ఒంటరిగా కనపడిన మహిళలపై కొన్నేళ్లుగా అత్యాచారాలు చేస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లకు బతికున్నంత కాలం జైలుశిక్ష అనుభవించాలంటూ కర్నూలు జడ్జి వెంకట జ్యోతిర్మయి సంచలన తీర్పు ఇచ్చారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్లయిన రవి, శ్రీనివాస్ గత కొంతకాలంగా సుమారు 20 మంది ఆడవాళ్లపై అత్యాచారాలు చేశారు. అయితే వీటిలో కొన్ని మాత్రమే పోలీసుల దృష్టికి వచ్చాయి. కొంతకాలం క్రితం కర్ణాటక నుంచి వచ్చిన ఓ మహిళను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినప్పుడు వారిని అరెస్టు చేసి విచారించగా విభ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు తాము అనేకమంది విద్యార్థినులు, మెడికోలపై కూడా అత్యాచారాలు చేసినట్లు వాళ్లు వెల్లడించారు. ఇద్దరూ అత్యాచారాలు, దోపిడీలలో ఆరితేరిన వాళ్లని తేలింది. ఇంతకాలం విచారించిన తర్వాత.. వాళ్లిద్దరూ జీవితకాలం జైలుశిక్ష అనుభవించాలని జడ్జి వెంకట జ్యోతిర్మయి తీర్పునిచ్చారు. కాగా.. నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు.
Published Wed, Apr 1 2015 7:20 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement