ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిధిలోని 4 కోట్ల మంది చందాదారులకు సంతోషం కలిగించే కబురును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంటి కొనుగోలుకు వారు తమ రిటైర్మెంట్ నిధి నుంచి 90 శాతం నిధులను వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి పథకానికి సవరణలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలిపింది.