నాలుగు రోజుల విరామం అనంతరం ప్రారభమైన పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగతున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాల్సిందే అంటూ ప్రతిపక్షాలు లోక్ సభలో ఆందోళన చేపట్టడంతో బుధవారం సభ ప్రారంభమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇవాళ లోక్ సభకు హాజరయ్యారు. భవిష్యత్ కోసమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చర్చ నుంచి కాంగ్రెస్ తప్పించుకుంటోందని ఆయ విమర్శించారు.
Published Wed, Dec 14 2016 1:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement