిపై దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తే అలాంటి ఏమీ లేదని సదరు కంపెనీ తెలిపిందన్నారు. దేశంలోని కొన్ని కంపెనీలు పెట్టి, డబ్బులు పంపడానికి మాత్రమే సెల్ కంపెనీలను ఉపయోగిస్తున్నారన్నారు. దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ డబ్బులు ఇద్దరు వ్యక్తుల వద్దకే వెళ్లినట్లు తేలిందని, అందులో ఒకరు చంద్రబాబు పీఏ, ఇంకొకరు లోకేష్ పీఏ అని అన్నారు. ఎలాంటి సిస్టమ్ కూడా పాటించలేదని, మాజీ ముఖ్యమంత్రి, గౌరమైన వ్యక్తి అంటూ వదిలేయమంటే ఎలా అని, అలా వదిలేసి హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఇందిరాగాంధీ, లాలూ ప్రసాద్, జయలలిత, పీవీ నరసింహారావు లాంటి వారే కోర్టు కేసులు ఎదుర్కొన్నారని, చంద్రబాబు దోషి అవునా.. కాదా అన్నది కోర్టు తెలుస్తుందని, చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని కోర్టులోనే నిరూపించుకోవాలని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. -
రెవెన్యూలో ఇన్ని సంస్కరణలు ఇప్పుడే
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ): గతంలో ఎప్పుడూ జరగనన్ని రెవెన్యూ సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో పెద్దఎత్తున జరిగాయని, తద్వారా లక్షలాది మందికి ప్రయోజనం కలిగిందని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రూ.76 వేలకోట్ల విలువైన భూమిని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలుగా ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూమిని ఇచ్చాయని, ఈ ప్రభుత్వమే తొలిసారి వేలకోట్లతో భూమి కొని ఇళ్లస్థలాలు ఇచ్చిందని చెప్పారు. విజయవాడలో ఆదివారం జరిగిన రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులు గల భూములు, సర్వీస్ ఈనాం వంటి లక్షల ఎకరాల భూములు త్వరలో ఓపెన్ మార్కెట్లోకి వస్తాయని తెలిపారు. రెవెన్యూశాఖ మరింత బలోపేతమవడంతోపాటు దాని గౌరవం కూడా పెరిగిందన్నారు. నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ చట్టాన్ని తీసుకుని కొత్త టైటిలింగ్ చట్టాన్ని రూపొందించి రాష్ట్రపతి అనుమతి కోసం పంపామని, అది వస్తే రెవెన్యూశాఖ ఇంకా పవర్ఫుల్గా మారుతుందని చెప్పారు. రెవెన్యూశాఖ పేరును ల్యాండ్ అడ్మిస్ట్రేషషన్ అండ్ జనరల్ అడ్మిస్ట్రేషషన్గా మార్చాల్సిన అవసరం ఉందని, ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్–1977 చట్టాన్ని మార్చడంతో 30 లక్షల ఎకరాల భూమి మళ్లీ వ్యవస్థలోకి వస్తుందన్నారు. ఇన్ని లక్షల ఎకరాల భూమి టైటిల్ ఫ్రీగా అయితే రాష్ట్రంలో ఆరి్థక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులు లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని, సీఎం మానవతాకోణం ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ సాయిప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు టార్గెట్ సమయాన్ని కొంత ఎక్కువైనా తీసుకుని పనిచేయాలని, ఒత్తిడికి గురవ్వద్దని చెప్పారు. భవిష్యత్తులో ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ వ్యవస్థ వస్తుందని, వ్యవసాయ భూములతోపాటు నివాస, పారిశ్రామిక తదితర భూములన్నీ రెవెన్యూ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వం మన సమస్యల్ని పరిష్కరిస్తోంది ఏపీ రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని చెప్పారు. అయితే ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో వీఆర్ఏ, వీఆర్వోలకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.300 ఉన్న డీఏను రూ.500కు పెంచారని తెలిపారు. వచ్చే ఏడాదికి రెవెన్యూశాఖ ఏర్పడి 60 ఏళ్లవుతున్న నేపథ్యంలో జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా ప్రకటించాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరికీ ఉమ్మడి సర్విస్ రూల్స్ అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, వేణుగోపాలరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. తొలుత లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్కు ఎన్నికైన 30 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. -
రాజధాని పేరుతో ఇన్ని ఘోరాలా ?
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు పాల్పడిన ఘోరాలు విస్తుగొల్పుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అధికార రహస్యాలను బయట పెట్టబోమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఇంత అన్యాయం చేయడం దారుణమన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ధర్మాన మాట్లాడారు. టీడీపీ సర్కారు రాజధానిపై ఏనాడూ ఒక పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు వినియోగించుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు తప్పు చేసి దొరికిపోవడంతో మూటాముల్లె సర్దుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చెప్పారు. హైదరాబాద్లో చేసినట్లుగానే అమరావతిలోనూ భూముల దోపిడీకి పాల్పడ్డారన్నారు. రాజధానిపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. 2013 చట్టంలోనే భూసమీకరణకు అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టారని, ప్రభుత్వాలు ఇంత అధర్మంగా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. మిగతావారిని దారి మళ్లించి తాము ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో భూములు కొన్నారని తెలిపారు. తొలుత అతి చౌకగా జిరాయితీ భూములు కొన్నారని, ఆ తర్వాత జీవో 1 విడుదల చేసి అన్ని కేటగిరీల భూములకు భూ సమీకరణ ప్యాకేజీని పేర్కొంటూ అసైన్డ్ భూముల దగ్గర మాత్రం ఖాళీగా వదిలేశారని తెలిపారు. వాటికి రిజిస్ట్రేషన్ జరగదని తెలిసి కూడా వారిని కార్యాలయాలకు రప్పించి రిజిస్ట్రేషన్లను తిరస్కరించేలా చేశారని చెప్పారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ రాదంటూ మూడు మండలాల్లోని అసైన్డ్ రైతులను భయపెట్టి బాబు బృందం దక్కించుకుందన్నారు. ఆ భూములకు లభించే కౌలు, వన్టైమ్ బెనిఫిట్ను తమకు అందేలా చంద్రబాబు మనుషులు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి నారాయణ కాలేజీకి సైతం డబ్బులు జమ అయ్యాయని, పేద రైతులను మాయచేసి దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు తమ చేతికి వచ్చిన తర్వాత వాటికి జీవో 1 వర్తించదు కాబట్టి ఏడాది తరువాత తాపీగా జీఓ 41 తీసుకువచ్చారని చెప్పారు. అసైన్డ్ రైతులను భయపెట్టేందుకే ఆ జీఓను ఒక సంవత్సరం పాటు ఆపారని తెలిపారు. రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిన జీవోను మున్సిపల్ శాఖ ఇచ్చేసింది అసైన్డ్ భూములకు సంబంధించిన జీవోను రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉండగా మున్సిపల్ పరిపాలన శాఖ ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. పేదల భూములను బోగస్ వ్యక్తుల పరం చేయటాన్ని అధికారులంతా వ్యతిరేకించినా గత సర్కారు లెక్కచేయలేదన్నారు. మూడు మండలాల్లో అసైన్డ్ రికార్డులను సైతం మాయం చేశారని తెలిపారు. ప్రస్తుతం భూములు ఎవరి వద్ద ఉన్నాయో వారికే హక్కులు ఇద్దామంటూ తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు తమ మనుషులను ప్రవేశపెట్టారని చెప్పారు. పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా, రెవెన్యూ శాఖకు తెలియకుండా మాజీ మంత్రి నారాయణ ఇవన్నీ చేశారన్నారు. జీవో వచ్చిన 22 రోజుల తర్వాత నాటి సీఎం దీన్ని అంగీకరించారని, చట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో జారీ అయిందన్నారు. ప్రజల క్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున దోపిడీ చేస్తుంటే దాని పట్ల విశ్వాసం ఏముంటుందని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అనుకూలంగా ఇవ్వలేదని ఆయన్ను తీసేశారని, న్యాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ అందరూ వ్యతిరేకించినా దోపిడీని కొనసాగించారని తెలిపారు. ఇంత అడ్డగోలుగా వచ్చిన భూమి ప్లాట్లను కోర్ క్యాపిటల్లోని సచివాలయం, గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ ఉన్నచోట ఇచ్చారని, ఇది ఎంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పొట్టగొట్టి గొడవలా? అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు తెలిశాయని, ఇన్ని ఘోరాలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు తాను అవినీతిపరుడిని కాదని ఎలా చెప్పుకుంటారని ధర్మాన ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా ఇవన్నీ చేశారన్నారు. పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పించేందుకు ఇప్పుడు సీఎం జగన్ 50 వేల మందికి అక్కడే ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. రాజధాని రైతుల పొట్ట గొట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు తాము రైతులమంటూ గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, ఒక ప్రభుత్వం తప్పు చేసి వ్యవస్థపై విశ్వాసాన్ని పోగొడితే మళ్లీ ఆ విశ్వాసాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హెరిటేజ్, నారాయణ కోసం ఇన్నర్ ప్లాన్ మార్చారు: ఎమ్మెల్యే పేర్ని నాని రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో తనకు సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. చంద్రబాబు సర్కారు అవినీతి చిట్టాలో ఇన్నర్ రింగు రోడ్డు ఒకటి. దోపిడీ దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. మొదట ఇది మంత్రివర్గ నిర్ణయమని చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా, హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం అలైన్మెంట్ ప్లాన్ మార్చారు. ఐఆర్ఆర్తో తనకేం సంబంధం అంటున్న ఏ–14 నారా లోకే‹శ్ 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. ఆ తీర్మానంపై లోకేష్ సంతకం చేశారు. దళితులు, పేదల నుంచి చంద్రబాబు, నారాయణ అసైన్డ్ భూములను లాక్కున్నారు. కేసులు ఎక్కువ నమోదైన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారు? యువతను రెచ్చగొట్టి ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371 కోట్లు టిప్ అని అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు? ఇన్నర్ రింగ్ రోడ్డును అటూ ఇటూ తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే తన కరకట్ట ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని హైకోర్టులో చెప్పారు. బాబుకు సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేనికి అద్దె కింద రూ.27 లక్షలు ఇచ్చామని భువనేశ్వరి చెబుతున్నారు. నిజంగానే అధికారికంగా ఇచ్చి ఉంటే అద్దె ఎందుకు చెల్లించారు? ఐటీ రిటరŠన్స్లో ఈ వివరాలను వెల్లడించారా? రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు ఎందుకు మాట్లాడడం లేదు? రాజధానిపై నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఏర్పాటుకు జీవో ఇచ్చారు. భూసమీకరణకు ఒప్పుకోని వారిని ఏ–2 నారాయణ, ఏ–14 లోకేష్ బెదిరించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టారు. ఎకరం భూమిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే రాయించుకున్నారు. అసైన్డ్ రైతులను దగా చేసిన ఇలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. సమగ్ర విచారణ జరగాలి: వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలి. రాజధానిని ప్రకటించకముందే లింగమనేని రమేష్ 355 ఎకరాలను కొనేశారు. పేదలను మోసం చేసి కంతేరు వద్ద భూముల్ని హెరిటేజ్ కొనడం ఏమిటి? ఢిల్లీ కోటను ఢీకొన్న జగన్ కళ్లల్లో భయం చూపిస్తానని లోకే‹శ్ అంటున్నారు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జగన్ ఎక్కడ? ఆయనకు ఉన్న 175 మంది సైనికుల్లో ఒకరి చేతుల్లో ఓడిపోయిన లోకే‹శ్ఎక్కడ? మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు: ఆదిమూలపు సురేష్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు. ఇన్నర్ రింగు రోడ్డు అనకొండలా మలుపులు తిరుగుతూ కొందరు వ్యక్తుల పొలాల దగ్గరకు వచ్చి ఆగింది. ఇందులో చేయని మోసం అంటూ ఏదీ లేదు. టెండర్లు పిలవకుండా నచ్చిన వాళ్లకు నామినేషన్ల విధానంలో పనులు అప్పగించారు. ముగ్గురు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అలైన్మెంట్ను మార్చారు. గ్రాఫిక్స్తో అమరావతిని అంతర్జాతీయ నగరం అని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది అంతర్జాతీయ స్కామ్ అయింది. ఈ స్కామ్కి డైరెక్షన్ చంద్రబాబుది అయితే పర్యవేక్షణ లోకేశ్, నాటి మంత్రులు, ఇతరులది. అమరావతిలో దళిత, పేద రైతుల్ని నిలువునా ముంచారు. నవ నగరాలు, ఐకానిక్ బ్రిడ్జి లాంటివన్నీ బూటకం. ఇన్నర్ రింగురోడ్డు గురించి కాగ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ల విధానంలో సుర్బానా, జురాంగ్ కంపెనీలకు ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగించి రూ. 28 కోట్లు రూల్స్కి విరుద్ధంగా చెల్లించినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఇన్నర్ రింగు రోడ్డులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటున్న వారు ఈ డబ్బు గురించి సమాధానం చెప్పాలి. ఎస్టీయూపీ అనే కంపెనీకి మాస్టర్ప్లాన్ తయారీకి రూ.5 కోట్లు ఇచ్చారు. ఇవి డబ్బులు కాదా? రింగురోడ్డు తుది అలైన్మెంట్ను లింగమనేని, హెరిటేజ్ భూముల గుండా మార్చారు. హెరిటేజ్ భూములు కాజ, కంతేరు, చినకాకాని వద్ద ఉండడంతో రింగురోడ్డు అటు వెళ్లింది. అలైన్మెంట్ మార్పు చేసి తనకు సహాయం చేసినందుకే లింగమనేని రమేష్ ప్రతిఫలంగా చంద్రబాబుకి కరకట్ట నివాసాన్ని ఇచ్చారు. క్విడ్ప్రోకు ఇది తిరుగులేని ఉదాహరణ. నారాయణ తన వద్ద పనిచేసిన ఉద్యోగి పేరు మీద భూమిని కొని తర్వాత తన పేరిట మార్చుకున్నారు. అడ్డంగా దొరికిన అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు. ఆధారాలతో చట్టం ముందు నిలబెడుతున్నాం. చంద్రబాబు, లోకే‹శ్ను చట్ట ప్రకారం శిక్షించాలి. -
రికార్డులు మాయం.. టీడీపీ అవినీతి చిట్టా..
-
రాష్ట్రంలో భూ సంస్కరణలు ఓ విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన భూసంస్కరణలు ఓ విప్లవమని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్నింటినీ ఎదుర్కొని కేవలం నాలుగేళ్లలోనే ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ సంస్కరణలు రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాల జీవన స్థితిగతులను మారుస్తాయని, వారి గౌరవాన్ని పెంచుతాయని వివరించారు. సీఎం జగన్ చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. భూమి యాజమాన్యం, వినియోగదారులకు సంబంధించి ఈ నాలుగేళ్లు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ – రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే – పేదల కోసం చుక్కల భూముల సంస్కరణలు’ అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా 15 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. భూమి టైటిల్ ఫ్రీగా ఉంటే పెట్టుబడులు తెస్తుందని, దానివల్ల ఉద్యోగాలు వస్తాయని, తద్వారా జీడీపీ పెరిగి రాష్ట్రం వృద్ధిలోకి వస్తుందని తెలిపారు. భూమిని సరిగా వినియోగంలో తీసుకురాలేకపోతే అది సరైన పాలన కాదని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ భూమిని లిటిగేషన్ ఫ్రీ చేస్తున్నాయని చెప్పారు. భూమి వినియోగంలో లేకుండా చేస్తే చెడు ప్రభావాలు పెరుగుతాయన్నారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ భూమిని అమ్మడానికి చేసినది కాదని, వాటిపై సర్వ హక్కులు కల్పించడం కోసమని చెప్పారు. ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేలా ప్రైవేటు భూమితో సరిసమానమైన హక్కులు కల్పించామన్నారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ఈ సంస్కరణలను ప్రజలు బాగా స్వీకరించారని, ఇంత పెద్ద సమస్యకు ఆర్డినెన్స్ ఇస్తే ఒక్క విమర్శ కూడా రాలేదన్నారు. అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు దాటితే యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. ఈ భూముల యజమానులు ఎన్ఓసీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పారు. అధికారులు వీటి జాబితాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ప్రక్రియ అంతా జరుగుతుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వాడే నాయకుడు ప్రజల కష్టాలను తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచి, వారి గుండుల్లో చిరకాలం ఉండే వాడు, పెద్ద ఎత్తున జరిగే దాడిని తట్టుకుని సంస్కరణలు చేయగలిగిన వాడే నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడే వైఎస్ జగన్ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే సమయానికి పేదలకు భూమి ఇస్తే, అది మళ్లీ ధనవంతుల దగ్గరకు చేరిపోయే పరిస్థితి ఉందని, అందుకే పేదలకిచ్చిన భూముల్ని అమ్మకూడదని, వ్యవసాయం మాత్రమే చేయాలని నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనందున, ఇంకా భూమిని ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకోవడం సరికాదని, ఆ భూములపై వారికి సర్వ హక్కులు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ భావించారని తెలిపారు. పేద రైతుల గౌరవాన్ని పెంచడానికి అసైన్డ్ భూముల చట్టానికి సీఎం సవరణ సవరణ చేశారని తెలిపారు. దీనివల్ల 15 లక్షల కుటుంబాల సామాజిక స్థితి మారి, వారికి గౌరవం ఏర్పడుతుందన్నారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. ఎవరూ కోరకుండానే సీఎం జగన్ ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిపై బాగా అధ్యయనం చేశామని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వెళ్లి చూశామని, అన్నింటిపైనా చర్చింన తర్వాత అక్కడికంటే సరళంగా సీఎం చట్టాన్ని మార్చారని చెప్పారు. వైఎస్సార్ తర్వాత మళ్లీ ఇప్పుడే భూ పంపిణీ అనాధీన భూములను క్రమబద్దీకరించి, వందేళ్లుగా ఉన్న చుక్కల భూముల సమస్యనూ సీఎం జగన్ పరిష్కరించారని చెప్పారు. దీనిద్వారా 2.50 లక్షల ఎకరాలు విముక్తి పొందాయని, ఆ రైతులకు హక్కులు వచ్చాయని తెలిపారు. దళితవాడల్లో భూమి కొని అయినా శ్వశానవాటికలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిపారు. భూ పంపిణీ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిందని, అప్పట్లో 7 లక్షల ఎకరాలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు భూ పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమిని గుర్తించారని, త్వరలో సభ పెట్టి పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. అసైన్డ్ భూముల చట్టంలో ఇళ్ల స్థలాలపై ఉన్న ఆటంకాన్ని కూడా ముఖ్యమంత్రి ఎత్తివేశారని, 10 సంవత్సరాల తర్వాత ఆ స్థలాలను అమ్ముకోవచ్చని తెలిపారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం గొప్ప విషయం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. ఇందుకోసం భూమని కొనడానికి రూ. 12 వేల కోట్లు ఖర్చయినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పేదల కోసం భూమి కొనడానికి రూ.12 వేల కోట్లు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. ఆ కాలనీల్లో సౌకర్యాలు కల్పించడానికి ఇంకా చాలా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈ స్థలాల లేఅవుట్లు, అక్కడ కల్పిస్తున్న వసతులు చూసి అక్కడికి వెళ్లాలని చాలామంది అనుకుంటున్నారని తెలిపారు. ఇదంతా కేవలం రెండేళ్లలోనే వచ్చిందన్నారు. ఈర‡్ష్యతో ఉన్న వాళ్లు తప్ప ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా ఎవరుంటారని ప్రశ్నించారు. సర్వే జరక్కపోవడం వల్లే గ్రామాల్లో వివాదాలు బ్రిటిషర్ల కాలంలో భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి మళ్లీ సర్వే జరక్కపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ రీ సర్వే ప్రారంభించారని తెలిపారు. 17 వేల గ్రామాలకుగానూ 4 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని, రెండు నెలలకు 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని తెలిపారు. 15 శాతం మందికి ఖాతా నంబర్లు కూడా లేవని, 1.20 లక్షల మందికి ఎఫ్ఎంబీలు కూడా కనిపించడంలేదన్నారు. ఒక్క సర్వే జరిగితే ఇలాంటివన్నీ పరిష్కారమవుతాయన్నారు. 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో సర్వే చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10 వేల మంది సర్వేయర్లను నియమించామని, పరికరాల కోసం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. దేశంలో సమగ్రమైన సర్వే చేసిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దీనివల్ల ప్రయోజనం పొందుతున్న ఏ ఒక్క రైతు పైసా పెట్టక్కర్లేదన్నారు. ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం చేసే పనులని, రాజనీతిజు్ఞలే ఈ పనులు చేస్తారని చెప్పారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసేది కాదు ఒక స్కూల్ పిల్లాడికి అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్నారని మంత్రి చెప్పారు. పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, సాక్సులు ఇవ్వడం.. మంచి టీచర్ను పెట్టడం, వారికి భోజనం పెట్టడం.. ఒకవేళ వాళ్లమ్మ పనికి పంపేస్తుందనే భయంతో ఆమెకు డబ్బులివ్వడం.. ఇవన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలని తెలిపారు. ఓట్ల కోసం కాదని చెప్పారు. తల్లితండ్రులు, పిల్లల కోసం దేశంలో ఎక్కడా లేని మంచి విద్యా వ్యవస్థను సీఎం జగన్ ఇక్కడ తెచ్చారన్నారు. టీచర్లంటే తనకు చాలా అభిమానం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని చెప్పారు. వారు కోరకుండానే విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందని, దీన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయాలని అన్నానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అవసరమైతే తన మాటలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. ప్రతి సెక్రటేరియట్ ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయం సామాన్యలు మరింత త్వరతగతిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సీఎం జగన్ కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారని చెప్పారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్తోపాటే మ్యుటేషన్ కూడా జరిగిపోతుందన్నారు. ప్రతి గ్రామ సెక్రటేరియేట్ ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం కాబోతోందన్నారు. కొత్త చట్టం వచ్చాక ఆర్ఓఆర్ చట్టం ఉండదన్నారు. ఒకే ఆస్తిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటివి ఉండవన్నారు. క్లియర్ టైటిల్తో ఉండే రాష్ట్రంగా ఏపీ నిలవబోతోందన్నారు. వంద సంవత్సరాలుగా కృశించినపోయిన రెవెన్యూ శాఖను సీఎం జగన్ కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా మార్చారని తెలిపారు. వెబ్ల్యాండ్లో తప్పులు సరి చేయడానికి తహశీల్దార్కి అధికారాలు ఇచ్చారన్నారు. ఎస్సీ కోఆపరేటివ్ భూములకు పట్టాలివ్వడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల సర్వీస్ ఈనాం భూములపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు: శాసన వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అసైన్డ్, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించడం వల్ల కొన్ని లక్షల మంది దళితులు, బీసీలు, పేదలకు లబ్ధి కలిగింది. అసైన్డ్ భూములపై హక్కులు నిరుపేదలకు వరం. గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయంలో చాలా తప్పలు జరిగాయి. ఒకరి భూములను మరొకరు ఆన్లైన్ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ ప్రభుత్వం రెవెన్యూ లోపాలపై గట్టిగా దృష్టి సారించి, వాటిని సవరిస్తోంది. హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఇది పేదల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అసైన్డ్ హక్కులు చారిత్రాత్మకం : సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. అనేక జటిలమైన సమస్యలకు సీఎం జగన్ ఈరోజు పరిష్కారాలు చూపిస్తున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ హైటెక్. సీఎం జగన్ ఫిలాసఫీ లోకల్టెక్. చంద్రబాబు కార్పొరేట్ శక్తుల్ని ప్రేమిస్తే.. జగన్ కార్మికుల్ని ప్రేమిస్తారు. భూమాతను కొందరికే సొంతం చేసిన చరిత్ర బాబుది. అదే భూమిని పేదలకు ఇచ్చి వారికి హక్కులు కల్పించిన సీఎం జగన్. చంద్రబాబు రాజమండ్రిలో ప్రజలను చంపిన చోటే దేవుడు ఆయన్ని జైల్లో పెట్టాడు. 31 లక్షల మందికి ఇళ్ల పట్లాలు లేవనే విషయం చద్రబాబుకు తెలుసా? ఒక సినిమా హీరో విలన్కి సపోర్ట్ చేస్తున్నాడు. నైపుణ్యమైన దొంగను కాపాడ్డానికి హీరో వెళ్లాడు. ఆయన హీరో కాదు విలన్. అణగారిన వర్గాలకు, బలిసిన వాళ్లకి మధ్య యుద్ధం జరుగుతోంది. బాబు అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు.. జగన్ వాటిపై హక్కులిచ్చారు: నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ ఎం జగన్మోహనరావు చంద్రబాబు అసైన్డ్ భూములను దోచుకుంటే, సీఎం వైఎస్ జగన్ వాటిపై పేదలకు హక్కులు కల్పించారు. బాబు హయాంలో క్యాపిటల్ రీజియన్లో 1,400 ఎకరాల అసైన్డ్ భూములను దోచుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ రైతులను భయపెట్టి వారి భూముల్ని లాక్కున్నారు. చుక్కల భూములు, షరతుల గల భూములు వంటి లక్షల ఎకరాలపై హక్కులివ్వడం ఎప్పుడూ జరగలేదు. సమగ్ర భూ సర్వేను స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేపట్టలేదు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఈ సర్వే జరుగుతోంది. అభినవ కొమరం భీం జగన్ : పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి అసైన్డ్ భూములకు సీఎం వైఎస్ జగన్ సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం లక్షలాది రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూములకు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు. గిరిజనులకు భూములపై సర్వ హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్.. అభినవ కొమరం భీం. -
ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది : ధర్మాన ప్రసాదరావు
-
అవినీతి లేకుండా చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పం
-
సీఎం జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు
-
చంద్రబాబును కోర్టే జైలుకు పంపింది..
శ్రీకాకుళం రూరల్: చంద్రబాబును కోర్టే జైలుకు పంపిందని, కేంద్ర ఏజెన్సీలే ఆయనను దోషిగా తేల్చాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన ఆదివారం శ్రీకాకుళం మండలం బైరి గ్రామంలో సచివాలయ ప్రారంబోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. స్కిల్స్కామ్లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని, ఈ కేసు 2021లో నమోదైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, జర్మనీ కంపెనీకు ఒప్పందమంటూ ఫేక్ అగ్రిమెంట్లతో అడ్డంగా దొరికిపోయి అడ్డగోలు వాదనలు చేయడం బాబు కోటరీకి తగదని హితవుపలికారు. సాంకేతిక విద్య పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని 6 షెల్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట దోచేసిన వారిని జైల్లో పెట్టకుండా ఉత్తమ పురుషుడంటూ పొగడాలా.. అంటూ ధర్మాన ప్రశ్నించారు. ఈడీ తనిఖీల్లో ఈ దోపిడీ వ్యవహారం బట్టబయలైందని తెలిపారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. -
సీఎం జగన్ హయాంలో విద్యారంగంలో సంస్కరనలు, మార్పులు: మంత్రి ధర్మాన
-
తాను తప్పుచేయలేదంటే కోర్టులో నిరూపించుకోవాలి
-
ప్రాజెక్టుల జాప్యానికి బాధ్యుడు చంద్రబాబే
శ్రీకాకుళం (పాత బస్టాండ్): రాష్ట్రంలో ప్రాజెక్టుల జాప్యానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబునాయుడే నని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సాగునీరు, వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం నాలుగేళ్ల పాలన చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు కనీస అవగాహనతో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయిందని.. అందులో రెండేళ్లు కరోనా కష్టకాలంలోనే గడిచిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికే వంశధార ప్రాజెక్టు 77 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కేవలం 23 శాతం మాత్రమే చేశారన్నారు. నేరడి బ్యారేజీ సమస్యపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించామని.. ఇలాంటి ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ధర్మాన ప్రశ్నించారు. రూ.200 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తయారు చేసి సాగునీరు అందించడం జరుగుతోందని తెలిపారు. చంద్రబాబు నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తే, ఇటీవల వారికి రూ.200 కోట్లు మంజూరు చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న చంద్రబాబునాయుడు 14 ఏళ్లు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ‘విధ్వంసం’ అనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ‘నీరు–చెట్టు’ పేరుతో నాయకులు దోపిడీ చేశారన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు వ్యవసాయ రంగంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్మెంట్ దండగ అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. -
‘ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బాబు సిగ్గుపడాలి’
శ్రీకాకుళంః వంశధార ప్రాజెక్టును డిసెంబర్లో జాతికి అంకితమిస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఉద్దానం సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం జగన్దేనని ధర్మాన పేర్కొన్నారు. రూ. 4 వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు చకచకా జరుగుతున్నాయని, ఉత్తరాంధ్ర ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారని మంత్రి తేల్చిచెప్పారు. ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల రూపకర్త వైఎస్ఆర్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రంలోని ప్రాంతాల అభివృద్ధి పట్ల పూర్తి అవగాహన లోపించినట్లుంది. ఆయన ప్రతిపక్ష నేతగా ఎక్కడికైనా రావచ్చు. పర్యటించి పరిశీలనలు కూడా చేయొచ్చు. కాకుంటే, ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయనకు ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్నట్లు.. ఈ ప్రభుత్వానికి లేనట్లు చిలుకపలుకులు పలికాడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టింది మహానేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఆనాడు జలయజ్ఞం పేరిట తోటపల్లి, వంశధార, టెక్కలిలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ తదితర మేజర్ ప్రాజెక్టులను ఆ మహానేత ప్రారంభించారు. 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేదని బాబు అంగీకారం చంద్రబాబు ఈరోజు ఇక్కడకొచ్చి ప్రాజెక్టులు పూర్తికాలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునే తనకు తాను ప్రశ్నించుకున్నట్లు ఉంది. నువ్వు పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులను 4 ఏళ్ల కిందట వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిచేయలేదనడం హాస్యాస్పదం కాదా..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసుకున్న 4 ఏళ్లల్లో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఉంటే.. మరి, నువ్వు 1995లో ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నావన్న సంగతి గుర్తుందా..?. ఈ ప్రాంతం పెద్ద ఎత్తున నీకు, నీ ప్రభుత్వానికి మద్ధతిచ్చి ముఖ్యమంత్రిని చేసింది. 14 ఏళ్లపాటు ఈ ప్రాంతవాసుల ప్రేమతో నువ్వు ముఖ్యమంత్రిగా అధికారాన్ని వెలగబెట్టావు. మరి, నువ్వు ఈ ప్రాంతవాసులపై చూపించిన ప్రేమేంటి..? నీ నిర్లక్ష్యం, నీ అలసత్వాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు శ్రీ వై ఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిగ్గనిపించడంలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. అసలు, మీరేం చేశారు..? మేము ఈ ప్రాజెక్టు ప్రారంభించి పూర్తిచేశామని ఏ ఒక్కదాన్నైనా చెప్పగలరా..? ప్రజలకు ఆ విధమైన సమాచారం చెప్పుకోలేని మీరు కేవలం 4 ఏళ్ల ముందట పుట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు కట్టలేదని.. నాశనం చేశారనడం వంటి చంద్రబాబు మాటలపై అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వంశధారను డిసెంబర్లో జాతికి అంకితమిస్తున్నాం ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో 97 శాతం పనులు పూర్తిచేసుకుని, మిగతా 3 శాతాన్ని రేపు డిసెంబర్కల్లా పూర్తి చేస్తాం. విజయవంతంగా పూర్తయిన ఈ ప్రాజెక్టు ను డిసెంబర్లో జాతికి అంకింతం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షగా కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను వెల్లడిస్తున్నాను. వంశధార పూర్తి వెనుక జగన్ కృషి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైన ఈ వంశధార ప్రాజెక్టు పూర్తి చేయడానికి జరిగినటువంటి కృషిని ఈ సందర్భంగా నేను వివరిస్తాను. మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్రెడ్డి కాలంలో దాదాపు 63 శాతం వంశధార ప్రాజెక్టు పనులు పూర్తయితే.. ఆ తర్వాత ప్రభుత్వం కొంతపనులు పూర్తి చేస్తే.. బాబు 14 ఏళ్లహయాంలో కేవలం 23 శాతం పూర్తి చేశారు. అంటే, 14 ఏళ్లల్లో 23శాతం పనులు చేసిన మీరొచ్చి మమ్మల్ని అడుగుతారా..? ఈ ప్రాజెక్టుకు 19 టీఎంసీల రిజర్వాయర్ నింపడానికి నేరడి బ్యారేజీ వద్ద కట్టాల్సిన అదనపు బ్యారేజీని ఒరిస్సాతో వివాదం ఉందని స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికి అక్కడికి వెళ్లి సంప్రదింపులు జరపడం మీకు తెలియదా..?. ఆ తర్వాత ఒరిస్సా ప్రభుత్వం మరలా సుప్రీం కోర్టు వరకు వెళ్లి మరో వివాదం తెచ్చింది. దీంతో రూ.2వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ముందుకు సాగదేమోనని గొట్టా బ్యారేజీ వద్దనే రూ.170 కోట్లతో మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శాంక్షన్ ఇచ్చి టెండర్ ఖరారు చేసి పనులు ప్రారంభించాము. గొట్టా బ్యారేజీ నుంచి 19 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్ను నింపుకుందామని చేసిన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. మరో మూడునెలల్లో వంశధార ప్రాజెక్టు పనులన్నింటినీ పూర్తిచేసి జాతికి అంకితం చేయబోతున్నాం. వంశధారకు నువ్వు చేసిందేంటి..? చంద్రబాబు ఒక విషయంపై సమాధానం చెప్పాలి. మీ 14 ఏళ్ల ఏలుబడి కాలంలో అనేక స్వార్థపూరిత ఆలోచనలకు కేటాయించిన సమయాన్ని ఈ ప్రాంతంలో కీలకమైన వంశధార ప్రాజెక్టుకు కేటాయించారా..? ఒక్క శాతం కూడా చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై శ్రద్ధచూపలేదు. ఎప్పుడో 1955లో శంకుస్థాపన జరిగిన వంశధార ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో వివాదం ఉందని ఆ ప్రాజెక్టును నిలుపుదల చేస్తే నీ 14 ఏళ్ల కాలంలో అటువైపు ఒక్కసారైనా తొంగిచూశావా..? ఒరిస్సా ముఖ్యమంత్రితో ఏనాడైనా నువ్వు మాట్లాడావా..? లేదంటే, ఒక ట్రిబ్యునల్ వేయించుకుని సమస్యను పరిష్కరించుకున్నావా..? అంటే, ఏదీ చేయలేదు. మరి.. ఈ నాలుగేళ్ల ప్రభుత్వం ప్రాజెక్టులను నాశనం చేస్తుందని ఎలా అనగలుతున్నావు చంద్రబాబు..? అని మేము ప్రశ్నిస్తున్నాం. ఉద్దానం సమస్యను పరిష్కరించిన మనసున్న నేత జగన్ ఇక, దేశంలో ఒక ప్రత్యేకమైన సమస్యతో అట్టుడికిన ఉద్దానం ప్రాంతం గురించి మాట్లాడుకుంటే.. గ్రౌండ్వాటర్ తాగి కిడ్నీ జబ్బులతో ప్రజలు చనిపోతున్నారని రీసెర్చిలో తేలింది. ఈ చంద్రబాబు 14 ఏళ్ల హయాంలో ఒక్క పనిని కూడా ఉద్దానం ప్రజల కోసం చేయలేదు. కిడ్నీ జబ్బుల సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని బాబు సూచించలేదు. అదే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకొచ్చిన వెంటనే ఇచ్చాపురం, పలాసకు వెళ్లి సమావేశాలు పెట్టి ఉద్దానం ప్రజల ఉపశమనానికి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడి ప్రజలు గ్రౌండ్వాటర్ తాగకుండా ఏం చేయాలని ఆలోచించి.. హిరమండలం వద్దనున్న బ్యారేజీ నుంచి పైపులైన్ల ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలందరికీ తాగునీరు ఇవ్వాలని రూ.700 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టి.. ట్రయల్రన్ కూడా పూర్తిచేసుకుని రేపోమాపో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఉద్ధానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం అద్భుతం కాదా..? ఈ సందర్భంగా నేను కూడా ప్రజలనుంచి ఒక సమాధానాన్ని కోరుతున్నాను. దశాబ్ధాలుగా అనేకమంది ముఖ్యమంత్రుల కాలంలో పరిష్కారమవని ఒక సమస్యను ఒక ప్రభుత్వ కాలంలో అంటే, కేవలం 4 ఏళ్లకాలంలో పరిష్కరించి ప్రజలకు మేలు చేయడం అద్భుతం కాదా..? అని గుర్తుచేస్తున్నాను. అంతేకాదు, ఉద్దానం సమస్యకు రెండుమూడు రకాల పరిష్కారాలున్నాయి. అందులో ఒకటేమిటంటే.. ఉద్దానం ప్రజలకు ఇక కిడ్నీ వ్యాధులు రాకుండా సర్ఫేస్ వాటర్ను పైపులైన్ల ద్వారా అందించడం. రెండోదేమిటంటే, ఇప్పటికే కిడ్నీ వ్యాధి సోకి వైద్యం చేయించుకుంటూ.. ఏ పనిని చేసుకోలేని వారికి నెలనెలా రూ.10వేలు ఆర్థికసాయం అందించి వారి పొట్టగడవడానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఇక మూడోదేమంటే, ఉద్దానంలోనే ఒక ఆస్పత్రిని నిర్మాణం చేయడం. రాబోయే మూడు నాలుగు నెలల్లో ఆ ఆస్పత్రి ప్రారంభోత్సవం కూడా జరగబోతుంది. నాల్గోదేమంటే, రీసెర్చి సెంటర్ను పూర్తిచేసి అక్కడికి వైద్యులను, ఇతర సిబ్బందిని విధుల్లోకి తెచ్చేందుకు నియమిస్తున్నాం. వాటికి సంబంధించిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఉద్దానం ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాది. ఒక సమస్యకు కేవలం 4ఏళ్ల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు ఏ ఒక్క మీడియాలోనూ ఒక్క వార్త కనిపించకపోవడం చాలా దారుణం. ఇదికదా.. ఒక ప్రభుత్వం తాలూకూ పనితనం. ఇదికదా.. ఒక ప్రభుత్వపనితీరుకు అద్దంపట్టే వాస్తవమని ప్రజలకు నేను గుర్తుచేస్తున్నాను. ఈ జిల్లాలోనే కాదు. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఒక సమస్యపై 14 ఏళ్లకాలంలో చంద్రబాబు ఒక్క సమస్య అయినా పరిష్కరిండాడని ఆయన చెప్పగలరా..? శ్రీకాకుళంలో ఒక్క కేంద్ర సంస్థనైనా పెట్టలేదేం బాబూ..? రాష్ట్రవిభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రరాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు 23 పెద్ద సంస్థలను కేంద్రప్రభుత్వం ఇస్తే.. 13 జిల్లాలుంటే.. శ్రీకాకుళంలో ఏ ఒక్క సంస్థనూ చంద్రబాబు పెట్టలేదు కదా..?. దీన్నిబట్టి ఉత్తరాంధ్ర వాసులు మీ పాలనను ఎలా అర్ధం చేసుకోవాలి. ఇప్పుడొచ్చి ఈ ప్రాంతం పట్ల నాకు ప్రేముందని చంద్రబాబు ఎలా చెబుతారు..? అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు సమానంగా పంచితే రెండు పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రకు రావాలి కదా..? ఎందుకు తేలేకపోయారు..? అబద్ధాలకైనా ఒక అంతుండాలని.. కన్నార్పకుండా అబద్ధాలాడటం చంద్రబాబుకే సాధ్యమని ఆయన సాహసాన్ని నేను మెచ్చుకోలేకపోతున్నాను. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన వ్యక్తే ఈ చంద్రబాబు అని మరోమారు నేను గుర్తుచేస్తున్నాను. టెక్కలిలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ గురించి చంద్రబాబు మాట్లాడటంలో అర్ధంలేదు. అసలు, ఆ ప్రాజెక్టుతో ఆయనకు సంబంధమేలేదు. ఆఫ్ షోర్ ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకొచ్చాక దాన్ని ఆపేశారు. ఆ తర్వాత జగన్గారు వచ్చి ల్యాండ్ అక్విజేషన్ చేసి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేసి రూ.700 కోట్లతో ప్రాజెక్టుకు శాంక్షన్ ఇచ్చి పనులు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో ఇప్పటికే 20శాతం పూర్తయ్యాయి. తోటపల్లిలో బాబు పాత్రేమీ లేదు తోటపల్లి రిజర్వాయర్కు 2004లో బాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినా పైసా ఖర్చుపెట్టలేదు. అప్పట్నుంచి 2014లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 10 శాతం పనులే చేశారు. అంతకుముందే, మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో 90శాతం ప్రాజెక్టు పనుల్ని పూర్తిచేశారు. కాబట్టి, తోటపల్లి పూర్తిలో బాబు పాత్రేమీలేదని స్పష్టంచేస్తున్నాను. అన్నీ నేనే చేశానని ఆపాదించుకోవడం వలన ఏం ప్రయోజనం పొందుతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. రూ.4వేల కోట్లతో మూలపేట పోర్టు పనులు చకచకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రూ.4వేల కోట్లతో ఒక పోర్టు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే అందరూ అవహేళన చేశారు. ఈరోజు ఎవరైనా చూడండి.. మూలపేట, విష్ణుచక్రం ప్రాంతంలో పోర్టు పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో చూడండి. స్వాతంత్య్రం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులును శ్రీకాకుళం జిల్లాకు తెచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే, అక్కడ్నే మరో రూ.400 కోట్లత ఫిష్షింగ్ హార్బర్ను కూడా ప్రారంభించి పనులు చేయిస్తున్నాం. మంచినీళ్లపేట దగ్గర ఫిష్ల్యాండింగ్ సెంటర్ పనులు చేస్తున్నాం. -ఇవాళ మా పాలనతో కింది స్థాయిలో అవినీతి లేకుండా చేశాం. కానీ మీరు అవినీతిని ప్రోత్సహించారు. మీరు కూడా అవినీతిని నియంత్రించలేం అని ఒప్పుకున్నారు. ఇవాళ గౌరవంగా చెప్పుకునే స్థితికి వ్యవస్థలను తీసుకువచ్చాం. పాలనలో సంస్కరణలు తీసుకు వచ్చాం. పరిపాలన వికేంద్రీకరణను తీసుకుని వచ్చాం. ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తున్నాయి. వ్యవసాయంపై మీకు సదభిప్రాయమే లేదు. - బలహీనవర్గాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడే తప్ప.. బలహీనవర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. - మంత్రివర్గంలో ఏనాడైనా బ్యాక్వర్డ్ క్లాసులకు ప్రాధాన్యం ఇచ్చారా..? పరిపాలనలో ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా..? ఎలా బలహీనవర్గాలను ఆదుకున్నానని చెప్పలగవు చంద్రబాబూ..? - రూ.150 కోట్లతో నాగావళి నది వద్ద బ్యూటిఫికేషన్ చేశానని చంద్రబాబు చెబుతున్నాడు.. అది ఎక్కడుందో ఎవరైనా చూపించగలరా..? దయచేసి చంద్రబాబు విధ్వంసం అనే మాటను ఉపసంహరించుకొని, శ్రీకాకుళం ప్రాంతానికి ఏదీ చేయలేదని ఒప్పుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. బాబూ.. విమర్శల్ని వెనక్కితీసుకో.. వీటన్నింటిని ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తుంటే.. ఈ చంద్రబాబు మాత్రం నోరుతెరిస్తే అబద్ధాల పుట్టగా కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్రపై ఇంత ప్రేమ కురిపిస్తోన్న మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారిని పట్టుకుని ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం మానుకుని.. ప్రాజెక్టుల్ని ఈ ప్రభుత్వం నాశనం చేస్తుందనే నీ అసత్యపు విమర్శల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇదేవిధంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నోరుపారేసుకుంటానంటే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకుంటావని బాబును హెచ్చరిస్తున్నాను. -
14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారు ?
-
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తాం
కోటబొమ్మాళి: రాష్ట్రంలోని 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు పేదలకు చెందేలా... జిరాయితీ భూముల మాదిరిగానే పేదలు అన్ని హక్కులు పొందేలా ఆర్డినెన్స్ తెస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో రూ.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను శుక్రవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలిగే ధీరుడు సీఎం వైఎస్ జగన్ అని, ఎలాంటి వాగ్దానాన్ని అయినా ఆయన అమలు చేయగలరని ప్రశంసించారు. అమరావతిలో ఒకేసారి 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరుచేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు నివేశన స్థలాలు, ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట... అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు అండ్కో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని పార్టీలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని ధర్మాన స్పష్టంచేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమూల మార్పులు తెచ్చామన్నారు. కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. -
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అసైన్డ్ భూములపై సర్వ హక్కులు
-
అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం
‘ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే నిమిషాల వ్యవధిలో అతని పని జరుగుతోంది. ఒక అర్హుడు పథకానికి దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా లబ్ధి అందుతోంది. ఒక విద్యార్థికి బడిలో అడుగు పెట్టిన తొలిరోజే పుస్తకాల నుంచి బ్యాగు వరకు, షూ నుంచి యూనిఫారం వరకు అన్నీ అతని చేతిలో పెడుతున్నారు. వీధి బడులు సకల వసతులతో సగర్వంగా నిలబడుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాలు సర్వసన్నద్ధంగా తయారయ్యాయి. ఒకటో తేదీ రావడమే లేటు ఇంటి తలుపు తట్టి మరీ పింఛన్ ఠంఛన్గా అందిస్తున్నారు. వీధికే రేషన్ తెచ్చి ఇస్తున్నారు. విద్యార్థి నుంచి విశ్రాంత ఉద్యోగి వరకు, బాలల నుంచి వృద్ధుల వరకు అందరి సంక్షేమం కోరే ప్రభుత్వమిది’ అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తమ ప్రభుత్వ పనితీరును వివరించారు. ప్రతిపక్షాలు పనిలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న భావాలు ఆయన మాటల్లోనే.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దేశంలో సంక్షేమ పథకాల నిధులు 90శాతం దుర్వినియోగమై... కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారునికి చేరుతున్నాయని రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నిత్యం ఆవేదన చెందేవారు. వంద శాతం మందికి ఎలా అందించాలా అని ఆలోచించేవారు. ఇవాళ రాష్ట్రంలో ఆ మార్పు వచ్చింది. దీని కోసం వైఎస్ జగన్ ఓ విప్లవమే తీసుకువచ్చారు. వంద శాతం ప్రజలకు ఒక్క పైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందించి చూపించారు. ఇది ఓ విప్లవాత్మక మార్పు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తనకు కావాల్సిన పనిని చేసుకోలేకపోతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం లేకపోవడమే దీనికి కారణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది. సచివాలయ వ్యవస్థ ద్వారా సామాన్యుడికి కావాల్సిన పనులు నిమిషాల మీద జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. వలంటీర్ వ్యవస్థ ద్వారా పనులు సులభమవుతున్నాయి. అప్పటికే ఒకరో ఇద్దరో అర్హులు మిగిలిపోతే ‘జగనన్న సురక్ష’ ద్వారా వారిని గుర్తించి మరీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఈ విషయాలు పట్టడం లేదు. లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి విద్యార్థులకు ఇచ్చే సంక్షేమ పథకాలపైనా విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులకు ఓటు హక్కు ఉండదని తెలిసినా పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘జగనన్న సురక్ష’ ఓ వరం సంక్షేమ పథకాలు అందని వారికి జగనన్న సురక్ష ఓ వరం లాంటిది. ఇందులో 11 సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో గ్రామంలో 200 నుంచి 400 మంది ప్రజలు ఈ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే 25వేల మంది ప్రభుత్వ సేవలు అందుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వలంటీర్, అధికారులు ప్రజల ఇంటికే వెళ్తుండడం వల్ల ఎవరికీ రోజు కూలీ నష్టపోవాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఇదివరకు ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ జగనన్న సురక్ష పథకం ఈ పనిని చాలా తేలిక చేసి చూపించింది. ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పనితీరు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే టీడీపీ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. అభివృద్ధి అంటే భౌతికంగా కనిపించే అంశాలే అనే భావన చాలా మందిలో ఉంది. ఒక కుటుంబం జీవన ప్రమాణాలు పెంచేదే అభివృద్ధి. విద్య, వైద్యం, పోషకాహారం, భవిష్యత్ తరాలకు ధీమా, నివాసయోగ్యమైన ఇళ్లు, మంచి వస్త్రాలు.. ఇవన్నీ జీవన ప్రమాణాలకు కొలమానం. ఈ ప్రయోజనాలు అందించకుండా ఏదేదో చేసేశామంటే ఎవరూ హర్షించరు. వైఎస్ జగన్ సర్కారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సఫలమైంది. అన్నదాతకు భరోసా.. రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు, వారికి కావాల్సిన సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాం. గతంలో మండలానికి ఇద్దరు, ముగ్గురు వ్యవసాయ అధికారులు ఉంటే ఇపుడు ప్రతి మండలానికి 25మంది వ్యవసాయ అధికారులు ఉండేలా ఏర్పాటు చేశాం. అదే గ్రామంలో ఎరువులు అందుబాటులో ఉంచడం, పండిన పంట కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. కళ్ల ఎదుటే సచివాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి చేపడితే ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయి. విమర్శించేవారు వారి గ్రామాన్ని ఒకసారి పరిశీలించాలి. ఏం జరిగిందో? ఏం జరగలేదో? వారే చూస్తారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతి చోటు చేసుకుంది. ఏమిటీ పరిస్థితులని ఒక రకమైన ఆవేదనతో ప్రజలు తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అవినీతికి చరమ గీతం పాడి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా రూ.2,30,000 కోట్లు జమ చేసింది. ఇందులో ఫలానా వ్యక్తి డబ్బులు అడిగారని గానీ, తాము ఒక పైసా ఇచ్చామని గానీ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. చంద్రబాబు ఏం చేశారు..? టీడీపీ హయాంలో జిల్లాకు ఎలాంటి మేలు జరగలేదు. ఎల్లో మీడియా ద్వారా ఆహా, ఓహో ప్రచారం చేసుకోవడం తప్ప టీడీపీ నాయకులు చేసిన పనులేవీ లేవు. తోటపల్లి, వంశధార, మెడికల్ కళాశాల, పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఆఫ్షోర్ తదితర ప్రాజెక్టులో టీడీపీ పాత్ర ఏమీ లేదు. ఇదంతా వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధే. శ్రీకాకుళంలో పెద్ద మార్కెట్లో టీడీపీ చేసిందేమీ లేదు. మార్కెట్ పునఃనిర్మాణం ఆయన హయాంలో జరిగిందే. ఇపుడు రూ.10కోట్లు పెట్టి రోడ్లుకు టెండర్లు వేశాం. గట్టిగ మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్న ట్టు చెబితే ప్రజలు ఓట్లు వేస్తారనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లో ఉంది. అవన్నీ కాపీ యాత్రలే.. ఏ రాజకీయ పార్టీ అయినా తన ఉనికి కోసం ఏదో ఒక పేరుతో యాత్రలు చేస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఇటువంటి యాత్రల ద్వారా అధికారం వస్తుందని అనుకుంటే పొరపాటు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేశారంటే అతను ప్రజల యొక్క ప్రతి సమస్య క్షుణ్ణంగా గమనించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ పథకాలు నిష్పాక్షికంగా అమలు చేశారు. మండలం నుంచి గ్రామాలకు పరిపాలనను వికేంద్రీకరించారు. ఒక్కో ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా, ఏ ఒక్కరూ సమస్య పరిష్కరించలేదు. జగన్ సీఎం అయిన వెంటనే ఉద్దానంకిడ్నీ సమస్యపై రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వంశధార రిజర్వాయర్ నుంచి మంచినీరు ఉద్దాన ప్రాంత ప్రజలకు అందించేందుకు పనులు పూర్తి, కిడ్నీ బాధితుల మందులకు రూ.10వేలు సాయం, డయాలసిస్ కోసం అక్కడే ఆసుపత్రి ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు. జగన్ను అనుకరించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. స్థిరమైన అభిప్రాయంతో ప్రతిపక్షాలు లేవనేది ప్రజల భావన. సిక్కోలులో ప్రగతి జాడలు.. గత నాలుగేళ్లలో జిల్లాలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. పలాసలో రూ.60 కోట్లతో ఒక రీసెర్చ్ ఆస్పత్రిని తెచ్చాం. అలాగే మంచినీళ్లపేట వద్ద హార్బర్ (ఫిష్ లాండింగ్ సెంటర్)ను ఏర్పాటు చేశాం. రూ.4000 కోట్లతో మూలపేట పోర్ట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. బుడగట్ల పాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు, ఆమదాలవలసలో హార్టికల్చర్, అగ్రికల్చరల్ కళాశాలలు, శ్రీకాకుళంలో 900 పడకల ఆస్పత్రిని సంపూర్ణంగా అభివృద్ధి చేశాం. జిల్లావ్యాప్తంగా రోడ్లు నిర్మితమవుతున్నాయి. ఏం అభివృద్ధి జరిగిందని అడిగే టీడీపీ వాళ్లు వీటిని చూడాలి. జిల్లా వ్యాప్తంగా నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు కోసం రూ.780కోట్లు ఖర్చుపెట్టాం. మరో 3–4 నెలల్లోనే ప్రారంభించనున్నాం. పలాసలో ఆస్పత్రికి రూ.60కోట్లు ఖర్చుపెట్టాం. మరో 2 నెలల్లోనే ప్రారంభించనున్నాం. వంశధారపై వివాదం కేసు సుప్రీంకోర్టులో ఉంది. లిఫ్ట్ పెట్టి 19 టీఎంసీ నింపి వేసవిలో 2లక్షల ఎకరాలకు రబీ పంటకు నీరు అందించేందుకు నిర్ణయించాం. టెండర్లు పిలిచి అనుమతులు ఇచ్చారు. ఈ వర్షాకాలం ముగిసేలోగా పూర్తి చేయాలని చెప్పాం. కోడి రామ్మూర్తి స్టేడియంపై టీడీపీ సమగ్ర ప్లాన్ లేకుండా కూలగొట్టేసింది. దీన్ని మేం బాధ్యతగా తీసుకున్నాం. దీని నిర్మాణం కోసం రూ.10కోట్లు నిధులు మంజూరు చేశాం. ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు పని జరుగుతోంది. మరో 4–5 నెలల్లో పూర్తవుతుంది. సమగ్ర భూ సర్వేతో కొన్ని ఆక్రమణలు బయటపడుతున్నాయి. వందేళ్లుగా సర్వే జరగకపోవడంతో ఎవరిది ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఆక్రమణలు జరుగుతున్నాయి. ఏ ఆక్రమణను కూడా విడిచిపెట్టేది లేదు. -
ఏపీలో లంచంలేని సమాజం ఏర్పాటు చేశాం
-
చందాదారుల భద్రతే లక్ష్యంగా ‘ఈ–చిట్స్’
సాక్షి, అమరావతి: చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో ‘ఈ–చిట్స్’ సేవలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేస్టేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ను వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చిట్ఫండ్ కంపెనీల మోసాలకు సంబంధించి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ–చిట్స్ సేవలను అమల్లోకి తెచ్చిందన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ రూపొందించిన ఈ నూతన ఎల్రక్టానిక్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని చిట్ఫండ్ కంపెనీలన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందన్నారు. చిట్ఫండ్ లావాదేవీలను ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉందని, రిజిస్ట్రేస్టేషన్ శాఖ అధికారులు కూడా ఆన్లైన్ విధానంలోనే సంబంధిత లావాదేవీలను పరిశీలించి ఆమోదిస్తారని తెలిపారు. ‘ఈ–చిట్స్’ విధానంవల్ల చిట్ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడమే కాక చందాదారులు నష్టపోకుండా సహకరిస్తుందని మంత్రి చెప్పారు. చిట్ఫండ్ కంపెనీల విషయంలో చందాదారులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ తమ ప్రాంతాల్లో నడుస్తున్న చిట్ఫండ్ సంస్థలు రిజిస్టర్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని ముందుగా ఈ విధానంలో తెలుసుకోవచ్చన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రేస్టార్ ఆఫ్ చిట్స్ని కూడా ఈ విషయంలో సంప్రదించవచ్చన్నారు. అదే విధంగా చిట్ఫండ్ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎటువంటి సమస్యలలైనా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని, ఆ సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించే అవకాశం ఈ నూతన విధానం ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు. ఇంకా అదనపు వివరాలను https:// echits.rs. ap.gov.in నుండి తెలుసుకోవచ్చని మంత్రి ధర్మాన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేస్టేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ, అడిషనల్ ఐజీ ఉదయభాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
AP: చిట్స్ నిర్వహణలో ఇక కొత్త విధానం
సాక్షి, అమరావతి: ఏపిలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో.. చిట్స్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలోనే సాగనుందని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. అంతేకాదు.. ఇ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ప్రారంభించారాయన. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు అన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఇందుకోసం ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్ను రూపొందించాయి. చందాదారులు అంతా ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో.. ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు. చందాదారు మోసపోకుండా చూడాలనే ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి ధర్మాన వెల్లడించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్ లు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. -
విద్యకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలి
-
దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో జగనన్న భూ హక్కు–భూ రక్ష పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైంది. ఉప సంఘం సభ్యులు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి పథకం ప్రగతిని సమీక్షించారు. మంత్రులు మాట్లాడుతూ 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. మున్సిపాలిటీల్లోనూ సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్, సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ సౌరబ్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాలంటీర్లపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం వస్తే మొట్టమొదటగా తుపాకీ పేలేది వాలంటీర్లపేనే అని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి ధర్మాన సోమవారం శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కోసమే ఈనాడు అసత్య కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లే. అయితే, వాలంటీర్లు తెలివైన వారు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని వారిని కోరారు. -
రెవెన్యూ శాఖ ప్రాంతీయ సదస్సులో ధర్మాన కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మొదలైంది. శనివారం ఉదయం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దారులు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టర్లు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘రెవెన్యూ శాఖలో సంస్కరణ అమలుపై సదస్సు నిర్వహించాము. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నాము. అసైన్డ్ భూములు వ్యవసాయేతర పనులకు వినియోగంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. భూములను వినియోగంలోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
ధర్మాన మాటల్ని వక్రీకరించి.. సోషల్ మీడియాలో గోల..
ఇన్నాళ్లకొకరు (ధర్మాన ప్రసాదరావు) ఉత్తరాంధ్ర వివక్ష మీద గొంతు విప్పి మాటాడేరు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయకుంటే కనీసం మా ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలా అయితే ఉత్తరాంధ్రకు గల సహజవనరుల సాయంతో, ఆర్థిక కేటాయింపులతో, పాలనా ఏర్పాటుతో... ఏ నగరానికీ లేని ఓడరేవు, విమానాశ్రయం; భారీ, మధ్యతరగతి పరిశ్రమలతో మహానగరంగా ఎదగాల్సిన విశాఖను రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని రాజకీయ ప్రకటన చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలన్నదే ప్రసాదరావు కోరుకునేది. అది మరింత బలంగా విన్పించడానికి విశాఖను పాలనా రాజధానిగా చేయకపోతే, కనీసం ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనన్నారు తప్పా ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనేమీ అనలేదు. అయినా ప్రసాదరావు మాటల్ని వక్రీకరించి, ఒక్కదాన్నే పట్టుకొని సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. నిజానికి ప్రసాదరావు ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తే బాగుండేది. అయినా, ఈ సందర్భంలో ప్రసాదరావు ఆమాత్రం అనడం ఘనతే! ఇప్పటిదాకా ఇలాంటి ప్రకటనలు ఉత్తరాంధ్ర పౌరసమాజం నుండి అరాకొరా (కె.ఎస్.చలం, నల్లి ధర్మారావు, అట్టాడ అప్పల్నాయుడు తది తరులు) వచ్చేయి తప్పా రాజకీయశక్తుల నుంచి రాలేదు. పాలకవర్గ పార్టీల నుంచీ రాలేదు, కమ్యూనిస్టు, విప్లవకారుల నుంచీ రాలేదు. చాలా ఆశ్చర్యంగా ధర్మాన ప్రసాదరావు ప్రకటనపై విచ్చిన్నకారుడు, సమైక్య వ్యతిరేకి వంటి వ్యక్తిగత దాడి మాత్రమే కాక ప్రసాదరావు రాజకీయ ప్రయాణాన్నీ, ఆ ప్రయాణంలో ఉత్తరాంధ్రకు అతను చేసినదేమిటీ, ఇపుడెందుకిలా ప్రకటించాడంటూ... ఉత్తరాంధ్రేతరులే కాక ఉత్తరాంధ్రులూ ప్రశ్నిస్తున్నారు. విచిత్రంగా ఒక్క నల్లి ధర్మారావు తప్పా, ఉత్తరాంధ్ర గురించి తొలినాడు గొంతు విప్పిన కె.ఎస్. చలం గానీ ఇంకెవరుగానీ ఇపుడేమీ మాటాడడం లేదు. స్పందనా రాహిత్యం ఉత్తరాంధ్ర స్వభావంలోకి ఇంకిపోయినట్టుంది. తొలి తరం రచయితలు తప్పా వర్తమాన రచయితలెవరికీ ఉత్తరాంధ్ర జీవన సంక్షోభానికి కారణమయిన రాజకీయార్థిక విషయాలమీద అవగాహనా లేదు, ఆసక్తీ లేదు. అణు విద్యుత్ వ్యతిరేక పోరాటం, నిర్వాసితుల పోరాటాలు, విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక పోరాటం వంటివాటిని వీరు సాహిత్యీకరించలేదు. అటు రచయితలుగానీ, ఇటు మేధావులుగానీ ఉత్తరాంధ్ర వివక్షమీద ప్రాంతీయవాద దృష్టితో స్పందించటం లేదు. విశాఖలో స్థిరపడిన (వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు చేసి) వారు ఉత్తరాంధ్ర గురించి వ్యాఖ్యానిస్తుంటారు, ఉత్తరాంధ్రుల తరఫున బాధ్యత తీసుకుంటారు. రాజకీయాల్లో, సాహిత్య, సాంస్కృతికాంశాల్లో ఉత్తరాంధ్రపై వివక్ష చూపి, ‘వెనక బడిన జిల్లా’ అనే టాగ్ తగిలించి సానుభూతి చూపుతారు ఉత్తరాంధ్రేతరులు. పాతిక లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా ఎనిమిదిలక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పటికీ సాగునీరు అందుతోంది. నాగావళి, వంశధార వంటి పద్దెనిమిది నదులూ, అధిక వర్షపాతం వల్ల అయిదువందల టీఎంసీల నీరు లభ్యమవుతున్నా... సాగునీరందించే ప్రాజెక్టులు పూర్తికాక పోవటంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతోన్నవి. వ్యవసాయాధార పరిశ్రమలు లేక, ఉన్నవి మూత పడి ఇటు రైతులూ, అటు కార్మికులూ నష్ట పోతున్నారు. ఉపాధుల్లేక ఏటా ఏభయి వేలమంది ఇక్కడినుంచి వలసలు పోతున్నారు. వలసల నివారణకుగానీ, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకుగానీ, విశాఖ వంటి నగరంలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడానికిగానీ ప్రత్యేక రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక కేటాయింపులూ, అధికార యంత్రాంగమూ ఉండాలి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒనగూరలేదు. ప్రత్యేక రాష్ట్ర మయితే ఒనగూరే అవకాశాలుంటాయి, ఒనగూరకపోతే కనీసం వీటికోసం తమదయిన ప్రాంతంలో ప్రజలు ఉద్యమించగలరు. పాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలరు. సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమనేది ఉపకరిస్తుందే తప్పా నష్టపెట్టదు. గనక ధర్మాన ప్రసాదరావేమీ విచ్చిన్నకారుడు కాడు, వారి ప్రకటనేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో భాగం కాదు. ఉత్తరాంధ్రుల లోలోపలి భావాన్నే ప్రసాదరావు పలికేరు. ఇపుడు కాకపోతే మరొకప్పుడయినా ఉత్తరాంధ్ర తన లోలోపలి ఆకాంక్షను కోటిగొంతులతో బహిరంగ పరచగలదు! (క్లిక్ చేయండి: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’) – వంశధార సూరి, శ్రీకాకుళం -
‘ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్కు ఇష్టం లేదా?’
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర బాగుపడటం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఇష్టం లేదనే విషయం నిన్నటి సభ ద్వారా మరోసారి అర్ధమైందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అసలు పవన్ మాటలకు చేతలకు పొంతనే లేదని ధర్మాన విమర్శించారు.ఈరోజు (శుక్రవారం) మాట్లాడిన ధర్మాన.. ‘ ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్కు ఇష్టం లేదా?, పవన్ మాటలకు చేతలకు పొంతన లేదు. ప్రజా నాయకులు హుందాగా ఉండాలి. పుస్తకాలు చదవడం కాదు.. అందులో ఉండే భావజాలాన్నిఅర్థం చేసుకోవాలి. అమరావతిలో రాజధాని అనేది రియల్టర్ల కోసమే. విశాఖ రాజధానితో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినష్టపోయాం. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.కిడ్నీ బాధితుల కోసం పలాసలోనే ఆస్పత్రి ఏర్పాటు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాలు ఆత్మ గౌరవంగా ఉండేలా సీఎం జగన్ పాలన.’ అని మంత్రి ధర్మాన తెలిపారు. -
సీఎం జగన్ను విమర్శించే అర్హత పవన్కు లేదు: ధర్మాన
-
వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం ఆదేశించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు హాజరు కాకుండానే.. పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత బరాటం రామశేషు దారుణ హత్య) కాగా, గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషు స్థానికంగా పలు వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో ఈ గ్రామంలో మూడు దఫాలు సర్పంచ్గా కూడా పనిచేశారు. అయితే, పలు వ్యాపారాలు చేస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు ఆరేళ్ల క్రితం కూడా రామశేషుపై దాడి చేశారు. ఆ సమయంలో తీవ్రగాయాలు కాగా కోలుకున్నారు. అయితే, మంగళవారం ఉదయం తన గోడౌన్కు స్టాక్ వచ్చిందని ఫోన్ రావడంతో రామశేషు అక్కడికి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు మీద కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. తలపై బండిరాయితో కొట్టడంతో రక్తపు మడుగులో అక్కడికక్కమే మృతిచెందాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
అలాంటి వాళ్లను చంద్రబాబు అంటాం: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం జగన్ కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతందిని సీఎం జగన్ తెలిపారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ ఇస్తాం. ప్రతి కమతానికి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాం. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లోనే దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ సర్వే చేస్తున్నాం. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించాం. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టాం. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతుల చేతుల్లో పెడతాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. మన గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నాం. లంచాలకు ఎక్కడా తావులేదు అని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలనలో విప్లవాత్మక మార్పులు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. కుప్పం సహా 25 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. మూడు ప్రాంతాలు బాగుపడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలుంటే ప్రస్తుతం మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. రైతన్నల కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ దుష్టచతుష్టయాన్ని ఏమనాలి? తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటాం. ఎన్నికలపుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమనాలి?. మోసం చేసే చంద్రబాబులాంటి వారికి మళ్లీ అధికారం ఇవ్వొద్దు. పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారు. పరాయి స్త్రీమీద కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నాం. దుర్యోధనుడిని సమర్థించిన వారిని దుష్టచతుష్టయం అంటాం. మామకు వెన్నుపోటుపొడిచి సీఎం కుర్చీని లాక్కుని, ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, పవన్ను మరి ఏమనాలి? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒక ఎకరం ఇవ్వని బాబుకు.. 30లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్తో పోలికా?: మంత్రి ధర్మాన
సాక్షి, గుంటూరు: సంఘాల కంటే సమాజం గొప్పదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమపై సమాజానికి ఇతరత్రా అనుమానాలు రాకుండా సంఘాలు ప్రవర్తించాలని సూచించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేది రెవెన్యూ టీమ్గా పేర్కొన్నారు. మంచి భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని సూచించారు. బ్రిటిషనర్లు చేసిన సర్వేలతోనే ఇప్పటికీ కొనసాగుతున్నామని, ప్రభుత్వం చేపట్టిన సర్వేతో గ్రామాల్లో అశాంతి పోతుందని స్పష్టం చేశారు. ‘సర్వే క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర జీడీపీ మరో రెండుశాతం పెరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానించిన ఓ చట్టం వల్ల రెవెన్యూ మరింత శక్తిమంతం అవుతుంది. ఆ చట్టం ఆమోదించబడితే సివిల్ కోర్టుల్లోని కొన్ని హక్కులు రెవెన్యూ సిబ్బంది చేతుల్లోకి వస్తాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఒక ఎకరం కూడా కొని పేదలకు ఇవ్వలేదు. పేదలకు ఒక్క ఎకరా ఇవ్వని చంద్రబాబుకు, 30లక్షలపైగా ఇళ్ళు కట్టిస్తున్న జగన్ పాలనకు పోలికా? కొంతమంది ఆ ఇళ్లను చూడటానికి బయల్దేరారు. ఈ మూడేళ్లలోనే అన్ని సమస్యలు వచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు ఐదేళ్లు ఉంటాయి. మా ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది సరికాదు’అని స్పష్టం చేశారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇదీ చదవండి: పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్ -
అవినీతికి తావు లేకుండా అభివృద్ధి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అవినీతి రహిత పాలన అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, దీనిపై టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలడం సరికాదని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా, పైసా లంచం ఇవ్వకుండా, పారదర్శకంగా.. అర్హతే ప్రామాణికంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని పీఎన్కాలనీలో మంగళవారం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాలతో మాట్లాడితేనే ప్రభుత్వ పనితీరుపై వారి సంతృప్తి స్థాయి తెలుస్తుందని చెప్పారు. వ్యవస్థ దానంతటదే పని చేసుకునే పద్ధతి రావాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే జరుగుతుందన్నారు. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు అందించాలని అప్పట్లో ప్రధానిగా రాజీవ్ గాంధీ చెప్పారన్నారు. మధ్యవర్తుల కారణంగానే అప్పట్లో 90 శాతం స్కీమ్లు అర్హులకు చేరేవి కావన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, వ్యవస్థను మార్పు చేస్తూ వివిధ పథకాల కింద లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు నేరుగా అందించామని స్పష్టం చేశారు. ఇది మార్పు కాదా? అని ప్రశ్నించారు. విద్యా రంగంలో సంస్కరణల ద్వారా మంచి మార్పులు తీసుకొచ్చామన్నారు. నిన్నా మొన్నటి వరకు రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో 22వ స్థానంలో ఉండేదని, తాజా సంస్కరణల వల్ల ఆ పరిస్థితిలో బాగా మార్పు వస్తోందన్నారు. అయితే సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంత వ్యతిరేకత ఉండటం సహజమని చెప్పారు. ప్రజలు వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందన్నారు. ఇది అర్థం కాని వారే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని వివరించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ హయాంలోనే జిల్లా అభివృద్ధి ► బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్, రూ.3 వేల కోట్లతో భావనపాడు పోర్టు నిర్మించనున్నాం. గొట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఉద్దానంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, పలాసలో కిడ్నీ రోగుల కోసం రూ.50 కోట్లతో డయాలసిస్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. ► జిల్లాల పునర్విభజన పూర్తయింది. రిమ్స్ను 900 పడకలతో తీర్చిదిద్దాం. ఇదంతా అభివృద్ధి కాదా? ఇది టీడీపీ నేతలకు కనిపించడం లేదా? మరో తెలంగాణ కాకూడదు.. ► రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు పట్టించుకోకుండా, నారాయణ కమిటీ సిఫార్సులను అమలు చేయడం దారుణం. చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం వారి స్వార్థానికి రాష్ట్రంలో ప్రజలందరినీ బలి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మరో తెలంగాణ కాకూడదు. ఈ దృష్ట్యా పాలన రాజధాని విశాఖే అన్న నినాదం వినిపించేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని గుర్తించిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. ► వైజాగ్.. రాష్ట్రం మధ్యలో లేదని కొంత మంది చెప్పడం హాస్యాస్పదం. దేశంలో తమిళనాడు, మహారాష్ట్రల్లో చెన్నై, ముంబై ఎక్కడ ఉన్నాయో గమనించాలి. పాలన రాజధానిగా అందరినీ ఆదరించే గుణం వైజాగ్ సొంతం. న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. దేశంలో సుమారు 8 రాష్ట్రాల్లో ఈ విధంగా రాజధానులు ఉన్నాయి. -
ఎకరాకు రూ.25 లక్షల పరిహారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: భావనపాడు పోర్టు ప్రభావిత గ్రామాల్లోని రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, దీనికి రైతులు సంతృప్తి వ్యక్తంచేశారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన గురువారం మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో కలిసి మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులతో డీఎల్ఎన్సీ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గతంలో ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని, రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో రూ.5 లక్షలు పెంచుతూ రూ.25 లక్షల పరిహారాన్ని అందించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. దీనిపై నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలువురు నిర్వాసిత రైతులను మంత్రులు సత్కరించారు. రైతుల త్యాగాలు మరువలేమని మంత్రులు చెప్పారు. త్వరలోనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీవో జయరావు, తహసీల్దార్ చలమయ్య తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు రెండేళ్లకే హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారు: ధర్మాన
-
రాజధాని విషయంలో కేంద్ర కమిటీ అదే చెప్పింది: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే చంద్రబాబు దానిని విస్మరించారని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మంచి రాజధాని అవసరం ఏర్పడిందని తెలిపారు. పదేళ్లు హైదరాబాద్లో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రెండేళ్లకే ఖాళీ చేశారన్నారు. ఈమేరకు మన రాజధాని, మన విశాఖ సదస్సులో మంత్రి ధర్మాన ప్రసంగించారు. 'ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్ర కమిటీ చెప్పింది. ఆంధ్ర రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చింది. ఒరిస్సాలో.. కటక్లో హైకోర్ట్, భువనేశ్వర్లో పరిపాలన రాజధాని ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోంది. అభివృద్ధి అసమానత ఉంటే రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుంది. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బాబు హయాంలో అమరావతి రాజధాని కోసం 3,500 రహస్య జీఓలు ఇచ్చారని' మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..) -
విశాఖ కోసం రాజీనామా!.. మంత్రి ధర్మానను వారించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా కార్య నిర్వాహక రాజధాని సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు తన రాజీనామాను అంగీకరించాలన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలసిన మంత్రి ధర్మాన కొందరు ప్రగతి నిరోధకులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదని, తన రాజీనామాను అనుమతించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది. దీన్ని సున్నితంగా తిరస్కరించిన సీఎం జగన్ వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. తాను సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, సర్పంచ్ నుంచి రెవెన్యూ మంత్రి వరకూ వివిధ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించినట్లు ధర్మాన ఈ సమావేశంలో పేర్కొన్నారు. దీని వెనుక దివంగత వైఎస్సార్ ఆశీస్సులు, ప్రోత్సాహం మెండుగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టాక పరిపాలనలో సమూల మార్పులు తెచ్చారని ప్రశంసించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశం వివరాలివీ.. ►ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు, సమగ్రాభివృద్ధి, పరిపాలన రాజధానిగా విశాఖను సాధించుకోవడంతో పోలిస్తే ఈ పదవులు, హోదాలు గొప్పవని నేను భావించడం లేదు. ►అనేక అవకతవకలు, ఆశ్రిత పక్షపాతం, ఏకపక్ష ప్రయోజనాలు, కేంద్రీకృతమైన సంపద కోసం సమగ్రాభివృద్ధిని విస్మరిస్తూ గత సర్కారు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసింది. నాడు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కగా నేడు ధనబలం, ఓ వర్గం మీడియా సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతూ కుటిల యత్నాలు చేస్తున్నారు. రూ.లక్షల కోట్లు వెచ్చించి అమరావతిని మరో హైదరాబాద్లా తయారు చేయడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం. ►రాజ్యాంగ వ్యవస్థలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలని మీరు (సీఎం జగన్) తీసుకున్న నిర్ణయం ద్వారా మూడు ప్రాంతాల ప్రగతికి బాటలు వేయడం కాకుండా చారిత్రక శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించినట్లయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది కొత్త ఆశలు చిగురింపజేసింది. యువత ఆశలు మొగ్గ తొడిగాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిపోతున్న ప్రాంత ప్రజలకు గౌరవంగా బతకొచ్చనే ధైర్యాన్నిచ్చింది. తమ మధ్యే రాష్ట్ర పరిపాలన జరుగుతుందని వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, గృహిణులు ఉత్తేజితులయ్యారు. ►దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా లెక్కలకెక్కిన శ్రీకాకుళం వాసిగా, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా విశాఖలో పాలనా రాజధాని ఒక్కటే ఈ ప్రాంత అభివృద్ధికి తారక మంత్రమని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నా. వికేంద్రీకరణ సూత్రంతో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి అంతా మద్దతివ్వాలి. ఈ దిశగా ఆలోచించినప్పుడు ఉత్తరాంధ్ర ఉజ్వల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతోంది. పొట్ట చేత పట్టుకుని పరాయి ప్రాంతాలకు వెళుతున్న వలసలు ఆగిపోతున్న దృశ్యం కళ్ల ముందు కనిపిస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. చదవండి: ‘ఎన్ని మందలు కలిసి వచ్చినా.. సీఎం జగన్పై పైచేయి సాధించలేరు’ -
ఉత్తరాంధ్ర గొంతు నొక్కటానికే తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి, శ్రీకాకుళం రూరల్: ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నందుకే తమలాంటి వాళ్ల పీక నొక్కాలని కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయని రెవెన్యూ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. తన నోరు మూయడం కోసమే తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 2005లో కొన్ని ఎన్ఓసీలు ఇచ్చారని, అవన్నీ అప్పట్లో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రయోజనాలకోసమే జరిగాయని పేర్కొంటూ ఇప్పుడు ‘ఈనాడు’ పత్రిక వరస కథనాలు వేస్తుండటంపై ఆయన స్పందించారు. ‘‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉండాలని కొన్ని గొంతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి గళాలన్నిటినీ నొక్కి ఆ పత్రికలు ఏం సాధించాలనుకుంటున్నాయో నాకైతే అర్థం కావటం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇలా గొంతులు నొక్కటం ద్వారా అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ మాఫియాను నిర్మించాలనుకుంటున్నారని, అదే వారి ప్రయోజనమని చెప్పారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ను సృష్టించి ఆస్తులు సంపాదించాలనే తాపత్రయం తప్ప వారి ఆలోచనల్లో ప్రజల కోణం ఏమీ లేదన్నారు. స్వల్ప ప్రయోజనాల కోసం వాళ్లు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, తాము విశాల ప్రయోజనాల కోసం పోరాటం మొదలుపెట్టామని స్పష్టంచేశారు. ‘‘నాది 40 సంవత్సరాల రాజకీయ జీవితం. అలాంటి నా క్యారెక్టర్పై మచ్చ వేయటం వారి తరం కాదు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న చంద్రబాబు కుట్రలను ఎదుర్కోవటమే మాకు ముఖ్యం. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలే మాకు ప్రధానం’’ అన్నారు. వాళ్లు ఆరోపిస్తున్న వ్యవహారాలను చూస్తే... ఎన్ఓసీలు ఇవ్వటం వంటివి మంత్రి నిర్ణయం తీసుకునేవి కాదని, కలెక్టర్ల స్థాయిలోనే ఆ నిర్ణయాలు జరుగుతాయని వివరించారు. ‘‘చంద్రబాబు కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు. ఆయనకు ఇవన్నీ తెలియదా? మసిపూసి మారేడు కాయ చేయాలనుకుంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రికి, జిల్లా స్థాయిలో కార్యకలాపాలకు సంబంధం ఉండదని, జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల స్థాయిలోనే ఇదంతా జరుగుతుందని చెప్పారు. వికేంద్రీకరణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే ఈ తరహా తప్పుడు రాతలు రాస్తున్నారంటూ... ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం ఇంకా గట్టిగా గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. రాజధానికన్నా పదవి ముఖ్యం కాదు విశాఖ రాజధాని కావాలా.. మంత్రి పదవి కావాలా..? అని అడిగితే ఉత్తరాంధ్ర ప్రజల కోసం మంత్రి పదవినైనా వదిలేస్తానని ధర్మాన ప్రసాదరావు స్పష్టంచేశారు. శ్రీకాకుళంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొని ఉద్వేగంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్ కమిటీ, శ్రీభాగ్ కమిటీ వంటివి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అవసరమని ప్రతిపాదించాయని గుర్తు చేశారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చంద్రబాబు తన ఇంటిలో స్కెచ్ వేసి అమరావతి, గుంటూరు, నూజివీడు ప్రాంతాలనే రాజధానిగా ప్రకటించి ఇతర ప్రాంతాల వారి నోట్లో మట్టి కొట్టారని దుయ్యబట్టారు. రాజధాని కోసం మద్రాసుకు 70 ఏళ్లు, కర్నూలుకు మూడేళ్లు, హైదరాబాద్కు 58 ఏళ్లు పరుగులు పెట్టామని, 130 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు రాజధానికి దూరంగానే ఉన్నారని వివరించారు. విశాఖలో వాయు, జల, రైలు మార్గాలు అనువుగా ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉత్తరాంధ్రులంతా ఏకమై విశాఖకు రాజధాని తెప్పించుకోవాలన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అమరావతిలో కేవలం చెట్లు, రేకులు తప్ప ఏమీ లేవన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. -
చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్
-
‘అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు’
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు. ఒక్కచోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబడతాయి. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆవేదన కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. దీనిపై చంద్రబాబు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. కొన్ని వర్గాల అభివృద్ధి కోసమే అమరావతి రాజధాని ప్రతిపాదన. వనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా అందించాలి. గత అనుభవాలతో ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి. అందరికీ న్యాయం జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. కొంత మంది చేతుల్లో ఉండే రాజధాని మనకు అవసరమా?. అన్ని ప్రాంతాల వారు నివసించే పరిస్థితి ఒక్క విశాఖలోనే ఉంది. అమరావతిలో వేరే వర్గం నివసించే పరిస్థితి లేదు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి?. ఉత్తరాంధ్రకు ఒక్కసంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా?. టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారు. విశాఖలో సెంటిమెంట్ లేదని అంటారా.. అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు. -
విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు
సొంత ప్రాంతంపై ఎటువంటి వారికైనా మమకారం ఉంటుంది. తమ ప్రాంత ప్రగతికి అవకాశం వస్తే హర్షిస్తారు.. స్వాగతిస్తారు.. సహకరిస్తారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిలో అవేవీ మచ్చుకైనా లేవు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప తన ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదన్నట్లు విర్రవీగుతున్నారు. పదవులు ఇచ్చిన అధినేత మోచేతి నీళ్లు తాగుతూ.. వారి పన్నాగాలకు వంతపాడుతూ సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి బాటలు వేసే విశాఖ రాజధానికి అడ్డం పడుతూ.. విషం కక్కుతున్నారు. అమరావతే అజెండాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెగేసి చెబుతూ ఉత్తరాంధ్రకు ద్రోహం తలపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలు బాగు కోరకుండా.. విశాఖ రాజధాని వద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలు మండి పడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని గెలిపించి తప్పు చేశామని టెక్కలి నియోజకవర్గ ఓటర్లు అంతర్మథనం చెందుతున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిగానే తాను ఎన్నికలకు వెళ్తానని అచ్చెన్నాయుడు ఓటర్లకు సవాల్ విసురుతున్నారు. ప్రజల కంటే తమ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, అమరావతిలో వారికున్న భూములే ముఖ్యమని చెప్పకనే చెబుతున్నారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కోరుతున్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తమ గళం విప్పుతున్నారు. కానీ టీడీపీ నేతలకు మాత్రం ఇది రుచించడం లేదు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికైనా సిద్ధమవుతున్నారే తప్ప అమరావతిని వదులుకునేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ రైతుల యాత్రకు మద్దతునిస్తూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. జిల్లాలో అచ్చెన్నాయుడు అండ్ కో తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. దద్దమ్మలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా మూడు రాజధానుల కోసం తాము రాజీనామా చేస్తాం.. అమరావతి కోసమని రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడుకు సవాల్ కూడా విసురుతున్నారు. (క్లిక్: జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి) ఓట్లేసిన ప్రజలు దద్దమ్మలా... మీకు ఓటేసినందుకు ప్రజలు దద్దమ్మలా కన్పిస్తున్నారా.. అచ్చెన్నాయుడు? చంద్రబాబు పంచన చేరి ఆయన చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయకులంతా ప్రయత్నిస్తున్నారా? ఇంతకాలం వివిధ సందర్భాల్లో రాజధాని పేరిట జరిగిన ఏర్పాటులో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలే బుద్ధి చెబుతారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖను పాలనా రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి ఇక్కడి టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించాల్సింది పోయి వ్యతిరేకించడం దారుణం. చంద్రబాబుతో సహా ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులంతా అభివృద్ధి నిరోధకులు. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. నరసన్నపేట: మూడో రోజు రిలే దీక్షలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రజల మనోభావాలతో అచ్చెన్న ఆటలు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అచ్చెన్నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాకుండా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అచ్చెన్నాయుడు తాపత్రయపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలడా..! టెక్కలి: వికేంద్రీకరణకు మద్ధతుగా నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆత్మ సాక్షిగా ముందుకు సాగాలి.. ఉత్తరాంధ్ర నాయకులు ఆత్మసాక్షిగా ముందుకు సాగాలి. ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలి. విశాఖపట్నం రాజధానిగా అవకాశం లభించింది. ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు వైస్ చాన్స్లర్, ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ అభిమానం అందరికీ ఉంటుంది మన ప్రాంతం అన్న అభిమానం అందరికీ ఉంటుంది. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతున్నారు. పార్టీకి సైతం నచ్చజెప్పేలా నాయకులు ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రగతికి విశాఖపట్నం రాజధాని కావటం మంచి అవకాశం. దీన్ని స్వాగతించాలి. – ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్ -
‘మన పీక కోసేందుకు అరసవల్లి వస్తారంట’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: విశాఖ రాజధాని ఏర్పాటైతే ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్ బాగుంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అరసవల్లిలో శుక్రవారం.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు చెన్నై, కర్నూలు, హైదరాబాద్ పరుగెత్తాం. మా ప్రాంతానికి రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అంటూ ప్రశ్నించారు. చదవండి: కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్టు ‘‘విశాఖ రాజధాని కోసం త్యాగాలు, చందాలు అవసరం లేదు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దంటూ అరసవల్లి వస్తారంట. మన పీక కోసేందుకు అరవసల్లి వస్తారంట. విశాఖ రాజధాని వద్దని చంద్రబాబు అంటున్నారు. అడ్డొచ్చిన వారిని చితక్కొట్టాలని చంద్రబాబు అంటున్నారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు. -
Dharmana Prasada Rao: వికేంద్రీకరణతోనే సమన్యాయం
స్వతంత్రం రాక ముందు మద్రాస్కు, స్వాతంత్య్రం వచ్చాక కర్నూలుకు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. పరిపాలనా వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాల వాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. అలా ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పాలనా రాజధానిగా త్వరగా, తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. జూన్ 2, 2014. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తేదీ. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ భారతదేశ పార్లమెంట్ చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’ (రీ–ఆర్గనైజేషన్ యాక్ట్, 2014) అమలులోకి వచ్చిన రోజు. ఈ చట్టం చేసే ముందు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విధివిధానాల పరిశీలన కోసం కేంద్ర ప్రభు త్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2010 ఫిబ్రవరి నుంచి ఉమ్మడి రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటించింది. పది నెలలు పర్యటించి చేసిన అధ్యయనంలో వివిధ అంశాలను ప్రస్తా విస్తూ నివేదికను సమర్పించింది. తొలుత రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరడానికి అంగీకరించకపోవడం, ఆ తర్వాత 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఆర్థిక, సామాజిక పరిపాలనా అంశాల్లో కొన్ని భద్రతలు కల్పించడంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఒకటి కావడం, ఆ తర్వాత తెలంగాణతో కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం వంటి పరిణామాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లో హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగు తుందని, ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొ న్నారు. సెక్షన్ 6లో కేంద్ర ప్రభుత్వం నియమించే నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలు నాటి నుండి ఆరు నెలల లోపు ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని కోసం వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి తగిన సూచనలు, సిఫారసులు చేస్తుందని ఉంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించి, కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ రతన్ రాయ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సైన్స్ అండ్ పాలసీ డైరెక్టర్)ను, సభ్యులుగా ఆరోమార్ రెవి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్), శ్రీ జగన్ షా (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్), ప్రొఫెసర్ కె. రవీంద్రన్ (న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్)లను నియమించింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఈ కమిటీకి అపార అనుభవం ఉంది. ఈ కమిటీ రాష్ట్రంలో 11 జిల్లాలు పర్యటించి ప్రజలను ప్రజా సంఘాలను కలిసింది. వారితో సంప్రదింపులు జరిపింది. వారి సూచనలు, సలహాలు తీసుకుంది. 4728 ప్రజా విజ్ఞప్తుల్ని పరిశీలించి వాటన్నింటినీ క్రోడీకరించింది. 187 పేజీలతో తన నివేదికను నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ‘‘హైదరాబాద్లో కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు; మంత్రిత్వ శాఖల కేంద్రీకరణకు అనేక సంవత్సరాలు పట్టింది. అన్నేళ్లుగా రాజధాని పేరిట హైదరాబాద్లో జరిగిన ఈ కేంద్రీకృత అభివృద్ధే విభజన డిమాండ్కు కీలకాంశం. కాబట్టి ఒకే ఒక పెద్ద రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యం కాదు’’ అని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడింది. అలాగే గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా నిర్మాణం మొదలు పెట్టడం) రాజధాని కూడా ఆమోదయోగ్యం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆనాటి ప్రభుత్వం ఈ సూచనను పట్టించుకోలేదు. పైగా అత్యంత విచారకరమైన విషయమేమిటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో భూలభ్యత గురించి అడిగినప్పుడు ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించకపోవడం! అసలు కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఒక అభిప్రాయానికొచ్చి విభజన చట్టానికి వ్యతిరేకంగా తానే ఒక కమిటీ నియమించుకుంది. అర్హతలూ, అనుభవం, నైపుణ్యం ఏ మాత్రం లేని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కమిటీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. అందులో సభ్యులుగా ఉన్న వారిని చూస్తే వారి ఆలోచన, సామర్థ్యం, రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదనుకునే బాధ్యతా రాహిత్యం, ఇతర ప్రాంతాల అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతుంది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్, బొమ్మిడాల శ్రీనివాస్, జీవీకే సంజయ్ వంటివారు ఆనాటి కమిటీ సభ్యులు. రాజ్యాంగబద్ధంగా, శాసన సమ్మతంగా ఏర్పాటైన శివరామ కృష్ణన్ నివేదికను తొక్కిపెట్టి, ఏ చట్టంలోనూ పేర్కొనని నారాయణ కమిటీని అడ్డం పెట్టుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించారు! దాని కోసం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) చట్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య. రాజ్యాంగ సభలో 1949 మే 27న ‘రాజధాని ఎక్కడ ఉండాలి?’ అనే విషయంపై చర్చ జరిగినా, రాజ్యాంగంలో ప్రస్తావన జరగలేదు. రాజధాని ఒకటే ఉండాలని గాని, ఒకే చోట ఉండాలి గాని ఎక్కడా నిర్దేశించలేదు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలు ఒకేచోట ఉండాలని నిర్ణయించలేదు. ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి అనుకూల మని భావించిన చోట పార్లమెంటును సమావేశపరిచే అధికారం ఉంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోర్టు విచారణలు ఎక్కడ జరపాలో నిర్ణయించే అధికారం ఉంది. వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు సూచించమని రిటైర్డ్ అధికారి నాగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానత లను దృష్టిలో పెట్టుకొని పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర సమగ్రా భివృద్ధిని సూచిస్తూ తన నివేదికను 2019 డిసెంబర్ 20న ప్రభుత్వానికి సమర్పించింది. ఆ కమిటీ నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. సెక్రటేరియట్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సమ్మర్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్ విశాఖపట్నంలో; రాష్ట్ర శాసన సభ, హైకోర్ట్ బెంచ్, మినిస్టర్స్ క్వార్టర్స్ అమరావతి, మంగళగిరిల్లో; హైకోర్ట్ ప్రిన్సిపల్ సీట్, సంబంధిత కోర్టులు కర్నూలులో పెట్టాలని సూచించింది. అసలు ఈ పరిపాలన వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాలవాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. ఆ ఆకాంక్షలు, కోరికలు తీరే రోజులు సమీపిస్తున్నాయని పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పరిపాలన రాజధానిగా అతి త్వరగా తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల్లో ఇతర రాష్ట్రాలు, దేశాలతో విశాఖపట్నం అనుసంధానం కలిగి ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలమైనది. అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాలలోని చాలా కంపెనీలు విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. విశాఖపట్నం మొదటి నుంచీ జీడీపీకి కీలక వాటాను అందిస్తున్నా తిరిగి తగినంత ప్రభుత్వ నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామని ప్రశ్నించుకుంటే... చుట్టూ తిరిగి, తెలుగుదేశం ఐదేళ్లు పాలన ఒక కల లాగే మిగిలిపోయి, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6 ముందు నిలబడ్డాం. మన ముందు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం శివరామకృష్ణన్ రిపోర్ట్ ఉంది. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే వికేంద్రీకరణ ఒకటే సూత్రమనే తారకమంత్రం వినిపిస్తోంది. సమాన అభివృద్ధి అనే విధానాన్ని పట్టిం చుకోకపోతే భవిష్యత్తు పట్ల యువత ఆశలు కునారిల్లిపోతాయి. ప్రజా స్వామ్య ప్రభుత్వంపట్ల విశ్వాసం సన్నగిల్లిపోతుంది. స్వతంత్రం రాక ముందు నుండి మద్రాస్కు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్నూ లుకు, ఏపీ ఏర్పడ్డాక హైదరాబాద్కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. -వ్యాసకర్త: ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి -
వికేంద్రీకరణతోనే అభివృద్ధిలో సమతుల్యత
రాష్ట్రంలో మరెవరికీ న్యాయం జరగకుండా తమ వారికి మాత్రమే ప్రయోజనం కల్పించే వ్యూహంతోనే అమరావతిని రాజధాని చేయాలనుకుని రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు నట్టేట ముంచేశారు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. – మంత్రి ధర్మాన ప్రసాదరావు సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందని మేధావులు, రాజకీయ నేతలు స్పష్టంచేశారు. విభజన సమయంలో వేలాది మంది మనోభావాలను స్వయంగా అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికను చంద్రబాబు కాలగర్భంలో కలిపేసి ప్రస్తుత సమస్యకు కారణమయ్యారని వారు విమర్శించారు. హైదరాబాద్లో పెట్టిన రూ.వేల కోట్ల పెట్టుబడులను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం నలుమూలలా పెట్టి ఉంటే మనం ఇంతగా నష్టపోయే వారం కాదన్నారు. ఆ పొరపాటును మళ్లీ పునరావృతం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రోడ్డెక్కడం మూర్ఖత్వంగా వారు అభివర్ణించారు. పాలనా వికేంద్రీకరణపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం రాజమహేంద్రవరం ఎంపీ, పార్లమెంటులో వైఎస్సార్సీపీ చీఫ్విప్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో విభిన్న రంగాలకు చెందిన మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్, విద్యావేత్తలు, వైద్యులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్యఅతిథిగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై మాట్లాడారు. నిపుణుల సూచనలకు అనుగుణంగానే.. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగానే పాలనా వికేంద్రీకణ చేస్తున్నట్లు ధర్మాన చెప్పారు. దేశంలో అత్యున్నతమైన మేధావులు ప్రొ. మహవీర్, కేటీ రవీంద్రన్, అంజలీమోహన్ తదితరులతో ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు తుంగలోకి తొక్కడమే కాక నారాయణ కమిటీని వేసి తప్పు మీద తప్పు చేశారన్నారు. రాష్ట్ర విభజన తరువాత పార్లమెంటు చేసిన పునర్నిర్మాణ చట్టంలో తీసుకొచ్చిన సెక్షన్–6 మరే రాష్ట్ర విభజన సమయంలో చేయలేదన్నారు. ఇక విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్–6లోని సిఫార్సులను ఎందుకు ఆమోదించలేదో చంద్రబాబు బదులివ్వాలని ధర్మాన డిమాండ్ చేశారు. కమిటీ నివేదికను అమలుచేయడం తప్ప మరో గత్యంతరం లేదన్నారు. అందుకే అన్ని రకాలుగా అనువైన విశాఖపట్నం సిటీ కాస్మోపాలిటన్ నగరంగా ఉండటంతో దానిని కార్యనిర్వాహణ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారన్నారు. అబద్ధాలు ఆడటమే చంద్రబాబు ఎజెండా : వేణు చంద్రబాబు ప్రదాన ఎజెండా అబద్ధాలు అడటమని.. వాటిని ఎల్లో మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మరో మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శించారు. అమరావతిని రాజధాని చేస్తానని చంద్రబాబు.. వికేంద్రీకరణ చేస్తామని తాముచెప్పి ఎన్నికలకు వెళ్తే ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టి చంద్రబాబుని ఓడించారన్నారు. అంటే ప్రజలంతా వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నారన్నారే విషయం స్పష్టమైందని మంత్రి అన్నారు. కమిషన్ నివేదిక బుట్టదాఖలు : బోస్ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను చంద్రబాబు చెత్తబుట్టలో వేయడంతోనే ప్రాంతీయ విభేదాలు తలెత్తాయన్నారు. ఇక కోర్టులు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడంపై పునారాలోచించుకోవాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు కూడా రాజధాని విషయం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమని తెల్చి చెప్పిందని.. కోర్టులన్నా, న్యాయమూర్తులన్నా తనకు అపారమైన గౌరవం ఉందని బోస్ చెప్పారు. పాలనాపరంగా విశాఖ మేలు : భరత్రామ్ ఇక రాష్ట్రంలో అద్భుత నగరమైన విశాఖపట్నం పాలనాపరంగా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్విప్ మార్గాని భరత్రామ్ అభిప్రాయపడ్డారు. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి అద్భుతమైన రాజధానిగా, నెంబర్వన్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు. రాజధాని పేరుతో టీడీపీ తన ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భరత్రామ్ ఎద్దేవా చేశారు. మాజీమంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. 2014లో కేవలం సీనియర్ అనే కారణంతో ప్రజలు బాబుకు పట్టంకట్టిన పాపానికి నేడు ఇన్ని అనర్థాలకు ఆయన కారణమయ్యారన్నారు. 16 రాష్ట్రాల్లో ఒకచోట అసెంబ్లీ, మరోచోట న్యాయవ్యవస్థ నడుస్తుంటే.. చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం చరిత్రను మసిబూసి మారేడు కాయగా చేస్తోందని మండిపడ్డారు. తమ భూముల విలువ పెంచుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, సత్తి సూర్యనారాయణరెడ్డి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కవురు శ్రీనివాసరావు, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, విభిన్న రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. జగన్ నిర్ణయం శాస్త్రీయం వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో మూడుచోట్ల రాజధానుల ఏర్పాటు అనేది శాస్త్రీయమైనది. చంద్రబాబు తన కోటరీకి లాభం చేకూర్చేలా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలని జగన్ భావిస్తున్నారు. – జార్జి విక్టర్, మాజీ వైస్చాన్సలర్, నన్నయ విశ్వవిద్యాలయం ఇన్సైడర్ ట్రేడింగ్వల్లే ఆటంకాలు రాజధాని పేరుతో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అందుకే వికేంద్రీకరణకు ఆటంకాలు కల్పిస్తున్నారు. వికేంద్రీకరణవల్ల ఎటువంటి నష్టమూ ఉండదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఉంటే జిల్లా కోర్టు రాజమహేంద్రవరంలో ఉండేది. దానివల్ల ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. – డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు అభివృద్ధిలో సమానత్వం రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను బట్టి రాజధానిని నిర్ణయించాలి. జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలకు రెండు రాజధానులున్నాయి. ఒకటి కంటే ఎక్కువ రాజధానులున్నంత మాత్రాన అభివృద్ధి జరగదనుకుంటే పొరపాటు. చాలా రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి కదా! పాలనా వికేంద్రీకరణతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అభివృద్ధిలో సమానత్వం వస్తుంది. – గన్ని భాస్కరరావు, ఐఎంఏ అధ్యక్షుడు -
మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్
సాక్షి, శ్రీకాకుళం: ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనుక దురుద్దేశం ఉంది. 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు అంటూ మంత్రి ధర్మాన ప్రసాదారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి ధర్మాన శ్రీకాకుళంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 65 ఏళ్లలో మనమంతా కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేశాము. ఆనాడే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే ఇలాంటి ప్రమాదం వచ్చేదికాదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుంటే విభజన జరిగేది కాదు. ఒక్క అమరావతినే అభివృద్ధి చేస్తే మళ్లీ అలాంటి పరిస్థితి రాదా?. ఒక్క చోటనే అభివృద్ధి అనేది సరికాదు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే విషయం చెప్పింది. అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రతిపక్షం ఎందుకు అంగీకరించట్లేదు. అమరావతిలో క్యాపిటల్ వద్దని ప్రభుత్వం చెప్పడం లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ విధానం. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనుక దురుద్దేశం ఉంది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కాన్సెప్ట్ను ప్రపంచమే అంగీకరించట్లేదు. 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు. సృష్టించబడిన సంపద అందరికీ చేరాలి. హైదరాబాద్లో జరిగిన అన్యాయం మళ్లీ పునరావృతం కావొద్దు. 4-5 లక్షల కోట్లతో అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమా?. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా?. ఒక్కచోటే అన్నీ పెట్టి మా పీక కోస్తామంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఊరుకుంటారా?. మా ప్రజలు ఎప్పటీకీ కూలీలుగానే ఉండాలా?. సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉండాలన్నడాన్ని మేము అంగీకరించం. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే మేము చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: గడపగడపకూ.. ఆహ్వానిస్తూ, ఆర్జీలిస్తున్న జనం -
ప్రభుత్వంపై కుట్రలు చేసేందుకే టీడీపీ పరిమితం
-
వెలుగు రేఖ జగన్
పలాస/కాశీబుగ్గ: నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగు రేఖలా కనిపిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో తిత్లీ తుపాను బాధితులకు అదనపు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో కూడు, గూడు, గుడ్డ కోసం బొడ్డపాడులో ఎన్నో ఉద్యమాలు చేశారని, సీఎం వైఎస్ జగన్ వాటిని ఏ పోరాటం లేకుండా అర్హులకు అందిస్తున్నారని ధర్మాన చెప్పారు. అందరికంటే పెద్ద కమ్యూనిస్టు వైఎస్ జగనేనని ఓ మిత్రుడు తనతో చెప్పాడని, అదే నిజమని అన్నారు. గత మూడేళ్లలో ప్రజల ఖాతాలకు రూ.లక్షా నలభై వేల కోట్ల నగదు జమ చేసిన ఘనత సీఎం జగన్దేనని ప్రశంసించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ, ఎల్లోమీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని అన్నారు. టీడీపీ హయాంలో కేవలం కార్యకర్తలకే పథకాలు అందేవని విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు తలెత్తుకునేలా సీఎం పనితీరు ఉందన్నారు. త్వరలోనే హిరమండలం నుంచి ఉద్దానంకు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఉద్దానంలో ఎందరో నాయకులు పర్యటించారని, కానీ వైఎస్ జగన్ వచ్చాక మాత్రమే డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, రూ.200 కోట్లతో పలాస ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలకు అవకాశం లేకుండా సీఎం పరిపాలన సాగుతోందని, చంద్రబాబుకు ఇది మింగుడు పడడం లేదని అన్నారు. తిత్లీ తుపాను బాధితులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా సాయం చేసేలా ప్రతిపాదన పెడతామన్నారు. విద్యార్థుల్లో డ్రాపౌట్లను తగ్గించేందుకు విద్యకు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నామని, అమ్మ ఒడి, ప్రభుత్వ బడులు బాగు చేయడం వంటి పలు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం నిధులిచ్చారు జిల్లాలోని 90,789 మంది జీడి, కొబ్బరి రైతులకు రూ.182.60 కోట్ల అదనపు పరిహారం చెల్లించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.700 కోట్లతో శుద్ధ జలాలు అందించే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హెక్టారు జీడి పంటకు నష్ట పరిహారాన్ని రూ.30,000ల నుంచి రూ.50,000లు, కొబ్బరి చెట్టుకి రూ.1,500 నుంచి రూ.3,000కి పెంచి చెల్లింపులు చేసినట్లు వివరించారు. -
లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు: మంత్రి ధర్మాన
-
ప్రజలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచి బస్ యాత్ర ద్వారా చేసిన మేలుని వివరిస్తాం: మంత్రి ధర్మాన
-
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయంపై వివరిస్తాం: ధర్మాన
-
YSR Bus Yatra: శ్రీకాకుళం నుంచి ఏపీ మంత్రుల బస్సుయాత్ర
సాక్షి, శ్రీకాకుళం: పలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయంం ప్రారంభమైన వైఎస్సార్సీపీ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. ‘‘దేశానికి ఇండిపెండెన్స్ రాక ముందు నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేశాయి. మొదటిసారిగా 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారు. ఇది చరిత్రలో సీఎం వైఎస్ జగన్ ఒక్కరే చేయగలిగారు. ఇలా చేయమని సీఎం జగన్కు ఎవరూ అడగలేదు.. ఆయనే స్వతహాగా అవకాశం కల్పించారు. ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. వాళ్ళకి పంచి పెడితే దానిని కొందరు హేళన చూస్తున్నారు. విమర్శలు చేసే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టే. గతంలో నాయకులకు సలాం కొడితే పథకాలు ఇచ్చారు. కానీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచాల్సిన పనిలేదు. సీఎం జగన్ వాళ్ళ ఇంటికే పథకాలు అందిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర మంతా తిరిగాడు. కానీ, మేము ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగాడా?. ఏ బీసీ అయినా తల వంచే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఈ వర్గాల వారిని సీఎం జగన్ సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేశారు. దానికి సజీవ సాక్ష్యంగా నిలబడాలి అనే బస్సు యాత్ర చేస్తున్నాం. మూడేళ్ళలో ఈ వర్గాల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం.. అవన్నీ ప్రజలకు చెప్తాము. ఈరోజు దేశానికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని పంపారు’’ అని తెలిపారు. అనంతరం, పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘసంస్కర్త సీఎం జగన్. ఆ వర్గాల్లో మహిళలకు సమానావకాశాలు కల్పిస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశమంతా చూస్తోంది. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నాము’’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: బస్సు యాత్రను అడ్డుకుంటామనడం సిగ్గుచేటు -
దేశంలో ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది
-
ప్రజలను చైతన్యపరిచేందుకే సామాజిక న్యాయభేరి
శ్రీకాకుళం రూరల్/విజయనగరం అర్బన్: ప్రజలను చైతన్యపరచడమే సామాజిక న్యాయభేరి ఉద్దేశమని రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ యాత్రలో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. యాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెదపాడు క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి ధర్మాన పార్టీ నేతలతో మాట్లాడగా, మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఈనెల 26న శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్లో బహిరంగం సభ అనంతరం అక్కడి నుంచి బస్సుయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 27న విశాఖపట్నం, 28న పశ్చిమగోదావరి జిల్లాల్లో యాత్ర సాగుతుందని, 29న అనంతపురంలో ముగుస్తుందని చెప్పారు. దేశంలోనే బ్యాక్వర్డ్ క్లాస్లకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, దానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చట్టసభల్లో బడుగు, బలహీనవర్గాల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను క్షేత్రస్థాయిలో తెలియజేస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది బడుగు, బలహీనవర్గాల వారున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యాన్ని దాదాపు 50% మంది బడుగు, బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ అప్పగించారని తెలిపారు. రాజ్యసభ సీట్లను తెలంగాణ వారికి ఇవ్వడాన్ని తప్పుగా ప్రసారం చేస్తున్న ఏబీఎన్ చానల్.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లను ఆ రాష్ట్రవాసులకే ఇవ్వాలనే నిబంధనలు లేవని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో చట్టం తనపని తాను చేస్తుందన్నారు. ఇప్పటికే ఆయనపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. తప్పుచేసిన వారిపై ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలను ఈ వేసవి సెలవుల్లోనే చేపడతామన్నారు. మంత్రి బొత్స వెంట జెడ్పీ చైర్మన్ మజ్జి సీతారాం, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య తదితరులున్నారు. -
26 నుంచి బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో మంత్రివర్గంలో 77 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ అని చాటిచెప్పిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని రెవెన్యూ, విద్యా శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తెలిపారు. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలసి గురువారం వారిద్దరూ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాల ద్వారా పేదల బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసి రాజ్యాధికారం కల్పించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించటాన్ని విపక్షాలు, ప్రధానంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓర్చులేకపోతున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వల్లె వేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే దుస్సాహసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుందని తెలిపారు. యాత్ర సందర్భంగా రోజూ ఒకచోట బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తొలిరోజు 26న విజయనగరంలో, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు బస్సు యాత్రలో పాల్గొంటారని, ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నామినేటెడ్ పదవులు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేకూర్చిన సామాజిక న్యాయం, సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తారన్నారు. మంత్రులు ధర్మాన, బొత్స ఇంకా ఏమన్నారంటే.. ఏనాడూ అధికారం, పాలన చూడని వర్గాలకు రాజ్యాధికారం స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు బండ చాకిరీకే పరిమితం అయ్యాయి. అధికారం, పాలన ఏనాడూ చూడని ఆయా వర్గాలు ఎంతో ఆవేదనతో ఉన్న నేపథ్యంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తానని ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఆ వర్గాలకు రాజ్యాధికారం కల్పించారు. దేశ చరిత్రలో ఎక్కడైనా ఇచ్చారా? మంత్రివర్గంలో 70% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కడైనా ఇచ్చారా? గతంలో ఎక్కడో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి వస్తే గొప్ప. నేడు మంత్రివర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చినట్లు చూపించగలరా? హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను గతంలో హోంమంత్రిగా సీఎం వైఎస్ జగన్ నియమించారు. దేశ చరిత్రలో ఎక్కడైనా హోంమంత్రిగా ఎస్సీ మహిళను ఎవరైనా నియమించారా? హోంమంత్రిగా మేకతోటి సుచరిత మూడేళ్లు పనిచేశారు. ఇలాంటి పదవులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అర్హత లేదనే భావన గతంలో సమాజంలో ఉండేది. నేడు మరో దళిత మహిళ తానేటి వనితను హోంమంత్రిగా సీఎం వైఎస్ జగన్ నియమించారు. బీసీల గొంతుకను పెద్దలసభకు పంపితే తప్పా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ వర్గానికి చెందిన నలుగురిని సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. తెలంగాణకు చెందిన బీసీకి ఇస్తే తప్పా? చంద్రబాబు హైదరాబాద్లో నివాసం ఉండొచ్చా? దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తికి సీఎం జగన్ రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పిస్తే దానిపై చంద్రబాబు తప్పుగా మాట్లాడటం సబబేనా? బీసీ వర్గాల ఆత్మఘోషను రాజ్యసభలో బలంగా వినిపించే వ్యక్తిని సీఎం జగన్ ఎంచుకోవడాన్ని చంద్రబాబు ఎందుకు హర్షించలేకపోతున్నారు? చంద్రబాబు దేన్ని హర్షిస్తారు..?: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం కల్పించే విప్లవాత్మక మార్పులను కూడా చంద్రబాబు హర్షించలేకపోతే మరి ఇక ఆయన దేన్ని హర్షించగలరు? ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చేస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇచ్చారా? కనీసం 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో ఒక్క రాజ్యసభ సీటైనా చంద్రబాబు బీసీలకు ఇచ్చారా? విపక్షాల విమర్శలు అర్ధరహితం కరోనా విపత్తు కారణంగా ఆదాయం అడుగంటి కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేస్తున్నాయి. ఏపీ ఆదాయం ఎక్కడా పెరగలేదు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదు. ధరలు పెరిగాయని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు, చంద్రబాబు దేశంలో ఏ రాష్ట్రంలో ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలి. టీడీపీ హయాంలో ఎక్కడైనా గొప్ప పరిశ్రమలు వచ్చాయా? ప్రాజెక్టులు వచ్చాయా? మరి ఎందుకు ఈ సంక్షేమ ప్రభుత్వంపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారు? ఏదైనా కులం, వర్గంలో ఎవరైనా అసంతృప్తితో ఉన్నారా? వారికి పథకాలు అందడం లేదా? పథకాల అమలులో ఎక్కడైనా అవినీతి చోటు చేసుకుందని చెప్పే సాహసాన్ని ప్రతిపక్షాలు చేయగలవా? ఒక్క రూపాయైనా అవినీతి జరిగినట్లు కనీసం ఆరోపించగలిగారా? వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ(డీబీటీ)తో ప్రభుత్వం అందచేస్తున్న డబ్బులు సుమారు 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.40 లక్షల కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇందులో ఒక్క రూపాయైనా అవినీతి జరిగినట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు కనీసం ఆరోపించగలిగారా? ఇదీ పరిపాలన సంస్కరణల ద్వారా సీఎం వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వృద్ధాప్య పెన్షన్ నుంచి గృహాల మంజూరు వరకూ అన్నీ జన్మభూమి కమిటీలకు అప్పగించారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేగానీ కరుణించని విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా? -
అన్ని శాఖలకు తల్లి.. రెవెన్యూ శాఖ
సాక్షి, అమరావతి: అన్ని శాఖలకూ రెవెన్యూ శాఖ తల్లి వంటిదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కొత్త కార్యాలయాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఎల్ఏ కార్యదర్శి ఎ.బాబు, సంయుక్త కార్యదర్శులు గణేష్కుమార్, తేజ్ భరత్, సీఎంఆర్వో (కంప్యూటరైజేషన్ ఆఫ్ ఎంఆర్వో ఆఫీసెస్) ప్రాజెక్ట్ డైరెక్టర్ పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు మంత్రి ధర్మాన ప్రసాదరావును సన్మానించారు. -
నాకు సమాజంలో గౌరవం రావడానికి కారణం ఆ కుటుంబమే: ధర్మాన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ముఖ్యమంత్రి లక్ష్యాలే మా లక్ష్యాలు. ఆయన ఆశయాలకు తగ్గట్టు పనిచేస్తాం. జిల్లాలోని వనరులను వినియోగించుకుని అభివృద్ధి చేస్తాం. అనుభవంతో ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తాను’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రాధాన్యత అంశాలను వివరించారు. ప్రమాణస్వీకారం, బాధ్యతల స్వీకరణ తర్వాత తొలిసారిగా ధర్మాన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. జీవన ప్రమాణాలు పెంచాలి.. జిల్లాలో సహజ వనరులు చాలా ఉన్నాయి. అయినా ప్రజల జీవన ప్రమాణాలు తక్కువగానే ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టాలి. 170 కిలోమీటర్ల హైవే, 200 కిలోమీటర్ల సముద్ర తీరం జిల్లాకు అడ్వాంటేజ్. వంశధార, నాగావళి నీళ్లను వినియోగంలోకి తీసుకువచ్చి వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తే మన ప్రాంతం అభివృద్ధి జిల్లాల సరసన నిలబడుతుంది. సీఎం స్పందించారు.. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వంశధారలో 19 టీఎంసీల నీటిని సత్వరం వినియోగంలోకి తేవాల్సిన ఆవశ్యకతను వివరించాను. ఇప్పటికే వంశధార ప్రాజెక్టుపై వెచ్చించిన రూ.2వేల కోట్ల పెట్టుబడిని సద్వినియోగం చేసుకోవాలంటే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించాను. గొట్టా రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కోరితే దానికి ఆయన అంగీకరించడమే కాకుండా అనుమతి కూడా ఇచ్చారు. ఈ నెలాఖరుకల్లా ఇంజినీర్లు చేయాల్సిన పని అయిపోతే తర్వాత అడ్మినిస్ట్రేషన్ మంజూరు కోసం కమిటీకి తీసుకెళతాం. డిసెంబర్ నాటికి అది పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రబీ పంటకు నీరివ్వాలన్నది మా ధ్యేయం. దీని వల్ల ఖరీఫ్ను ముందుకు తీసుకురావచ్చు. ఏటా వచ్చే తుఫాన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. రబీలో కూడా శివారు వరకు నీరు ఇవ్వవచ్చు. పారిశ్రామికంగా ముందుకు.. జిల్లాలో ఇప్పటికే బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం. సంతబొమ్మాళి మండలంలో భావనపాడు పోర్టు నిర్మాణం చేపడతాం. వీటి వల్ల మత్స్య సంపద, గ్రానైట్ తదితర ఎగుమతులు జరిగి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగితే జాతీయ రహదారి పొడవునా పరిశ్రమలు పెట్టుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. పారదర్శకతకు పెద్దపీట రెవెన్యూలోనే కాదు రిజిస్ట్రేషన్లోనూ పారదర్శకత, అవినీతి రహిత కార్యకలాపాలు జరిగేలా సంస్కరణలు చేపడతాం. ఫాస్ట్గా చేసే ప్రొసీజర్స్ను తీసుకొచ్చి, నిర్లక్ష్య భావాన్నంతా తొలగించి నిజాయితీతో కూడిన వ్యవస్థను రూపుదిద్దాలి. దీని కోసం ఏం చేయాలో నిపుణుల సలహాలు తీసుకుంటాం. ఇంటి కల సాకారం.. రాష్ట్రంలో ఇంతకుముందు ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లు పీఓటీ యాక్ట్ కింద ఉండేవి. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. అయినా చాలా మంది ఇళ్లను విక్రయించారు. ఈ విక్రయాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. అందుకే ఇలాంటి వివాదాలు పరిష్కరించి యజమానులకు హక్కు ఇచ్చేలా శాశ్వత గృహ హక్కు పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిపై ప్రతిపక్షాలవి అవగాహన లేని మాటలు. దీని వల్ల ప్రయోజనం స్వయంగా పొందిన వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. విమర్శించడమే పనిగా పెట్టుకున్న వారి మాటలు వినకూడదు. ఉద్దానం కోసం.. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ఇప్పటికే ఒక రీసెర్చ్ కమ్ ట్రీట్మెంట్ సెంటర్ నిర్మిస్తున్నారు. అలాగే చక్కటి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ పనులు గత ప్రభుత్వాల హయాంలో జరగలేదనే వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి. సీఎంకు ఉద్దానం ప్రాంతంపై ఫోకస్ ఉంది. అందులో భాగమే రూ.700కోట్ల మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం. తిత్లీ, వంశధార పరిహారాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆఫ్షోర్ కూడా పూర్తవుతుంది. కార్యకర్తలు కోరుకున్నట్టు.. పార్టీ కార్యకర్తలు కోరుతున్నట్లు పార్టీలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సీఎం ప్రత్యేకంగా చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కనుక అన్ని స్థాయిల్లో ఉత్సాహవంతులను తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ దిశగా మేమూ పని చేస్తాం. రీజనల్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ లెవెల్లో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. మేం అధికారంలో ఉన్నాం కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాం. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు కూడా విశాల దృక్పథంతో ఆలోచించాలి. నిజాయితీతో కూడిన పాలన అందిస్తున్న సీఎం వెనుక బలంగా నిలబడాలి. వైఎస్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం నేను 1989లో మొట్టమొదటిసారిగా శాసనసభకు 27 ఏళ్ల వయసులో పోటీ చేశాను. వైఎస్సార్ ఆ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నా ప్రయాణం కొనసాగుతోంది. నాకు ఈనాడు సమాజంలో గౌరవం రావడానికి కారణం ఆ కుటుంబమే. ఇప్పుడు ఆయన తనయుడైన జగన్మోహన్రెడ్డి తన కేబినెట్లో అవకాశం ఇచ్చారు. అలాంటి విశ్వాసాన్ని నిలుపుకోవడం, వారి లక్ష్యాల కోసం పనిచేయడం నా బాధ్యత. -
అపూర్వ రాజకీయ ప్రస్థానం.. 13 ఏళ్లపాటు మంత్రిగా..
సాక్షి, శ్రీకాకుళం: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ధర్మాన ప్రసాదరావు ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. ఇప్పటికే 13 ఏళ్లపాటు ఆయన మంత్రిగా సేవలు అందించారు. జిల్లాకు సంబంధించి ఇదే రికార్డు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోనూ చోటు దక్కడంతో ఆయన సీనియారిటీ మరింత పెరగనుంది. అంతేకాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఘనత ధర్మానకు దక్కింది. రెవెన్యూ మంత్రిగా మూడోసారి పనిచేసిన గౌరవం కూడా ధర్మాన ప్రసాద రావుకే లభించింది. జిల్లాలో ఇలా.. ► శ్రీకాకుళం జిల్లా తరఫున 1952 నుంచి నేటి వరకు 19 మంది నేతలు మంత్రులుగా పనిచేశారు. ► కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న చోటు దక్కించుకున్నారు. ► జిల్లాలో అత్యధిక కాలం(13 ఏళ్లు) మంత్రిగా పనిచేసిన ఘనత ధర్మాన ప్రసాదరావుకు దక్కగా, అత్యల్ప కాలం(31రోజులు) మంత్రిగా పనిచేసిన ఘనత తంగి సత్యనా రాయణకు దక్కింది. నాదెండ్ల భాస్కరరావు హయాంలో రెవెన్యూ మంత్రిగా అతి తక్కువ రోజులు పనిచేశారు. అత్యధిక రికార్డు ధర్మానదే ► నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989లో ఎన్నికైన ధర్మాన ప్రసాదరావు తొలిసారి మంత్రిగా నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు. ► ఆ తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్లో కూడా మంత్రి అయ్యారు. ► వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ రెండోసారి ఏర్పా టు చేసిన ప్రభుత్వంలో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణానంతరం ఏర్పడిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాల్లోనూ మంత్రి పోస్టు దక్కింది. తాజాగా వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రి పదవి పొందారు. ► అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనతే కాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం కూడా ధర్మానకే దక్కింది. నేదురుమల్లి జనార్దనరెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరకు ఆరుగురి వద్ద పనిచేసిన మంత్రిగా రికార్డుకెక్కారు. ఇక రెవెన్యూ శాఖనైతే మూడు సార్లు చేపట్టారు. ► ధర్మాన ప్రసాదరావు తర్వాత అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన గౌరవం ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకు, మాజీ మంత్రి ప్రతిభా భారతికి దక్కింది. ► తమ్మినేని సీతారాం పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అత్యధికంగా 18 శాఖలకు పనిచేసిన చరిత్ర సీతారాం పేరున ఉంది. ► తాజాగా చేపట్టిన స్పీకర్ పదవితో కలిపితే 13ఏళ్ల పాటు ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించినట్టు అవుతుంది. ► ప్రతిభా భారతి విషయానికొస్తే మంత్రిగా దాదాపు ఎనిమిదిన్నరేళ్లు, స్పీకర్గా ఐదేళ్ల పాటు పనిచేశారు. -
రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు
సాక్షి, అమరావతి: రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: చెప్పాడంటే.. చేస్తాడంతే.. గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవన్నారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. ‘‘రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్కు భూమి ఉపయోగపడటం లేదు. ఎక్కువ ల్యాండ్ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం జగన్ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని’ మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజకీయ నేపథ్యం: 1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్పారీ్టలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. -
ధర్మాన ప్రసాద్ రావు అనే నేను..
-
Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక
సాక్షి, శ్రీకాకుళం: ఐదుసార్లు ఎమ్మెల్యే, గత ప్రభుత్వాల మంత్రివర్గంలో కీలక పదవులు. ఉత్తరాంధ్ర అగ్రశ్రేణి రాజకీయనాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. సుదీర్ఘ అనుభవానికి సరైన సమయంలో గుర్తింపునిస్తూ వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి ధర్మానకు కొత్త కాకపోయినప్పటికీ వైఎస్సార్ తనయుడి కేబినెట్లో పనిచేయాలన్న కోరిక నెరవేరింది. ప్రత్యేకమైన నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఓ ప్రత్యేకమైన నాయకుడు లోతైన విషయ పరిజ్ఞానం, విషయాన్ని సుస్పష్టంగా చెప్పగల నేర్పు, ఇరిగేషన్ అంశాలపై విశేషమైన అవగాహన, రాజకీయాల్లో ఎత్తుకుపై ఎత్తు వేయగల చతురత ఆయన సొంతం. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా వివరించడమే కాకుండా వారి ఆవేదనను కళ్లకు కట్టినట్టు ప్రసంగించే నేర్పరి కావడంతో ఆయనకు స్థానికంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ధర్మానకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినవారు ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తున్నారు. నేపథ్యమిదీ.. పేరు: ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గం: శ్రీకాకుళం అర్బన్ స్వస్థలం: మబగం తల్లిదండ్రులు: సావిత్రమ్మ (లేట్), రామలింగంనాయుడు (లేట్) పుట్టినతేదీ: మే 21, 1958 విద్యార్హతలు: ఇంటర్మీడియట్ సతీమణి: గజలక్ష్మి సంతానం: కుమారుడు రామమనోహరనాయుడు జిల్లా: శ్రీకాకుళం రాజకీయ నేపథ్యం: 1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజాజీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. చదవండి: (ఆ అంశాలే ఆదిమూలపు సురేష్కు మరో అవకాశం కల్పించాయి..) -
ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దు: ధర్మాన
-
మంత్రి గౌతమ్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు
-
సీఎం జగన్ కు ఎమ్మెల్యే ధర్మాన లేఖ
-
సీఎం జగన్ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది
-
ఒడిశాతో జలవివాదాలకు తెర
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నేరడిపై ఉన్న అభ్యంతరాలు ఈ నెల 9తో తొలగిపోతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ఒడిశా సీఎంతో భేటీకి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆదివారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 60 ఏళ్లుగా ఒడిశాతో ఆంధ్రాకు జల వివాదాలున్నాయని, అదృష్టవశాత్తు ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు సీఎంగా ఉండడంవల్ల అవి ఇప్పుడు పరిష్కారమవుతున్నాయని చెప్పారు. వంశధారపై నేరడి బ్యారేజీకి 1962లో అప్పటి సీఎం దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత వైఎస్సార్ వచ్చేంతవరకు ఈ ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. వైఎస్సార్ వంశధార ఫేజ్–2, స్టేజ్–2 పనులకు శ్రీకారం చుట్టారని, అప్పుడే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ముందడుగు వేసినా ఒడిశా ప్రభుత్వం కోర్టులకెళ్లడంతో పనులు సాగలేదని చెప్పారు. నేరడి బ్యారేజ్ నిర్మిస్తే ఒడిశాలో 50 వేల ఎకరాలకు, ఆంధ్రాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. చదవండి: (సిక్కోలు చిరకాల కల.. ఈ నెల 9న ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ) -
ప్రజల ఆకాంక్షలకు చట్ట రూపం: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ చట్టం- 2020 గవర్నర్ ఆమోదం ద్వారా చట్టబద్దం అయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ అనేది చారిత్రాత్మక నిర్ణయం. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ చట్టం ఉద్ధేశ్యం. రాజ్యాంగబద్దమైన చర్యల ద్వారా ఈ చట్టం సంపూర్ణంగా వెలువడింది. సీఎం జగన్ పట్టుదల, ప్రయత్నంతోనే ఇది కార్యరూపం దాల్చింది. ప్రజాస్వామ్యవాదులు దీనిని సమర్ధించాలి. ఇది ఆర్టికల్ 38, 39కి లోబడే ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ మూలసూత్రం ప్రపంచం మొత్తం ఆచరిస్తోంది. గొప్ప నగర నిర్మాణాన్ని రాజధానితో ముడిపెట్టి చంద్రబాబు తప్పు చేశారు. (చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్) నేడు ప్రజల ఆకాంక్షలకు చట్ట రూపం వచ్చింది. ఈ చట్టాన్ని తదుపరి దశకు తీసుకువెళ్లాలి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలుకు రాజధానిలో ప్రాధాన్యత ఇస్తే తప్పేంటి. తెలంగాణా తరహా ఉద్యమాలు భవిష్యత్తులో రాకుండా ఈ చట్టం పనిచేస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ, జిల్లాల విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. గ్రామస్థాయిలో సచివాలయాల ద్వారా ద్వారా జరుగుతున్న లబ్ధి ఇప్పటికే ప్రజలు గుర్తించారు. ఇలాంటి చట్టాలు తీసుకురాకుండా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేము. మరోసారి అధికార కేంద్రీకృతం చేసి తప్పులు చేయకూడదు. శివరామకృష్ణ కమిటీ, వరల్డ్ బ్యాంక్ కూడా పరిపాలన వికేంద్రీకరణ చేయమని చెప్పాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఇన్నాళ్లకు తీరింది. వికేంద్రీకరణ బిల్లును ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఈ బిల్లుపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కి లేదు' అంటూ ధర్మాన హితువు పలికారు. (అందరికీ కృతజ్ఞుడిని: విజయసాయి రెడ్డి) -
కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు
సాక్షి, శ్రీకాకుళం : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్వన్గా నిలిచిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడటం లేదని పేర్కొన్నారు. కరోనా అనుమానితులందరికీ ప్రభుత్వం పరీక్షలు చేసిందని, ప్రతిరోజు 6 వేల నుంచి 7 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు సక్రమంగా పనిచేస్తున్నాయని, వైద్యశాఖలో ఖాళీలనూ భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు బాగున్నాయని కేంద్రం ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. (ఎక్కడి వారక్కడే: సీఎం జగన్) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన ఆదర్శంగా ఉంది. రూ.౩ కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ నుంచి మత్స్యకారులను తీసుకొచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరు సరిగా లేదు. ప్రతి మంచి పనిని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో పసుపు చొక్కాల వారికే పనులు జరిగాయి. కానీ.. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సాయం అందుతోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత ప్రతిపక్షాలకు లేదు. ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా ప్రతిపక్షాలు విజయం సాధించలేవు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. మద్యంపై టీడీపీకి విమర్శించే హక్కు లేదు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబే. రాష్ట్రంలో దశలవారిగా మద్యం అమ్మకాలు నిషేధించడం జరుగుతుంది’ అని ధర్మాన స్పష్టం చేశారు. -
ఒక్క బీసీకైనా బాబు రాజ్యసభ సీటు ఇచ్చారా?
సాక్షి, శ్రీకాకుళం : వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిచేస్తుంటే.. బాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇసుకను భారీగా దోపిడీ చేసిందని, నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్లను దోచి పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే చంద్రబాబు తప్పుడు ఆరోపణలతో గవర్నర్కు ఫిర్యాదు చేశారని అన్నారు.. చంద్రబాబుపై నమ్మకం లేకే ముఖ్య నేతలంతా రాజీనామా చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తప్పదని తెలిసే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారని పేర్కొన్నారు. (ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం) చంద్రబాబు తన రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలను వాడుకున్నారని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారని, ఒక్క బీసీకైనా బాబు రాజ్యసభ అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదని, సీఎం వైఎస్ జగన్ ఇద్దరు బీసీలకు రాజ్యసభ అవకాశం ఇచ్చారని, గత అయిదేళ్లలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఇప్పుడు రాజకీయంగా బాబు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, బీసీ జనాభాను శాస్త్రీయ గణన చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్కు ఈ సందర్బంగా ప్రసాదరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు లభిస్తాయని ధర్మాన తెలిపారు. ('చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలు') -
ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజ్యసభలో నలుగురికి అవకాశం లభిస్తే అందులో రెండింటిని వెనకబడిన తరగతుల వారికి కేటాయించడం చరిత్రాత్మక సందర్భంగా చెప్పుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. బీసీల పట్ట చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రధానమైన రెండు వెనుకబడిన తరగతుల అగ్నికుల క్షత్రియ), పిల్లి సుభాష్చంద్రబోష్ (శెట్టిబలజ)లను రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదొక చరిత్ర అని, సమైక్య రాష్ట్రంలో కూడా బీసీలకు ఇటువంటి అవకాశం రాలేదన్నారు. బీసీలపై జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడంలో చూపిన శ్రద్ధ చెప్పలేనిదన్నారు. రాష్ట్రంలో బీసీంతా హర్షించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన సమయంగా భావిస్తున్నానన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చారంటే ఎంత గొప్ప నిర్ణయమో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం బీసీల్లో ఉత్సాహం నింపిందని అభిప్రాయపడ్డారు. ఇదే టీడీపీ విషయానికి వస్తే ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీసీలకు ఎప్పుడైనా ఈ రకమైన గుర్తింపు, అవకాశాలు కలి్పంచిందా? అని ప్రశ్నించారు. టీడీపీ పల్లకీ మోసిన బీసీలను తొక్కేసారు తప్ప నిలబెట్టిన దాఖలాల్లేవన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బీసీ సదస్సులో స్పష్టం చేశానన్నారు. బీసీలకు టీడీపీ చేసిన అన్యాయాన్ని, అధికారంలోకి వస్తే వైఎస్సార్సీపీ చేసే న్యాయాన్ని వివరించానని, ఇప్పుడది అమలు కావడంతో తనకెంతో గర్వంగా ఉందన్నారు. -
చంద్రబాబుది రాజధాని డ్రామా
-
'చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలు'
సాక్షి, శ్రీకాకుళం : అమరావతిలో చంద్రబాబు ఆస్తుల విలువ పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలని, కేవలం తన ప్రయోజనాల కోసమే ఇటువంటి దిక్కుమాలిన పోరాటం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ విడిపోయినప్పుడు ఎలా నష్టపోయామో.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతకన్నా ఎక్కువ నష్టపోయామని తెలిపారు. అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్న బాబు రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని వెల్లడించారు. ఆయన దోచుకున్న వాటిలో రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టుంటే ప్రాజెక్టులన్నిపూర్తయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు వారి పార్టీని తిరస్కరించినా బాబుకు బుద్ధి రాలేదని పేర్కొన్నారు. ఇంకా ఎంతకాలం తన దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేస్తారని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. (అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన) -
అరుదైన తీర్పు ఇచ్చారు..
-
అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన
సాక్షి, అమరావతి: బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పెద్దల సభను ఏర్పాటు చేశారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయాన్ని గమనించి స్వాతంత్ర్యానికి ముందే జాతిపిత మహాత్మా గాంధీ ఈ సభను వ్యతిరేకించారని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదని తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయపరమైన కారణాలతో చట్టాలు ఆలస్యమవుతున్నాయి కాబట్టి మండలి రద్దు సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారి రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిందని.. అటువంటి సభ అవసరం లేదని గతంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని పేర్కొన్నారు.(ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) అరుదైన తీర్పు ఇచ్చారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, అభిప్రాయాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. రాష్ట్రమంతా పూర్తిగా అధ్యయనం చేసిన ఆయనకు ప్రజలు అరుదైన తీర్పు ఇచ్చారు. ఇంతకు ముందెన్నడూ లేని భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకుంటోంది. మండలి వల్ల కోట్ల రూపాయలు దుర్వినియోగమని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న చట్టాలను.. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మరీ అడ్డుకుంటున్నారు. టీడీపీ రాజకీయాల వల్ల కీలక బిల్లులు ఆలస్యమవుతున్నాయి’అని ధర్మాన.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.(మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి ) తాత్కాలికమని అంబేద్కర్ చెప్పారు.. ‘పెద్దల సభలు తాత్కాలికమే అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారు. ఆర్టికల్ 169 కింద పెద్దల సభను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాదు గోపాలస్వామి అయ్యర్, ఆచార్య రంగా వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్ట సవరణలు చేసే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన శాసన సభకు లేకుంటే ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరతాయి. మంత్రిగా ఉన్న నారా లోకేశ్ను మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే.. ఆయన మండలిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే. 1971, 72, 75లో రాజ్యసభను రద్దు చేసే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు ముఖం చూపించలేకనే శాసన సభకు రాలేదు. మండలి అవసరం లేదన్న బాబు వ్యాఖ్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే చర్చకు రాలేదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గతంలో చంద్రబాబు తీర్మానం కూడా పెట్టారు. ఆ తీర్మానంలో ఉన్నవన్నీ కూడా తప్పులే. సీఆర్డీఏ చట్టం 171 పేజీలు ఉంది. దానిని శాసన మండలిలో ఎన్నిరోజులు చర్చించారు. దాన్ని సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపలేదు. 12 పేజీలు ఉన్న వికేంద్రీకరణ బిల్లును మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడంలో ఉద్దేశం ఏమిటి’అని ధర్మాన ప్రశ్నించారు. -
‘మండలి అవసరమా..? చర్చ జరగాలి’
సాక్షి, అమరావతి : గతంలో వ్యవస్థలను మెనేజ్ చేసినట్లుగా బుధవారం చంద్రబాబు నాయుడు శాసన మండలిని ప్రభావితం చేసి బిల్లులను అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారని ఆవేద వ్యక్తం చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్ణయాలను మండలి ఆపలేదన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసే ఆస్కారం ఉన్న శాసన మండలి అవసరమా లేదా అన్నది ప్రజాస్వామ్యవాదులంతా ఆలోలించాలని కోరారు. (చదవండి : నిబంధనలు పాటించడమే చైర్మన్ బాధ్యత: కన్నబాబు) మండలి అనేది అవసరమే లేదని ఎన్జీ రంగా నాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన నిర్ణయాలను అడ్డుకుంటే.. అది ప్రజలను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య లక్ష్యాన్ని దెబ్బతీసేవిధంగా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. నిన్న మండలిలో జరిగిన పరిణామాలు సమయాన్ని వృధా చేయాలన్నట్లుగానే ఉన్నాయన్నారు. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు నాయుడు నాలుగు నెలల కాలాన్ని మింగేస్తాడేమో కానీ అంతకు మించి ఏమి చేయలేరన్నారు. శాసన మండలి అవసరమా లేదా అనే దానిపై చర్చ జరగాలని, దీని కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి, స్పీకర్ను కోరారు. -
‘సీఎం జగన్ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’
సాక్షి, అమరావతి : వెనకబడిన ప్రాంతాల్ని విస్మరిస్తే సమస్యలు తప్పవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అది గమనించే సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజధానిగా అమరావతి కొనసాగితే మళ్లీ ఉద్యమాలు వచ్చేవని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు అందరం కలిసి ఉండటం సాధ్యమయ్యేదా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నానని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుంటే.. వెనక నుంచి అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్లే.. తమ ప్రాంతాల్లో వెలుగులు వచ్చాయని ధర్మాన ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) టీడీపీ పాలనలో చర్చలు లేవు.. రాజధానిని చంద్రబాబు పూర్తిగా వ్యాపార ధోరణితోనే చూశారని ధర్మాన విమర్శించారు. రాజధాని నిర్మాణం అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించే విధంగా ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని గుర్తు చేశారు. ఎవరితో చర్చింకుండానే టీడీపీ పాలనలో నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ పర్యటన పూర్తి కాకముందే గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, సుప్రీం కోర్టుపై గౌరవం లేదని ధర్మాన అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే సీఎం జగన్ చేశారని తెలిపారు. విశాఖ ఏమైనా మారుమూల ప్రాంతమా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన నిలదీశారు. చదవండి : అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం రాజధాని రైతులకు వరాలు చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని -
‘లోక కల్యాణం కోసమా.. లోకేష్ కల్యాణం కోసమా?’
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణంలో అస్తవ్యస్త విధానాలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధానిపై తీసుకునే కీలక నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలో ఉండాలని హితవు పలికారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని పేర్కొన్నారు. అమరావతిపై అన్ని ప్రాంతాల్లో అసంతృప్తులు ఉన్నాయని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కనీస అభిప్రాయాలు తీసుకోలేదని టీడీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘చంద్రబాబు ఊహలతోనే దోపిడీకి రంగం సిద్ధమైందని అప్పుడే భావించా. పదేళ్ల హక్కులున్నా హైదరాబాద్ను వదిలేసి వచ్చాం. అమరావతి అనే బూచి చూపించారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఇప్పటికీ కొనసాగుతోంది. చంద్రబాబు విఙ్ఞతతోనే వ్యవహరించారా? రాజధానిలో ఎక్కడ ఏ ఆఫీసు ఉందో కూడా తెలియదు. రాజధాని అభిప్రాయం చెప్పాలని శివరామకృష్ణ కమిటీ వేశారు. కానీ, ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా చంద్రబాబు ఆగలేకపోయారు. బాబు ఎందుకు అలా చేశారో సమాధానం చెప్పాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 10 ఎకరాలకు మించి భూమి అందుబాటులో లేదని చెప్పారు. 70 ఏళ్లుగా అభివృద్ధి మొత్తం హైదరాబాద్లోనే కేంద్రీకృతమైంది. అన్ని వర్గాలు, వ్యక్తులు హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ వదిలి వచ్చేందుకు ఎవరికీ ఇష్టం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే.. విభజన జరిగినా మనకు ఆవేదన ఉండేది కావు. భవిష్యత్లో మరోసారి దగా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. గత ఐదేళ్లలో కేంద్రం 23 విద్యాసంస్థలను ఇస్తే శ్రీకాకుళంలో ఒక్కసంస్థ కూడా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు పార్టీకి అనేకసార్లు అధికారం ఇచ్చిన మా జిల్లాకు ఒక్క సంస్థ కూడా ఇవ్వలేకపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే బాబు ప్రణాళికలు వేశారని ముందే చెప్పా. లక్షకోట్లు పెడితేకాని చంద్రబాబు అనుకున్న రాజధాని పూర్తవదు. సాధ్యంకాదని తెలిసినా నమ్మించే ప్రయత్నం చేశారు. రాజధాని లోక కల్యాణం కోసమా? లోకేష్ కల్యాణం కోసమా?’అని ధర్మాన చురకలంటించారు. -
'గ్రామ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు'
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను వేలెత్తి చూపే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవంతో చంద్రబాబు నాయుడు గ్రామ వ్యవస్థతో పాటు ఆర్థిక వనరులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బ్రోకర్లతో జన్మభూమి కమిటీలు వేసి ప్రజల మధ్య రాజకీయ వైషమ్యాలను పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 24వేల కోట్లు బకాయిలు పెట్టి బొగ్గులేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాల వల్లే ప్రస్తుతం ప్రజలు కరెంట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధర్మాన ఆరోపించారు. -
సాగుదారు గుండె చప్పుడే ఈ చట్టం..
సాక్షి, శ్రీకాకుళం: ‘సాగు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. రైతులకు ఎంత ఇచ్చినా చాలదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా ఎక్కువగా చేయగలిగారు. బడ్జెట్లో మాగ్జిమమ్ మొత్తం వ్యవసాయానికి డైవర్ట్ చేశారు. ఎవరైనా హర్షించాల్సిందే. ఎవరైనా కాదనలేనిదే. ఒకవేళ కాదన్నా... ఇంకొక రకంగా బాధపడ్డా.. రైతుల పీక నొక్కడం తప్ప, వారి కన్నీరు చూడడం తప్ప, వారి ఆవేదనకు వ్యతిరేకంగా పనిచేయడం తప్ప ఇంకొకటికాదు. కౌలుదారి చట్టం ప్రవేశపెట్ట డం వెనక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. కోట్లాది మంది ఆవేదన ఉంది. ఎన్నో ఆత్మహత్యలు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఈతి బాధలు ఉన్నాయి. నిరాశ నిస్పృహ ఉంది. ఆకలి కూడా ఉంది. రైతులు, బలహీన వర్గాల పక్షపాత ప్రభుత్వమిది. కొత్త ఐడియాలజీతో వెళ్తున్న ఈ ప్రభుత్వం ఎవరికి అండగా నిలుస్తుందో శాసన సభలో చేసిన 14 చట్టాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి’ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు తన అనుభవ సారంతో కొత్త ప్రభుత్వం ఆత్మను ఆవిష్కరించారు. సోమవారం ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారాయన. ఈ సందర్భంగా చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయం చేస్తున్నోడికే ఇకపై రాయితీలు పండించేవాడికే ఇన్సెంటివ్ ఇవ్వాలి. దాని కోసం దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా మొదటిసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేసింది. వ్యవసాయ భూమి కలిగి ఉన్నవాడికి కాదు.. వ్యవసాయం చేస్తున్నోడికి సాయం అందాలి. సాగు చేస్తున్న వారు వేరు.. భూ యజమాని వేరు. మొట్టమొదటిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ తేడాను గుర్తించారు. దేశంలోనూ, రాష్ట్ర స్థాయిలో అనేక ఇన్సెంటివ్లు ఈ రంగానికి వస్తున్నాయి. వచ్చినా వ్యవసాయం చేసిన వాడికి వెళ్లనంతకాలం అది అసలైన సపోర్టు కాదు. ప్రభుత్వమేమో సాయం ఫలానా వ్యక్తికి వెళ్లాలని అనుకుంటుంది. కాని అనుకున్న వ్యక్తికి వెళ్లడం లేదు. అది కొంత నివారించి, సరిచేసి ప్రాక్టికల్గా ఆ దిశగా తీసుకెళ్లే చట్టం ఇది. రాయితీలన్నీ కౌలు రైతులకు అందించడమే దీని లక్ష్యం. రైతుకు స్వేచ్ఛ ఎక్కడిది? వ్యవసాయం రానురాను కష్టమైపోయింది. భూమి గల వారిలో ఎక్కువమంది వ్యవసాయాన్ని వదిలేశారు. వేరే వాళ్లు సాగు చేస్తున్నారు. ఈ రంగానికి కొత్తగా వచ్చిన సవాళ్లు ఏంటి? వ్యవసాయానికి వినియోగించే సరుకులు, వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ట్రాక్టర్ తీసుకుంటే రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు అవుతుంది. డీజిల్కు రూ.80 అవుతుంది. ఇన్సూరెన్స్ రూ.15 వేలు. అంటే మూడెకరాలు చేస్తే మిగిలిన ధాన్యం గింజలు అమ్మితే ఇన్సూరెన్స్ వస్తుంది. అదే సమయంలో వాటి ఉత్పత్తి ఖరీదు పెరగలేదు. అది ఇక పెరగదు. ఉత్పత్తి ఖరీదు దేశంలో పెరిగే పరిస్థితి లేదు. ఉత్పత్తి ధర పెరగకపోవడానికి కారణం ఆహార గింజలు. దేశంలో 130 కోట్ల జనాభాకు అందించడానికి ఎక్కువ ధరైతే ఆ పని చేయలేరు. అందుకోసం రైతు పీక నొక్కే పని జరుగుతున్నది. స్వేచ్ఛగా తానింతకు అమ్ముకుంటానని, గిట్టుబాటుకు అమ్ముకుంటా నని చెప్పే, అడిగే స్వేచ్ఛ రైతుకు లేదు. మిగతా ఉత్పత్తిదారులకు మాత్రం ఆ వెసులుబాటు ఉంది. ట్యాక్స్, ముడి సరుకు ధరలు, లేబర్ చార్జీలు... వీటితోపాటు వడ్డీ కలుపుకుని ధర నిర్ణయిస్తారు. ఆ పరిస్థితి రైతుకు లేదు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కొంతకాలానికి పాడవుతున్నాయి. దానికి మౌలిక సౌకర్యాలు రావా లి. కొనుగోలుదార్లు వచ్చేవరకు ఆగి అమ్మే సిస్టమ్ రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ ఇనిస్టిట్యూట్లు ఏర్పాటు చేయగలగాలి. ఇంత పెద్ద ఎత్తున ఉపాధినిచ్చే రంగం మరొకటి లేదు. దానికోసం వ్యవసాయ రంగాన్ని సపోర్టు చేయాల్సిందే. ఈ దేశంలో 70 శాతంమంది వ్యవసాయం మీద బతుకుతున్నారంటే వారందరి కోసం వ్యవసాయ రంగంపై ఖర్చు పెట్టాల్సిందే. జాతీయ ఉత్పత్తులకు ఉపాధి దెబ్బ నేషనల్ ప్రోడక్ట్పై ఉపాధి చట్టం దెబ్బకొట్టింది. సాగు చేసే భూమికి కూలీలు కొరత ఉండటం, ఉన్న కూలీలు సకాలంలో దొరకకపోవడం వల న, దొరికినా వారి వేతనాలు భారీగా పెరగడం వలన సాగు చేసే భూమి తగ్గిపోతున్నది. అందుకనే కొన్ని ప్రాంతాల వ్యవసాయ భూముల వద్దకు వెళ్లితే పంటలు కన్పించడం లేదు. ఎందుకని అడిగితే కూలీలు దొరకడం లేదని చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వమిది కొత్త ఐడియాలజీతో వచ్చిన పార్టీ కనుక ఆ ఆశయాలను అమలు చేయడానికి అవసరమైన చట్టాన్ని తీసుకురావడమే ప్రధానమైన అంశంగా శాసన సభ నడిచింది. రెవెన్యూపై సందేహాలుండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన, ఉద్దేశమేంటో ప్రజలకు అర్థమై ఉంటుంది. ఏ వర్గాలకు కొమ్ముకాయాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది? ఎవరి ప్రయోజనాలను రక్షించడానికి ఇది పనిచేస్తుందనేదానికి ఈ శాసన సభ, చట్టాలతోనే ఒక సంకేతం పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ దిశగా వెళ్తుంది? ఏ వర్గాల ప్రయోజనాలను కాపాడుతుంది? ఏ వర్గాల కష్టాన్ని తీర్చడానికి తాపత్రాయం పడుతుంది? ఏ దిశగా వచ్చే రెవెన్యూను ఖర్చు పెట్టాలని చూస్తుంది? అనే దానిపై ఈ శాసన సభలో క్లారిటీ వచ్చింది. అవగాహన ఉన్న వారికి వీటి విలువేంటో తెలుస్తుంది. అల్పాదాయ వర్గాలకు, నిస్పృహలో ఉన్నవారికి, నిరాశ చెందిన వృత్తిదారుల వారికి, దెబ్బతిన్న వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఊతమిచ్చి నిలబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతుందని శాసనసభ ద్వారా చెప్పడం జరిగింది. చట్టాలు చూసినా, బడ్జెట్ కేటాయింపులు చూసినా ఈ ప్రభుత్వం గమనం అర్థమవుతుంది. కొద్ది సమయంలో ఇన్ని చట్టాలు చేసిన సందర్భాల్లేవు. ప్రభుత్వం కొత్త ఐడియాలజీ డైరెక్షన్లో నడుస్తోంది. దానికి అవసరమైన చట్టాలు తీసుకొచ్చింది. అవసరమైతే సవరణలు కూడా తెచ్చుకోవచ్చు. వైఎస్సార్ భావజాల ప్రభుత్వమిది.. అధికారంలోకి వచ్చిన కొత్త రాజకీయ పార్టీ మాది.. తొమ్మిదేళ్ల క్రితం ఆవిర్భవించవచ్చు. ఈ పార్టీకి ఒక భావజాలం ఉంది. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పుట్టినటువంటి పార్టీ ఇది. వైఎస్సార్ పాలన అందించడానికి ఒక పార్టీ ఉంటే బాగుండునని ప్రజలు ఆలోచించడం ద్వారా వచ్చిన ఒత్తిడితో మహానేత కుమారుడు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఇది. వైఎస్సార్ భావజాలంతో వచ్చినటువంటి పార్టీ ఇది. శాసనసభా సమావేశాలను ప్రజల ఆకాంక్షను తీర్చడానికి వినియోగించారు. ఆ దిశగా సభ నడిచింది. పాదయాత్రలో గమనించిన సమస్యలకు పరిష్కారం గడిచిన కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, అనేక వృత్తులు, అనేక సామాజిక వర్గాలు, ఆ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, వృత్తుల్లో ఉన్న సమస్యలు, జీవన విధానంలో ఎదురైనటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. కళ్లారా చూసి చలించిపోయిన విషయాలకు మేనిఫెస్టోలో చోటు కల్పించారు. అంతటితో సరిపోదని బడ్జెట్లో కేటాయింపులు చేశారు. వాటిని ఖర్చు పెట్టేందుకు 14 చట్టాలు తయారు చేశారు. ఆ చట్టాలు తయారు చేసేందుకు ఈ శాసన సభను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. -
మహానేత స్ఫూర్తితో శ్రేయోదాయక బడ్జెట్
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు, వైఎస్సార్సీపీ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా శ్రేయోదాయకమైన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో స్వయంగా చూసిన ప్రజల కష్టాలను తీర్చేందుకు, పేదల కన్నీళ్లను తుడిచేందుకు మార్గాన్ని సుగమం చేసేలా బడ్జెట్ ఉందని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర స్ఫూర్తి బడ్జెట్లో ప్రతిఫలించిందన్నారు. ఏడ్చే బిడ్డను తల్లి తన ఒడలోకి తీసుకుని ఎలా ఓదారుస్తుందో అదే విధంగా అక్షరాస్యతకు దూరంగా ఉన్న పిల్లలను సీఎం వైఎస్ జగన్ తన ఒడిలోకి తీసుకుని వారికి విద్యను అందించడానికి అమ్మ ఒడి పథకాన్ని రూపొందించారన్నారు. ప్రభుత్వం రూ.28 వేల కోట్లతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్తో, రైతు భరోసా పథకంతో రాష్ట్రంలోని రైతులకు ధైర్యం వచ్చిందని చెప్పారు. కౌలు రైతుల గురించి ఆలోచించిన మొట్టమొదటి సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు భూసేకరణ కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించడం రాష్ట్రంలో గొప్ప మార్పు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకు ఓడారో బాబుకు తెలీదట 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా ప్రజలను సమ దృష్టితో చూశారా అని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. ప్రజల్ని పౌరులుగా కాకుండా ఓటర్లుగానే చూసి పాలించారని ఆయన విమర్శించారు. పసుపు చొక్కా వేసుకుంటేనే పథకాలు అందిస్తామన్నదే ఆయన సిద్ధాంతమని దుయ్యబట్టారు. బడ్జెట్ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించడాన్ని ఆయన తిప్పికొట్టారు. ‘అవును మా బడ్జెట్ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలానే ఉంది. అందులో తప్పేముంది? బడ్జెట్ పార్టీ మేనిఫెస్టోలానే ఉండాలి. అందులో ఉన్న హామీలను చూసి ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలోని హామీలనే అమలు చేయాలి.లేకపోతే ప్రజల్ని మోసం చేసినట్లు అవుతుంది. చంద్రబాబు అయితే మేనిఫెస్టోలో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసి ప్రజల్ని మోసగించారు’ అని ధర్మాన పేర్కొన్నారు. చంద్రబాబు గత ఐదేళ్లలో అప్పులు పెంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. అందుకే ప్రజలు ఓడించి వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను ఎందుకు ఓడిపోయానో తెలియట్లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. -
టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...
సాక్షి, అమరావతి : రాష్ట్ర బడ్జెట్ నూతన అధ్యాయానికి తెర తీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ..‘గతంలో ప్రజల అవసరాలు ఒక రకంగా, బడ్జెట్లో కేటాయింపులు మరో రకంగా ఉండేవి. అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ ఎందుకు ఉండదు అని ఆలోచించేవాడిని. తొలిసారిగా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ప్రతిపక్షాలకు మేం ప్రవేశపెట్టినట్లుగా ఈ బడ్జెట్ అంచనాలు లేవనే బాధ ఉంది. వైఎస్సార్ పాలన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. చేతల ప్రభుత్వం ఏర్పడింది. చేసి చూపిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను పేదలు, బడుగులకు అందించిన వ్యక్తి వైఎస్సార్. ఆ పథకాలను లబ్ది చూసిన ప్రజలే వైఎస్సార్ సీపీని ఆదరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర హామీలు ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ వర్గాలకు ఎంత కేటాయించాలో స్పష్టంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో సమస్య ఉంది. అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ను రూపొందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే ఏ పథకాలు ఉంటాయో జగన్ ముందే చెప్పారు. ప్రతిపక్షాలు బడ్జెట్ను మేనిఫెస్టోలా ఉందంటున్నారు. మేనిఫెస్టో బడ్జెట్లో కనిపిస్తే తప్పేంటి?. అలా కనిపించకపోతేనే తప్పు. ఆ బాధ్యత మనపై లేదా? అమ్మ ఒడి గొప్ప పథకం. అక్షరాస్యతను పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అక్షరాస్యతలో మన రాష్ట్రం 31వ స్థానంలో ఉందంటున్నారు. చదువుకోవడానికి వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వాటిని పరిగణనలో తీసుకోవాల్సిన బాధ్యత మనపై లేదా?. అమ్మ ఒడి లాంటి పథకం ఈ నిర్లక్ష్యాన్ని తొలగిస్తుంది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే గొప్ప పథకం. ప్రభుత్వం ఏ దిశగా వెళుతుందో చూడకుండా వాటిలో తప్పులు వెతికే ప్రయత్నం మంచిది కాదు. కేటాయింపులు సరిపోకుంటే మరిన్ని కేటాయింపులు జరుగుతాయి. ప్రైవేట్ విద్యను ఇష్టానుసారంగా పెంచడంతో వారు దోపిడీ చేసుకుంటే వెళ్లిపోయారు. తప్పులు సరిదిద్దడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. అందుకే వ్యవసాయానికి అధిక కేటాయింపులు.. రైతులకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. రైతులు తమతో పాటు అనేక కుటుంబాల కడుపు నింపడానికి ప్రయత్నిస్తారు. అయితే పంట కోసం చేసిన అప్పులు కూడా తీరక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అందుకే రైతులకు బడ్జెట్ అధిక కేటాయింపులు చేసింది. రాష్ట్రంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయాన్ని మనం పట్టించుకోకుండా ఉండగలమా?. వాళ్లంతా వేరే రంగాల వైపు మళ్లితే పరిస్థితి ఎలా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో తమ పిల్లలను వ్యవసాయం వైపు చూడనివ్వడం లేదు. ఇతర రంగాల వైపు ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు చివరకు ఏమీ మిగలడం లేదు. రైతు భరోసా, 9 గంటల విద్యుత్, రైతులకు ఇన్సురెన్స్, సున్నా వడ్డీ రుణాలు... ఇవన్నీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పథకాలే. వ్యవసాయానికి రూ.24వేల కోట్లు కేటాయింపుల ద్వారా రైతులకు నమ్మకం కల్పించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. సొంతిల్లు పేదవాడి కల. ఆ కలలు నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. చంద్రబాబు సర్కార్లో పేదవాడి ఇళ్ల నిర్మాణానికి ఒక్క ఎకరం కొనుగోలు చేసేందుకు బడ్జెట్ కేటాయించారా?. ప్రభుత్వ భూములు లేని చోట భూములు కొనుగోలు చేసి పేదవాడికి ఇళ్ల కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం సంతోషం. ఎన్నికల్లో ఓటు వేయనివాడికి కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనుకోవడం గొప్ప లక్ష్యం. చంద్రబాబు హయాంలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే, పచ్చ చొక్కా వేస్తేనే పథకాలు అందే పరిస్థితి. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి. ఎన్నికల అనంతరం ప్రజలను పార్టీరహితంగా చూడాలి. చంద్రబాబు 19సార్లు కేబినెట్ సమావేశాలు పెట్టినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుకపై కొత్త పాలసీ తీసుకొస్తామనగానే.. అక్రమ ఇసుక రవాణా రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. నాయకుడి నిబద్ధతకు ఇది ఉదాహరణ. మత్స్యకార గ్రామాల్లో మహిళలు బెల్టు షాపులు రద్దు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు సాధించిందేమిటి?. ఎమ్మెల్యే, మంత్రులకు ఒక్క క్వార్టర్ కట్టలేదు. నాలుగో తరగతి సిబ్బంది ఉండేందుకు గృహ నిర్మాణం జరగలేదు. గవర్నర్, స్పీకర్ వ్యవస్థలతో పాటు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారు.’ అని అన్నారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా ఎమ్మెల్యే ధర్మాన ప్రసంగం అనంతరం శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. -
ఫొని తుపానుపై ఆరా తీసిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రపై పెను ప్రభావం చూపించిన ఫొని తుపానుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణి, తదితర నేతలతో ఆయన శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఫొని ప్రభావాన్ని అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా తుపాను తీరం దాటినప్పటికీ శ్రీకాకుళం జిల్లా భారీ వర్షాలతో పాటు, ఈదురు గాలులు వీస్తున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. ఇక టెక్కలిలో తుపాను ధాటికి అన్నా క్యాంటీన్ షెల్టర్ గాలికి ఎగిరిపోయింది. దీనితో కరెంటు వైర్లు తెగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చదవండి: ఉత్తరాంధ్రకు తప్పిన పెను తుఫాన్ ముప్పు -
అప్పుడు లేని అనుమానం ఇప్పుడొచ్చిందా ?
-
ప్రధాన నాయకుడిని హత్య చేశారు
-
చంద్రబాబు మాయలో మరోసారి పడొద్దు
అచ్యుతాపురం (యలమంచిలి): చంద్రబాబు వరుస మోసాలతో మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్నాడని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రావాలి జగన్–కావాలి జగన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త యు.వి.రమణమూర్తిరాజు ఆధ్వర్యంలో అచ్యుతాపురంలో ఆదివారం ఏర్పాటుచేసిన భారీ ముగింపు సభలో ధర్మాన మాట్లాడారు. చంద్రబాబు గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి పసుపుకుంకుమ కింద కేవలం మూడువేలు ఇచ్చి సరిపెట్టాడన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయని, బ్యాంకు మేనేజర్లు పెరిగిన వడ్డీతోసహా ముక్కుపిండి వసూలుచేశారని చెప్పారు. మహిళలకు మాయమాటలుచెప్పి మరోసారి మోసంచేయాలని చంద్రబాబు చూస్తున్నాడని, అతని మాటలు నమ్మవద్దని కోరారు. పంటకు గిట్టుబాటుధర ఇవ్వకుండా బ్యాంకు ఖాతాలో రూ. వెయ్యి వేసి రైతుల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తానని లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసంచేశాడని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు బీజేపీ పాలన బాగుందని కితాబు ఇచ్చిన చంద్రబాబు చివరి నిమిషంలో మాటమార్చాడన్నారు. రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి నిబద్ధత లేకుంటే ప్రజలకు ఏవిధంగా సేవలు అందుతాయని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత అవినీతిపాలన ఎన్నడూ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతిలో నిర్మాణాలు అంటూ కేవలం ప్రచారం కోసం రూ. 400 కోట్లు ఖర్చుచేశాడన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన కావాలని ప్రజలు కోరితేనే వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీని స్థాపించారని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శరగడం చిన్నప్పలనాయుడు, వరుదు కల్యాణి, గుడివాడ అమరనాథ్, గొల్ల బాబూరావు, సూర్యనారాయణరాజు, కె.కె.రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో బాబు దుర్మార్గాలకు అంతులేకుండాపోతోంది
-
బాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా?
సాక్షి, విజయవాడ : మాయమాటలతో బీసీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు జయహో బీసీ అనే అధికారం లేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోస పోవడడానికి బీసీలు సిద్ధంగా లేరన్నారు. ఐదేళ్ల కాలంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకమైనా పెట్టారా అని ప్రశ్నించారు. బీసీలు ప్రశ్నిస్తారనే భయంతో చంద్రబాబు జయహో బీసీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. బీసీలకు మేలు చేస్తే ఇలాంటి సభలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏ వర్గాలకు చెందిన వారిని కేంద్ర మంత్రులుగా పంపారో అందరికి తెలుసన్నారు. టీడీపీ నుంచి ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా అని ప్రశ్నించారు. బీసీలకు జరిగిన అన్యాయాలపై జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని నిలదీశారు. బీసీలు జడ్జిలుగా పనికిరారు అని కేంద్రానికి లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. మత్క్యకారులను ఎస్టీల్లో కలుపుతామని ఓట్లు వేయించుకొని.. నిరసన చేస్తే అంతు చూస్తానన్న మాటలను ప్రజలు మర్చిపోలేదన్నారు. కులం పేరుతో నాయీ బ్రాహ్మణులను దూషించిన విషయం మర్చిపోయారా అని చంద్రబాబును ప్రశ్నించారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన అని ఆరోపించారు. బీసీలకు ఏం చేయలేదు కాబట్టే ఇప్పుడు అది చేస్తాం..ఇది చేస్తామని కపట ప్రేమ నటిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు సీఎంగా ఉండడం వల్లే సమసమాజం రావడం లేదన్నారు. బీసీలను దివంగత సీఎం వైఎస్సార్ ఎంతో ప్రేమగా చూసుకున్నారని, వారికోసం దేశంలో ఎక్కడ లేని విధంగా ఫిజు రియింబర్స్మెంట్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ వల్లే బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు పొందారని చెప్పారు. అతి త్వరలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బీసీల కోసం కార్యాచరణ ప్రకటిస్తారని వెల్లడించారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. -
బీసీలపై చంద్రబాబుకు చులకన భావమే ఉంది
-
‘రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్సార్ సీపీకి ముఖ్యం’
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్ సీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల భేటీపై పొత్తుల పేరుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతునే ఉందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోను వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు కేంద్రంతో అంటాకాగి హోదాను నీరుగార్చారని విమర్శించారు. హోదా వద్దని.. ప్యాకేజీ కావాలని చంద్రబాబు అనలేదా అని నిలదీశారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే.. ఎవరిని ప్రశ్నించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాట మీద నిలబడటం లేదని ఆరోపించారు. ప్యాకేజీకి అంగీకరించిన టీడీపీ నేతలు కేంద్రమంత్రులకు సన్మానం చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు హోదా ఇవ్వలేదని చంద్రబాబు బీజేపీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజధాని భూముల అగ్రిమెంట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేశారు
-
చంద్రబాబు అవినీతి దేశానికే ప్రమాదం
వజ్రపుకొత్తూరు: సీఎం చంద్రబాబునాయుడు వ్యూహాత్మక దోపిడీ, అవినీతి దేశానికే ప్రమాదకరమని, అధికారం రాగానే తన కార్యాలయం నుంచే దోపిడీకి సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో హనుమంతు వెంకట్రావు దొర ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ తిత్లీ తుపాను బాధితులందరినీ జగన్ కలుస్తారని, ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తారని భరోసా ఇచ్చారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ విధానాన్ని తీసుకువచ్చి, సీఆర్డీఏ చట్టాలను ఏకపక్షంగా సవరించడం ద్వారా వ్యూహాత్మక దోపిడీకి అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు. రాజధాని పేరుపెట్టి రాష్ట్ర ప్రజల నోరు నొక్కారని మండిపడ్డారు. సింగపూర్ బొమ్మ చూపి అక్కడి ప్రైవేటు కంపెనీలకు వేల కోట్లు రూపాయలు ధారాదత్తం ధ్వజెమత్తారు. శివరామ కృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడి ఉందని నివేదికల్లో పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన 12 సంస్థల్లో ఒక్కటి కూడా స్థానికంగా ఏర్పాటు చేయలేకపోయారని ఆక్షేపించారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయ సాధన జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమని, అలుపెరుగకుండా చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. 25 కిలోల కోసం 3 రోజులా? ముఖ్యమంత్రి వైఫల్యం, ప్రభుత్వ సాయం అందకపోవడంతో నిలదీసిన వారిపై అక్రమ కేసులు బనాయించి ప్రజల గొంతు నొక్కారని పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే తిత్లీ తుపాను పరిహారం కోసం టీడీపీ సభ్వత్వ కార్డుతో రావాలని ఎస్ఎంఎస్లు పంపించడం దారుణమన్నారు. తిత్లీ బాధితులకు కేవలం 25 కిలోల బియ్యం ఇచ్చేందుకే 3 రోజులపాటు పలాసలో ఉన్నారా అని మండిపడ్డారు. ఈఎస్ఐ ఆస్పత్రి కోసం డిమాండ్ చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అంతకు ముందు పార్టీ నాయకులకు బెండి గ్రామస్తులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం అప్పయ్యదొర విగ్రహానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాలల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు దువ్వాడ హేమబాబు చౌదరి, మెట్ట కుమారస్వామి, బళ్ల గిరిబాబు, పలాస, మందస మండలాల పార్టీ అధ్యక్షులు పైల చిట్టి, అగ్గున సూర్యారావు, మండల ప్రధాన కార్యదర్శి తమ్మినేని శాంతారావు, పలాస పట్టణ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్, సరుబుజ్జిలి ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, బోర కృష్ణారావు, డబ్బీరు భవానీశంకర్, యువజన విభాగం మండల అధ్యద్యక్షుడు కొల్లి రమేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దున్న వీరస్వామి, నాయకులు హనుమంతు కిరణ్కుమార్, ఉంగ సాయికృష్ణ, బళ్ల గిరిబాబు, డొక్కరి దానయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, మరడ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఓట్లను కాపాడుకోవాలి వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన 20 వేల మంది ఓటర్లను జిల్లాలో తొలగించేందుకు సర్వేలు చేపట్టారని, దీనిపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించి, పోరాటాలతో సాధించుకున్న ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో ఇసుక, మైన్స్, వైన్స్ మాఫియా దొరికినంత దోచుకుంటున్నారని, కోట్లాది రూపాయల విలువైన భూములను తమకు కావాల్సిన వారికి దోచి పెడుతున్నారని విమర్శించారు. దివంగత ఎంపీ హనుమంతు అప్పయ్య దొర నీతి, నిజాయితీ కలిగిన ఉత్తమ పార్లమెంటేరియన్ అని అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి కొనియాడారని గుర్తుచేశారు. బెండిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం జిల్లాలో పార్టీ విజయానికి నాంది కావాలని ఆకాంక్షించారు. సీఎం అబద్ధాల పుట్ట శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సోనియా, రాహుల్ గాంధీలను రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేయాలని గతంలో తిట్ల దండకం అందుకున్నారని గుర్తుచేశారు. అయితే... కేసుల భయంతో అదే కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. మోదీ అంతటి నాయకుడు లేరని అసెంబ్లీలో ప్రశంసించిన సీఎం.. ఎన్డీఏ నుంచి బయటకు రాగానే ప్రధానిపై చిందులేస్తున్నారని ఆక్షేపించారు. నోరు విపిత్తే చంద్రబాబు నోట అబద్ధాలు తప్ప ఇంకేమీ రావని తూర్పారబట్టారు. -
ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది?
-
చంద్రబాబును తరిమికొడతారు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తామని 2014 ఎన్నికల సమయంలో బూటకపు హామీలిచ్చి వాటన్నింటినీ తుంగలొ తొక్కేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ బూత్కమిటీ మహిళా కన్వీనర్ల సమావేశం శనివారం పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం.వి.పద్మావతి అధ్యక్షతన జరిగింది. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా దివంగనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళల ఓట్లు దండుకోవడానికి ‘అక్కచెల్లెమ్మల్లారా నేను మారాను.. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాను.. నన్ను నమ్మండి’ అని ప్రాధేయపడితే ఓట్లు వేసిన మహిళలను నట్టేట ముంచాడని దుయ్యబట్టారు. పిల్లనిచ్చిన మామకే ముప్పు తిప్పలు పెట్టిన బాబుకు అమాయకులైన మహిళలను మోసం చేయడం పెద్ద విచిత్రం కాదన్నారు. డ్వాక్రా రుణాలు రూ.3వేలు ఇచ్చినందుకు సన్మానం చేయాలా? కట్టాల్సిన బకాయిలు లక్షల రూపాయలకు చేరినందుకు తగిన బుద్ధి చెప్పాలా అని మహిళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ గెలుపులో మహిళలే కీలకమన్నారు. 279 మంది మహిళా కన్వీనర్లు ఒక్కొక్కరూ 10 మంది సభ్యులతో కలిపి మొత్తం 2790మందితో కూడిన కమిటీని మరింత బలంగా తయారుచేసి పార్టీ విజయానికి దోహదపడాలన్నారు. నవరత్న పథకాలను అన్ని వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తినడానికి తిండిలేక ఎంతోమంది నిరుపేదలు ఇబ్బందులు పడుతుంటే టెక్నాలజీ పేరుతో ప్రచార ఆర్భాటం చేస్తున్న బాబుని ప్రజలు క్షమించరన్నారు. బస్సుచార్జీలు, విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు పన్నులు పెంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళా శక్తికి మించినది లేదు: కృష్ణదాస్ సమాజంలో మహిళలకి మించిన గొప్పవారు ఎవరూ ఉండదని, కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలున్న వ్యక్తులని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. షర్మిలమ్మ 3180 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. అంత శక్తి సామర్థ్యాలున్న మహిళలు వైఎస్సార్సీపీని గెలిపించడం పెద్ద విశేషం కాదన్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి టీడీపీని కంగుతినిపించాలన్నారు. జగన్తోనే మహిళా సాధికారత: దువ్వాడ మహిళాసాధికారతపై ఉద్యమాలు జరుగుతుంటే దానికి తూట్లు పొడిచేవిధంగా చంద్రబాబునాయుడు వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఏ సంక్షేమ పథకాన్నైనా మహిళల పేరుపైనే ఇవ్వాలని తొలిసారిగా ప్రతిపాదించి మహిళలకు చేయూతనిచ్చింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ అధిష్టానం తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా, నిస్వార్థంతో చేస్తామని కన్వీనర్లు ప్రమాణం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, మహిళా ప్రధాన కార్యదర్శి అంబటి అంబిక, రాష్ట్ర మహిళా కార్యదర్శి టి.కామేశ్వరి, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా అలివేలు మంగ, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షురాలు పి.సుగుణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ సతీమణి పిరియా విజయమ్మ, ధర్మాన రామ్మనోహర్నాయుడు సతీమణి ధర్మాన సుశ్రీ, మూల కృష్ణవేణి, రాధారాణి, టెక్కలి ఎంపీటీసీ సత్తారు ఉషారాణి, మూకళ్ల సుగుణా, పైడి భవానీ, గార మండల అధ్యక్షురాలు సుగ్గు లక్ష్మినర్సమ్మ, పైడి భవానీ, మహిళా కన్వీనర్లు పాల్గొన్నారు. -
తిత్లీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
-
శ్రీనివాస్ను ప్రేరేపించిందెవరు? కుట్రదారులెవరు?
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ను ప్రేరేపించిందెవరని, ఈ దాడి వెనుక కుట్రదారులెవరో తేల్చాలని ఆ పార్టీ నేతలు మేకపాటి రాజ్మోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి రాజకీయ కారణాలతో బయటకొచ్చారన్నారు. ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై కేకలేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మొదట్నుంచీ పోరాడుతుంది వైఎస్సార్సీపేనని స్పష్టం చేశారు. వైఎస్ జగన్పై జరిగిన దాడిపై టీడీపీ నేతల స్పందన దారుణంగా ఉందన్నారు. ఈ దాడిని చిన్న ఘటనగా చిత్రీకరించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, విచారణ చేయకుండా డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జగన్ను కైమా చేసేవాళ్లమని టీడీపీ నేతలు అనడం ఎంతవరకు సమంజసమని అడిగారు. రాష్ట్రపతి,కేంద్ర హోంమంత్రిలను కలిసి దాడి ఘటనను నివేదిస్తామని ఈ సందర్భంగా మేకపాటి పేర్కొన్నారు. టీడీపీ పెద్దల హస్తం: ధర్మాన వైఎస్ జగన్పై దాడి వెనుక టీడీపీ పెద్దల హస్తముందని ధర్మాన ఆరోపించారు. వారికి సంబంధం లేనప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించొచ్చు కదా అని ప్రశ్నించారు. థర్డ్పార్టీ ఏజెన్సీతో విచారణ జరిగితేనే ప్రజలు విశ్వసిస్తారని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను పనిచేయకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ పాత్ర కాకుండా .. చంద్రబాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దయాదాక్షిణ్యాలపై బతకకపోతే ఎవర్నైనా కైమా చేసేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగనివ్వకుండా స్టేలు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అక్రమ సంపాదనపై దాడులు జరిగితేనే ప్రజలకు నమ్మకమొస్తుందని తెలిపారు. వైఎస్ జగన్ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉండటంతో వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని ధర్మాన పేర్కొన్నారు. -
డీజీపీ మాటలు టీడీపీ మాటల్లా ఉన్నాయి: ధర్మాన
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యాఖ్యలు టీడీపీ మాటల్లా ఉన్నాయని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ..విచారణ పూర్తి కాకుండానే పబ్లిసిటీ కోసం చేసిన ఘటన అని డీజీపీ ముందస్తుగానే తేల్చి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఇంటరాగేషన్లో భిన్నమైన వాస్తవం గుర్తించినా దిగువస్థాయి పోలీసు అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు - వైఎస్ జగన్ మోహన రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు తీశాయి. శ్రీకాకుళంలో ఏడు రోడ్ల జంక్షన్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. - పాలకొండలో కోటదుర్గ గుడి నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వరకు ఎమ్మెల్యే వి.కళావతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. - పాతపట్నం వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. - రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్లో కొవ్వొత్తులతో మానవహారం, నిరసన ప్రదర్శన చేపట్టారు. - రణస్థలంలో జాతీయ రహదారిపై ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. - టెక్కలిలో వైఎస్ఆర్ జంక్షన్ వద్ద పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. - ఆమదాలవలసలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. -నరసన్నపేటలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో, కాశీబుగ్గ బస్టాండ్ వద్ద పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో, కవిటిలో రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ తీశారు. -
అధైర్య పడొద్దని చెప్పండి
గార: జిల్లాకు తీవ్ర నష్టాన్ని కలిగించిన తిత్లీ తుపాను, అనంతరం వచ్చిన వంశధార వరదతో ఇబ్బందులు పడిన ప్రజలవ్వెరూ అధైర్యపడవద్దని చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ రీజినల్ కో ఆర్డీనేటర్ ధర్మాన ప్రసాదరావుకు సూచించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ధర్మానతో ఆదివారం ఉదయం జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని గార మండలం తోనంగిలో పర్యటించిన సందర్భంగా ధర్మాన రైతులకు తెలియజేశారు. అనంతరం ప్రసాదరావు మాట్లాడుతూ..తుపానుతో జిల్లాలో వాటిల్లిన నష్టాని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీని పార్టీ అధినేత వేశారన్నారు. ఆ బాధ్యతలను తమకు అప్పగించడంతో మూడు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో పరిస్థితి, ప్రభుత్వ సాయంపై జగన్మోహన్రెడ్డి తమ నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లోనే జిల్లాకు వచ్చి రైతులతో మాట్లాడతానని, ఎవ్వరూ అధైర్యపడవద్దని పార్టీ శ్రేణుల ద్వారా భరోసా కల్పించాలని తెలిపారన్నారు. గతంలో సంభవించిన హుద్హుద్ తుపాను, గతేడాది అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకూ ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడం చంద్రబాబు తీరుకు నిదర్శనమని ధర్మాన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నానని, జిల్లాలో మకాం పెట్టానని చెప్పి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రస్తుతం జిల్లాలోని వరి పంటను చూస్తే దారణంగా దెబ్బ తిందన్నారు. అయితే వ్యవసాయదారులు కాని వారు పంట బాగుందని అనుకుంటారని, వ్యవసాయం చేసిన వారికి పంట పాడైన సంగతి తెలుస్తుందన్నారు. చంద్రబాబు కూడా వ్యవసాయదారుడు కాకపోవడంతో రైతుల కష్టాలు ఆయనకు తెలియవని ధర్మాన వ్యాఖ్యానించారు. గతంలాంటి చంద్రబాబుని కాదని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని.. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఆయనలో మార్పు కలగలేదన్నారు. గడిచిన నాలుగు రోజులుగా రైతుల పరిస్థితి, ప్రభుత్వం ఏమి చేయాలి అనే నివేదిక చూశాక తమ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. తుపానుతో వరిపంట పూర్తిగా తుడిసిపెట్టుకుపోయిందన్నారు. ఇప్పటికే 20 వేల రూపాయల వరకూ ఒక్కోరైతు పెట్టబడి పెట్టారని, అన్ని ఖర్చులు పూర్తయ్యాక తుపాను రూపంలో నష్టం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందని, ఆ సంస్థకైన రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదకలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వమైనా సాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తుపాను ప్రభావిత గ్రామాల్లో మంచినీరు, భోజనం దొరకడం లేదన్నారు. టెక్కలి సబ్డివిజన్ కేంద్రానికే విద్యుత్లేకపోవడం చూస్తే రాష్ట్రంలో పెద్ద యంత్రాంగం ఉన్నా నిర్వీర్యం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం శ్రీకాకుళంలో కూర్చుంటానని, పడుకోనని చెబుతున్నారన్నారు. అయితే నష్టపోయిన బాధితులు మాత్రం ఏమి వస్తుందానని ఆలోచిస్తారన్నారు. తీరప్రాంతంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టి గృహ నిర్మాణాలు చేపట్టారన్నారు. ఈ తుపానులో కూడా పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి, కవిటి, సోంపేటలో తాము పర్యటించిన సందర్భంగా అప్పట్లో వైఎస్ కట్టించిన ఇళ్లన్నీ సేఫ్గా ఉన్న విషయం వెలుగు చూసిందన్నారు. అయితే పూర్తిళ్లు మాత్రం దెబ్బ తిన్నాయన్నారు. టీడీపీ సర్కార్ హయాంలో ఇళ్ల నిర్మాణాలే జరగలేదన్నారు. 5 లక్షల ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. పర్యటనలో పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గొండు రఘురాం, పార్టీ నాయకులు మార్పు ధర్మారావు, ముంజేటి కృష్ణమూర్తి, పీస శ్రీహరిరావు, పీస గోపి, చల్ల రవికుమార్, బరాటం రామశేషు, సుగ్గు మధురెడ్డి, వమరవల్లి ఉదయభాస్కరరావు, కెప్టెన్ ఎర్రన్న, మైలపల్లి రాజేశ్వరరావు, గుంటు లకు‡్ష్మయ్య, రామచంద్రరరావు, కుడతాల రాజు ఉన్నారు. -
బాబు మాటలన్నీ నీటిమూటలే
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అనుభవజ్ఞుడైన తనతో నే అద్భుతమైన రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటనలు, హామీలు గుప్పించారని, అవన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయని వైఎస్సార్సీపీ రీజ నల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర 3వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావ పాదయాత్ర ను బుధవారం శ్రీకాకుళం నగరంలో ఆదివారంపే ట అయ్యప్పస్వామి గుడి నుంచి ఇలిసిపురం మీదుగా బలగ చేరుకుని సాధు వైకుంఠరావు అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్వన్గా చేస్తానని గొప్పలు పలికి న చంద్రబాబు అవినీతిలో ప్రథమ స్థానంలో నిలబెట్టారని ఓ సర్వేలో తేటతెల్లమైనట్లు గుర్తు చేశా రు. రాష్ట్ర ప్రజలకు ప్రతి రోజూ ఫోన్ చేస్తున్నానని చెబుతూ పాలనపై అభిప్రాయం తెలుసుకుని ప్రజలంతా 80శాతం తృప్తిగా ఉన్నారని డబ్బాలు చెప్పుకుంటున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుం దన్నారు. ప్రజలు తృప్తిగా ఉన్నప్పుడు చంద్రబా బు కాంగ్రెస్తో స్నేహం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో కలిసి పోటీచేసి ఇప్పుడు వారినే తిట్టడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. పంట లకు గిట్టుబాటు ధరలేక రైతులు పాట్లు పడుతుం టే అమెరికాలో బాబు మాత్రం రాష్ట్రంలో ఎరువులు లేని పంటలు పండిస్తున్నాం...సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. మరో రెండేళ్లలో ఎరువులు వెయ్యకుండానే పూర్తిగా పంటలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని గొప్పలు పలకడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడి జిల్లా సిక్కోలుకు ఒక్క కేంద్ర సంస్థనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించా రు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేతకానితనానికి ఇదే నిదర్శనమన్నారు. అమరావతి వెళ్తే ఎడారి ప్రాం తంలా తప్ప ఒక్క భవనం కూడా నిర్మా ణం పూర్తయిన పరిస్థితి లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అనంతరం టీడీపీకి కం చుకోటగా ఉన్న బలగ నుంచి 500 కుటుం బాలు వైఎస్సార్సీపీలోకి చేరినట్లు ధర్మాన ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీను, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, కోణార్క్ శ్రీను, కె.ఎల్.ప్రసాద్, మండవల్లి రవి, గొండు కృష్ణమూర్తి, పైడి మహేశ్వరరావు, డాక్టర్ శ్రీనివా స పట్నాయక్, గుమ్మా నగేష్, కోరా డ రమేష్, మెంటాడ స్వరూప్, అల్లు లక్ష్మినారాయణ, టి. కామేశ్వరి, చల్లా అలివేలు మంగ, చల్లా మంజుల, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
శ్రీకాకుళంలో జగనన్నకు అండగా.. సంఘీభావ పాదయాత్ర
-
రావాలి జగన్.. కావాలి జగన్ పేరుతో కార్యక్రమాలు
-
రావాలి జగన్.. కావాలి జగన్
సాక్షి, విశాఖపట్నం: ‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో ఈ నెల 17వ తేదీ నుంచి పోలింగ్ బూత్ స్థాయిలో గడపగడపకు వెళ్లబోతున్నాం. బూత్ కమిటీ సభ్యులతో కలిసి సమన్వయకర్తలు ప్రతి గడపకూ వెళ్లి.. ప్రతి ఒక్కర్ని స్వయంగా కలుసుకుని కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలియజేస్తారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాలతో పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. స్థానిక బీచ్ రోడ్లోని విశాఖ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమన్వయకర్తల సమావేశం వివరాలను ధర్మాన మీడియాకు వివరించారు. పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారని చెప్పారు. రానున్న నాలుగైదు నెలలు చాలా కీలకమైనందున.. వాటికి సన్నద్ధమయ్యేలా కార్యక్రమాలు రూపకల్పన చేశారని చెప్పారు. గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కర్నీ కలవాలి.. పాదయాత్ర జరిగే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీలు మినహా మిగిలిన 168 నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్..కావాలి జగన్’ అనే నినాదంతో ‘గడపగడపకు వైఎస్సార్సీపీ’ కార్యక్రమం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు దర్మాన తెలిపారు. ఈ నెల 17 నుంచి బూత్ కమిటీ సభ్యులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతి రోజూ కనీసం రెండు పోలింగ్ బూత్ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ఆయా ప్రాంతాల్లోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలతో పాటు వైఎస్సార్సీపీ లక్ష్యాలను వివరించాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించినట్లు చెప్పారు. రానున్న నెల రోజుల్లో 50 పోలింగ్ బూత్ల పరిధిలో గల కుటుంబాల్లోని వ్యక్తులందర్నీ కలిసి మాట్లాడాలని ఆదేశించినట్లు వివరించారు. నవరత్నాల వల్ల ఏఏ వర్గాలకు ఏడాదికి ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఈ కార్యక్రమం ద్వారా వివరిస్తారని తెలిపారు. అలాగే ఎక్కడైనా ఇంకా బూత్ కమిటీల నియామకాలకు జరగకపోతే వాటిని రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని వైఎస్ జగన్ సూచించినట్లు చెప్పారు. అలా నియమించనిపక్షంలో పార్టీ కేంద్ర కమిటీయే సమర్థులను గుర్తించి నియామకాలు చేపడుతుందని స్పష్టం చేశారన్నారు. బూత్ కమిటీల నిర్వహణ తీరును పరిశీలించేందుకు మండల, జిల్లా, రీజనల్ స్థాయిల్లో ప్రత్యేకంగా బాధ్యులను నియమించుకోవాలని.. వారు గుర్తించిన విషయాలను ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవాలంటూ సమన్వయకర్తలను ఆదేశించారని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమమనే విషయాన్ని సమన్వయకర్తలు భావించాలని స్పష్టం చేసినట్లు వివరించారు. బూత్ కమిటీల పనితీరుపై సమన్వయకర్తలు సమీక్ష చేసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగవనడానికి ఓటర్ జాబితాల తయారీలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలే నిదర్శనమని ధర్మాన పేర్కొన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని తమ పార్టీ అధినేత ఆదేశించారని చెప్పారు. ఓటర్ల జాబితాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పేర్లనే అత్యధికంగా తొలగించారని.. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇలా తొలగించిన వారిని మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్పించుకునేందుకు వచ్చే నెల 30 వరకు ఎన్నికల కమిషన్ గడువిచ్చిందని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రజల్ని చైతన్యపర్చాలని పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ కమిటీలు కృషి చేయాలని.. పక్షపాత ధోరణితో పనిచేస్తున్న అధికారులపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేయాలని ఆదేశించారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని ధర్మాన వివరించారు. సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సీనియర్ నేత పొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే అంజాద్ భాషా, విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు -
చంద్రబాబుకు ఓటమి భయం
కోటబొమ్మాళి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి డబ్బుతో అధికారం కొనుగోలు చేసేందుకు అడ్డదారులు తొక్కుతారని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. గురువారం కోటబొమ్మాళి మండలం కొత్తపేట రెడ్డి కల్యాణ మండపంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్.హేమసుందరరాజు అధ్యక్షత బూత్ కమిటీల శిక్షణ శిబిరం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై ధర్మాన దిశానిర్దేశం చేశారు. అనంతరం పాకివలస, పట్టుపురం, పొన్నానపేట, కురుడు, పెదబమ్మిడి తదితర గ్రామాల నుంచి సుమారు 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. సమావేశంలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, నందిగాం ఎంపీపీ ప్రతినిధి యర్ర చక్రవర్తి, బోయిన నాగేశ్వరరావు, కవిటి రామరాజు, పేడాడ వెంకటరావు, అన్నెపు రామారావు, నేతింటి నాగేష్, దుబ్బ వెంకటరావు, దుంగ శిమ్మన్న, కాళ్ళ సంజీవరావు, దుబ్బసింహాచలం, టి.లచ్చుమయ్య, దుక్క రామకృష్ణ, ఆర్.ముకుందరెడ్డి, కణితి నారాయణమూర్తి, చల్ల రవి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు రాష్ట్రానికి ప్రమాదకారి
మందస శ్రీకాకుళం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకారి అని, దేశంలోనే అవినీతిపరుల్లో ఒకరని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. మందస పట్టణంలోని బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల శిక్షణ శిబిరంలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్ కంపెనీలకు ధారదత్తం చేశారని, రూ. 21వేల కోట్ల పెట్టుబడి దుర్వినియోగంగా మారుతోందన్నారు. రాష్ట్రాన్ని ఇతర దేశాల పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతున్నారని, దోచిన సొమ్ముతో రాబోయే ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ. 5 వేలిచ్చి, మళ్లీ అధికారంలోకి రావడానికి ఇప్పట్నుంచే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి పేరిట మాయాజాలం చేస్తున్నారన్నారని, పేదల తిండికి లేకుండా ఉన్నారని, భూగర్భ డ్రైనేజీల పేరిట నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జీతాలు పెంపు, పథకాలు.. ఇతరత్రా ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్లు వ్యయం చేయలేని దుస్థితిలో ఉన్నారన్నారు. కేవలం నియంతలా చంద్రబాబు ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రాజ్యం వైఎస్సార్సీపీదేనని, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అని, ఇందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు, టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్, పలాస బూత్ కమిటీల కన్వీనర్ సీదిరి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు మెట్ట కుమారస్వామి, డొక్కరి దానయ్య, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేయాలని కూడా పార్టీ తీర్మానించింది. ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ వద్ద ప్రజా సంకల్ప యాత్ర శిబిరంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్.. మూడు గంటల పాటు పార్టీ నేతలతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చలేదని, అందువల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని, ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించినట్టు తెలిపారు. సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్ వెలుపల.. ఇటీవల ప్రత్యేక హోదా కోసం పోరాడి పదవీ త్యాగం చేసిన.. లోక్సభ మాజీ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపడతారన్నారు. ఈ విధంగా యావత్ దేశ ప్రజలకు తమ నిరసన తెలిసేలా చేస్తామని చెప్పారు. సాధారణంగా ఇలాంటి రాజ్యాంగ పదవులకు జరిగే ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఒక ధృఢమైన అభిప్రాయంతో ఉందని, అయితే ఏపీ ప్రజలకు అత్యంత ముఖ్యమైన, ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి అవసరమైన ప్రత్యేక హోదా హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలని బీజేపీ ప్రభుత్వానికి తమ పార్టీ ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చిందని, చివరకు లోక్సభలో అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా ఇచ్చిందని ధర్మాన వివరించారు. అప్పటికీ స్పందించనందున పార్టీ లోక్సభ సభ్యులు రాజీనామాలు చేశారన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ప్రాముఖ్యమైనదిగా తాము భావిస్తున్నామని, అది ఇవ్వనందుకు నిరసనగానే బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయించామన్నారు. హోదా రాకపోతే ఎలా సాధించుకోవాలనే విషయంలో జగన్ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చారన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వకపోతే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 20 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే కేంద్రంలో రేపు ఏర్పడే ప్రభుత్వాలు మన వద్దకే వచ్చి ఇచ్చిన హామీని అమలు చేస్తాయని ధర్మాన అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి కూడా పాల్గొన్నారు. -
పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ.. కీలక నిర్ణయం
సాక్షి, అనపర్తి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శిబిరం వద్ద వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్స్, పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంపై పార్టీ నేతలతో చర్చించి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నేరవేర్చనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరిగినంత కాలం పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలపనున్నారని ధర్మాన పేర్కొన్నారు. -
రాజధాని నిర్మాణం చేపట్టేదెవరు?: ధర్మాన
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వం చేపడుతుందా? లేక ఆ దేశ ప్రైవేట్ కంపెనీ చేపడుతుందా? అని ప్రశ్నించారు. సింగపూర్ మంత్రి ఏ హోదాలో రాజధాని నిర్మాణ సంస్థతో సంతకాలు చేశారు, ఆయన పర్యటనపై విదేశాంగ శాఖ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని పరిసర ప్రాంతాలలోని భూములు కారు చౌకగా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం గవర్నర్ పేరుతో అక్రమంగా పదిహేను వందల జీవోలు విడుదల చేశారని, వీటిపై గవర్నర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలవనున్నదని ధర్మాన స్పష్టంచేశారు. ఈ జీవోలన్నింటిపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలతో ప్రజలను అపహాస్యం చేస్తుందని ఎద్దేవచేశారు. -
ధర్మానతోనే జిల్లా అభివృద్ధి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాను సస్యశ్యామలం చేయాలనే కృత నిశ్చయంతో వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి పునాది వేసిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు వన్నె తెచ్చిన నాయకుడు ధర్మాన అని కొనియాడారు. ఈ నెల 21వ తేదీ సోమవారం 60వ పుట్టినరోజు వేడుకలు ధర్మాన ఇంటి వద్ద ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఉదయం 7గంటలకు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని అనంతరం బంగ్లాలో కేక్ కట్చేస్తామన్నారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతా యన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి ధర్మాన అని అన్నా రు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి కుడి భుజంగా ఉంటూ జిల్లా అభివృద్ధికి రిమ్స్ మెడికల్ కళాశాల, వంశధార ప్రాజెక్టు నిర్మాణం, ఆఫ్షోర్ వంటి ఎన్నో జిల్లాకు తీసుకొచ్చి సిక్కోలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని అన్నా రు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంలో, జిల్లా అభివృద్ధిలో ధర్మాన కీలకపాత్ర పోషిస్తారన్నారు. యువజన విభాగం నాయకుడు మామి డి శ్రీకాంత్ మాట్లాడుతూ ధర్మాన పుట్టిన రోజు నా డు 38 మండలాల నుంచి వచ్చే నాయకులు ఓ పద్ధతి ప్రకారం ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తె లిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కో రారు. సమావేశంలో యువజన విభాగం నాయకులు మెంటాడ స్వరూప్, కె.ఎల్.ప్రసాద్, ఎం.ఎ .రఫీ, శిమ్మ వెంకటరావు, కోరాడ రమేష్, మండవిల్లి రవి, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు, పొన్నాడ రుషి, పురుషోత్తం, ఊన్న నాగరాజు, కరమ్చంధ్, ఆర్.ఆర్.మూర్తి పాల్గొన్నారు. -
ధర్మపోరాటమంటే రాళ్లతో కొట్టడమా?
కవిటి: ధర్మ పోరాటమంటే రాష్ట్రానికి వచ్చిన వారిని రాళ్లతో కొట్టడమేనా? అని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. శనివారం కవిటిలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు అధ్యక్షతన యువభేరి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, రెడ్డిశాంతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా వాహనశ్రేణిపై రాళ్లదాడి చేయడం శోచనీయమన్నారు. దాడి జరిగే అవకాశముందని బీజేపీ నేతలు ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవనియా అన్న పెద్ద మనిషి నాలుగేళ్ల తర్వాత ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అధర్మ విధానాలతో ధర్మపోరాటాలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 97 వేల కోట్ల అప్పును నాలుగేళ్ల కాలంలో రెండు లక్షలకు పెంచి రాష్ట్రాన్ని దివాళా తీయించి ప్రజలకు భారాన్ని మిగిల్చారన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సామంతులు, బెంతు ఒడియాలు, మత్స్యకారులు, మైనార్టీ కులాల ఓట్లు సాధించడంలో సరైన ప్రణాళికతో ఈ పదినెలల కాలంలో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రెడ్డిక, యాదవ, కాళింగ, అగ్నికులక్షత్రియ తదితర కులాలన్నీ ఏకతాటిపై తెచ్చి వైఎస్సార్సీపీకి ఓట్లు వేసేలా ఓటర్ల మనసు గెలుచుకోవాలన్నారు. యువకులు సోషల్మీడియాను ఆయుధంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి సమన్వయకర్తలు నర్తు రామారావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, తమ్మినేని నాగ్చిరంజీవి, నవీన్కుమార్ అగర్వాలా, పి.ఎం.తిలక్, పూడి నేతాజీ, డాక్టర్ ఎన్.దాస్, పులకల శ్రీరాములు, రజినీకుమార్ దొళాయి, పిలక రాజలక్ష్మీ, ఇప్పిలి లోలాక్షి, సత్యన్నారాయణ పాఢి, శ్యాంపురియా, జయప్రకాష్, శ్యాంప్రసాద్రెడ్డి, కారంగి మోహనరావు, కడియాల ప్రకాష్, ఎన్ని అశోక్, తడక జోగారావు, వజ్జ మృత్యుంజయరావు, పిట్ట ఆనంద్కుమార్, కాళ్ల దేవరావు తదితరులు పాల్గొన్నారు. జగన్ నాయకత్వంతోనే అభివృద్ధి.. రాష్ట్రానికి జగన్మోహన్రెడ్డి నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది. యువకులు రానున్న కీలకమైన ఎన్నికల రణక్షేత్రంలో అలుపెరగని సైనికుల్లా కష్టపడి పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రి చేసేలా సమాయత్తం కావాలి. – రెడ్డి శాంతి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువత ఐక్యంగా పనిచేయాలి రాష్ట్రంలో టీడీపీ పార్టీ సాగిస్తున్న అరాచకపాలనను అంతమొందించడానికి వైఎస్సార్సీపీ యువజన విభాగం ఐక్యతతో పోరాడాలి. అన్ని రంగాల్లో ప్రభుత్వ అవినీతి అక్రమాలను యువత వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. – తమ్మినేని నాగ్చిరంజీవి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి. వైఎస్సార్సీపీ గెలుపు అభివృద్ధికి నాంది వైఎస్సార్సీపీ గెలుపు రాష్ట్రాభివృద్ధికి నాందిపలుకుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డిపై పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు అందరూ కలిసి రావాలి. – నర్తు రామారావు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఇచ్ఛాపురం -
చంద్రబాబు తీరుతో రాజకీయాలు చులకన
వినుకొండ: చంద్రబాబు తాను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఉంది.. తాను చెప్పిందే ప్రజలు వినాలన్న భ్రమలో ఆయన బతుకుతున్నారని, ఇలాంటి వారి వల్లే రాజకీయ నాయకులంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ లెవల్ కన్వీనర్ల మూడు రోజుల శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ధర్మాన ఆవిష్కరించారు. వేదికపై ఏర్పాటు చేసిన మహానేత రాజన్న విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలు గుండెల మీద చెయ్యి వేసుకుని జీవించారని గుర్తు చేశారు. తేడా లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చేయగలిగిన గొప్ప వ్యక్తి వైఎస్ అని చెప్పారు. చంద్రబాబు పాలనలో అనర్హులకే అందలం దక్కుతుందని, అర్హులు సంక్షేమ ఫలాలు అందక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎంత కష్టపడతారో అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా కష్టపడ్డప్పుడే సంపూర్ణ ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓట్లు సమర్థవంతంగా పోలింగ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందన్నారు. జిల్లాలో 3లక్షల ఓట్లు తొలగింపబడ్డాయని, జాబితాలో మార్పులు చేర్పులు గమనించి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి ఒటు కీలకమేని వివరించారు. రాష్ట్ర నేత వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు పాదయాత్ర చేస్తున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి, చీకట్లో రాత్రిపూట పాదయాత్ర చేసిన చంద్రబాబుకు తేడా ప్రజలు గుర్తించారన్నారు. ఎమ్మెల్యే జీవీకి దొంగ ఓట్లు వేయించడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గ్రామీణ, పట్టణంలో రెండు చోట్ల ఓట్లు వేయించిన ఘనుడు ఎమ్మెల్యే జీవీ అని అన్నారు. పంచభూతాలను దోచుకుంటున్న టీడీపీ నేతలు అధికార టీడీపీ నాయకులు పంచభూతాలను సైతం దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. అధికార తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూనే మహారాష్ట్రలోని ఓ మంత్రి భార్యకు టీటీడీ బోర్డు మెంబరుగా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలు రహస్య ఎజెండాతో స్నేహాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని కార్యకర్తలు గ్రామాలల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బోతున్నారని జోస్యం చెప్పారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు రానున్నరోజుల్లో మంచి గుర్తింపు లభిస్తుందని, ఇది తన మాట కాదని, జగన్మోహన్రెడ్డి చెప్పమన్న మాటని కార్యకర్తలకు తెలియజేశారు. కార్యకర్తలు గ్రామస్థాయిలో టీడీపీ చేస్తున్న దోపిడీని గుర్తించి ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రహస్య పొత్తు కొనసాగుతోందని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైయితే ప్రత్యేక హోదా ఇచ్చి ప్రజలకు న్యాయం చేస్తారో వారితో కలసి పనిచేస్తామని బొత్స స్పష్టం చేశారు. త్వరలో మండల స్థాయి కమిటీ సభ్యులకు శిక్షణనిస్తామన్నారు. ప్రతి కార్యకర్తా బూత్ స్థాయిలో రెండు ఓట్లు వేయించగల్గితే అధికారం చేపట్టవచ్చని సూచించారు. స్థానిక ఓటర్లపై దృష్టి పెట్టాలి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ట్లాడుతూ ప్రతి కార్యకర్తా స్థానిక ఓటర్లపై దృష్టి సారించాలన్నారు. బూత్ స్థాయి ఓటరు లిస్టుల్లో పేర్లున్న 1000 మందిలో 100 ఓట్లు స్థానికంగా నివాసం ఉండటం లేదని, వాటిని గుర్తించేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా సగానికి పైగా ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తోందన్నారు. పార్టీకి ఏ మీడియా సహకరించకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ప్రోటోకాల్ విస్మరించిన ప్రభుత్వం సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలువకుండా అధికా దుర్వినియోగానికి ప్పాడిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. నాలుగేళ్లుగా పడుతున్న అవమానాలు, ఇబ్బందులు తొలగిపోవాలంటే పార్టీని గెలిపించడం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలోఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, వల్లభనేని బాలశౌరి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ , కావటి మనోహర్ నాయుడు, అరవింద్ తదితర నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఘనంగా సత్కరించారు. -
పోలింగ్ బూత్ కమిటీ సభ్యులే ఎన్నికల్లో కీలకం
-
చంద్రబాబుది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష!
సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో దీక్షలు, సభలు అంటూ రకరకాల మోసపూరిత ఎత్తుగడలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష అని నిప్పులు చెరిగారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా విశాఖపట్నంలో సోమవారం చేపట్టి ‘వంచన వ్యతిరేక దీక్ష’లో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు నాయకులు ఏమన్నారంటే.. కేంద్రంతో చంద్రబాబు లాలూచీ చంద్రబాబుకు అనుభవం ఉందని ప్రజలు నమ్మారని, కానీ ఆయన ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. దొంగ దీక్షలతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ముందుకొస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీని అద్భుతమంటూ.. దానిని చంద్రబాబు అంగీకరించారని, ప్రజల్లో వ్యతిరేకతను చూసి మళ్లీ ఆయన యూటర్న్ తీసుకున్నారని ధర్మాన గుర్తుచేశారు. మీరే అన్యాయం చేసి.. మీరే దీక్ష చేస్తానంటే ప్రజలు నమ్మరని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారని, ఇప్పుడు తనను ప్రజలే కాపాడాలని చంద్రబాబు వేడుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన అభ్యర్థించారు. అది దీక్ష కాదు.. కక్ష చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. అది తెలుగువారి కక్ష అని వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. విభజన చట్టంలో ఏ ఒక్క హామీపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేదని అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు, ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమైంది అని ఆయన చంద్రబాబును నిలదీశారు. ప్రత్యేక హోదా మన హక్కు, మన దిక్కు, మన లక్కు అని ఆయన పేర్కొన్నారు. ఓట్లరూపంలో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ముఖ్యమంత్రే దీక్ష చేయడమేంటి? హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబే దీక్ష చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబూ.. దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయలేవని పేర్కొన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని అభివర్ణించారు. చంద్రబాబు ‘ఆల్ ఫ్రీ’ అంటూ అందరినీ ముంచారని, మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నాలుగేళ్లుగా వంచిస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూనే ఉన్నాడని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. హోదా మాట రాష్ట్రంలో వినపడకుండా కుట్రలు చేసిన బాబు ఇప్పుడు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఇన్ని రోజులు హోదా మాటా ఎత్తని చంద్రబాబు ఇప్పుడు కొంగ జపాలు చేస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. చంద్ర బాబు లెంపలు వేసుకోవాలి రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లుగా చేసిన అన్యాయానికి చంద్రబాబు చెంపలు వేసుకోవాలని వైఎస్సార్సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, పోలవరం కమీషన్ల వ్యవహారం, రాజధాని నిర్మాణంలో అవినీతిపై చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని కోటం రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు జగన్ భయం పట్టుకుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్సీపీ పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికే బాబు ధర్మ పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసినందుకుగాను చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. -
జలయఙ్ఞంతో రైతులకు మేలు : ధర్మాన
-
విభజన హామీల సాధనలో చంద్రబాబు విఫలమయ్యారు
-
చంద్రబాబు మౌనంగా ఉన్నారెందుకు?
సాక్షి, నెల్లూరు: విభజన హామీల సాధనలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో జరుగుతున్న కీలక సమావేశానికి వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. భేటీకి ముందు వారు ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. డ్రామాలేంటి బాబు: ధర్మాన ప్రసాదరావు ‘కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఆయన వల్లే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టింది. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? కేంద్ర ప్రభుత్వంలో ఉండి డ్రామాలేంటి? రాష్ట్రానికి అన్యాయం చేసి సంబరాలు చేసుకోవడమేంటి? ప్రజల ఆగ్రహం నుంచి బయటపడేందుకు డ్రామాకు తెర లేపారు’ తేడా ఉంది: ఎంపీ వరప్రసాద్ ‘ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి చాలా తేడా ఉంది. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం. ప్యాకేజీతో ఒరిగేదేమీ ఉండదు. ప్యాకేజీతో చంద్రబాబుకు మేలు జరుగుతుంది. ప్రజలకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. హోదాకోసం మేం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం. జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేశారు. హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేయాలి. అప్పటివరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది’ ఇంకెన్నాళ్లు మోసం: ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ‘కేసు భయంతోనే కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారు. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటారా? ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు? నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి సాధించిందేంటి? ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు’ -
చంద్రబాబు వల్లే రాష్ట్రానికి అన్యాయం
కడియం: చంద్రబాబు నాయుడివల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పల్ల వెంకన్న నర్సరీలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోని ప్రతిపక్షం, ప్రజా సంఘాలు, పౌరులు, వివిధ వర్గాలు చేసిన సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం నష్టపోయిందన్నారు. ఆనాడు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని సూచనలు చేస్తే అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని సీఎం హేళన చేశారన్నారు. బీజేపీతో టీడీపీ కలిసి ఉండడం ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నారని ప్రచారం చేసుకున్నారన్నారు. చివరికి ఇప్పుడు చంద్రబాబే అంగీకరిస్తున్నారు. కేంద్రంతో ఘర్షణపడి ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన సమయంలో నోరు విప్పకుండా ఇప్పుడు పోరాడేస్తామని చెప్పడం డ్రామా కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు వల్ల జరిగిన నష్టానికి ఎవరిని బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. కేబినెట్ మంత్రుల ఆమోదం పొందాకనే బడ్జెట్ పార్లమెంట్కు వచ్చిందని, అప్పుడు నోరు మెదపకుండా కూర్చుని ఇప్పుడు టీడీపీ చేస్తున్నదంతా నటించడం కాక ఇంకేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారని దాని ప్రభావం రాష్ట్రంపై పడిందని ధర్మాన వివరించారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని రాష్ట్రం నిర్మిస్తుందని తీసుకోవడం, స్విస్ చాలెంజ్ వద్దని సుప్రీంకోర్టు చెబుతున్నా రాజధాని నిర్మాణం చేపట్టడం, టీడీపీ కార్యకర్తల కడుపు నింపేందుకే ఎన్ఆర్ఈజీఎస్ను వినియోగించడం తదితర అన్ని అనైతిక కార్యక్రమాలను చంద్రబాబు చేయడం వల్ల కేంద్రం ముందు నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను చేసిన తప్పును మరొకరి మీదకు నెట్టి మరోసారి చంద్రబాబు డ్రామా ఆడుతున్నారు. ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర సమయం ఉన్నందున పొత్తులపై ఇప్పుడేమీ చెప్పలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడే విధంగానే తమ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. రూరల్ కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు (బాబు), రాష్ట్ర రైతు కార్యదర్శి చిక్కాల ఉమామహేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు రైతులు ధర్మానకు ఘన స్వాగతం పలికారు. -
దేశం ఆమోదించిన చట్టాన్ని గౌరవించరా?
-
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం చెన్నై వచ్చిన ధర్మాన ప్రసాదరావు ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయామని బాధపడుతున్న ప్రజలకు టీడీపీ పాలనలో ఊరట లభించకపోగా.. మరిన్ని అగచాట్లు పడాల్సి వస్తోందన్నారు. మరోవైపు గవర్నర్ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టిపోయిందన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించడం కంటే దుర్మార్గమన్నారు. ‘స్పీకర్ వ్యవస్థ కూడా బ్రష్టుపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ఇప్పటికీ వైఎస్సార్సీపీ కిందే చూపిస్తున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తుంటారు..’అని ధర్మాన మండిపడ్డారు. సింగపూర్కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీకి వేలాది ఎకరాలను ధారాదత్తం చేసి.. గొప్ప రాజధాని నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధులు టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని ఆరోపించారు. దీనిపై కేంద్రం దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. -
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవండి
-
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవండి
కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ నేతలకు సూచించారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక హెలికాన్ టైమ్స్లో పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లతో సోమవారం పార్టీ కార్యకలాపాలపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను ఇవ్వాలన్నారు. జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలను కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. నియోజకవర్గాల వారీ సమీక్ష ఇంటింటికీ వైఎస్సార్తో పాటు పోలింగ్బూత్ స్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం, ఇతర అంశాలపై నియోజకవర్గాల వారీగా ధర్మాన సమీక్షించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి పార్టీని, పార్టీ కేడర్ను సమాయత్తం చేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, మోషేన్రాజు, పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, కాకినాడ పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, అమలాపురం పరిశీలకులు వలవల బాబ్జి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, ముత్తా శశిధర్, తోట సుబ్బారావునాయుడు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, అనంత ఉదయభాస్కర్, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, అల్లూరి కృష్ణంరాజు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. -
జనం మధ్యలో జగన్ దళం
శ్రీకాకుళం నియోజకవర్గం పరిధి గార మండలం వాడాడ పంచాయతీ కొత్తూరు–కొన్నిపేట గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో రచ్చబండ ,పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హామీలిచ్చి నాలుగేళ్లు పూర్తయినా వాటిని నెరవేర్చలేదని, దీనిపై ప్రజలు ఆలోచించి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గొండు రఘురాం, సర్పంచ్ బి.సావిత్రమ్మ పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం కొండ్రగూడ గ్రామంలో పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను గాలికొదిలేసి అవినీతిలో కూరుకుపోయిందన్నారు. పల్లెల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టిందని, అవినీతి, ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతితో ఊరేగుతోందని ధ్వజమెత్తారు. ఎంపీపీ కేవీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ ఎస్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: జనం మధ్యలోకి జగన్ దళం మరింత చొచ్చుకుపోయింది. ప్రజా సమస్యలు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలను పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు ఆయా ప్రాంతంలోని సమస్యలను పార్టీ నేతల ముందు ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని, సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయా ప్రాంత ప్రజలకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు ♦ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి రచ్చబండ, పల్లెనింద్ర కార్యక్రమాలు రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, దళితవాడలో రాత్రి నిద్రించారు. రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్ పాల్గొన్నారు. ♦ నరసన్నపేట మండలం నడగాం గ్రామంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని వైఎస్ జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలను రైతులకు వివరించారు. ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర నిర్వహించారు. ♦టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం సవరనీలాపురం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ♦ ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో పాదయాత్ర చేసి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. అక్కడి నుంచి బైక్లపై సన్యాసిపుట్టుగ దళితవాడకు చేరుకున్నారు. ♦ రాజాం నియోజకవర్గం పరిధి రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు రచ్చబండ,కార్యక్రమం నిర్వహించారు. పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ రచ్చబండ అనేది మహత్తర కార్యక్రమమని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టారో ఇప్పుడు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వీలుంటుందనన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. ♦ పాలకొండ నియోజకవర్గం పరిధి సీతంపేట మండలం కడగండి పంచాయతీ రోలుగుడ్డి గ్రామంలో సర్పంచ్ ఎస్.రాము అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. గిరిజన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం పలు గిరిజన గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. రాత్రి పంచాయతీ కేంద్రం కడగండిలో పల్లెనిద్ర చేశారు. ఈమె వెంట పార్టీ మండల కన్వీనర్ జి. సుమిత్రరావు పాల్గొన్నారు. -
అందుకు చంద్రబాబే కారణం: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేసి.. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీలోకి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము స్పీకర్ను కోరామని, కానీ స్పీకర్ మాత్రం చంద్రబాబు డైరెక్షన్లో నడుచుకుంటూ.. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అందుకే వైఎస్సార్సీపీ ఈ విషయంలో కోర్టుకు వెళ్లిందని, స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తాము కోర్టుకు వెళ్లాల్సిన అసవరం ఏముందని ధర్మాన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలను రేపటిలోగా సస్పెండ్ చేయాలని ధర్మాన డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రేపటిలోగా అనర్హులుగా ప్రకటిస్తే.. ఎల్లుండి నుంచి తమ సభ్యులు సభకు వస్తారని తెలిపారు. రెండువేల జీవోలను రహస్యంగా విడుదల చేసిన ఘనత చంద్రబాబుదని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు రాక్షస పాలన గురించి చెప్పుకోవడానికి ప్రజలు పెద్దసంఖ్యలో వైఎస్ జగన్ పాదయాత్రకు తరలివస్తున్నారని ధర్మాన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రూ. 97వేల కోట్ల అప్పు వస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ. లక్షకోట్లకుపైగా అప్పు చేశారని మండిపడ్డారు. ప్రజల సొత్తును చంద్రబాబు తన తాబేదారులకు కట్టబెడుతున్నారని, ఈ దోపిడీని పాదయాత్ర ద్వారా జగన్ ప్రజలకు వివరిస్తున్నారని ధర్మాన తెలిపారు. -
అందుకు చంద్రబాబే కారణం
-
ఎక్కడా ఇలాంటి ప్రభుత్వం లేదు
సాక్షి, ఇడుపులపాయ: దేశంలో ప్రతిపక్ష సభ్యులతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ పాలనలో ఏ చట్టాలను గౌరవించే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సర్కారు 2 వేల జీవోలు రహస్యంగా విడుదల చేసిందని, ఎంత దొంగతనంగా ప్రభుత్వం నడుస్తుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లడనీయకుండా గొంతు నొక్కుతున్నారని, ప్రజల తరపున ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మధ్యకు వెళ్లడమే ఏకైక మార్గమన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలనను ప్రజల ముందు పెట్టడమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ప్రజాసామ్యాన్ని రక్షించడానికి, గాడి తప్పిన పాలనను దారిలో పెట్టడానికి జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజా సంకల్పం యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్ను గ్రామగ్రామన ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎక్కడా ఇలాంటి ప్రభుత్వం లేదు
-
అప్పుడు మీరు తీసుకున్నారా పర్మిషన్ ?
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పాదయాత్ర చేసిన చంద్రబాబు ముందస్తు అనుమతి తీసుకున్నారా? అని నిలదీశారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్రకు అనుమతి తీసుకోవాలనడం అర్థరహితమన్నారు. పాదయాత్ర చేయడం కొత్త విషయమేమీ కాదని, స్వాతంత్య్రానికి పూర్వమే గాంధీ, వినోబాబావే, స్వాతంత్య్రం తర్వాత మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఎవరి అనుమతి లేకుండానే పాదయాత్ర చేశారని ధర్మాన గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల బాధలు తెలుసుకున్నారని, ఆ తర్వాత ఆయన కుమార్తె షర్మిల ఇదే బాటలో పయనించారని తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రను నేర చర్యగా చిత్రీకరించేందుకు సర్కార్ ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మితిమీరిన వ్యవహారంగా ధర్మాన అభిప్రాయపడ్డారు. చట్టసభలో ప్రజల వాణిని విన్పించే అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం వల్లే విపక్ష నేత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి వస్తోందన్నారు. అధికార పార్టీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పడమే సంకల్పయాత్ర ప్రధాన ఉద్దేశమని ధర్మాన తెలిపారు. దగాపడుతున్న అన్ని వర్గాల బాధలను ఆలకించేందుకే జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధిపై గొప్పలే..! రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి దారుణంగా ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల్లో ఏపీకి 15వ స్థానం రావడం సిగ్గుచేటన్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, చంద్రబాబు మాత్రం దేశంలో ఏపీ నంబర్ వన్గా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కీలక నిర్ణయాలపై ఏనాడూ ప్రతిపక్షంతో ప్రభుత్వం చర్చించలేదన్నారు. శాసనçసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇవ్వరని, ప్రతిపక్షం మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలిసిపోతాయోనని తెలుగుదేశం సర్కార్ నిరంతరం భయంతో బతుకుతోందన్నారు. గడచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం రహస్యంగా 2 వేల జీవోలను విడుదల చేసిందని, ఆ రహస్య జీవోలు ఎందుకు విడుదల చేశారో చెప్పగలరా? అని నిలదీశారు. ప్రజా సంకల్ప యాత్ర సజావుగా సాగాలని ఈ నెల 3న వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారని చెప్పారు. 6వ తేదీ ఉదయాన్నే ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు ఎన్నో.. కొత్త రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదని ధర్మాన అన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుదలతో పాటు ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు మూడు సార్లు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు.ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలోనే ఇంధన ధరలు పెరిగాయన్నారు. రేషన్ సరుకుల్లోని ఏడింటిలో ఆరింటికి కోత పెట్టిందని, కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లవుతున్నా రాజధాని నిర్మాణం జరగలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదని, కనీసం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని ధర్మాన దుయ్యబట్టారు. రాష్ట్ర అప్పు ప్రస్తుతం రూ.2.15 లక్షల కోట్లకు చేరిందని, కేవలం ఈ మూడేళ్లల్లోనే రూ.1.18 లక్షల కోట్లు అప్పుచేశారని ధర్మాన తెలిపారు. -
‘జగన్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్ర’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6 నుంచి తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘ప్రజా సంకల్పం’ యాత్రకు ఆటంకాలు కల్పించేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోందన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లే హక్కు జగన్కు ఉందన్నారు. ప్రజలను చైతన్యపరచడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని పేర్కొన్నారు. టీడీపీ మితిమీరిన వ్యవహారాలు చేస్తోందని, పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విపక్ష సభ్యులు మంత్రులుగా ఉన్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఇప్పటివరకు 2 వేల రహస్య జీవోలు విడుదల చేసిందని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘనలతో వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో మాట్లాడనీయకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత విపక్షానిదేనని అన్నారు. 6 నెలల పాటు జరిగే పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను, చట్టవ్యతిరేక చర్యలను ప్రజలకు వైఎస్ జగన్ వివరిస్తారని చెప్పారు. జననేత అందరినీ కలుస్తారని, పాదయాత్రకు అందరూ సహకరించాలని ధర్మాన ప్రసాదరావు కోరారు. జగన్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్రలు చేస్తోంది -
‘జగన్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్ర’
-
'వైఎస్ఆర్ కృషివల్లే గెలిచాం'
-
'వైఎస్ఆర్ కృషివల్లే గెలిచాం'
సాక్షి, శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లే వంశధార ట్రిబ్యునల్లో గెలిచామని వైఎస్ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు. వంశధారి నది ఒడ్డున కాట్రగడ్డ వద్ద వైఎస్ఆర్కు కృతజ్ఞతాపూర్వకంగా నేతలు నివాళులు అర్పించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా వైఎస్ఆర్ సీపీ అభిమానులు తరలివచ్చి తమ మద్ధతు తెలిపారు. వైఎస్ఆర్కు పేరు వస్తుందని నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తే పోరాటం చేస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి అన్నారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు వంశధార నీరు తెచ్చే మహత్తర కార్యక్రమం జరిపిస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒడిషా ప్రభుత్వంతో సమావేశమై ప్రాజెక్టు ముందుకు పోవడానికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.