తెలుగుదేశం పార్టీ వాళ్లు వేరే పార్టీ నుంచి కొనుక్కున్న లేదా దత్తత తీసుకున్న ఎమ్మెల్యేలకు రేపు రాబోయే ఎన్నికలలో సీట్లు ఇచ్చుకోడానికే అసెంబ్లీ సీట్లు పెంచుకోవాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. వాళ్లకు రాష్ట్ర భవిష్యత్తుతో సంబంధం లేదని, అందుకే కేంద్రం ఏం చెప్పినా దానికి హర్షామోదాలు చెబుతున్నారని అన్నారు.