ఉల్లిపాయకు మళ్లీ ఒళ్లు మండింది. ఒక్కసారిగా నెత్తికెక్కి కూర్చుంది. నిన్న మొన్నటి వరకు కూడా సామాన్యులెవ్వరికీ అందుబాటులో లేకుండా చెట్టెక్కి కూర్చున్న ఉల్లిపాయల ధరలు ఏదో.. కాస్త అదుపులోకి వస్తున్నాయని సంతోషించినంత సమయం పట్టలేదు. మళ్లీ అవి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాయి. మనకు ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు వస్తుంటే, అక్కడే కొండెక్కేశాయి. నాసిక్ మార్కెట్లో కిలో 70 రూపాయల చొప్పున ఉల్లిపాయలు అమ్ముతున్నారట. ముంబై మార్కెట్లోకి వచ్చిన ఈజిప్టు ఉల్లి కూడా ధరలపై ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఉల్లి కేజీ రూ.47కు లభిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం రూ.50-52 చొప్పున విక్రయిస్తున్నారు.
Published Thu, Sep 19 2013 4:22 PM | Last Updated on Wed, Mar 20 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement