అండర్ గ్రౌండ్ మెట్రో రైల్లో పేలుడు జరగడంతో లండన్ నగరం ఉలిక్కిపడింది. శుక్రవారం ఉదయం పశ్చిమ లండన్ పార్సన్స్ గ్రీన్ ట్యూబ్ స్టేషన్ వద్ద మెట్రోరైల్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి. పేలుడుతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇది ఉగ్రవాద దాడేనని పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగానే పరిగణిస్తున్నామని, ఈ ఏడాది బ్రిటన్లో పలు ఉగ్రవాద దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఉగ్రకోణంలోనే దర్యాప్తు చేపడుతున్నామని లండన్ పోలీసులు స్పష్టం చేశారు.
Published Fri, Sep 15 2017 2:26 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement