మీ చేతి వేళ్లే మీ భవిష్యత్తుగా మారబోతున్నాయని భీమ్ యాప్ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. మీ చేతి వేళ్లతో సరికొత్త భారత్ను ఆవిష్కరించడని ప్రజలకు పిలుపునిచ్చారు.. రాబోయే రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు మొబైల్స్, ఇంటర్నెట్ కూడా అవసరం లేదని, కేవలం వేలిముద్ర ద్వారానే లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. 'భీమ్ యాప్ సామాన్యమైనది కాదు. కేవలం ఐదు నిమిషాల్లో లావాదేవీలను పూర్తిచేస్తుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘన నివాళిగా ఈ యాప్ను ప్రారంభించాం. ఈ యాప్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆర్థిక నిపుణులుగా చేస్తుంది' అని మోదీ చెప్పారు.