Drug trafficking
-
ఇదీ మన సంస్కృతి
డ్రగ్స్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి టీనేజర్స్ని బయటపడేసే ప్రయత్నానికి పయనీర్గా నిలిచింది హైదరాబాద్కి చెందిన పద్నాలుగేళ్ల అమ్మాయి.. డిజిటల్ సేఫ్టీ వెల్నెస్, డ్రగ్స్ ఫ్రీ– వెల్నెస్ ఆన్లైన్ కోర్స్లను డిజైన్ చేసి! వాటికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సర్టిఫికెట్స్నీ అందిస్తోంది! ఆమె పేరు సంస్కృతి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది.డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్ అడిక్షన్.. అందరినీ కలవరపరుస్తున్నా వాటికి వల్నరబుల్గా ఉంటోంది మాత్రం టీనేజర్సే అని గ్రహించింది సంస్కృతి.. తన వాలంటీరింగ్ అనుభవాల ద్వారా, తోటి పిల్లల ద్వారా. వాటి బారిన వాళ్లెందుకు, ఎలా పడుతున్నారు? ఆ ప్రభావానికిలోనై ఎలా ప్రవర్తిస్తున్నారు? అసలా ఊబిలో పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? అని ఆలోచించి, ఓ ప్రశ్నావళిని తయారుచేసి మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు, సామాజిక వేత్తల ముందుంచింది. వాళ్ల చర్చల సారాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో ‘డిజిటల్ సేఫ్టీ వెల్నెస్’, ‘డ్రగ్స్ ఫ్రీ వెల్నెస్’ అనే రెండు ఆన్లైన్ కోర్స్లను డిజైన్ చేసింది. ఫీడ్బ్యాక్ కోసం వంద మంది టీనేజ్ స్టూడెంట్స్కి ఆ కోర్స్ మాడ్యూల్స్ని చూపించింది. కంటెంట్ బాగుంది, కానీ చెప్పే విధానం ఆసక్తికరంగా లేదన్న అభిప్రాయాలు వచ్చాయి. సమీక్షించుకుంటే తనకూ అదొక కౌన్సెలింగ్లా అనిపించింది. టీనేజర్స్కెప్పుడూ ఎదుటివాళ్లు జడ్జ్ చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఆ జంకుతో మనసువిప్పి మాట్లాడరు. అంతేకాదు వద్దన్నదే చేయాలన్న కుతూహలమూ జాస్తే! ఈ కోణంలోనూ ఆలోచించి, మొత్తం కోర్స్ మాడ్యూల్స్ని నిజ జీవిత సంఘటనలకు అన్వయించి చాట్ ఫార్మాట్లో రీడిజైన్ చేసింది. వాటికి ఆన్లైన్ ΄్లాట్ఫామ్ కావాలి కాబట్టి అక్క ప్రకృతి సహాయంతో ‘క్రియేట్ ఎడ్యుటెక్’ అనే వెబ్సైట్ను స్టార్ట్చేసింది. ఈ మొత్తం ప్రక్రియకు ఎనిమిది నెలలు పట్టింది. ఆఫ్లైన్ లోనూ సేవలందించడానికి ‘ఎడిస్టిస్ ఫౌండేషన్ ’ అనే స్వచ్ఛంద సంస్థతో పనిచేస్తోంది సంస్కృతి. యాప్స్ అవసరం లేని ఈ కోర్సులకు మొబైల్ డేటా ఉంటే చాలు. వీటిని పూర్తి చేసినవారికి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు స్కూల్స్, కాలేజీల్లో ఈ కోర్సులు లాంచ్ అయ్యాయి. ఇప్పటివరకు పదివేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కోర్స్లను సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిచాలనేది సంస్కృతి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్స్కి మాత్రం నామమాత్రపు రుసుముంటుందని చెబుతోంది. టీనేజర్స్కి ‘రెసిస్టెన్స్.. రెజిలియెన్స్’ కల్పించడమే ఈ కోర్సుల ముఖ్య లక్ష్యం. డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్స్ అడిక్షన్.. దేన్నయినా అవగాహనతో తిరస్కరించడం మొదటిదైతే, ఆ అడిక్షన్ నుంచి విజయవంతంగా బయటకు వచ్చి, ఆరోగ్యకర జీవితాన్ని గడపడం రెండవది. ఆ వలలో పడకుండా ఉండటమే కాదు, అలాంటి వాతావరణాన్ని వ్యాపించకుండా చూసే బాధ్యతనూ ఎలా తీసుకోవాలో కూడా చేతన కల్పిస్తాయీ కోర్సులు అని చెబుతుంది సంస్కృతి.నేపథ్యం.. అంత చిన్న వయసులో ఆమె చేసిన ఇంత పెద్ద ప్రయత్నానికి ఆమె నేపథ్యం చాలా తోడ్పడింది. అందులో తల్లిదండ్రులు సుమతి(ఐజీ, ఇంటెలిజెన్స్, తెలంగాణ), శ్రీనాథ్ (బిజినెస్మన్), తాతయ్య తిరుపతి రెడ్డి, అక్క ప్రకృతిల పాత్ర ఎంతో ఉంది. ఎలాగంటే.. సుమతి సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నప్పుడు సైబర్ వరల్డ్లో జరుగుతున్న వాటి గురించి ఇంట్లో చర్చించేవారు. వాటికి చెవొగ్గేది సంస్కృతి. అవి అర్థమయ్యీ.. కాక ఆ చిన్నబుర్రలో కలవరం రేపేవి. సైబర్ సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కాస్తున్న పహారా, దానిమీద పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల గురించి అమ్మ ద్వారా తెలుసుకుంది. ఆ ఎన్జీవోల్లో వాలంటీరింగ్ మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎంతోమందిని కలిసింది, మాట్లాడింది. పెద్దవాళ్లు సమస్యల్ని ఎలా చూస్తున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారో పరిశీలించింది. అలా కూతురికి సామాజిక స్పృహను కలిగించి, సామాజిక బాధ్యతనూ తెలియజేసింది సుమతి.నాన్న.. శ్రీనాథ్.. ఐఐఎమ్ అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్. బిజినెస్లో వినూత్న ఆలోచనలను ఆయన ప్రోత్సహస్తున్న తీరు, అందిస్తున్న సపోర్ట్ను గమనించేది సంస్కృతి. కొత్త విషయాలు, సరికొత్త స్కిల్స్ గురించి ఆయన ఆన్ లైన్ లో టీచ్ చేస్తుంటే, కరెంట్ అఫైర్స్ను ‘వాట్–వై–హౌ’ పద్ధతిలో వివరిస్తుంటే శ్రద్ధగా వినేది. వాటన్నిటినీ తన వాలంటీరింగ్లో అమలుచేసేది. అలా తండ్రి ఆంట్రప్రెన్యూర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా ఒంటబట్టించుకుంది సంస్కృతి. తాతయ్య.. ఆంజనేయుడిని పరిచయం చేసి!తిరుపతిరెడ్డి ప్రతిరోజూ మననవరాలికి పురాణేతిహాసాల్లోని ఒక్కో పాత్రను పరిచయం చేసేవారు. ప్రతి పాత్రకు సహానుభూతి, సహాయం చేసే గుణం, జడ్జ్ చేయని తత్వాలను అద్దుతూ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని వర్ణించేవారు. అవన్నీ ఆ అమ్మాయి మనసులో ముద్రపడిపోయాయి. ఆ లక్షణాలతో పాటు, తెగువ, అచీవ్మెంట్, డెడికేషన్ కూడా ఉన్న ఆంజనేయుడు ఆమెకు ఫేవరిట్ అయ్యాడు. ఆ పాత్రలో తనను చూసుకోవడం మొదలుపెట్టింది. చదువుతో పాటు ఆర్ట్, మ్యూజిక్ వంటి కళల్లోనూ సంస్కృతి ప్రతిభ మెచ్చుకోదగ్గది. పోటీల్లో మనవరాలు ప్రైజ్ తెచ్చుకున్న ప్రతిసారి చాకోబార్తో ఆమెనుప్రోత్సహిస్తునే ‘గెలుపు కన్నా కూడా మన పనితో ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నామనే దాని మీద దృష్టి పెట్టాల’ని చెప్పేవారు. ఆ విలువనే తన ఫిలాసఫీగా మలచుకుంది సంస్కృతి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అక్క ప్రకృతి, సైకాలజీ స్టూడెంట్. చెల్లికి మంచి ఫ్రెండ్, గైడ్! సంస్కృతి ఈ కోర్స్లను డిజైన్ చేయడంలో ఆమె సహాయం ఎంతో ఉంది. టెన్త్ బర్త్డేకి అమ్మ, నాన్న ఇచ్చిన గిఫ్ట్నూ సంస్కృతి ఓ టర్నింగ్ పాయింట్గా చెబుతుంది. అదేంటంటే..ఒక నోట్ బుక్లో అమ్మ, నాన్న ‘నీ జీవితం ఈ ఎమ్టీ–బుక్ లాంటిది. నీ గురించి ఎవరూ ఏదీ రాయరు. నువ్వేం నేర్చుకుంటున్నావ్, నీకోసమే కాకుండా, ఇతరుల కోసమూ నువ్వేం చేయగలుగుతున్నావ్ అన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికినప్పుడల్లా ఒక్కో పేజీ ఫిల్ చేయాలి. అలా ఈ పుస్తకం నీ విశిష్ట వ్యక్తిత్వంతో నిండిపోవాలని ఆశిస్తూ అమ్మ.. నాన్న!’ అని రాసిన నోట్. ఈ ఆన్లైన్ కోర్స్ల డిజైన్ ఆ పుస్తకంలోని మొదటి పుటకు శుభారంభమని చెప్పపచ్చు. ఇలాంటి ఇంకెన్నో ప్రయత్నాలతో ముందుకు సాగాలనుకుంటున్న ఆ చిరంజీవికి ఆల్ ద వెరీ బెస్ట్! వై, వై నాట్, వాట్, హూ, వేర్, వెన్ లాంటి ఇంగ్లిష్ డబ్ల్యూసే నా బెస్ట్ ఫ్రెండ్స్. వాటితోనే నా లెర్నింగ్, గ్రోత్, అచీవ్మెంట్! ఏబీసీడీఈ.. అంటే అంబీషస్, బోల్డ్, క్రియేటివ్ అండ్ క్యూరియస్, డిటర్మైండ్, ఎంపథిటిక్గా నన్ను నేను డిస్క్రైబ్ చేసుకుంటాను. శరీర నిర్మాణంలో తేడాలుండొచ్చు కానీ, చేసే పనికి, ప్రయత్నానికి బాయ్స్, గర్ల్స్ అనే తేడా ఉండదని, పదిమందికి మేలు చేయగలగడమే నిజమైన అచీవ్మెంట్ అని చె΄్తారు మా పెద్దవాళ్లు. ఆ స్ఫూర్తితోనే నేనీ కోర్స్లను డిజైన్ చేశాను!’– సరస్వతి రమ, ఫొటోలు @ నోముల రాజేష్రెడ్డి -
మరణశిక్ష నుంచి ఎట్టకేలకు విముక్తి
మనీలా: డ్రగ్స్ తరలించారన్న ఆరోపణలపై అరెస్టయి గత 15 సంవత్సరాలుగా జైళ్లో మగ్గిపోతున్న అమాయక ఫిలిప్పీన్స్ మహిళకు ఎట్టకేలకు ఇండోనేసియా జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై ఆమె జీవితకాల జైలు శిక్షను ఇండోనేసియాకు బదులు సొంతదేశం ఫిలిప్పీన్స్లోని మహిళల కారాగా రంలో అనుభవించనుంది. ఇండోనేసియా విధించిన శిక్ష ప్రకారం 2015 ఏడాదిలోనే ఫిలిప్పీన్స్ పోలీసుల తుపాకీ గుళ్లకు బలికావాల్సిన మేరీ జేన్ వెలోసో అనూహ్యంగా ఆ దారుణ శిక్ష అమలు నుంచి తప్పించుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని త్వరలో దేశాధ్యక్షుడిని వేడుకుంటానని 39 ఏళ్ల మేరీ చెప్పారు. బుధవారం ఉదయం ఆమె ఇండోనేసియా నుంచి బయల్దేరి స్వదేశం ఫిలిప్పీన్స్లోని మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ తల్లి రాకతో ఇద్దరు కుమారులు, మేరీ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎనిమిది మందిపై బుల్లెట్ల వర్షం2010లో బతుకుదెరువు కోసం పనిమనిషిగా ఇండోనేసియాలో అడుగుపెట్టిన ఆమెను ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అరెస్ట్చేశారు. వెంట తెచ్చిన సూట్కేసులో 2.6 కేజీల నిషేధిత హెరాయిన్ మాదకద్రవ్యం ఉండటంతో ఆమెపై కఠిన డ్రగ్స్ ట్రాఫికింగ్ చట్టాలు మోపి మరణశిక్ష విధించారు. ఆ సూట్కేసుతో తనకేం సంబంధం లేదని, ఇండోనేసియాలో ఇంటి పనిమనిషిగా పని కుదిర్చిన ఏజెంట్ మారియా క్రిస్టినా సెర్గీ ఆ సూట్కేసు ఇచ్చాడని, అందులో ఏముందో తనకు నిజంగా తెలీ దని ఆమె ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. ఐదే ళ్ల తర్వాత షూట్ చేసి చంపేయాలని తీర్పు వెలువడింది. అక్రమంగా డ్రగ్స్ తెచ్చారంటూ మేరీసహా ఆస్ట్రే లియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఘనా, నైజీరియాలకు చెందిన మొత్తం తొమ్మిది మందిని 2015 ఏడాదిలో ఒక ద్వీపకారాగారానికి తీసుకెళ్లారు. మేరీ తప్ప మిగతా ఎనిమిది మందిపై ఫైరింగ్ స్క్వాడ్ పోలీసులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించి చంపేశారు. ఈమెను కూడా చంపేసేవారే. కానీ ఈమెను ఇండోనేసియాకు పంపిన ఏజెంట్ సెర్గీ కేవలం రెండ్రోజుల ముందు ఫిలిప్పీన్స్లో అరెస్టవడం, తానే ఆమెకు ఆ సూట్కేసు ఇచ్చి పంపాన ని ఒప్పుకోవడంతో ఈమె శిక్ష అమలు ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. అయితే ఎవరు తెచ్చినా డ్రగ్స్ తమ భూభాగానికి తేవడం మాత్రం నేరమే కాబట్టి ఈమెను నిర్దోషిగా వదిలేది లేదని ఇండోనేసియా కరాఖండీగా చెప్పింది. దీంతో మేరీ విడుదలకు ఫిలిప్పీన్స్లో పెద్ద ఉద్యమమే మొదలైంది. చివరకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకుంది. మేరీ మిగతా శిక్షాకాలం సొంత దేశంలో అనుభవించేలా డీల్ కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఆమెను ఇండోనేసియా బుధవారం వదిలేసింది. -
భార్యాభర్తల డ్రగ్స్ దందా!
సాక్షి, సిటీబ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి మాదకద్రవ్యం ఏంఫెటమైన్తో నగరానికి వచ్చి, విక్రయానికి ప్రయత్నించినా భార్యా భర్తల్ని వెస్ట్జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షలు విలువైన 254 గ్రాముల డ్రగ్, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శనివారం వెల్లడించారు. అసోంలోని లాల్పానీ గ్రామానికి చెందిన ఆతిఫ్ అస్లం ఖాన్ గతంలో నగరానికి వలసవచ్చి నిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. దాదాపు ఐదారేళ్లు ఇక్కడ ఉండటంతో ఇతడిలా వచి్చ, సిటీలో నివసిస్తున్న పలువురు అసోం వారితో పరిచయం ఏర్పడింది. అసోంలోని మొరాంగా గ్రామానికి చెందిన సుభానీ బేగంను వివాహం చేసుకున్న అస్లం ఖాన్ స్వస్థలానికి వలసవెళ్లాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించాడు. అసోంలో తయారయ్యే మాదకద్రవ్యం ఏంఫెటమైన్ను ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది వినియోగిస్తూ ఉంటారు. దీంతో ఆ డ్రగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్పెడ్లర్ ప్రణోయ్ దాస్కు రూ.2 లక్షలు చెల్లించిన అస్లం ఖాన్ 300 గ్రాముల ఏంఫెటమైన్ ఖరీదు చేశాడు. భార్య సుభానీ బేగంతో కలిసి మాదకద్రవ్యం తీసుకుని అస్లం ఖాన్ గత నెల్లో రైలు మార్గంలో నగరానికి చేరుకున్నాడు. బేగంపేటలోని ప్రకాష్నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఓ బైక్ ఖరీదు చేశాడు. దీనిపై సంచరిస్తూ నగరంలో ఉన్న అసోం వాసులకు ఏంఫెటమైన్ విక్రయించడం మొదలెట్టాడు. డిమాండ్ను బట్టి రేటు నిర్ధారిస్తూ తమ వద్ద ఉన్న 300 గ్రాములు అమ్మడం ద్వారా రూ.25 లక్షలు సంపాదించాలని, ఆ మొత్తంతో స్వస్థలానికి తిరిగి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఇప్పటి వరకు 11 మంది అసోం వాసులకు 46 గ్రాములు విక్రయించారు. వీరి దందాపై సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇ.జంగయ్య నేతృత్వంలో ఎస్సై జి.నవీన్ తమ బృందంతో వలపన్నారు. శనివారం ఇద్దరితో పాటు 11 మంది వినియోగదారులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
అండమాన్లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
కెనడాలో డ్రగ్స్ సూపర్ల్యాబ్ గుట్టురట్టు
వాంకోవర్: కెనడాలో మాదక ద్రవ్యాల తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 485 మిలియన్ డాలర్ల (రూ.4,076 కోట్లు) కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయోగశాలలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త గగన్ప్రీత్ రంధవాను అరెస్టు చేశారు. కెనడాలో బ్రిటిష్ కొలంబియాలోని కామ్లూప్స్కు 50 కిలోమీటర్ల దూరంలో ఫాల్క్ ల్యాండ్ అనే గ్రామీణ ప్రాంతంలో ఈ సూపర్ ల్యాబ్ ఏర్పాటుచేశారు. ఇక్కడ ఫెంటానైల్, మెథ్, కొకైన్, కన్నబీస్ తదితర డ్రగ్స్ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. సూపర్ ల్యాబ్ గురించి సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంట్ పోలీసులు దాడి చేశారు. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అత్యాధునికంగా ఉన్న ల్యాబ్లో నిషేధిత మాదక ద్రవ్యాలు తయారవుతుండడం చూసి అవాక్కయ్యారు. ఈ దాడిలో 500 కిలోలకుపైగా డ్రగ్స్ లభించాయి. అంతేకాదు కొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలు సైతం లభ్యమయ్యాయి. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ల్యాబ్ నిర్వహణలో, డ్రగ్స్ దందాలో గగన్ప్రీత్ రంధవా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. -
మస్తాన్ సాయి అరెస్ట్తో కదులుతున్న డ్రగ్స్ డొంక
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పెడ్లర్ రావి మస్తాన్ సాయి కేసులో సంచనల విషయాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి అరెస్ట్తో డ్రగ్స్ డొంక కదులుతోంది. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. తాజాగా మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం బయటకొచ్చింది. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. అమ్మాయితో మస్తాన్సాయి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసినట్లు తేలింది. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకోగా.. డ్రగ్స్ కవాలి, తీసుకురావలిన వాట్పాప్లో ప్రీతి చాటింగ్ చేసినట్లు వెల్లడైంది.కాగా గుంటూరులో సోమవారం రావి మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అతడికి హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి సెల్ ఫోన్లో భారీగా పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు సమాచారం. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహనరావు గుంటూరులోని మస్తానయ్య దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు అడ్డుపెట్టుని మస్తాన్ సాయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. కాగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అప్పట్లో హైదరాబాద్ పోలీసులు కొందరిని అరెస్టు చేయగా..వారిలో వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకుడు కూడా ఉన్నారు. వారితో కలిసే మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారాలు నడిపేవారని తేలింది. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలోనూ మస్తాన్సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్సాయి పేరు వెలుగులోకి వచ్చింది. -
మెక్సికో డ్రగ్ లార్డ్ అరెస్ట్
వాషింగ్టన్: మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారంతో వేలకోట్ల రూపాయల నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలీకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్చాపో కుమారుడు జోక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(38)నూ పోలీసులు అరెస్ట్చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్కోసం అమెరికా ప్రయతి్నస్తోంది. అతని జాడ చెప్తే రూ.125 కోట్ల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. ‘అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదకద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది’ అని ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్దం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యంత హింసాత్మక, శక్తివంత ‘ సినోలా కార్టెల్’ మాదకద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రస్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీనిని ఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్ను విచ్చలవిడిగా అమ్మడం మొదలెట్టారు. వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్డో గుజ్మాన్ లోయెరా (ఎల్చాపో)ను 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతోంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి హేయమైన నేరాలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం. -
ఏపీ పరువు తీసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : తెలంగాణ ప్రభుత్వంతో చర్చల పేరుతో వీసమెత్తు ప్రయోజనాన్ని కూడా సాధించలేకపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో ఆంధ్రా ప్రజల పరువు తీశారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం సంగతి అటుంచితే అసలు రాష్ట్రంలో పెద్దగా లేని డ్రగ్స్.. ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నట్లు ఒప్పుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు బృందం తెలంగాణ రాష్ట్రంతో చర్చించేందుకు వెళ్లిన ఉద్ధేశం ఏమిటి? చివరికి ఏం సాధించారు? వంటి ప్రశ్నలు సాధారణ ప్రజలు నుంచి వస్తున్నాయి. ఒక్క విభజన సమస్య గురించి కూడా గట్టిగా మాట్లాడకుండా డ్రగ్స్ గురించి చర్చించడం, హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్ దందా అంతటికీ ఏపీయే మూలమని స్వయంగా అంగీకరించడం విడ్డూరం. టీడీపీ రెండు రోజుల నుంచి రెండు రాష్ట్రాల మధ్య చర్చలు పేరుతో నానా హడావుడి చేసింది రాష్ట్రం పరువు తీసేందుకేనా అనే చర్చ మొదలైంది. బాబు గురించి అంత బిల్డప్ ఇచ్చింది ఇందుకేనా?విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు చొరవ తీసుకని తన శిష్యుడిగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చర్చలకు వెళుతున్నారని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని టీడీపీ శ్రేణులు ఊదరగొట్టాయి. ఎల్లో మీడియా అయితే చంద్రబాబు దార్శనికత, సుదీర్ఘ అనుభవంతో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ బీభత్సమైన బిల్డప్ ఇచ్చింది. కానీ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నెలకొన్న ప్రధాన సమస్యల గురించి లోతుగా చర్చించలేదు. హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్పై, అక్కడ డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి ఏపీలో గంజాయి ఉత్పత్తి అవడమే కారణమని చర్చించడం విస్మయ పరుస్తోంది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉమ్మడి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఒప్పుకోవడం దారుణం అని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేరుగా ఏపీ పేరు చెప్పకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పగా, టీడీపీ మంత్రి అనగాని మాత్రం ఏపీలో డ్రగ్స్ ఉత్పత్తి అయి హైదరాబాద్కి వస్తున్నాయని.. తమ రాష్ట్రంలో 8వ తరగతి పిల్లల స్కూల్ బ్యాగులో గంజాయి దొరుకుతోందని చెప్పి రాష్ట్రం పరువును తెలంగాణ రాష్ట్ర బజారులో నిలబెట్టారు. హైదరాబాద్ డ్రగ్ సంస్కృతికి ఏపీకి సంబంధం ఏమిటి? హైదరాబాద్ డ్రగ్ కల్చర్కి, ఏపీలో అక్కడక్కడా దొరుకుతున్న గంజాయికి సంబంధమే లేదని అనేకసార్లు తేటతెల్లమైంది. హైదరాబాద్లో కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ విరివిగా దొరుకుతాయి. ఏపీలో వాటి జాడే లేదు. కొకైన్, హెరాయిన్ వంటి విదేశాల నుంచి దిగుమతయ్యే డ్రగ్స్ కూడా ఏపీ నుంచే వస్తున్నాయని స్వయంగా మంత్రి చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో గంజాయి పెరిగిందని ఎప్పటి నుంచో చేస్తున్న దుష్ప్రచారాన్నే పక్క రాష్ట్రంతో చర్చల్లో కూడా వల్లె వేయడం రాజకీయ స్వప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో గంజాయి ఉందని చెప్పడం.. పక్క రాష్ట్రంలోని వేదికపై అంగీకరించడం ఆత్మహత్యాసదృశంగా మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మూసీలో కలిపేసిన చంద్రబాబు చర్చల ద్వారా ఏపీకి సంబంధించి ఎటువంటి సానుకూలత సాధించలేకపోగా, మన గౌరవానికి భంగం కలిగించేలా చంద్రబాబు, ఆయన మంత్రుల బృందం వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఏపీలోని పోర్టులు, టీటీడీ ఆస్తుల్లో వాటా ఇవ్వాలని, పోలవరం విలీన గ్రామాలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ పెట్టిన డిమాండ్లపైనా నోరు మెదపక పోవడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్లేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రేవంత్రెడ్డి, చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ చర్చలు జరిగినట్లు ఎక్కడా కనిపించలేదంటున్నారు. అందులోనూ రేవంత్ పైచేయి సాధించి ఏపీ నెత్తిన డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారనే అపవాదు మోపారు. దీనికి అంగీకరించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్ మూసీ నదిలో కలిపేశారనే సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.గంజాయి దందాపై గత సర్కారు ఉక్కుపాదంరాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలీసు యంత్రాంగాన్ని విస్పష్టంగా ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ అనే కార్యక్రమం ద్వారా గంజాయి సాగు వల్ల అనర్థాలపై ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించారు. ఆ తర్వాత శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పాంత్రాన్ని జీయో మ్యాపింగ్ చేశారు. ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. మొత్తం 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతోపాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. గిరిజనులకు ప్రత్నామ్నాయం చూపింది. రూ.144కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. వివిధ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. కాగా, గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా కొనసాగింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా గంజాయిసిండికేట్ను నిర్వహించారు. -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
Narcotics Control Bureau: తమిళ నిర్మాత సూత్రధారిగా డ్రగ్స్ రాకెట్
న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్పై విచారణ చేపట్టినట్లు ఎన్సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్దారాపూర్లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది. -
జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
కట్టు తప్పితే కఠిన చర్యలే !
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్ట మైన హెచ్చరికలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏమాత్రం నిర్లిప్తత, నిర్లక్ష్యంగా ఉండరాదని, మైండ్సెట్ మార్చుకోవా లని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో నామమాత్రంగానే డబ్బు, మద్యం జప్తు చేస్తున్నారని, చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ ప్రధానమార్గంగా మారిందని, గోవా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్కు పెద్దఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతుంటే ఎందుకు పట్టుకోవడం లేద ని పోలీస్శాఖను ప్రశ్నించింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్కుమార్ నేతృత్వంలో ఎలక్ష న్ కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన బృందం బుధవారం రెండోరోజు నగరంలోని ఓ హోటల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల కలె క్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సమీక్ష నిర్వహించింది. గుజరాత్, మహారాష్ట్రలో టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుపడితే, ఇక్కడ మాత్రం 10, 20 గ్రా ము లే పట్టు బడడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. మాఫియాతో కుమ్మక్కయ్యారా? అని సూటి గా ఓ ఎస్పీని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పై ని ఘా ఉంచి జప్తు చేస్తామని ఆ ఎస్పీ వివరణ ఇచ్చు కున్నారు. ఓటర్లకు బంగారం, వెండి, వస్త్రాలు వంటి కానుకలు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలున్నా, ఎందుకు జప్తు కావడం లేదని ప్రశ్నించింది. సిద్దిపేటలో నగదు దొరకలేదా ? గత శాసనసభ సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి నగదు జప్తు చేయకపోవడం పట్ల ఎన్నికల సంఘం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల వారీగా గత ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం, ఇతర కానుకలను పరిశీలించి పెదవి విరిచింది. ఇటీవల జరిగిన కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలి్చతే దాదాపు ఐదారు రేట్లు అధికంగా నగదు జప్తు చేశారని, త్వరలో జరి గే శాసనసభ ఎన్నికల్లో సైతం అలాంటి ఫలితాలు ఆశిస్తున్నామని స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ ఎందుకు పట్టుకోవడం లేదని ఆబ్కారీ, పోలీస్శాఖను ప్రశ్నించింది. ఇకపై డబ్బులు, మద్యం, ఇతర కానుకల జప్తుపై ప్రతివారం నివేదిక సమర్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో గతంలో జప్తు చేసిన నగదు, మద్యం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో లోపాలుంటే కలెక్టర్లదే బాధ్యత బుధవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నా, ఓట్లు గల్లంతైనట్టు ఫిర్యాదులొచి్చనా కలెక్టర్లదే బాధ్యత అని, తీవ్రమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది. శేరిలింగంపల్లిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నట్టు వచి్చన ఫిర్యాదుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏం చర్యలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ప్రశ్నించింది. -
మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్మెంట్లోనే పోలీసులకు చిక్కారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు -
20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్(టీజేపీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 గ్రాముల హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని జులై 26(బుధవారం)ఆగ్నేయాసియా నగరమైన చాంగీ జిల్లా జైలులో ఉరితీయనున్నట్లు తెలిపింది. అదే విధంగా 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న (శుక్రవారం) ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు పేర్కొంది. 30 గ్రాముల హెరాయిన్ను అక్రమంగా తరలించిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారని.. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ 20 ఏళ్లలో తొలిసారి ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు గత 20 ఏళ్లలో సింగపూర్లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారి 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళా హెయిర్ స్టైలిష్ యెన్ మే వుయెన్కు ఉరిశిక్ష పడినట్లు టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. ఇదిలా ఉండగా సింగపూర్లో హత్యలు, కిడ్నాప్ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. అత్యంత కఠిన చట్టాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సింగపూర్లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసే వారికి మరణశిక్ష విధిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును సింగపూర్ నిలిపి వేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది. -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
ఆర్యన్ఖాన్ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్ఖాన్ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
డ్రగ్స్ నేరగాళ్లకు జైలే గతి
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వాములైన బడా నేరగాళ్లను రాబోయే రెండేళ్లలో కచ్చితంగా జైలుకు తరలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. డ్రగ్స్ దందాలో సంపాదించిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పాపపు సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సమస్యపై బుధవారం లోక్సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అమిత్ షా మాట్లాడారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవారిపై కేసుల నమోదు అధికారాన్ని బీఎస్ఎఫ్, సీమా సురక్షాబల్, అస్సాం రైఫిల్స్కు కట్టబెట్టామని అమిత్ షా గుర్తుచేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. 2014 నుంచి 2022 వరకూ రూ.97,000 కోట్ల విలువైన డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 2006 నుంచి 2013 దాకా రూ.23,000 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్లో హేల్స్కు టీమ్లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్లో కీలక ఇన్నింగ్స్లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్ను టీమ్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్లతో జరిగిన మ్యాచ్లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విభాగం అధికారుల విచారణ సమయంలో ఓ నిందితుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. వివరాలు.. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చోళవరంలో చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాయప్పరాజు అనే వ్యక్తిని ఆ విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 8 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అయపాక్కంలోని ప్రధాన కార్యాలయానికి తరలించి శుక్రవారం రాత్రంతా ప్రశ్నించారు. శనివారం వేకువ జామున రాయప్పరాజు హఠాత్తుగా మూడో అంతస్తులోని విచారణ గది నుంచి బయటకు పరుగులు తీసి అనంతరం కిందకి దూకేశాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న రాయప్పరాజును అక్కడి సిబ్బంది ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో రాయప్ప రాజు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరుముల్లైవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు తెలంగాణ రాష్ట్రం రామకృష్ణాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబం పరువు పోతుందనే వేదనతో రాయప్పరాజు ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ, చెన్నై నుంచి మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. తాను మాదక ద్రవ్యాలతో పట్టుబడడంతో కుటుంబం తీవ్ర అవమానం పాలవుతుందనే వేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇతని వద్ద పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు విమానాశ్రయంలో సీజ్ చేసినవి కావడం గమనార్హం. అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరో సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఇతని ద్వారా బయటకు పంపిస్తున్నట్టు తేలింది. దీంతో ఈ కేసును మరింత సమగ్రంగా విచారించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మృతుడు 48 కేజీల మేరకు సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
రూ.120 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్లోని జామ్నగర్లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్ను పట్టుకున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్నగర్కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. -
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
హైదరాబాద్లొ మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా తరుచుగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హఫీజ్పేట్ గోకుల్ ఫ్లాట్స్లో నిందితుడు గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10గ్రాముల డ్రగ్స్, రూ55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరబిక్ ట్యూటర్ అష్రఫ్ బేగ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 గ్రాముల కొకైన్, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఫోన్స్ను సీజ్ చేశారు. -
అమిత్షా చూస్తుండగా.. 30,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
చండీగఢ్: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 30వేల కిలోల డ్రగ్స్ను తగలబెట్టారు అధికారులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. పంజాబ్ చండీగఢ్లో డ్రగ్ ట్రాఫికింగ్, నేషనల్ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమయంలో అధికారులు ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో మొత్తం 30వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 75వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేయాలని ప్రతిజ్ఞ చేశామని అమిత్షా వెల్లడించారు. ఇప్పటికే 81వేల కిలోల డ్రగ్స్ను తగలబెట్టామని వెల్లడించారు. ఆగస్టు 15నాటికి లక్ష కిలోల డ్రగ్స్ ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. Visuals of incineration of seized drugs by the NCB. On PM @narendramodi Ji’s call to celebrate #AmritMahotsav, we took a pledge to destroy about 75000 kg of drugs. Glad to share that till today we have already incinerated 82000 kg and will reach the 1 lakh kg mark by 15th Aug. pic.twitter.com/zx1anMJrV4 — Amit Shah (@AmitShah) July 30, 2022 డ్రగ్స్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జూన్ 1న మొదలుపెట్టింది. జులై 29నాటికి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల డ్రగ్స్ను తగలబెట్టింది. తాజాగా అమిత్షా కార్యక్రమంలో మరో 30వేల కిలోల డ్రగ్స్ను నిర్వీర్యం చేసింది. చదవండి: ఐఐటీ మద్రాస్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు! 300 మంది ఫోటోలతో విచారణ -
పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు!
శంషాబాద్: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్ రూపంలో ప్యాక్ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్న విదేశీయులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సుల్స్ రికవరీ చేశామని కస్టమ్స్ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్ను పారదర్శకంగా ఉండే టేప్తో 108 క్యాప్సుల్స్గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్గా మార్చుకుని అతడికి భారత్ రావడానికి టూరిస్ట్ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్ క్యాప్సుల్స్ను మింగించి ఎథిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ప్రయాణికుల జాబితా వడపోసి.. కస్టమ్స్ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్ ప్రొఫైలింగ్ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్ క్యాప్సుల్స్ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ డ్రగ్స్ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు
Hero Tovino Finally Open Up On Aryan Khan Drug Case: గతేడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ సంచలనం సృష్టించింది. 2021 అక్టోబర్ 3న క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టయిన ఆర్యన్ అక్టోబర్ 30న బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ కేసు బాలీవుడ్తో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ కేసులో ఎంతో బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు ఆర్యన్, షారుక్లకు మద్ధతుగా నిలిచారు. చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత కానీ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన ఏ ఒక్కరు ఈ కేసుపై నోరు విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్యన్ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగాక, ఈకేసు గురించి సెలబ్రెటీలతో పాటు ప్రజలు కూడా మరిచిపోయారు. ఈ తరుణంగా సౌత్ హీరో టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. దీంతో ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఏం జరిగిందంటే.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఇటీవల నటించిన మిన్నాళ్ మురళి చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. చదవండి: సుధీర్ ఎంగేజ్మెంట్!, ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేంటి.. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో టోవినో థామస్ ఆర్యన్ డ్రగ్ కేసుపై స్పందించాడు. ఈ సందర్భంగా టోవినో మాట్లాడుతూ.. ఈ కేసు సమంయలో షారుక్ ఖాన్ పేరును డ్యామేజ్ చేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని, దీనిని కొంతమంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ కేసులో ముంబై హైకోర్టు ఆర్యన్కు మూడు సార్లు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకంగా బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ కుమారుడికి బెయిల్ దొరక్కపోవడం ఏంటని అంతా షాక్కు గురయ్యారు. అంటే దీని వెనక ఎదైన కుట్ర జరుగుతుందా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. -
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరాఫరా చేస్తున్న ఓ నైజీరియన్తోపాటు 12 మందిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే డ్రగ్స్ సేవిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ బ్లాట్లతో పాటు గంజాయి, హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్, కార్ఖానా, సికింద్రాబాద్లో ముఠాగా ఏర్పడి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. చదవండి: సీబీఐ మరో కట్టుకథ: చంపుతుంటే.. పడుకున్నాడు! -
పాకెట్ మనీ కోసం.. మరో లోకంలో విహరించాలని..
సాక్షి, హైదరాబాద్: ‘సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన సాయికుమార్, ప్రతాప్రెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. పాకెట్ మనీ కోసం గంజాయి వ్యాపారంలోకి దిగారు. ఒడిశా రాష్ట్రంలోని సీలేరు ప్రాంతంలో మంగళ్ అనే వ్యక్తి నుంచి ఎండు గంజాయిని కిలో రూ.10 వేలకు కొనుగోలు చేసి బస్సుల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. శివారు ప్రాంతంలో వాటిని 5, 10 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి.. రూ.150– 200కు విక్రయిస్తున్నారు’ ‘దుస్తుల వ్యాపారం పేరిట మార్క్ ఒవాలోబీ నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు. బిజినెస్ వీసా గడువు ముగిశాక.. ముంబై నుంచి హైదరాబాద్కు మకాం మార్చాడు. ఢిల్లీ నుంచి కొకైన్ను తీసుకొచ్చి నగరంలో విక్రయించడం మొదలుపెట్టాడు. పలుమార్లు జైలుకెళ్లాడు. నేరెడ్మట్కు చెందిన బీకామ్ ఫైనలియర్ విద్యార్థి హర్షవర్ధన్ స్నేహితుడైన అభిషేక్ సింగ్ ఓ చోరీ కేసులో జైలుకెళ్లాడు. అక్కడ మార్క్ ఒవాలోబీతో ఇతగాడికి పరిచయం ఏర్పడింది. బయటికొచ్చాక ఈ ముగ్గురు, మరికొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి.. డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించారు’ .. ఇలా ఒకటి రెండు సంఘటనల్లోనే కాదు డ్రగ్స్ వినియోగిస్తూ.. విక్రయిస్తూ ఎందరో విద్యార్థులు పట్టుబడుతున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన విద్యార్థులు.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఫ్యాషన్గా మొదలు పెట్టి డ్రగ్స్ బానిసలుగా మారిపోతున్నారు. జైలులో పెడ్లర్లతో పరిచయాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో డ్రగ్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరఫరాదారులే కాదు వినియోగదారులపై కూడా కేసులు నమో దు చేస్తూ అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మూలాలను అంతమొందిస్తే తప్ప డ్రగ్స్ను అరికట్టలేమని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. కేవలం సరఫరాదారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమాండ్కు తరలించి జైలుకెళ్లిన నిందితులలో సత్ప్రవర్తన రాకపోగా.. జైలులో కొత్త పరిచయాలు ఏర్పరుచుకొని బయటికొచ్చాక సరికొత్త ఎత్తుగడలతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగుచూడటమే ఇందుకు ఉదాహరణ. గంజాయి రవాణాలు రౌడీషీటర్లు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు కూడా దిగారు. ప్యాకెట్కు రూ.150– 200.. ►కొకైన్ బంగారం కంటే చాలా ఖరీదైనది, దీన్ని అందరూ కొనుగోలు చేయలేరు. దీంతో గంజాయి విక్రయం, వినియోగం పెరిగింది. కిలో రూ.15– 20 వేలకు కొనుగోలు చేసి.. శివారు ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మారుస్తున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ప్యాకెట్ రూ.150– 200కు దొరకుతుండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసే వీలుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ►ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత సొంతూర్లకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాగులలో గంజాయిని తీసుకొస్తున్నారు. తాము సేవించడమే కాకుండా తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి 5, 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన లాబా కుమార్ ప్రధాన్, బాపిలను ఇటీవల కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ►ఇదే తరహాలో ఆదిలాబాద్ నుంచి కిలో గంజాయి రూ.15 వేలకు కొనుగోలు చేసి నగర శివార్లలో ప్యాకెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నట్లు జవహర్నగర్కు చెందిన బొడ్డు అభిషేక్, గాజుల పరమేష్, వడ్డారం ప్రవీణ్, ఆర్ శివలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. -
Amazon: ఎంతకి తెగించార్రా ! ఇంత పని చేస్తారా ?
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల విక్రయ లావాదేవీలకు తమ ప్లాట్ఫాం వేదికగా మారిందన్న ఆరోపణలపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా అంతర్గతంగా విచారణ చేపట్టింది. కేసు సత్వరం పరిష్కారమయ్యేలా అటు దర్యాప్తు సంస్థలకు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లోని భిండ్ పోలీసులు ఆన్లైన్ మారిజువానా విక్రయ రాకెట్ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు 20 కిలోల మారిజువానాను స్వాధీనం చేసుకున్నారు. ఈ–కామర్స్ సంస్థ ద్వారా నిందితులు ఈ రాకెట్ నిర్వహించారని, వచ్చిన లాభాల్లో సంస్థకు మూడింట రెండొంతుల లాభాలు అందినట్టు తెలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల లావాదేవీలకు వేదికగా నిల్చినందుకు గాను సదరు ఈ–కామర్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు. ఎన్సీబీ ఎంక్వైరీకి డిమాండ్ ఈ కామర్స్ వేదికగా నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా కావడమనేది తీవ్ర నేరమని, మధ్యప్రదేశ్ పోలీసులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరపాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది. అమెజాన్ సీనియర్ మేనేజ్మెంట్ను కూడా అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. -
ఫోటో ఫ్రేమ్స్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్సిళ్లు
-
ఆన్లైన్ వేదికగా వినతులు.. భారత సంతతి వ్యక్తికి ఆగిన ఉరిశిక్ష
సింగపూర్: సింగపూర్లోకి అక్రమంగా మాదకద్రవ్యాలను తెస్తున్నాడనే అభియోగాలతో ఉరిశిక్ష పడిన భారతీయ మూలాలున్న మలేసియన్ నాగేంద్రన్ కె.ధర్మలింగం ఉరిశిక్ష అమలు ఎట్టకేలకు ఆగింది. మానసిక దివ్యాంగుడైన 33 ఏళ్ల నాగేంద్రన్కు విధించిన కఠినశిక్షను తగ్గించాలంటూ ఆన్లైన్ వేదికగా వేలాది మంది మానవహక్కుల కార్యకర్తలు, సంఘాల నుంచి వినతులు వెల్లువెత్తడంతో సింగపూర్ తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేసింది. దాంతో అక్కడి జైలులో నవంబర్ పదో తేదీన అమలుచేయాల్సిన ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా ఆగింది. శిక్ష తగ్గింపు, రద్దుకు సంబంధించిన ఒక పిటిషన్ను మంగళవారం ఆన్లైన్లో విచారించాల్సి ఉన్నందున శిక్ష అమలును ప్రస్తుతం ఆపాలని సింగపూర్ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నాటి పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే 10వ తేదీనే ఉరిశిక్ష అమలుచేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. -
వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఓ అనుమానితుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్లోని వాట్సాప్ను పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్గా మారింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ వాట్సాప్లో కామెంట్లు వచ్చాయి. దీనిపై నగర కొత్వాల్ అంజనీకుమార్ గురువారం స్పందించారు. అనుమానితులను పట్టుకున్నప్పుడు ఆద్యంతం సోదా చేయడం తమ విధుల్లో భాగమని పేర్కొన్నారు. అలా చేయని కారణంగానే ఇటీవల నార్త్జోన్ పరిధికి చెందిన ఓ కానిస్టేబుల్పై నిందితుడు జేబులోని కత్తితో దాడి చేశాడని వివరించారు. చదవండి: వాట్సాప్ గ్రూప్లో గంజాయి ఆర్డర్ మరోపక్క అనుమానితులు, నిందితుల మధ్య సంబంధాలు కనిపెట్టడానికి వాట్సాప్ తదితరాల తనిఖీ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నప్పటికీ.. మనమంతా వాట్సాప్ యూనివర్సిటీలో విద్యార్థులుగా మారిపోయామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మవద్దని, వాట్సాప్లో వచ్చే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. Sir @TelanganaDGP @CPHydCity is this permissible under any law? to stop and check people, their Mobile Phone, chatting, pockets and etc?. Can you do this at Banjara Hills or Hi tech City areas?. This is clear harassment to common and illiterate people. pic.twitter.com/vej4Csxqdm — S.Q.Masood | مسعود (@SQMasood) October 28, 2021 32 కేసులు.. 60 మంది అరెస్టు ఈ నెల 19 నుంచి గురువారం వరకు గంజాయి దందాకు సంబంధించి సిటీలో మొత్తం 26 కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయి కేసుల్లో 389 కేజీలు స్వా«దీనం చేసుకున్నామని, చిక్కిన వారిలో ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఏపీకి చెందిన వారూ ఉన్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఈ ఏడాది మొత్తం 114 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, వీరిలో 31 మంది గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించిన వారన్నారు. మరో 21 మందిపై త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో విట్నెస్ కిరణ్ గోసవి అరెస్ట్
-
లెహెంగాల ఫాల్స్లో డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ను తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పెడ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కొరియర్ ద్వారా ఆస్ట్రేలియాకు రవాణా చేసేందుకు లెహెంగాల్లోని ఫాల్స్లో కోట్లు విలువ చేసే డ్రగ్స్ పెట్టి కుట్టేశారు. ఈ లెహెంగాలను కార్గోలో పంపేందుకు యత్నించి బెంగళూరు నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కింది ఓ ముఠా. మూడు లెహెంగాల్లోని ఫాల్స్లో 3 కేజీల మిథిలీన్ డైఆక్సీ మిథాంఫిటమిన్ (ఎండీఎంఏ) డ్రగ్ పెట్టి చెన్నైకి చెందిన పెడ్లర్ హైదరాబాద్లోని ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ ద్వారా కన్సైన్మెంట్ బుక్ చేశాడు. ఎన్సీబీకి సమాచారం అందడంతో ఆ పార్శిల్ను ట్రాక్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్టులో గురువారం స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ను తెరిచి చూడగా మూడు లెహెంగాల్లో్ల ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. ఏపీలోని నర్సాపురంలో ఓ తప్పుడు చిరునామా ఉపయోగించి చెన్నైకి చెందిన ఓ పెడ్లర్ దీన్ని బుక్ చేసినట్లు గుర్తించారు. అనంతరం చెన్నైలోని నిందితుడి అసలు అడ్రస్ గుర్తించి, ఎన్సీబీ అధికారులు శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్శిల్ను పంపేందుకు ఈ పెడ్లర్ నకిలీ డాక్యుమెంట్లు వినియోగించినట్లు విచారణలో తేలినట్లు అధికారులు చెప్పారు. మరో కేసులో నలుగురు అరెస్టు మరో కేసులో భాగంగా బెంగళూర్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఎన్సీబీ చేధించింది. శనివారం బెంగళూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారును ఎన్సీబీ దేవనహల్లి చెక్పోస్టు వద్ద ఆపి తనిఖీ చేయగా, హై గ్రేడ్ గంజాయితో పాటు ఎండీఎంఏ పిల్స్, మిథాంఫిటమిన్, మెథక్వలోన్ లభ్యమైనట్లు ఎన్సీబీ బెంగళూర్ జోనల్ డైరెక్టర్ అమిత్ గౌవాటే తెలిపారు. కారులో ఉన్న నలుగురి అరెస్టు చేసి విచారించగా, వారిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా, మిగిలిన ముగ్గురు హైదరాబాద్లో నివసిస్తున్న బిహార్కు చెందిన వారని గుర్తించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ను వీకెండ్ పార్టీలకు సరఫరా చేసేందుకు వెళ్తున్నారని, హైదరాబాద్లోని పలు పబ్బుల్లోకి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా బెంగళూరులో కొంత గంజాయితో పాటు ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. హాట్ స్పాట్లుగా.. విదేశాలకు డ్రగ్స్ రవాణా చేయడంలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూర్ నగరాలు హాట్ స్పాట్లుగా మారుతున్నట్లు ఎన్సీబీ పేర్కొంటోంది. ఎవరెవరో వ్యక్తులు హైదరాబాద్, ముంబై ద్వారా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆందోళన కల్గిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో విదేశాలకు చెందిన మాఫియా లోకల్ గ్యాంగ్లతో పెట్టుబడి పెట్టిస్తోందని, ఆ డ్రగ్స్ను ఇలా కొరియర్ల రూపంలో మళ్లీ అక్కడికే తెప్పించుకుంటోందని తేలింది. అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న పెడ్లర్లపై దృష్టి పెడితే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం
కుత్బుల్లాపూర్: డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఓ ముఠాకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పెట్టారు. మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ సభ్యులు రూ.2 కోట్ల విలువైన 5 కిలోల మెఫిడ్రోన్/మిథాంఫిటమిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రయ్య, మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయభాస్కర్ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి న్యూ బాలాజీనగర్లోని ఎస్వీ సెలెక్షన్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకోవడం తీసుకోవడంతోపాటు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మేడ్చల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్.. ఈ దాడుల్లో క్యాబ్ డ్రైవర్ పవన్ అలియాస్ చిటుకూరి ప్రశాంత్రెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 5 గ్రాముల మత్తు పదార్థం లభించింది. అదుపులోకి తీసుకుని విచారించగా, కన్నారెడ్డి అలియాస్ మహేశ్ కన్నారెడ్డి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో బొంగులూర్ గేటు సమీపంలోని గురుదత్తా లాడ్జిపై దాడులు చేయగా కన్నారెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 921 గ్రాముల మెఫిడ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న నాగర్కర్నూల్ జిల్లా తిమ్మరాజ్పేట మండలం బావాజీపల్లి గ్రామానికి చెందిన కొండమూరి రామకృష్ణగౌడ్ ఇంటిపై దాడులు చేశారు. అతడి వాహనాన్ని తనిఖీలు చేయగా, 4 కిలోల మెఫిడ్రోన్ పట్టుబడింది. బావాజీపల్లికి చెందిన బండారు హన్మంత్రెడ్డి, సురేశ్రెడ్డి అలియాస్ ఎస్.కె.రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అతను చెప్పారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్గా పనిచేసిన ఎస్.కె.రెడ్డి పటాన్చెరులో ఓ మూతబడిన పరిశ్రమను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా, కుత్బుల్లాపూర్, బాలానగర్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల వద్ద నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు లేదా తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, తగిన నగదు పారితోషికం అందిస్తామని అధికారులు తెలిపారు. -
కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్
-
నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్!
Shah Rukh Khan Emotional When He Meets Aryan Khan: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం అతడికి బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో షారుక్ ఖాన్ తొలిసారిగా ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్న కుమారుడిని కలిసి కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు సమాచారం. వీరి మధ్య గ్రిల్, గాజు గోడ అడ్డంగా ఉంది. ఇంటర్కామ్ ద్వారా వీరిద్దరూ మాట్లాడుకున్నారు.తండ్రిని నేరుగా చూడగానే ఆర్యన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయినట్లు సిబ్బంది వర్గాలు వెల్లడించాయి. దాదాపు15-20నిమిషాల వరకు వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ఆర్యన్ 'ఐ యామ్ సారీ' అని పదేపదే తండ్రికి చెప్పాడట. దీంతో తీవ్ర భావేద్వోగానికి లోనైన షారుక్ కన్నీళ్లు ఆపుకుంటూ..నేను నిన్ను నమ్ముతున్నానంటూ కొడుకులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతకుముందు కూడా తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడుతూ ఆర్యన్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. #WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbai pic.twitter.com/j1ozyiVYBM — ANI (@ANI) October 21, 2021 చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్ రోడ్డు జైల్లో ఆర్యన్ను కలుసుకున్న షారుక్ ‘లైగర్’ భామని విచారించనున్న ఎన్సీబీ -
Aryan Khan Drug Case: ఆర్యన్కు దొరకని బెయిల్
-
డ్రగ్స్రహిత రాష్ట్రంగా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో వచ్చే బుధవారం ప్రగతిభవన్లో సీఎం కె.చంద్రశేఖర్రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెట్రేగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వీటి కార్యకలాపాలను నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ ప్రాంతాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 23న జిల్లా కలెక్టర్లతో సమీక్ష: ఈ నెల 23న పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరిత హారంపై సీఎం సమీక్ష నిర్వహిం చనున్నారు. ప్రగతిభవన్లో కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో సమగ్ర కార్యాచరణ రూపొందించనున్నారు.రేపట్నుంచి పోడుపై అధ్యయనం: ఈ నెల 20, 21, 22 తేదీల్లో పోడు భూముల సమస్యలపై అధ్యయనంలో భాగంగా ఉన్నతాధికారులు అటవీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ ఛోంగ్తు, పీసీసీఎఫ్ శోభ హెలికాప్టర్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. -
ఆర్యన్ ఖాన్కు మళ్లీ నిరాశే
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దసరా పండుగ సమయానికి ఇంటికి చేరుకుంటాడన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్పై తీర్పు ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈ బెయిల్ పిటిషన్పై బుధ, గురువారాల్లో ఇరుపక్షాల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. ఆర్యన్ గత కొద్దికాలంగా డ్రగ్స్కి బానిసగా మారాడని, అతని వాట్సాప్ చాటింగ్లు చూస్తే ఈ విషయం తెలుస్తుందని, అందుకే అతడికి బెయిల్ మంజూరు చేయవద్దని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) తరపు న్యాయవాది అనిల్ సింగ్ కోరారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ ఏమీ లభించలేదు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వాలని వాదించడం సరికాదన్నారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నిందితుడి వద్ద డ్రగ్స్ లభించడం కీలకమైన అంశం కాదని చెప్పారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే తమ విచారణ ముందుకు సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా వయసులో చిన్న వాళ్లని, వారికి బెయిల్ ఇవ్వాలంటూ ఆర్యన్ తరఫు లాయర్ అమిత్ దేశాయ్ చేసిన వాదనలను అనిల్ సింగ్ వ్యతిరేకించారు. వీరంతా భావి భారత పౌరులని, మాదకద్రవ్యాలు సేవించడం చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా ఆ పని చేశారని ఆక్షేపించారు. మరోవైపు విదేశాల్లో ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు సేవించాడన్న అనిల్ సింగ్ వాదనల్ని అమిత్ వ్యతిరేకించారు. ఆర్యన్ ఇటీవల వెళ్లిన దేశాల్లో డ్రగ్స్ సేవించడం చట్టబద్ధమైన చర్యేనని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆర్యన్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. సోషల్ మీడియాలో, కోర్టు వెలుపల షారుక్ ఖాన్ అభిమానులు ఆర్యన్కు మద్దతుగా నిలిచారు. అతనికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టు బయట నినాదాలు చేశారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఇన్నాళ్లూ క్వారంటైన్ బ్యారెక్లో ఉన్న ఆర్యన్ ఖాన్ను ఇతర ఖైదీలు ఉండే సెల్కి అధికారులు తరలించారు. కోవిడ్–19 పరీక్షల్లో ఆర్యన్ సహా ఇతర నిందితులందరికీ నెగెటివ్ రావడంతో వారిని సాధారణ సెల్లో ఉంచినట్టు జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్ చెప్పారు. బిస్కెట్లు తింటూ.. ఆర్థర్ రోడ్డు జైలులో ఆర్యన్ ఖాన్ కేవలం బిస్కెట్లు తిని రోజులు గడుపుతున్నాడని తెలుస్తోంది. ముంబైలో స్థానిక మీడియా రాస్తున్న కథనాల ప్రకారం జైలులో ఇచ్చే భోజనం తినడానికి ఆర్యన్ నిరాకరించాడు. జైలు క్యాంటిన్ నుంచి కొనుక్కుంటున్న బిస్కెట్లు తింటూ కాలం గడిపేస్తున్నాడు. తనతో పాటు తీసుకువెళ్లిన 12 మంచినీళ్ల బాటిల్స్ నీళ్లతోనే కాలం నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా అయిపోతున్నాయని, తమ కుమారుడి దుస్థితిని తలచుకొని షారుక్ ఖాన్, గౌరి దంపతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ముంబై మీడియా కథనాలు రాస్తోంది. -
బాబుకు లీగల్ నోటీసు
సాక్షి, అమరావతి: డ్రగ్స్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు, పోలీస్ శాఖ ఎన్నిసార్లు తేల్చి చెప్పినా విపక్ష నేతలు పట్టించుకోకుండా పదేపదే అవే అబద్ధాలను వల్లించడం, అనుకూల మీడియాలో అవాస్తవాలను ప్రచురించడం, తిరిగి వాటిని ప్రచారంలోకి తెస్తున్న నేపథ్యంలో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో డీజీపీ న్యాయాస్త్రాన్ని సంధించారు. రాష్ట్రం, పోలీస్శాఖ ప్రతిష్టను మసకబార్చవద్దని సామరస్య పూర్వకంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఖాతరు చేయకపోవడంతో న్యాయబద్ధంగానే దీన్ని ఎదుర్కోవాలని, కుట్రలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించి లీగల్ నోటీసులు జారీ చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకుపోలీసు శాఖ సన్నద్ధమైంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడంతోపాటు పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న పన్నాగాలపై ‘న్యాయ అస్త్రాన్ని’ ప్రయోగించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, ఇతర పార్టీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు డీజీపీ సవాంగ్ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే లీగల్ నోటీసులిచ్చినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేతతోపాటు మీడియా సంస్థలపై డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఇలా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించడం దేశంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో ఇదే తొలిసారి... సాధారణంగా సీఎస్, డీజీపీ స్థాయి అధికారులు ఇలా ప్రతిపక్ష నేతకు లీగల్ నోటీసులు జారీ చేయాల్సిన అనివార్యత తలెత్తదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల అనివార్యంగా న్యాయాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. విపక్ష నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలతో వారి అనుకూల మీడియా కథనాలను ప్రచురిస్తోంది. టీడీపీ నేతలు తిరిగి వాటినే వల్లె వేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చిన దాఖలాలు లేవు. గుజరాత్లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేసిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్తో ఏపీకి ముడిపెడుతూ విపక్షాలు దుష్ప్రచారానికి తెగించాయి. ఆ హెరాయిన్తో ఏపీకి సంబంధం లేదని డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు విస్పష్టంగా ప్రకటించినప్పటికీ చంద్రబాబు, టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాతో బురద చల్లుతూనే ఉన్నారు. డీజీపీ సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబులోగానీ ఆ రెండు పత్రికల యాజమాన్యాల్లో గానీ ఏమాత్రం మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేనందున న్యాయ పోరాటం ద్వారానే ఈ కుట్రలను బహిర్గతం చేయాలని డీజీపీ నిర్ణయించుకుని చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు, ఎడిటర్లు, పాత్రికేయులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు, అవాస్తవ వార్తలపై బేషరతుగా క్షమాపణలు చెప్పి అదే విషయాన్ని ఆ రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బురద రాజకీయ లబ్ధి కోసం యావత్ పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు విపక్ష టీడీపీ కుతంత్రాలకు తెగిస్తోంది. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖపై దుష్ప్రచారానికి పాల్పడుతోంది. టీడీపీ అనుకూల మీడియా దీనికి కొమ్ము కాస్తోంది. నిరాధార ఆరోపణలను ప్రముఖంగా ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా – గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలోని సంస్థలదే’.. ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’ .. ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’... ఇలా పలు రకాలుగా చంద్రబాబు, లోకేశ్ నిరాధారణ ఆరోపణలు చేశారు. వాటిని అవే శీర్షికలతో ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ‘జగన్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి’.. ‘డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు: చంద్రబాబు ధ్వజం’ అంటూ విపక్ష నేత చేసిన అసత్య ఆరోపణలను ఆంధ్రజ్యోతి ఉద్దేశపూర్వకంగా ప్రముఖంగా ప్రచురించింది. కుట్రలపై జాతీయస్థాయిలో చర్చ పోలీస్ శాఖ ప్రతిష్టను పరిరక్షించేందుకు డీజీపీ సవాంగ్ న్యాయపరమైన చర్యలకు సమాయత్తమవడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అనివార్యంగా అంతటి నిర్ణయం తీసుకునేందుకు పురిగొల్పిన పరిస్థితులు ఏమిటన్న దానిపై దేశవ్యాప్తంగా అంతా దృష్టి సారించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన మీడియా సంస్థలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు సహకరిస్తుండటం పట్ల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇంటి పక్కన సంస్థే హెరాయిన్ దిగుమతి చేయించిందని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం, టీడీపీ అనుకూల మీడియా దానికి వత్తాసు పలుకుతూ దుష్ప్రచారం చేస్తుండటాన్ని దేశమంతా గుర్తించింది. ఈ కుట్రలను ఎండగట్టేందుకు డీజీపీ సరైన నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
అడ్డగోలు మాటలకు అర్థం ఏమిటి?
కేంద్ర నిఘా సంస్థల దగ్గర కూడా లేని సమాచారం చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టుంది. అందుకే తాలిబన్లు, తాడేపల్లి అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలన్నంత కసితో ప్రకటనలు గుప్పించారు. సమస్య ఏమిటంటే– ప్రజాక్షేత్రంలో ఓటమిని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం అన్న మాటే మరిచిపోయారు. రాజకీయాలను విషక్రీడగా మార్చారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా తట్టెడు బురద చల్లడం మొదటినుంచీ చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయనకు ఎన్టీఆర్ అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా, మరొకరు అయినా ఒకటే. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన రెండు ప్రకటనలు గమనించదగినవి. తన పార్టీ ఓడిపోవడం ఆయనకు జీర్ణించుకోలేని విషయమే. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎవరు కావాలని అనుకుంటే వారిని ఎన్నుకుంటారు. అయినా ప్రతిపక్షంలో ఉన్నా తామే పెత్తనం చేయాల నుకుంటే కష్టమే. ఇంతకీ బాబు చేసిన ప్రకటనలు ఏమిటో చూద్దాం. తాలిబన్లకూ తాడేపల్లికీ ఉన్న లింక్ బయటపెడతామని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ రెండు ప్రకటనలు చూస్తే ఏమని పిస్తుంది! తక్షణమే ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయా లన్న వ్యూహం ఏమైనా ఉందా అన్న సంశయం కలుగుతుంది. తాలిబన్లు అఫ్గానిస్తాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి, అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో ఘాతుకాలకు పాల్పడు తున్నారు. మరి ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిని తాలిబన్లతో పోల్చ డమే కాకుండా, లింకులు బయటపెడతామని చంద్రబాబు అనడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగా అలాంటి లింకులు ఉంటే కేంద్ర ప్రభు త్వానికీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకూ తెలియదా? వారికన్నా చంద్ర బాబుకే ఎక్కువ అంతర్జాతీయ నెట్వర్క్ ఉందా? ఆ దేశ అధ్యక్షుడు తెలుసు... ఈ దేశ ప్రధాని తెలుసు... తాను, బిల్ క్లింటన్, టోనీ బ్లేయర్ అంటూ గతంలో ఏవేవో కబుర్లు చెప్పేవారు. సింగపూర్, మలేíషియాలతో సంబంధం ఉందనీ, జపాన్కు చెందిన ప్రముఖుడిని అమరావతికి తెచ్చాననీ అనేవారు. వీటన్నింటిని బట్టి కేంద్రం కన్నా చంద్రబాబే తెలివైనవాడనీ, ఎక్కడి సమాచారం అయినా ఆయనకు ఇట్టే వస్తుందని అనుకోవాలి కదా? చంద్రబాబే స్వయంగా ఆ దర్యాప్తు సంస్థలకు తన వద్ద ఉన్న సమాచారం అందించవచ్చు కదా! తాలిబన్లతో పోల్చుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించా ల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. అంటే ఇప్పటి కిప్పుడు జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే తాను ఆ కుర్చీ ఎక్కాలని ఉబలాటపడుతున్నారా! 1989–94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పక్షాన బాబు ఇలాగే మాట్లాడేవారు. దానికి ఆనాటి మంత్రి రోశయ్య ‘బాబూ... నువ్వు దిగు, దిగు... నేను ఎక్కుతా అంటే కుదర’దనీ; ‘ఉట్టి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపో’దనీ అనేవారు. కానీ ఎలాగైతే నేమి 1995లో తన మామ ఎన్టీ రామారావును చంద్రబాబు పదవీచ్యు తుడిని చేశారు. అంటే ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. తాలిబన్లు మరో పద్ధతిలో అఫ్గాన్ ప్రభుత్వాన్ని కూల్చారు. మరి అలాంటప్పుడు చంద్ర బాబు ఆధ్వర్యంలోని టీడీపీ తాలిబన్ల మాదిరి వ్యవహరించిందని చెప్పవచ్చా? చంద్రబాబును తాలిబన్ అనడం లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్పై అలాంటి విమర్శ చేసినప్పుడు, సహజంగానే ఆయా విషయాలు స్ఫురణకు వస్తాయి. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు కూడా ఆయా వ్యవస్థలను విజయవంతంగా చంద్రబాబు వాడుకున్నారని ప్రచారం జరిగేది. తన మామను దించినట్లుగా జగన్ ప్రభుత్వాన్ని దించడం సాధ్యమయ్యే పని కాదు కనుక, కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ఏమైనా కుట్ర పన్నుతారా అన్న సందేహం కలగవచ్చు. ఇలాంటివి చేసేవారిని కదా తాలిబన్లు అనాలి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్కు జగన్ ఒక వినతిపత్రం సమర్పిం చిన సందర్భంలో– చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క మాట అంటేనే ఇంకేముంది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని హోరెత్తిం చారే! మరో వైపు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారే! ఇంకో సంగతి చెప్పాలి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బాబు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరిని కొనుగోలు చేయడం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని, ఆ తర్వాత వీలైతే మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని కూలదోయాలని యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ కాస్త అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది... లేకుంటే ఆయన బాబు చేతిలో ఇబ్బంది పడవలసి వచ్చేది. ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడా నికి చేసే ప్రయత్నాన్ని కదా తాలిబన్ అని అనాలి! డ్రగ్స్ వ్యవహారానికీ, జగన్ ప్రభుత్వానికీ లింక్ పెట్టడానికి విశ్వ యత్నం చేశారు. చోటామోటా నేతలతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి మరికొందరు నేతలపై ఆరోపణలు చేయిం చారు. అక్కడ మత్స్యకారుల బోటు దగ్ధం అయితే అందులో డ్రగ్స్ ఉన్నాయని ప్రచారం చేశారట. దానిపై మత్య్సకారులు టీడీపీ ఆఫీస్ వద్ద నిరసన చెప్పారట. దీనిని వైసీపీ వారు దాడి చేశారని చంద్ర బాబు ప్రచారం చేశారు. అక్కడ ఒక ఎగుమతిదారుడితో వైసీపీ వారికి సంబంధాలు అంటగట్టే యత్నం చేశారు. తీరా చూస్తే ఆ ఎగుమతి దారుడు అలీ షాతో చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు దిగిన ఫొటోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి బయటపెట్టారు. పైగా స్వయంగా అలీ షా జిల్లా ఎస్పీని కలిసి తనపై విచారణ చేయాలనీ, డ్రగ్స్ ఆరోపణలు నిజం కాదని తేలితే, ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకోవాలనీ కోరారు. దాని గురించి టీడీపీ సమాధానం ఇవ్వాలి కదా? దీనిపై పోలీసులు తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇస్తే దానిపై మళ్లీ గగ్గోలు పెడుతున్నారు. ఆరోపణలు చేయడం, తర్వాత జారి పోవడం టీడీపీకి అలవాటుగా మారింది. కాకినాడలో నిజంగానే పడవలో డ్రగ్స్ ఉంటే కేంద్ర నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? ఇన్ని కబుర్లు చెప్పే జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుజరాత్లో అంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడితే ఆ ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట అనే సాహసం చేయడం లేదేమి? ఒకప్పుడు మోదీని తీవ్రంగా దూషించిన టీడీపీ ఇప్పుడు నోరు విప్పడానికే ఎందుకు భయపడు తోంది? చంద్రబాబు పీఏ ఇంటిలో సోదాలు చేసి, రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీబీటీడీ అధికారిక ప్రకటన చేస్తే దానిపై చంద్ర బాబు ఇంతవరకు నోరు విప్పలేదు. అలాగే పండోరా పత్రాలలో పలువురు భారత ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వెంటనే దానిని జగన్కు పులిమే యత్నం చేశారు. ఇందులో జగన్ పేరు కూడా ఉండ వచ్చేమో అని టీడీపీ నేతలు అనుకున్నారట. దానిని ఈనాడు పత్రిక పెద్ద శీర్షిక పెట్టి వార్త ఇచ్చింది. తద్వారా పత్రికా ప్రమాణాలను మరింతగా దిగజార్చింది. వాస్తవంగా ఎవరిపై ఆధారాలు ఉన్నా బయటపెట్టవచ్చు. అలాకాకుండా ఒక ప్రతిపక్ష పార్టీ ఇలా అను కుంది... అలా అనుకుంది... అనుకుంటే అందులో చెత్త ఉన్నా, అలాగే రాస్తారా? అందుకే సజ్జల ఒక ప్రశ్న వేశారు. రామోజీరావు పేరు కూడా పండోరా జాబితాలో ఉందని తామెవరైనా అనుకుంటే రాస్తారా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అంటూ అలీషాతో ఆయన ఉన్న ఫొటోలను చూపించారు. లోకేశ్ హడావుడిగా దుబాయి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రాజకీయాన్ని ప్రజాసేవగా కన్నా, ఒక విషక్రీడగా చంద్రబాబు మార్చారన్న విమర్శలకు గురి అవుతున్నారు. గతంలో 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు– అసెంబ్లీలో చంద్ర బాబు మాట్లాడుతూ... కర్నూలులో ఒక అటవీ అధికారితో కుమ్మక్కై విజయభాస్కరరెడ్డి పదికోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని తన చాంబర్లో ఉన్న కోట్ల విన్న వెంటనే అసెంబ్లీ హాల్లోకి ఆగ్రహావేశాలతో వచ్చి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా, ఏ అవకాశం వచ్చినా తట్టెడు బురద చల్లడం చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయ నకు ఎన్టీఆర్ అయినా, జగన్ అయినా, మరొకరు అయినా ఒకటే. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ నెల నాలుగో తేదీన ఆయన ప్రెస్మీట్ పెట్టి డ్రగ్స్ రవాణా వ్యవహారంలో ప్రభుత్వానికి, పోలీసులకు గంజాయి వ్యాపారులతో సంబంధం ఉందంటూ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ నుంచి గుంటూరు జిల్లా చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చి పోలీసులు నోటీసును అందజేశారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వారం రోజుల్లో అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. చదవండి: (ఫేక్ పోస్టును షేర్ చేసిన పురందేశ్వరి) -
జ్యుడీషియల్ కస్టడీకి ఆర్యన్
ముంబై: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ స్వాధీనం కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్తోపాటు మరో ఏడుగురిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతని న్యాయవాది సతీష్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. నిందితులను తమ కస్టడీకి అప్పగిస్తూ ఇచ్చిన గడువును ఈ నెల 11 దాకా పొడిగించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కోరింది. డ్రగ్స్ స్వాధీనం కేసులో కుట్రలను వెలికి తీయాల్సి ఉందని, ఈ వ్యవహారంలో అచ్చిత్ కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశామని(సరఫరాదారు కావొచ్చని అనుమానం).. అతడిని, నిందితులను కలిపి విచారించాల్సి ఉందని వెల్లడించింది. అయితే, ఎన్సీబీ విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టిపారేసింది. అస్పష్టమైన ఆధారాలను బట్టి నిందితులను మళ్లీ ఎన్సీబీ కస్టడీకి అప్పగించలేమని పేర్కొంది. ఈ నెల 3న ముంబై నుంచి గోవాకు పయనమైన పర్యాటక నౌకలో డ్రగ్స్తో కొందరు పార్టీ చేసుకుంటున్న సమాచారం అందడంతో ఎన్సీబీ దాడి చేసింది. వివిధ రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్ను అరెస్టు చేసింది. షారుక్ మేనేజర్ పూజా దద్లానీ గురువారం కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె రోదించారు. 8 మంది నిందితులకు కోవిడ్ నెగటివ్ టెస్టు రిపోర్టు లేకపోవడంతో అధికారులు వారిని జైలుకు తరలించకుండా గురువారం రాత్రి ఎన్సీబీ ఆఫీస్లోనే∙ఉంచారు. నిందితులను కలిసి, మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులను అనుమతించారు. పూజా దద్లానీ ఎన్సీబీ ఆఫీసుకు వచ్చి ఆర్యన్ను కలిశారు. -
రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్ పట్టివేత
గౌహతి: కోహిమాలోని ఖుజమాలో నార్కోటిక్ చెక్ పాయింట్ వద్ద చేసిన తనిఖీలలో సుమారు 48 కిలోల బంగారం, రూ. 29 కోట్ల ఖరీదు చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గత మూడు రోజులగా నార్కోటిక్ చెక్ పాయింట్లలో నిర్వహించిన తనిఖీలో ఇవి వెలుగు చూశాయి అని చెప్పారు. (చదవండి: ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!) ఈ సందర్భంగా నాగాలాండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ ఎం తమ్గాడ్గే మాట్లాడుతూ...."రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా స్మగ్లింగ్ కోహిమాలోని ఖుజమా-ఇంఫాల్ జాతీయ రహదారిలోనే ఎక్కువగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ నిందుతులైన సౌరభ్ సింగ్, పవన్ కుమార్లకు సంబంధించిన వాహనంలోని గేర్లో 29 ప్యాకెట్లో రూ.22 కోట్లు ఖరీదు చేసే 10 బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నాం. దాదాపు ఆరు కోట్లు ఖరీదు చేసే హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం" అని చెప్పారు. మయాన్మార్ నుంచి సరిహద్దు ప్రాంతాలైన ఈశాన్యా ప్రాంతాలకు తరుచుగా మాదక ద్రవ్యాలు, ఆయుధ సామాగ్రీని అక్రమంగా తరలిస్తున్నారని అస్సాం రైఫిల్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు వెల్లడించారు. (చదవండి: మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్) -
Andhra Pradesh: మత్తు.. చిత్తు చేద్దాం
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలు లేవు... అయినా సరే అత్యంత అప్రమత్తంగా ఉండండి. ప్రధానంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదక ద్రవ్యాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా తక్షణం చర్యలు చేపట్టండి. – సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: ‘డ్రగ్స్’ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ దుష్ఫ్రచారం చేస్తోందని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతే ధ్యేయంగా ‘దిశ’ పోలీసు స్టేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఎఫ్ఐఆర్ల నమోదు మాత్రమే కాకుండా కేసుల పరిష్కారం కూడా పెరగాలని సూచించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టినందున పోలీసులకు వీక్లీ ఆఫ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ‘మత్తు’ జాడలు ఉండకూడదు.. కాలేజీలు, యూనివర్సిటీలు మాదకద్రవ్య రహిత ప్రదేశాలుగా ఉండాలి. అసలు మాదక ద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయో లేవో అన్నది కచ్చితంగా నిర్ధారించుకునేందుకు అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో నిశితంగా పర్యవేక్షించండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో కాలేజీలు, యూనివర్సిటీలే డ్రగ్స్ విక్రయాల పాయింట్లుగా ఉంటాయి. అక్కడే మనం సమర్థంగా కట్టడి చేయగలిగితే డ్రగ్స్ వ్యవహారాలను అరికట్టినట్టే. అన్ని కాలేజీలను మ్యాపింగ్ చేయండి. ఎక్కడైనా డ్రగ్స్ విక్రేతలు ఉన్నట్లు తెలిస్తే అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేది గుర్తించి మూలాల నుంచే డ్రగ్స్ వ్యవహారాలను పూర్తిగా తుడిచిపెట్టవచ్చు. డ్రగ్స్ ఆనవాళ్లు అన్నవి ఉండకూడదు. దీన్ని ఓ సవాల్గా తీసుకుని కార్యాచరణ రూపొందించండి. ఎస్పీలు, కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై నివేదిక సమర్పించాలి. ఈ అంశంలో పనితీరు ఎలా ఉందో నిశితంగా సమీక్షిస్తా. డ్రగ్స్ లేకున్నా విపక్షాల దుష్ఫ్రచారం ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం సంబంధం లేని డ్రగ్స్ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. లేని అంశాన్ని ఉన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం సాగిస్తోంది. వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థతో పాటు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు ఉద్దేశపూర్వకంగా అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రతి మహిళ ఫోన్లో ‘దిశ’ మహిళలు, చిన్నారుల భద్రత కోసం తెచ్చిన ‘దిశ’ వ్యవస్థ సమర్థంగా పని చేయాలి. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ, ప్రతి మహిళ మొబైల్ ఫోన్లోనూ దిశ యాప్ ఉండేలా చూడాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళా పోలీసులు, వలంటీర్ల సహాయం తీసుకోండి. దిశ యాప్ డౌన్లోడ్, వాడకంపై విస్తృత ప్రచారం కల్పించండి. బాధితులకు సత్వర న్యాయం యువతులపై అఘాయిత్యాలను నివారించాలి. దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథకంతో బాధితులను శరవేగంగా ఆదుకోవాలి. సత్వరమే న్యాయం చేకూర్చేలా చర్యలు చేపట్టి పరిహారాన్ని అందించాలి. ఘటన జరిగిన నెల రోజుల్లోపే బాధిత కుటుంబాలను పరిహారం అందాలి. ఎక్కడైనా ఆలస్యం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి. ధైర్యంగా ముందుకొచ్చేలా.. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి కల్పించాలి. ఫిర్యాదుదారులకు వెసులుబాటుగా వ్యవస్థ ఉండాలి. ఎఫ్ఐఆర్లు పెరుగుతాయని వెనకడుగు వేయవద్దు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికి ధైర్యం చెప్పి ప్రోత్సహించండి. బాధితులు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగలగాలి. వాటిపై చట్ట ప్రకారం సత్వరం చర్యలు తీసుకోవాలి. బాధితులకు భరోసా కల్పించడం ముఖ్యం. వచ్చే ఏడాది 6 వేల పోలీసు నియామకాలు మన ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించాం. వారికి శిక్షణ డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. వచ్చే ఏడాది కొత్తగా 6 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసేలా దృష్టి సారించి సన్నద్ధం కావాలి. అక్రమ మద్యంపై ఉక్కుపాదం అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఎస్ఈబీ విభాగంతోపాటు పోలీసులు ఉక్కుపాదం మోపాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్టు దుకాణాలను తొలగించాం. మద్యం దుకాణాలను మూడో వంతు తగ్గించాం. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. విక్రయ వేళలు కుదించి రేట్లు పెంచాం. దీంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. ఇసుక అక్రమ రవాణాపై కూడా కఠినంగా వ్యవహరించాలి. గుట్కా నిరోధంపై ప్రత్యేకంగా దృష్టి సారించండి. అవసరమైతే చట్టం తీసుకొద్దాం. సైబర్ నేరాలు అరికట్టేందుకు కార్యాచరణ సైబర్ నేరాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సమర్థ అధికారులు, న్యాయ నిపుణులను నియమించాలి. దిశ, ప్రత్యేక కోర్టులపై సమీక్ష దిశ బిల్లు, ప్రత్యేక కోర్టులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. దిశ వన్స్టాప్ సెంటర్లు, మహిళా పోలీసుల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చేలా ఆమోద ప్రక్రియ కేంద్రం వద్ద ఏ దశలో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాసనసభలో బిల్లును ఆమోదించి చాలా రోజులైనా ఇంకా పెండింగ్లో ఉండటం సరికాదన్నారు. వెంటనే ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 2,652 కేసులను దిశ వన్ స్టాప్ సెంటర్ల ద్వారా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రత కోసం ఇప్పటివరకు 51,053 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ న్యాయవాదులు పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం పది కోర్టులు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. డిసెంబరు నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళలపై నేరాల కేసుల విచారణకు సంబంధించి 12 కోర్టులు పని చేస్తున్నాయని చెప్పారు. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కోర్టుల్లో ప్రభుత్వ న్యాయవాదులు పూర్తిస్థాయిలో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదుల నియామకం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె.సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, పలువురు అదనపు డీజీలు, డీఐజీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దిశ డౌన్లోడ్స్ 74.13 లక్షలు – ఇప్పటివరకు దిశ యాప్ డౌన్లోడ్స్ 74,13,562 – చర్యలు తీసుకోదగ్గ కేసుల్లో 5,238 మందికి భద్రత, ఇతర సాయం – దిశ యాప్ ద్వారా 2021లో నమోదైన ఎఫ్ఐఆర్లు 684 – నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి మ్యాపింగ్ – దిశ పోలీస్ స్టేషన్లు అన్నింటికీ ఐఎస్వో సర్టిఫికేషన్ – జీరో ఎఫ్ఐఆర్లు నమోదు – మహిళలపై నేరాల కేసుల్లో దర్యాప్తునకు 2017లో 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు. – గణనీయంగా మెరుగుపడ్డ ఫోరెన్సిక్ సదుపాయాలు. గతంలో డీఎన్ఏ నివేదిక కోసం ఏడాదిపాటు నిరీక్షించగా ప్రస్తుతం రెండు రోజుల్లోనే నివేదిక సిద్ధం. సంబంధిత కేసుల్లో ఏడు రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు. -
మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..!
డ్రగ్స్ తీసుకున్నారనే విషయంపై షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్తో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు టీనేజర్లను ఎన్సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నిన్న అదుపులోకి తీసుకుంది. ఈ వార్త విన్న వారిలో చాలా మంది ‘డబ్బున్న వారి పిల్లలు అంతే’ అని ఓ మాట ఘాటుగా అనేసి తిరిగి తమ పనుల్లో పడిపోయుంటారు. ఇటీవల తరచూ మనముందుకొస్తున్న వార్తల్లో డ్రగ్స్ అనే బూచి తీసుకువస్తున్నవే ఎక్కువ. సినీ తారలు, డబ్బున్నవారు మాత్రమే డ్రగ్స్ వాడతారు అనుకునే సాధారణ జనం కూడా ఇప్పుడు తమ పిల్లల గురించి చర్చించుకోవాల్సిన, సరి చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ‘సమస్య మా ఇంట్లోకి రాదు, మా పిల్లలు బంగారం’ అనేది చాలామంది తల్లిదండ్రుల భావన. బయట సులువుగా దొరుకుతున్నప్పుడు, పిల్లలు ఆకర్షణకు లోనుకాకుండా ఉండరు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ‘డ్రగ్’ ప్రపంచంలో అత్యంత సాదాసీదాగా అడుగుపెట్టేవారిలో 18 ఏళ్ల లోపు టీనేజర్లే ఉంటున్నట్టు నివేదికలు చూపుతున్నాయి. అంటే, టీనేజర్లు డ్రగ్స్ వినియోగంలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్నారన్నమాట. ఒక్కసారేగా..! ఏదేమైనా ఈ దశలో ‘ప్రయోగం చేద్దాం’ అనుకోవడం నిజం. మాదకద్రవ్యాలు లేదా మద్యం ప్రయత్నించినంత మాత్రాన వాటికి బానిస అవుతారని చెప్పలేం. అయితే, కొంతమంది టీనేజర్లు ఈ తరహా ప్రయోగాలు చేయడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. ‘అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత, తోటి స్నేహితుల నుంచి తీసుకోమనే ఒత్తిడి, ట్రెండ్లో ఉన్నామని అనుకోవడం, కష్టం నుంచి తప్పించుకోవాలనే కోరిక’ సాధారణ కారణాలుగా ఉన్నాయి. అతి సాధారణ సంకేతాలు ఇంట్లో టీనేజ్ దశలో ఉన్న పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారా.. అని కొన్ని విషయాలను గమనించి తెలుసుకోవచ్చు. పిల్లలతో రోజూ కొద్దిసేపు సన్నిహితంగా మెలిగితే అవేంటో ఇట్టే తెలిసిపోతుంది. పిల్లల మాట, ఆలోచన, ప్రవర్తన.. ఈ మూడింటిని గమనించాలి. అలాగే.. ‘పిల్లలు చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారా... కారణం లేకుండా నవ్వడం లేదా ఏడ్వడం చేస్తున్నారా, చదువు, ఇతరత్రా రోజువారి కార్యకలాపాలపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదా, శుభ్రంగా ఉండటం లేదా, బాగా ఆకలి అంటూ రుచీ పచీ అని పట్టించుకోకుండా తింటున్నారా, వారి శ్వాస సిగరట్ వాసన వస్తోందా, బట్టలు పొగ వాసన వస్తున్నాయా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా, వారి వయసువారితో కాకుండా కొత్త కొత్త స్నేహాలు చేస్తున్నారా, ఇంట్లో డబ్బులు, ఖరీదైన వస్తువులు కనిపించకుండా పోతున్నాయా... వంటి విషయాలను పరిశీలించక తప్పదు. అయితే, తాము వారిని అనుమానిస్తున్నట్టు పిల్లలు అనుకోకూడదు. మరింత రహస్య జీవనంలోకి జారుకోవచ్చు! మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారనే నిజం తెలిసి కరకుగా పిల్లలతో ప్రవర్తిస్తే ‘మీకు తెలియకుండా మరింత రహస్యంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు’ అంటారు మానసిక నిపుణులు. ‘మీరు గమనించారని తెలిస్తే.. ఎత్తుకు పై ఎత్తు వేసి ఇంకా రహస్యంగా డ్రగ్స్ తీసుకోవచ్చు. పిల్లలను విమర్శిస్తూ మాట్లాడితే వారు ఎదురు తిరిగే అవకాశమూ ఉంది’ అంటారు. ప్రేమతోనే మందు వేయడం అనేది తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. గమనింపు అనేది అసలు బాధ్యతగా ఉండాలి. పిల్లలతోనే కాకుండా, వారి స్నేహితుల తల్లిదండ్రులతో కూడా సంభాషించాలి. మారేందుకు మూడు పద్ధతులు.. పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని తెలిస్తే వారితో గొడవపడకుండా, ప్రేమ పూర్వకమైన వాతావరణంలోనే వారిని నేర్పుగాSతమ దారిలోకి తెచ్చుకోవాలి అన్నది మానసిక నిపుణుల సూచన.‘స్కూల్ లేదా ఇంటి చుట్టుపక్కల వాతావరణంపై అనుమానం వస్తే వాటిని మార్చాలి. ఒక్కోసారి ఉన్న చోటును వదిలి మరో కొత్త ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. ఇవి మొదట్లో తల్లిదండ్రులు చేస్తారు. రెండవది.. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అనేది ప్రతి కుటుంబాల్లో సరిచూసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. అందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం. మూడవది.. డ్రగ్స్కు బానిస అయ్యారని గుర్తిస్తే వైద్యుల సాయంతో రిహాబిలిటీ సెంటర్లో పెట్టి కౌన్సెలింగ్, యోగా, మందులు వాడకం ద్వారా తిరిగి మామూలు జీవనంలోకి తీసుకురావచ్చు’ అని వివరించారు. డ్రగ్స్ కేవలం సెలబ్రిటీ క్లాస్ ట్రెండ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా టీనేజర్లు ఉన్న ఇంటింటి సమస్య కూడా. మన ఇంట్లో లేదంటే పొరుగింట్లో టీనేజ్ వయసున్న పిల్లలున్నారంటే వారిని ఓ కంట కనిపెడుతూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయచ్చు. సకాలంలో గుర్తించి, మాదక ద్రవ్యాల బారి నుంచి టీనేజర్లను కాపాడుకోవడం ఈ రోజుల్లో మన ముందున్న అసలైన సవాల్. మన ఇంట్లోనూ ఉండొచ్చు! కరోనా కారణంగా 18 నెలలుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న పిల్లలు, ఇప్పుడు ఒక్కసారిగా తిరిగి కొత్త లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. గతంలో టీనేజ్ దశలో అబ్బాయిలు, అమ్మాయిలు 3:1 రేషియోలో ఉండేవారు. ప్రస్తుత రోజుల్లో 1:1 గా ఉన్నారు. పల్లె, పట్నం అని తేడా లేకుండా అన్నిచోట్లా, అన్ని దిక్కులా మాదకద్రవ్యాలు సులువుగా దొరకడం కూడా ప్రధాన కారణం. – డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
డ్రగ్ ఫ్రమ్ ఢిల్లీ.. కొరియర్లో కొకైన్ సరఫరా
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ నుంచి కొరియర్లో మాదకద్రవ్యమైన కొకైన్ను నగరానికి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ముఠాలో ఓ నైజీరియన్ను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఆదివారం పట్టుకున్నారు. ఇతడికి ఈ డ్రగ్ సరఫరా చేస్తున్న వ్యక్తి సైతం నైజీరియనే అని డీసీపీ చక్రవర్తి గుమ్మి పేర్కొన్నారు. నైజీరియాలోని లాగోస్ రాష్ట్రానికి చెందిన డేనియల్ అయోటుండే ఓలమెడే 2014లో స్టూడెంట్ వీసాపై నగరానికి వలసవచ్చాడు. షేక్పేటలోని డ్రీమ్ వ్యాలీ సమీపంలో నివసిస్తూ కూకట్పల్లిలోని ప్రైవేట్ కాలేజీ నుంచి డిగ్రీ చదువుతున్నాడు. డ్రగ్స్ వినియోగానికి బానిసగా మారిన ఇతడికి ఢిల్లీలో ఉండే మరో నైజీరియన్ జాన్ పాల్తో పరిచయం ఏర్పడింది. చదవండి: హైదరాబాద్: స్టాంప్ పేపర్లు కావలెను! ఇద్దరూ కలిసి హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నారు. జాన్ అప్పుడప్పుడు నేరుగా వచ్చి, మిగిలిన సందర్భాల్లో కొరియర్ ద్వారా కొకైన్ పంపుతున్నాడు. దీన్ని డేనియల్ నగరంలోని కస్టమర్లకు ఒక్కో గ్రాము రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నాడు. ఇలా వచ్చిన లాభాన్ని ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నారు. ఇదే ఆరోపణలపై గతేడాది అక్టోబర్లో లంగర్హౌస్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసులో జాన్ ఇప్పటికీ వాంటెడ్గా ఉన్నాడు. బెయిల్పై బయటకు వచ్చిన డేనియల్ తన పంథా మార్చుకోకుండా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. చదవండి: హైదరాబాద్ ఆర్టీసీ: ఇక అందరికి రూట్ పాస్లు! దీనిపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ వలపన్నారు. ఆదివారం జీవీకే సమీపంలో ద్విచక్రవాహనంపై డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెళ్తున్న డేనియల్ను పట్టుకున్నారు. ఇతడి నుంచి నాలుగు గ్రాముల కొకైన్, వాహనం స్వా«దీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న జాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు!
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్యన్తో పాటు మొత్తం 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లతో ఆర్యన్ చాటింగ్పై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో షారుక్ తన కుమారుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భార్య గౌరీ ఖాన్తో కలిసి సిమి గేర్వాల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్.. 'నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు. సిగరెట్ తాగొచ్చు. సెక్స్, డ్రగ్స్ని కూడా ఆస్వాదించొచ్చు. అన్ని రకాలుగా అతను ఎంజాయ్ చేయవచ్చు' అంటూ షారుక్ సరదాగా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తను యవ్వనంలో చేయని పనులు తన కొడుకు చేయాలంటూ షారుక్ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజం అయ్యాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేసిన రైడ్లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది. చదవండి: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ Seriously Shahrukh Khan!! @narcoticsbureau Today he has been arrested pic.twitter.com/1WfZkNkvSC — Priya Kulkarni (@priyaakulkarni2) October 3, 2021 -
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ దందా!
మహారాష్ట్ర:ముంబైలో పట్టుబడుతున్న భారీ డ్రగ్స్ స్థావరాలు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) గుర్తించింది. శుక్రవారం ముంబై నార్త్ అంధేరీలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ 4.6కిలోల ఎపిడ్రిన్ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో తయారు చేసి పరుపులు, మెత్తల్లో పెట్టి సముద్ర మార్గంగా ఆస్ట్రేలియా తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియా డ్రగ్స్ తరలింపు జరుగుతోంది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి మూడు రోజుల క్రితం గోవా డ్రగ్స్ కేసులో హైదరాబాది సిద్ధిక్ అహ్మద్ అరెస్టు అయ్యారు. శనివారం ముంబైలో షిప్లో పట్టుబడ్డ ఎపిడ్రిన్ సైతం హైదరాబాద్ నుండే వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎపిడ్రిన్ డ్రగ్స్కు హైదరాబాద్ కేంద్రంగా మారినట్లు సమాచారం. నైజీరియన్ పెడ్లర్లుగా మార్చుకుని పెద్ద ఎత్తున డ్రగ్స్ బిజినెస్ జరుగుతోంది. ఇటీవల బెంగళూర్లో పట్టుబడ్డ డ్రగ్స్ డాన్ యోగిత, హైదరాబాద్లోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. యోగిత, సిద్ధిఖ్ అహ్మద్ల విచారణలో హైదరాబాద్ డ్రగ్స్ లింకులు బయటపడనున్నట్లు తెలుస్తోంది. ముంబై తీరంలో శనివారం క్రూజ్ షిప్లో రేవ్ పార్టీపై అధికారులు దాడి చేయగా.. రేవ్ పార్టీలో షారుఖ్ పెద్ద కొడుకు అర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత అరెస్టు.. కీలక విషయాలు వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యోగిత ‘డ్రగ్స్ డాన్’గా మారింది. ఆ నగరంతో పాటు హైదరాబాద్లోనూ నైజీరియన్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న ఈమె మాదకద్రవ్యమైన ఎండీఎంఏ విక్రయాలు ప్రారంభించింది. దాదాపు మూడేళ్లుగా దందా చేస్తున్న యోగిత కోసం వలపన్నిన బెంగళూరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఇటీవల పట్టుకోగలిగారు. హైదరాబాద్లో ఈమె తరఫున డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. వినియోగం నుంచి విక్రేతగా మారి... బెంగళూరులో వివిధ పబ్స్కు వెళ్లే యోగిత డ్రగ్స్కు బానిసగా మారింది. వీటి ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఆమె మూడేళ్ల క్రితం పెడ్లర్గా మారి విక్రయించడం మొదలెట్టింది. తనకు డ్రగ్స్ అమ్మిన నైజీరియన్లనే పెడ్లర్స్గా మార్చుకుని వారి ద్వారా వినియోగదారులకు అమ్మడం మొదలెట్టింది. కాలక్రమంలో అక్కడి నైజీరియన్లకు స్నేహితులైన హైదరాబాద్లో ఉంటున్న వారినీ ఏజెంట్లుగా మార్చుకుంది. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు ఇస్తూ, క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు చేస్తూ విదేశాల నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ను స్మగ్లింగ్ చేయిస్తోంది. ఈ వ్యవహారంపై మూడు నెలల క్రితమే ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది. (చదవండి: Marital Affair: వివాహేతర సంబంధం.. ఎంత చెప్పినా వినలేదు.. చివరికి) జర్మనీ నుంచి ఇంటర్నేషనల్ పోస్టులో... యోగితకు సంబంధించిన చిరునామా, ఇతర వివరాలు తమ వద్ద లేకపోవడంతో అధికారులు వేచి చూశారు. ఈమెను పట్టుకోవడానికి విదేశాల నుంచి వచ్చే అనుమానాస్పద పార్శిల్స్పై నిఘా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రెండో వారంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోస్టాఫీసుకు జర్మనీ నుంచి వచ్చిన ఓ ఇంటర్నేషనల్ పోస్టు పార్శిల్పై ఎన్సీబీ దృష్టి పడింది. కాస్మోటిక్స్, శాండ్విచ్ గ్రిల్ తదతరాల పేరుతో వచ్చిన దాన్ని డెలివరీ చేయడానికి పోస్టుమ్యాన్ వెళ్లగా యోగిత చిరునామా లభించలేదు. దీంతో అతడు దాన్ని వెనక్కు తీసుకువచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు మూడు రోజుల పాటు ఆ పోస్టాఫీస్ వద్దే మాటు వేసి ఉన్నారు. మూడో రోజు పోస్టాఫీస్కు వచ్చిన యోగిత పార్శిల్ తీసుకువెళ్తుండగా పట్టుకున్నారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తరలింపు ఎన్సీబీ అధికారులు ఆ పార్శిల్ను విప్పి చూడగా అందులోని వస్తువుల మాటున అర కేజీ ఎండీఎంఏ ఉన్నట్లు గుర్తించారు. వివిధ దేశాల నుంచి ఇంటర్నేషనల్ పోస్టు ద్వారా వస్తువుల మాటున డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు యోగిత అంగీకరించింది. ఇలా వచ్చిన వాటిని నైజీరియన్ల ద్వారానే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు పంపుతున్నట్లు బయటపెట్టింది. ఇక్కడ ఉన్న ఆమె ఏజెంట్లు వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆమె నెట్వర్క్ కోసం గాలిస్తున్న అధికారులు త్వరలో హైదరాబాద్ పెడ్లర్ల కోసం ఇక్కడకు రానున్నారని సమాచారం. (చదవండి: ‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కొత్త కోణాలు! ) -
డ్రగ్స్ దందా: హైదరాబాద్ టు ఆస్ట్రేలియా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా కొనసాగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డ్రగ్స్ తయారీకి ముంబై నుంచి ఫండింగ్ చేస్తున్న మాఫియా ఇక్కడి నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకే స్మగ్లింగ్ చేసే వరకు వెళ్లిందంటే వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం ముంబైలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో మరోసారి హైదరాబాద్ పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. త్వరలోనే ఛేదిస్తాం హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేయించిన మాఫియా ఆ డ్రగ్స్ను ఏమాత్రం సందేహం రాకుండా మెత్తలు, పరుపుల్లో పెట్టి షిప్పింగ్ ద్వారా ఇక్కడి నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు పంపించే యత్నంచేసి దొరికిపోయింది. ఎన్సీబీ బృందాలు శుక్రవారం ముంబైలోని నార్త్ అం«ధేరీలో సోదాలు నిర్వహించి పలు బాక్స్లు గుర్తించాయి. ఇందులో మెత్తల్లో దాచి ఉంచిన 4.6 కేజీల ఎపిడ్రిన్ డ్రగ్స్ ప్యాక్లను స్వాధీనం చేసుకుంది. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంకెడే స్పష్టంచేశారు. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు బుక్ చేశారని వెల్లడించారు. ముంబై ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉన్న అంధేరీలో ఈ డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం. ఎంత మొత్తంలో డ్రగ్స్ విదేశాలకు వెళ్లాయో త్వరలోనే ఛేదిస్తామని సమీర్ వాంకెడే చెప్పారు. సిద్ధిఖ్ అహ్మద్ లింకులతోనేనా? మూడు రోజుల క్రితం గోవాలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన హైదరాబాదీ సిద్ధిఖ్ అహ్మద్ విచారణలో సంచలన వివరాలు వెల్లడించాడు. ముంబై ఎన్సీబీ జోన్ కింద గోవా సబ్జోనల్ పనిచేస్తుంది. హైదరాబాద్లో భారీగా ఎండీఎంఏ డ్రగ్ తయారీ జరిగి అక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నట్టు సిద్ధిఖ్ తెలిపాడు. పదేపదే హైదరాబాద్ పేరు.. ఇక్కడి పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి ఈ డ్రగ్స్ తయారు చేయడం హైదరాబాద్తోపాటు తెలంగాణ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారుచేస్తున్న కంపెనీలను స్థానిక నిఘా విభాగాలు ఎందుకు గుర్తించడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోవా, ముంబై, బెంగళూరు డ్రగ్ కేసుల్లో పదేపదే హైదరాబాద్ పేరు బయటకు రావడం ఎన్సీబీతోపాటు స్థానిక పోలీసులు, నిఘా విభాగాలకు తలనొప్పిగా మారింది. కంపెనీలపై ప్రత్యేక నజర్తోపాటు దాడులు చేసేందుకు ఎన్సీబీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిసింది. వరుస దాడులతో ఇప్పటికే ఆయా కంపెనీల్లో డ్రగ్స్ మాయ మైపోయి ఉంటాయని దర్యాప్తు విభాగాలు అనుమానిస్తున్నాయి. అయితే విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సూత్రధారులు, హైదరాబాద్ పాత్రధారులు ఎవరన్నది తేల్చే పనిలో ఎన్సీబీ ఉన్నట్టు సమాచారం. -
డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నటుడు
Singham 2 Actor Arrested For Smuggling Drugs: డ్రగ్స్ వినియోగిస్తూ నటుడు మెల్విన్ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం..సూర్య హీరోగా నటించిన సింగం-2 సినిమాలో నటించిన నైజీరియన్దేశస్థుడు, నటుడు చాక్విమ్ మాల్విన్ గుర్తున్నాడు కదా.. ఆ సినిమాలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు మాల్విన్. సీన్ కట్ చేస్తే నిజ జీవితంలో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్కు జిరాక్స్ కాపీలా ఉందే.. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 15లక్షల వరకు ఉంటుందని సమాచారం. 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ సహా మొభైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే మెల్విన్తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి?అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మెల్విన్ పలు చిత్రాల్లో నటించాడు. చదవండి: ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకోనున్న అక్షయ్కుమార్ -
బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: గుజరాత్లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. 'బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే. టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నారు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు. ఏపీకి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. చదవండి: ('భారత్ బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు') కాల్మనీ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నారు. గతంలో జీవీ ఆంజనేయులు ప్రభుత్వం తయారు చేసే ఫర్టిలైజర్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. కాల్మనీ కేసులో డైరెక్ట్గా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న. ఇలాంటి నాయకులు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడరు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు మాచవరం సుధాకర్ జగన్ అనుచరుడంటూ జీవీ ఆంజనేయులు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒడి వంటి అద్భుతమైన పథకాలతో జగన్ పాలన చేస్తున్నారు. సీఎం జగన్ డ్రగ్స్ను ఏపీలోకి రానివ్వరు. ఆధారాల్లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు. సత్తెనపల్లిలో ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘర్షణ కూడా చోటుచేసుకోలేదు. అయ్యన్న పాత్రుడు చాలా నీచంగా మాట్లాడారు. రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని గోపిరెడ్డి మండిపడ్డారు. చదవండి: (రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స) -
డ్రగ్స్ రాకెట్ కేసు: రంగంలోకి ఎన్ఐఏ!
సాక్షి, ఢిల్లీ: డ్రగ్స్ రాకెట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగంలోకి దిగనుంది. ఉగ్రవాదం కోణంలో ఎన్ఐఏ దృష్టి సారించనుంది. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాదులు మారణాయుధాలు కొనుగోలు చేస్తున్న కోణంలో విచారణ జరపనుంది. తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అఫ్ఘాన్ నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా ఏర్పాటు చేయనుంది. సరకు రవాణా ముసుగులో ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని హెరాయన్ అక్రమ దిగుమతి కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్లోని కాందహార్ నుంచి ఇరాన్లోని ముంద్రా పోర్టుకు వచ్చిన రెండు కంటెయినర్లలో 2,998 కేజీల హెరాయిన్ను ఈ నెల 17, 19 తేదీల్లో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
గుజరాత్ డ్రగ్స్తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్
-
గుజరాత్ డ్రగ్స్తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్
సాక్షి, అమరావతి: విజయవాడ కేంద్రంగా ఎటువంటి డ్రగ్స్ సరఫరా జరగలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని, డ్రగ్స్తో ఏపీ రాష్ట్రానికి సంబంధం లేదని వెల్లడించారు. విజయవాడలో జీఎస్టీ అడ్రస్ మాత్రమే ఉందని, హెరాయిన్ను విజయవాడకు గానీ, ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడిందిగా మాత్రమే డీఆర్ఐ, కేంద్ర సంస్థల అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. చదవండి: అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్ అయితే కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని డ్రగ్స్ వ్యవహారంలో డీఆర్ఐకి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం దీనిపై తగిన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’ ‘సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచిపోవడం బాధాకరం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముంద్రా పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ అంశంపై విజయవాడ కమిషనర్ ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ అంశానికీ, విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదని చెప్పారు. అయినా రాజకీయ నాయకులు ఈ అంశాన్ని మరీమరీ ప్రస్తావించడం సరికాదు. నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో లేవన్న విషయం అటు డీఆర్ఐ, కేంద్ర సంస్థలు, ఇటు పత్రికలు ధృవీకరిస్తున్నా, సీనియర్ నాయకులు అపోహలు సృష్టించడం భావ్యం కాదు. ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఏపీలో లేవు’ అని డీజీపీ సవాంగ్ తెలిపారు. చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
డ్రగ్స్ వార్: రేవంత్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా
డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో లేదా ఆయా కేసులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా రేవంత్రెడ్డి దురుద్దేశంతో పదేపదే నా పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయన దుష్ప్రచారం వల్ల నాకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించాలి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ సైతం ప్రారంభించాలి. – కోర్టులో వేసిన దావాలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ రాష్ట్రంలో రాజకీయ రచ్చకు తెరలేపింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘డ్రగ్స్కు బ్రాండ్ అంబాసిడర్’ అంటూ రేవంత్ చేస్తున్న ఆరోపణలతో మొదలైన వివాదం సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసింది. రాహుల్ గాంధీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరుల పేర్లు ‘వైట్ చాలెంజ్ బరి’లో ప్రస్తావనకు వచ్చేలా చేసింది. ఈ అంశంలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు, పేలుతున్న మాటల తూటాలు ఆసక్తికరంగా మారాయి. ట్వీట్లతో మొదలైన వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. రేవంత్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేయడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అమరుల సాక్షిగా తేల్చుకుందాం: రేవంత్ రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రీన్ చాలెంజ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం గురించే చాలా మందికి తెలుసు.. తాజాగా వైట్ చాలెంజ్ చర్చనీయాంశమయ్యింది. టాలీవుడ్తో ముడిపడిన డ్రగ్స్ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా రేవంత్ ఆరోపణల నేపథ్యంలో.. శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించేందుకు చేసే రక్తం, వెంట్రుకల పరీక్షలకు తాను సిద్ధమని కేటీఆర్ రెండురోజుల క్రితం ప్రకటించారు. దీంతో డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి మచ్చా లేదని నిరూపించుకోవాలంటూ.. కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి రేవంత్ వైట్ చాలెంజ్ విసిరారు. దేశంలో డ్రగ్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు ఈ చాలెంజ్ విసురుతున్నానని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన చాలెంజ్ను స్వీకరించారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరుల స్థూపం వద్ద కేటీఆర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి కోసం ఎదురుచూస్తానని ప్రకటించారు. దీనిపై కేటీఆర్ సామాజిక మాధ్యమ వేదిక ‘ట్విట్టర్’లో తీవ్రంగా స్పందించారు. నా ప్రతిష్ట దిగజార్చుకోలేను: కేటీఆర్ ‘ఢిల్లీ ఎయిమ్స్లో ఏ తరహా పరీక్షకైనా నేను సిద్ధం. రాహుల్ గాంధీ కూడా ఇష్టమైతే నాతో పాటు పరీక్షలు చేయించుకోవచ్చు. చర్లపల్లి జైలు మాజీ ఖైదీతో కలిసి పరీక్షలు చేసుకోవడం ద్వారా నా ప్రతిష్టను దిగజార్చుకో దలుచుకోలేదు. నేను పరీక్షలు చేసుకుని ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తే క్షమాపణ చెప్పి, నీ పదవికి రాజీనామా చేస్తావా? ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నావా..?’ అని రేవంత్ను కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని, అయితే సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో కూడా లై డిటెక్టర్ టెస్టులకు వస్తారా? అని ప్రతి సవాల్ చేశారు. దురుద్దేశంతో దుష్ప్రచారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దురుద్దేశంతో గత కొంతకాలంగా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ, ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా రేవంత్రెడ్డి దురుద్దేశంతో పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దుష్ప్రచారం వల్ల తనకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ను సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. కాగా ట్విట్టర్లో ‘రాహుల్ డ్రగ్ టెస్ట్’ హ్యాష్ట్యాగ్ను వేలాది మంది రీ ట్వీట్ చేయడంతో పొలిటికల్ న్యూస్లో ట్రెండింగ్గా నిలిచింది. రాహుల్ గాంధీ కూడా ఎయిమ్స్లో డ్రగ్ టెస్ట్కు ముందుకు రావాలని పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు, ఇతర నేతలు, నెటిజన్లు ట్వీట్ చేశారు. కేటీఆర్ ఆవేశానికి గురై బెదిరిస్తున్నారు.. డ్రగ్స్ విషయంలో రక్త పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమని మంత్రి కేటీఆర్ చెప్పిన తర్వాతే తాను ఆయన్ను సవాల్ చేశానని రేవంత్ పేర్కొన్నారు. తన సవాల్కు జవాబు చెప్పాల్సింది పోయి ఆవేశానికి గురై బెదిరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. కోర్టుకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కేటీఆర్కు వైట్ చాలెంజ్ విసిరిన రేవంత్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తన అనుచరులతో కలిసి గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కొంతసేపు బైఠాయించారు. అనంతరం మాట్లాడుతూ..కేటీఆర్తో పాటు కొండా విశ్వేశ్వర్రెడ్డికి కూడా చాలెంజ్ విసిరానని, ఆయన వచ్చినా కేటీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు. తాను చేసిన చాలెంజ్కు కౌంటర్ పేరుతో తన స్థాయి గురించి కేటీఆర్ మాట్లాడడం సబబుగా లేదన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే తాను ఎమ్మెల్సీనని చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నానని, జాతీయ పార్టీ కాంగ్రెస్కు తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని చెప్పారు. స్థాయి గురించి మాట్లాడకుండా కేటీఆర్ ఎప్పుడు వచ్చినా ఇదే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాను సిద్ధమని, గంట ముందు తనకు సమాచారం ఇస్తే చాలునని రేవంత్ చెప్పారు. ఈ రోజు రాహుల్ రావాలని అంటున్న కేటీఆర్ రేపు ఇవాంకా ట్రంప్ రావాలని అడుగుతారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలో డ్రగ్స్ కారణంగానే అనుచిత ఘటన జరిగిందని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు పబ్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసేవారంతా టెస్ట్ చేయించుకోవాలి: కొండా రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్ను స్వీకరించి గన్పార్క్ వద్దకు వచ్చిన విశ్వేశ్వర్రెడ్డి.. ఈ చాలెంజ్ సమాజానికి మంచిదని వ్యాఖ్యానించారు. రేవంత్ సవాల్ను స్వీకరించి ఇక్కడకు వచ్చి ఉంటే కేటీఆర్ స్థాయి మరింత పెరిగేదని అన్నారు. రాజకీయ నాయకులు ఈ చాలెంజ్ను స్వీకరించాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారంతా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని, ఆ తర్వాతే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించాలని కోరారు. రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్కు ఓ సామాజిక కార్యకర్తగా, తండ్రిగా ప్రతిస్పందిస్తున్నానంటూ.. తన వంతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లకు వైట్ చాలెంజ్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బాగా బలిసినోడు డ్రగ్స్ తీసుకుంటాడు: బండి సంజయ్ విశ్వేశ్వర్రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ను స్వీకరిస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ‘కాంగ్రెస్లో రాజీ రాజకీయాలు నచ్చకే విశ్వేశ్వర్రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఆయన విసిరిన చాలెంజ్ను స్వీకరిస్తున్నా. అక్టోబర్ 2న నా తొలి విడత పాదయాత్ర పూర్తయిన వెంటనే వారు కోరిన చోటుకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటా. బాగా బలిసినోడు, బలుపెక్కినోడే డ్రగ్స్ తీసుకుంటాడు. పేదోడికి అవి అవసరం లేదు’ అంటూ ప్రతి స్పందించారు. చంద్రబాబు, లోకేశ్కు కూడా విసరండి వైట్ చాలెంజ్ పేరిట రేవంత్రెడ్డి తెలంగాణ అమరుల స్థూపాన్ని అపవిత్రం చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దిన్ నేతృత్వంలో టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అమరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొత్తులా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు రేవంత్రెడ్డి వైట్ చాలెంజ్ విసరాలని డిమాండ్ చేశారు. -
ఆ కేసుతో విజయవాడకు సంబంధంలేదు: సీపీ
సాక్షి, విజయవాడ: గుజరాత్లో పట్టుబడ్డ డ్రగ్స్కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయవాడకు డగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారన్నది వాస్తవం కాదని సీపీ స్పష్టం చేశారు. గుజరాత్ ముంద్ర పోర్టులో హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) చెన్నై నివాసముంటున్న దుర్గాపూర్ణ వైశాలి పేరుతో విజయవాడ అడ్రస్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారన్నారు. కొన్నేళ్లుగా వైశాలి, ఆమె భర్త, సుధాకర్ చెన్నైలో ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్ఐ విచారణ జరుపుతోందని సీపీ వివరించారు. ఈ కేసుపై అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలలో కూడా సోదాలు నిర్వహించాయన్నారు. విజయవాడలో ఇంటి అడ్రస్తో లైసెన్స్ తీసుకోవడం తప్పితే డ్రగ్స్ ఆనవాళ్లు లేవని సీపీ తెలిపారు. చదవండి: గర్ల్ఫ్రెండ్కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు -
అఫ్గాన్ టు గుజరాత్.. వయా విజయవాడ!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్కు విజయవాడ గేట్వేగా మారిందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. ఏకంగా రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్తో విజయవాడలోని ఓ వ్యాపార సంస్థకు సంబంధాలున్నాయన్న విషయం విస్మయం కలిగిస్తోంది. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుజరాత్లోని ముండ్రా పోర్ట్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో తీగ లాగితే విజయవాడలో డొంక కదలింది. టాల్కం పౌడర్ కాదు..హెరాయిన్ అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్లోకి హెరాయిన్ను స్మగ్లింగ్ చేశారని కేంద్ర డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దాంతో గుజరాత్లోని ముండ్రా పోర్టులో తనిఖీలు నిర్వహించగా.. భారీ పరిమాణంలో హెరాయిన్ను గుర్తించారు. టాల్కం పౌడర్ పేరుతో ఉన్న భారీ కన్సైన్మెంట్ను తెరచి చూడగా.. అందులో భారీస్థాయిలో హెరాయిన్ ఉండటం విస్మయపరిచింది. కాందహార్లోని ‘హాసన్ హుస్సేన్ లిమిటెడ్’ అనే వ్యాపార సంస్థ నుంచి ‘టాల్కం పౌడర్’ పేరుతో ఆ హెరాయిన్ను దిగుమతి చేసుకున్నారు. తొలుత ఆ హెరాయిన్ విలువ రూ.2,500 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేయగా.. దాని విలువ ఏకంగా రూ.9 వేల కోట్లుగా నిర్ధారించారు. ఇంతకీ ఆ హెరాయిన్ను ఎవరు దిగుమతి చేశారని దర్యాప్తు చేయగా... విజయవాడలోని లింకులు బయటపడ్డాయి. పోలీసుల అదుపులో నలుగురు విజయవాడలోని అషీ ట్రేడింగ్ కంపెనీ అఫ్గానిస్తాన్ నుంచి హెరాయిన్ను దిగుమతి చేసుకుందని కన్సైన్మెంట్ రికార్డుల్లో ఉంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడలోని గడియారం వీధిలోని అషీ ట్రేడింగ్ కంపెనీని గుర్తించారు. ఆ కంపెనీ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచా రణ చేపట్టారు. కాగా, వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమది కేవలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మాత్రమేనని.. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు జప్తు చేసిన హెరాయిన్తో తమకు సంబంధంలేదని చెప్పినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు తరలించేందుకే.. ఆ హెరాయిన్ను గుజరాత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తరలించనున్నారన్నది పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కాగా, స్మగ్లింగ్ రాకెట్ అసలు ప్రణాళిక ఏమిటన్న దానిపై పోలీసులు ఇతమిత్థంగా ఇంకా ఓ అంచనాకు రాలేదు. గుజరాత్ నుంచి విజయవాడ తీసుకువచ్చి ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారా లేక విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా గుజరాత్ నుంచి చెన్నై తరలించాలన్నది స్మగ్లర్ల ప్రణాళికా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును మాత్రమే స్మగ్లింగ్ రాకెట్ వాడుకుంటోందా అన్న దాంట్లో వాస్తవం ఎంతన్నది అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి అషీ ట్రేడింగ్ కంపెనీకి చెం దిన ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సింథటిక్ డ్రగ్స్ను ఆన్లైన్ ద్వారా తె ప్పించి విక్రయిస్తున్న ముఠాను గుంటూరు పో లీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అం తలోనే రూ.9వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్లో విజయవాడ కేంద్ర బిందువుగా ఉందని తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ దందాపై పోలీస్, డీఆర్ఐ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవ ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ను ‘సాక్షి’ సంప్రదించగా.. హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంలో విజయవాడ లింకులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదే అంశంపై విజయవాడలోని కేంద్ర డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజీవ్ను ‘సాక్షి’ సంప్రదించగా.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ
బనశంకరి: బెంగళూరులో ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన నైజీరియన్ని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.2 కోట్ల విలువచేసే 4 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్ (సింథటిక్ డ్రగ్స్), డ్రగ్స్ తయారీకి వాడే రసాయనాలను సీజ్ చేశారు. నిందితుడు డేవిడ్ జోమలవే అని పోలీసులు తెలిపారు. 2018లో డేవిడ్ భారత్కు చేరుకుని సోదరునితో కలిసి డ్రగ్స్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని ఎల్రక్టానిక్ సిటీ వద్ద గల చాముండీలేఔట్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒక ఫ్యాక్ట రీలో పనిచేస్తున్నట్లు ఇంటి యజమానికి చెప్పేవా డు. ఆ తరువాత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి రసాయనాలు, అలాగే ఉపకరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసి ఇంట్లోనే ఉత్పత్తిని ప్రారంభించాడు. ఎండీఎంఏ (ఎక్స్టసీ) డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు పంపుతూ భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీస్కమిషనర్ కమల్పంత్ తెలిపారు. బూట్ల కింద దాచి స్మగ్లింగ్ బూట్ల కింది భాగంలో ఎండీఎంఏ క్రిస్టల్స్ను దాచిపెట్టి కొరియర్ ద్వారా న్యూజిల్యాండ్, ఆ్రస్టేలియాలతో పాటు వివిద దేశాలకు సరఫరా చేసేవాడు. కస్టమర్లు ఇచి్చన డబ్బును ఢిల్లీలో ఉన్న తన సోదరుని బ్యాంక్ అకౌంట్లో జమచేయించుకునే వాడని పోలీసులు తెలిపారు. ఇతడు నైజీరియన్ కాగా, ఉగాండా, మొజాంబిక్ దేశాల పాస్పోర్టును కలిగి ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్
యశవంతపుర: శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ అందాల యాంకర్, నటి అనుశ్రీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మంగళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో శాండల్వుడ్ డ్రగ్స్ రాకెట్ బయటపడగా, అప్పట్లో ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. ముఖ్య సమాచారాన్ని చార్జిషీట్లో ప్రస్తావించారు. అనుశ్రీ డ్రగ్స్ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్ అమన్ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేవారు. అనుశ్రీ బెంగళూరులో నృత్య సాధన చేస్తున్న సమయంలో డ్రగ్స్ సేవిస్తే ఖుషీగా డ్యాన్స్ చేయవచ్చని తోటివారితో చెప్పేది. అనుశ్రీ రియాలిటీ షోలో గెలిచిన సమయంలో తరుణ్ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. నేను అలా చెప్పలేదే: అమన్శెట్టి.. అనుశ్రీ డ్రగ్స్ తీసుకొంటుందని తాను పోలీసుల విచారణలో చెప్పలేదని తాజాగా కిశోర్ అమన్శెట్టి ప్రకటించాడు. ఆయన మంగళూరులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమెతో నాకు పరిచయం లేదు, 2009లో కుణియోణ బారా కన్నడ డ్యాన్స్ షోలో కలిశాను. తరువాత ఆమెను ఎప్పుడూ ఎక్కడా కలవలేదన్నారు. చార్జీషీట్లో పొందుపరిచిన ఆరోపణలను ఖండించారు. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదన్నారు. మత్తు పార్టీలు ఆగలేదు: ఇంద్రజిత్.. డ్రగ్స్ కేసులో నిందితుల మూత్రం, రక్తం పరీక్షిస్తే చాలదు. తల వెంట్రుకలను కూడా పరీక్షించాలని నిర్మాత, పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ డిమాండ్ చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలున్నవారందరూ మళ్లీ డ్రగ్స్ పార్టీలకు వెళ్తున్నారు. డ్రగ్స్ కేసు కర్ణాటకలో పెద్ద కుంభకోణం. అన్ని రంగాల ప్రముఖులు ఈ దందాలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అని ఆయన ఆరోపించారు. విశ్రాంత ఐపీఎస్ జోక్యం: సంబరగి.. ఒక రిటైర్డు ఐపీస్ అధికారి ప్రభావంతో డ్రగ్స్ కేసు దారి తప్పినట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగి బెంగళూరులో ఆరోపించారు. తరుణ్ అనే వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు, చార్జీషీట్లో అతని పేరును ఎందుకు పేర్కొనలేదు? అని ప్రశ్నించారు. బెంగళూరుకంటే మంగళూరులో డ్రగ్స్ మాత్రలు ఎక్కువగా దొరుకుతాయని కిశోర్ అమన్శెట్టి చెప్పాడన్నారు. అనుశ్రీ ఏమన్నారంటే.. తను ఏ తప్పు చేయలేదంటూ అనుశ్రీ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను బెంగళూరుకు 14 ఏళ్ల క్రితం బస్సులో వచ్చి చేరుకున్నా. సుమారు 12 ఏళ్ల కాలం పాటు హాస్టల్లో ఉన్నాను. ఆ తర్వాత నాటక రంగంలో ఆఫర్లు వచ్చాయి. నేను మంచిగా ఉన్నాను, కనుకనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అయితే డ్రగ్స్ కేసులో విచారించడం బాధకు గురి చేసింది అన్నారు. ఇవీ చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్ చూశారా! నానిలోనాకు బాగా నచ్చిన విషయం అదే : రీతూ వర్మ -
బంజారాహిల్స్: ఓయో రూమ్స్లో అవసరమైన వారికి..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.14లో డ్రగ్స్తో పాటు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ టీమ్ అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ ప్రశాంత్నగర్లో మార్ధి శివశంకర్ రెడ్డి(26), బల్కంపేట తులసీ నగర్ జయప్రకాశ్ నగర్లో నివసించే గంధం మణికంఠ(26), వెస్ట్బెంగాల్ డార్జిలింగ్కు చెందిన శిల్పారాయ్(27) ముగ్గురూ కలిసి కొంత కాలంగా అవసరమైన వారికి డ్రగ్స్తో పాటు గంజాయి విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వీరిని బంజారాహిల్స్లో అరెస్ట్ చేశారు. ఓయో రూమ్స్లో అవసరమైన వారికి ఈ డ్రగ్స్ను, గంజాయిని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ను దిగుమతి చేసుకుంటున్నట్లుగా విచారణలో తేలింది. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి వీరి నుంచి పెద్ద ఎత్తున గంజాయితో పాటు డ్రగ్స్ను, మొబైల్ ఫోన్స్, మో టార్ బైక్లను సీజ్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఎన్ఏ అజయ్రావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి, సీఐ పి.నరేందర్, ఎస్ఐ నజీర్ హుస్సేన్, కానిస్టేబుల్ భాస్కర్రెడ్డి, అజీమ్, శ్రీధర్ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. చదవండి: ఊరికెళ్లే విషయంలో యువ దంపతుల గొడవ.. ఉదయం లేచేసరికి -
డ్రగ్స్ కేసు : నటుడు అర్మాన్ కోహ్లీకి షాక్ ఇచ్చిన కోర్టు
Armaan Kohli Bail Denied In Drugs Case: నటుడు అర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాకిచ్చింది. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని గత నెల28న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్మాన్ నివాసంలో జరిపిన సోదాల్లో 1.2 గ్రాముల కొకైన్ లభ్యం కావడంతో ఎన్సీబీ అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టు అర్మాన్కు 14రోజల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిని సవాలు చేస్తూ తనకు డ్రగ్ సప్లయర్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అర్మాన్ పేర్కొన్నాడు. తనకు వెంటనే బెయిల్ ముంజూరు చేయాలని కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా ఈ కేసులో అర్మాన్తో పాటు ఏడుగురు నిందితులు ఉన్నారని, వీరికి ఒకరితో మరొకరికి సంబంధాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్మాన్కు బెయిల్ మంజూరు చేయరాదంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై ఏకీభవించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎమ్ నెర్లికర్ అర్మాన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. చదవండి : సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్ -
ముగిసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణ
-
డ్రగ్స్ కేసు: కెల్విన్, ఎఫ్ క్లబ్తో చాటింగ్పై రకుల్ను ప్రశ్నిస్తున్న ఈడీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయిదు గంటలుగా ఈడీ అధికారులు రకుల్ ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో తన మూడు బ్యాంక్ అకౌంట్ల లావాదేవిల వివరాలపై ఈడీ విచారిస్తోంది. ఆడిటర్తో పాటు రకుల్ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు. ఈ క్రమంలో ఎఫ్ క్లబ్ మేనేజర్, డ్రగ్ డీలర్ కెల్విన్తో ఆమె జరిపిన బ్యాంక్ లావాదేవిలు, చాటింగ్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న తన మూడు ఫిట్సెంటర్లపై ఆరా తీస్తున్నా అధికారులు. అలాగే పలు అనుమానిత ట్రాన్సెక్షన్లపై కూడా ఈడీ అధికారులు రకుల్ను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రకుల్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ను ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు నోటీసులో పేర్కొనగా 9:10 గంటలకే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంది. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్తో కలిసి రకుల్ ఈడీ ఆఫీసుకు వచ్చింది. కాగా ఈ డ్రగ్ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి చార్మీలను ఈడీ విచారించిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు వారు సమర్పించారు -
డ్రగ్స్ కేసు : ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైంది. ఈడీ అధికారుల కంటే ముందే రకుల్ అక్కడికి చేరుకుంది. ఉదయం 10:30 కి ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు నోటీసులో పేర్కొనగా..9:10కే ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంది. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్తో కలిసి రకుల్ ఈడీ ఆఫీసుకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రకుల్ని ప్రశ్నించనున్న ఈడీ.. ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించనుంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లతో పాటు ఇతర వివరాలను తేవాలని ఈడీ నోటీసులో పేర్కొంది. నిజానికి సెప్టెంబర్ 6న విచారణకు హజరుకావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(సెప్టెంబర్3)న విచారణకు హాజరవుతానని రకుల్.. ఈడీకి మెయిల్ ద్వారా తెలిపింది. దీంతో డాక్యుమెంట్స్తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ నోటీసులో పేర్కొంది. 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. తాజాగా రకుల్ ప్రీత్సింగ్కు డ్రగ్స్ కేసుతో పలు లింకులున్నట్లు ఈడీ విచారణలో గుర్తించింది. అప్రూవర్గా మారిన కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రకుల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రకుల్ను విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ను 10 గంటలు, చార్మిని ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ రకుల్ను ఎన్ని గంటలు విచారిస్తుందో చూడాల్సి ఉంది. చదవండి : డ్రగ్స్ కేసు: ముగిసిన చార్మీ ఈడీ విచారణ Tollywood Drugs Case: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా -
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు : నటి సోనియా
Bengaluru Drug Case : కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ అయి ఇటీవలె బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, మోడల్ సోనియా అగర్వాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె ప్రస్తుతం కర్ణాటకలో కాస్మోటిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. తాజాగా బెంగుళూరులో ఏకకాలంలో జరిపిన సోదాల్లో సోనియాతో పాటు మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్ చిన్పప్ప ఇళ్లలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి వీరికి నైజీరియా డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా డ్రగ్స్ వ్యవహారంలో నటి సోనియా అగర్వాల్ అరెస్ట్ కాగా కొన్ని మీడియా సంస్థలు అత్యత్సాహంతో ఆమెకు బుదులుగా సినీ నటి సోనియా అగర్వాల్ ఫోటోను ప్రచురించాయి. పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో భయపడి ఆమె బాత్రూంలో దాక్కుందని, అయినా లాక్కొచ్చి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో అంతా 7/జీ బృందావన కాలనీ ఫేమ్ సోనియానే అనుకున్నారు. కానీ సోనియా ఆ వార్తలను కొట్టిపారేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని, అసలు పోలీసులు రైడ్ చేసింది తన ఇంట్లో కాదని, ఆ సమయంలో తాను కేరళలో షూటింగ్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు, వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. చదవండి : Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన చార్మీ ‘ఇద్దరు పిల్లల తల్లిని.. విచారణకు హాజరుకాలేను’ -
ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్
-
డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తనయుడు ఆకాష్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి పూరి జగన్నాథ్ ఈడీ కార్యాలయ్యానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది.విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే 'ఫెమా' కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరీ జగన్నాథ్తో పాటు రానా దగ్గుబాటి, రకుల్ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖులు, విచారణ తేదీ 1.పూరి జగన్నాథ్ – ఆగస్టు 31 2.ఛార్మి – సెప్టెంబర్ 2 3.రకుల్ప్రీత్ సింగ్ – సెప్టెంబర్ 6 4.రాణా దగ్గుబాటి – సెప్టెంబర్ 8 5.రవితేజ – సెప్టెంబర్ 9 6.శ్రీనివాస్ – సెప్టెంబర్ 9 7.నవదీప్ – సెప్టెంబర్ 13 8 ఎఫ్ క్లబ్ జీఎం – సెప్టెంబర్ 13 9.ముమైత్ ఖాన్ – సెప్టెంబర్ 15 10.తనీష్ – సెప్టెంబర్ 17 11.నందు – సెప్టెంబర్ 20 12.తరుణ్ – సెప్టెంబర్ 22 చదవండి : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను విచారించిన ఈడీ డ్రగ్స్ కేసు: సెలబ్రిటీల ఇంట్లో సోదాలు చేసే అవకాశం? -
డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం నుంచి సినీ ప్రముఖులను విచారించనుంది. పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ప్రీత్ సింగ్, రాణా దగ్గుబాటి, రవితేజ సహా మొత్తం 12 మంది ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తొలిరోజు విచారణకు హాజరుకానున్నారు. పూరి సహా అందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. 2017లో ప్రభుత్వం నియమిం చిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి శ్రీనివాస్ వద్ద.. గతంలో జరిగిన దర్యాప్తు వివరాలను, ఆ సందర్భంగా వెలుగు చూసిన సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు. పలువురు సినీ ప్రముఖులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్టుగా అనుమానిస్తున్న కెల్విన్, కమింగాలను ఇంతకుముందే విచారిం చిన ఈడీ.. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకుంది. వాటి ఆధారంగానే ఇప్పుడు సినీ ప్రముఖులను విచారించనుంది. కెల్విన్ మైక్ కమింగాలను 2017లో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆస్తుల జప్తు .. ఫెమా చట్టం కింద కేసులు! డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ సైతం జరిగిందన్న ఆధారాలతో లబ్ధిదారుల అస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 కింద ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) కోర్టులో దాఖలు అయ్యింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేసుల ఆధారంగా విదేశీ అక్రమ లావాదేవీల గుట్టు విప్పే పనిలో ఈడీ ఉంది. తాజా విచారణలో అక్రమాలు నిజమేనని తేలితే ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఈడీ దృష్టి సారించనుంది. అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉన్న డ్రగ్స్ ముఠాల బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించేందుకు ఇంటర్పోల్ సహకారం తీసుకోనుంది. ప్రస్తుతం నోటీసులు జారీ చేసిన సినీ ప్రముఖుల్నే కాకుండా గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారించిన 62 మందిలో మరికొందరిని కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖులు, విచారణ తేదీ 1.పూరి జగన్నాథ్ – ఆగస్టు 31 2.ఛార్మి – సెప్టెంబర్ 2 3.రకుల్ప్రీత్ సింగ్ – సెప్టెంబర్ 6 4.రాణా దగ్గుబాటి – సెప్టెంబర్ 8 5.రవితేజ – సెప్టెంబర్ 9 6.శ్రీనివాస్ – సెప్టెంబర్ 9 7.నవదీప్ – సెప్టెంబర్ 13 8 ఎఫ్ క్లబ్ జీఎం – సెప్టెంబర్ 13 9.ముమైత్ ఖాన్ – సెప్టెంబర్ 15 10.తనీష్ – సెప్టెంబర్ 17 11.నందు – సెప్టెంబర్ 20 12.తరుణ్ – సెప్టెంబర్ 22 -
Drugs Case: సిట్ అధికారి శ్రీనివాస్ను విచారించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ విచారణను వేగవంతం చేసింది. 2017లో డ్రగ్స్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన సిట్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలు ఎక్సైజ్ సిట్ అధికారి ఎస్. శ్రీనివాస్ ఈడీ అధికారులకు సమర్పించారు. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు క్రమాన్ని శ్రీనివాసరావు ఈడీకి వివరించారు. కాగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ ప్రముఖలను ఈడీ ప్రశ్నించనున్న సంగతి తెలిసిందే. 2017లో సిట్ విచారణ హైదరాబాద్కు చెందిన అనేక మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన కెల్విన్తోపాటు చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సోదరులు అబ్దుల్ వహీద్, ఖుద్దూస్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. వీళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతోపాటు విద్యార్థులు, సిటీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించినట్లు అనుమానించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) ఏర్పాటై 10 మంది అనేక మందికి నోటీసులిచ్చింది. అదే ఏడాది జూలై 19 నుంచి కొన్ని రోజులు వీరిని విచారించింది. అప్పట్లో మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్... 11 కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో ఎక్కడా సినీ రంగానికి చెందిన వారిని నిందితులుగా చేర్చలేదు. 2017 జూలైలోనే టాలీవుడ్ ప్రముఖులతోసహా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోళ్ల నమునాలను సేకరించింది. ఆధారాల సేకరణ కోసం అప్పట్లో సిట్ విచారణకు హాజరైన సినీ ప్రముఖులను విచారించాలని తాజాగా నిర్ణయించింది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు -
డ్రగ్స్ కేసు: సెలబ్రిటీల ఇంట్లో సోదాలు చేసే అవకాశం?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేసిన ఈడీ తాజాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారంగా ఈసీఐఆర్ను నమోదు చేసింది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే 'ఫెమా' కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ.. కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చదవండి : Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు Tollywood Drugs Case 2021: డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు
-
Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. కాగా, ఇప్పటికే ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ ల నుంచి వాగ్మూలాన్ని సేకరించారు. అదేవిధంగా, 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. కాగా, దీనిపై విచారించిన అనంతరం మరికొంత మందికి నోటిసులను జారీచేసే అవకాశం ఉంది. విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఇంటర్పోల్ సహయంతో విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. తాజాగా మరికొంత హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు చదవండి: విషాదం: లోయలో పడ్డ కారు.. నవ వధువు, తండ్రి మృతి -
డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన
Sandalwood Drug Case: డ్రగ్స్ కేసులో నిందితురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమె తల్లీ రేష్మా గల్రాని ఈ విషయం తెలిపారు. అన్నింటికీ తలరాత బాగుండాలి. అయితే మేం ఎలాంటి తప్పు చేయలేదు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని చెప్పారు. సంజన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాము డ్రగ్స్ సేవించినట్లు సీసీబీ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడంపై శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలు, అందాల నటి రాగిణి ద్వివేది స్పందించారు. దేవుడు వేసిన ప్లాన్పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్తో సంప్రదిస్తున్నారు. డ్రగ్స్పై కఠిన చర్యలు: హోంమంత్రి రాష్ట్రంలో మత్తు దందాను నియంత్రిస్తామని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. బుధవారం కోరమంగళ్లోని కేఎస్ఆర్పీ మైదానంలో పోలీసు పబ్లిక్ స్కూలును ప్రారంభించి విలేకర్లతో మాట్లాడారు. మత్తు పదార్థాలతో యువత జీవనం నాశనమవుతోందన్నారు. పోలీసుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించడానికి పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐపీఎస్ రజనీశ్ గోయల్, డీజీపీ ప్రవీణ్ సూద్ పాల్గొన్నారు. చదవండి : Drugs Case: శాండల్వుడ్ నటీమణులు రాగిణి, సంజనకు షాక్ నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్ -
బెంగళూరు టు ఆస్ట్రేలియా వయా హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: సింథటిక్ డ్రగ్స్గా పిలిచే యాంఫిటమైన్, సైడో ఎఫిడ్రిన్లను నగరం నుంచి ఆస్ట్రేలియాకు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రట్టు చేశారు. గత వారం బెంగళూరుతో పాటు నగరంలోని అక్బర్బాగ్ల్లో జరిపిన దాడుల్లో మొత్తం ముగ్గురిని పట్టుకున్నారు. వీరి నుంచి 3.9 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ను ఎన్సీబీకి చెందిన బెంగళూరు యూనిట్ చేపట్టింది. బెంగళూరుకు చెందిన సూత్రధారులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో ఈ సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని ఆ దేశాలనికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికో సం ఈ గ్యాంగ్ పోలీసు, కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వివిధ మా ర్గాలను అనుసరిస్తోంది. తొలుత బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు జిమ్ ఉపకరణాల మధ్యలో ఉంచి 2.5 కేజీల యాంఫిటమైన్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ బెంగళూరు యూనిట్ గత నెల 6న అక్కడి ఓ కొరియర్ సంస్థపై దాడి చేసింది. ఇస్మాయిల్ అనే నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఆస్ట్రేలియాకు పార్శిల్ చేసిన డ్రగ్ను స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామంతో కంగుతిన్న స్మగ్లర్లు తమ ‘రూటు’ మార్చారు. హైదరాబాద్ నుంచి పార్శిల్ చేయాలని పథకం వేశారు. ఈ విషయాన్నీ గుర్తించిన ఎన్సీబీ టీమ్ గత వారం నగరానికి చేరుకుంది. చంచల్గూడ సమీపంలోని అక్బర్ బాగ్ ప్రాంతంలోని ఓ కొరియర్ కార్యాలయంపై కన్నేసి ఉంచింది. తమిళనాడుకు చెందిన ఎ.తాహెర్, ఆర్.మీరన్ను ఓ పార్శిల్తో అక్కడకు చేరుకున్నారు. ఎంబ్రాయిడరీ వస్తువుల పేరుతో ఆస్ట్రేలియాకు దాన్ని పంపాలని ప్రయత్నించారు. అక్కడే మాటు వేసి ఉన్న ఎన్సీబీ టీమ్ వారిని అదుపులోకి తీసుకుని పార్శిల్ను తనిఖీ చేసింది. అందులో 1.4 కేజీల సూడో ఎఫిడ్రిన్ పౌడర్ బయటపడింది. దీంతో ఆ ఇద్దరినీ అరెస్టు చేసిన అధికారులు బెంగళూరు తరలించి జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. ఈ గ్యాంగ్కు సూత్రధారులుగా ఉన్న కర్ణాటక వాసుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి : Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి -
డ్రగ్స్ రాకెట్ కలకలం: కాలేజీ స్టూడెంట్స్, టెక్కీలే టార్గెట్
బనశంకరి: కర్ణాటకలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు శుక్రవారం బెంగళూరులోని హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి అస్సాంకు చెందిన ప్రముఖ డ్రగ్స్ పెడ్లర్ నబరన్చెక్మా, అతని అనుచరులు మోబీన్బాబు, రోలాండ్ రోడ్నిరోజర్, తరుణ్కుమార్ లాల్చంద్ను అరెస్ట్ చేశారు. రూ.6 కోట్ల విలువైన 15 కిలోల ఆశీశ్ ఆయిల్, 11 కిలోల గంజాయి, 530 గ్రాముల సెరస్ ఉండలు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర పోలీస్ చరిత్రలో 15 కిలోల ఆశీశ్ ఆయిల్ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. గత ఏడాది సీసీబీ యాంటీ డ్రగ్స్ పోలీసులు పక్కా సమాచారంతో బెంగళూరులోని రామమూర్తినగరలో దాడులు నిర్వహించి నబరన్చెక్మా అనుచరుడు సింటోథామస్ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నబరన్చెక్మా తప్పించుకున్నాడు. అతని కోసం గాలిస్తుండగా హెణ్ణూరు పోలీస్స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు నిర్వహించగా నబరన్చెక్మా గ్యాంగ్, అతని అనుచరులు పట్టుబడ్డారని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. నబరన్చెక్మా తన అనుచరులతో కలిసి కాలేజీ విద్యార్థులు, ఐటీ, బీటీ కంపెనీలకు చెందిన టెక్కీలకు ఆశీశ్ ఆయిల్, గంజాయిని విక్రయించేవాడని తెలిపారు. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) Yet another drug haul by CCB Anti Narcotics Wing..Rs 5 cr worth of 15 Kgs Hashish, 10 Kg Cannabis, Charas, Cocaine, Ecstacy pills, LSD strips, Hydro Ganja plants seized.. 5 accused arrested..& r main kingpin of hashish supply in Blore..@CPBlr @BlrCityPolice pic.twitter.com/RdGi70EBJX — Sandeep Patil IPS (@ips_patil) August 6, 2021 -
లైంగిక ఆరోపణలకు రివెంజ్!.. నటి అరెస్ట్తో ఉలిక్కిపాటు
రంగుల ప్రపంచంలో వివాదాలు-విమర్శల్లో చిక్కుకునే సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటోందో చెప్పే ఘటన ఇది. అగ్ర కథానాయిక పోరీ మోనీ(28) అరెస్ట్ బంగ్లాదేశ్లో సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలు కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’(Rapid Action Battalion) బుధవారం రాత్రి ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు. అరెస్ట్ ఇలా.. బుధవారం సాయంత్రం ఢాకా బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్న రాబ్ టీం.. సుమారు నాలుగు గంటపాటు సోదాలు నిర్వహించింది. ఆపై రాత్రి తొమ్మిది గంటల టైంలో ఆమెను హెడ్ క్వార్టర్స్కు తరలించి ప్రశ్నించింది. ఆ వెంటనే ఆమె అరెస్ట్ను ధృవీకరిస్తూ రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున్న మత్తు, మాదక ద్రవ్యాలు, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రాబ్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రతీకారంగానే.. పోరీ మోనీ అసలు పేరు షామ్సున్నాహర్. సైడ్ కిక్ వేషాల నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహమ్మూద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేయగా.. హైలెవల్ పరిచయాలతో కేసు నమోదు కాకుండా తప్పించుకున్నాడు నిందితుడు. ఈ తరుణంలో ఆమెకు నటులు, నెటిజన్స్ నుంచి మద్ధతు దక్కింది. తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో ఎట్టకేలకు నిందితుడు నజీర్ను, ముగ్గురు మహిళల్ని, నజీర్ సహచరుడైన డ్రగ్ డీలర్ తుహిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్టా కేసు నజీర్ అరెస్ట్ అయిన వారం తర్వాత గుల్షన్ ఆల్ కమ్యూనిటీ క్లబ్ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా ఓ కేసు దాఖలు చేశారు(నజీర్ ఈ క్లబ్కు డైరెక్టర్ కూడా). డ్రగ్స్ మత్తులో జూన్ 7న ఆమె క్లబ్పై దాడి చేసిందని క్లబ్ అధ్యక్షుడు అలంగిరి ఇక్బాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై నార్కొటిక్ చట్టం ప్రకారం కేసు నమోదుకాగా.. ఆపై బెయిల్ దొరికింది. ఆ వెంటనే నజీర్, అతని అనుచరులు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. చంపేస్తారన్న కాసేపటికే.. బుధవారం మధ్యాహ్నాం పోరి మోనీ ఫేస్బుక్ లైవ్లోకి వచ్చింది. తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని, గేట్ను ధ్వంసం చేశారని, సాయం కోరినా పోలీసులు స్పందించడం లేదంటూ ఆమె లైవ్లో వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వంకతో వచ్చి కూడా తనను చంపేస్తారని భయంగా ఉందంటూ ఆమె ఆందోళన చెందింది. ఆ కాసేపటికే ఇంటికి చేరుకున్న Rapid Action Battalion.. ఆమెను అరెస్ట్ చేయడం కొసమెరుపు. ఇక పోరీ మోనీతో పాటు ఓ సినిమా ప్రొడ్యూసర్-అతని ఇద్దరు అనుచరుల మీద కూడా నార్కొటిక్ కేసు నమోదు అయ్యింది. -
బెంగళూరు: టెక్కీలు, సంపన్నులే వారి లక్ష్యం
సాక్షి, బెంగళూరు/బనశంకరి: సిలికాన్ సిటీలో మత్తు పదార్థాల రవాణా– విక్రయాలు ఆందోళనకరస్థాయికి చేరాయి. గత ఆరునెలల్లో బెంగళూరులో 100 మంది విదేశీ డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్చేశారు. వారినుంచి సుమారు 2,500 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఆరునెలల్లో 2,550 కేసులు నమోదు కాగా 3,771 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాది ఆరునెలలకే గతేడాది కంటే ఎక్కువమంది దొరికిపోయారు. వీరిలో వంద మంది విదేశీయులు ఉండడం గమనార్హం. వారిదే అధిక వాటా నైజీరియాతో పాటు ఆఫ్రికా దేశాలకు చెందిన పర్యాటకులు హెణ్ణూరు, బాణసవాడి, కోరమంగల, కొత్తనూరు, రామమూర్తినగర, యలహంక, పుట్టేనహళ్లి, వైట్పీల్డ్, మారతహళ్లి, బెళ్లందూరు ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. చదువు, పర్యాటకం ముసుగులో డ్రగ్స్ విక్రయాలే వృత్తిగా చేసుకున్నారు. బెంగళూరులో జరిగే డ్రగ్స్ దందాలో 60 శాతం వాటా వీరిదే. దేశ విదేశాల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ సేకరించి టెక్కీలు, సంపన్నులు, విద్యార్థులకు అమ్ముతూ నెలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఎల్ఎస్డీ, హషిష్, కొకైన్, బ్రౌన్షుగర్, గంజాయి సహా వీరి వద్ద దొరకని డ్రగ్ ఉండదని చెబుతారు. ఆర్డర్ ఇస్తే గంటల్లో ఇంటికే డెలివరీ చేస్తారు. విదేశీయుల డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేస్తున్నామని పోలీస్కమిషనర్ కమల్పంత్ తెలిపారు. ఏడాది కేసులు విదేశీయులు దొరికిన డ్రగ్స్ (కేజీలు) 2018 285 44 764 2019 768 38 1,053 2020 2,766 84 3,912 2021 2,550 100 2,545