మెడికల్ పేపర్ లీక్ కావడంతో.. ఎంసెట్-2ను రద్దుచేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటివరకు మెడికల్ కోర్సుల కోసం దాదాపు ఐదు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులంతా మరోసారి ప్రవేశపరీక్ష రాసి తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున ఇంకా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే.. పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Published Fri, Jul 29 2016 8:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement