కాలేజీల్లో క్యాంపస్ నియామకాలకు బ్రేక్ పడింది! కిందటేడాది వరకు కాలేజీల ముందు క్యూ కట్టిన ఐటీ కంపెనీలన్నీ డీలా పడ్డాయి. అమెరికాలో రాజకీయ అనిశ్చితి.. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోవడం.. వంటి పరిణామాల నేపథ్యంలో దేశీయ, విదేశీ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్లు.. ద్వితీయ శ్రేణి కాలేజీల్లో ఈ ఏడాది నియామకాలు చేపట్టడం లేదు. ఇవేకాదు.. కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సైతం టాప్ కాలేజీల వరకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది 30 నుంచి 40 శాతం మేర క్యాంపస్ నియామకాలను తగ్గించుకుంటున్నట్లు కంపెనీలు సూచనప్రాయంగా వెల్లడిం చాయి.
Published Wed, Sep 14 2016 10:26 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement