టాలీవుడ్ను కుదుపుతున్న డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిపై సిట్ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటలపాటు సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. నలుగురు మహిళా అధికారుల బృందం ఆమెకు ప్రశ్నలను సంధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఐదుగంటలలోపే చార్మిపై సిట్ విచారణ ముగిసింది. చార్మి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న సిట్ అధికారులు.. మరోసారి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఉల్లాసంగా మీడియాకు చేతులు ఊపుతూ చార్మి వెళ్లిపోవడం గమనార్హం.
Published Wed, Jul 26 2017 5:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement