ఉపాధ్యాయుల గైర్హాజరుపై విసుగెత్తిన విద్యార్థులు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. హైకోర్టుకు లేఖ రాశారు. పాఠశాలకు ఉపాధ్యాయులు రావటం లేదంటూ వారు ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు. విద్యార్థుల లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు.. ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.
Published Mon, Aug 17 2015 1:11 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement