leakage
-
తాజ్మహల్ ప్రధాన గోపురం నుంచి లీకేజీ : స్పందించిన అధికారులు
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం తాజ్మహల్కి వర్షాల బెడద తప్ప లేదు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఢిల్లీలోని ఆగ్రాలో కొలువై వున్న ప్రేమసౌథం తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకైంది. దీంతో తాజ్ మహల్ ఆవరణలో ఉద్యానవనం నీట మునిగింది. ఈ లీకేజీకి సంబంధించి 20 సెకన్ల వీడియో ఇంటర్నెట్లో వీడియో గురువారం వైరల్గా మారింది.అయితే, సీపేజ్ కారణంగా లీకేజీ ఉందని, పాలరాతి భవనానికి ఎలాంటి నష్టం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఆగ్రా సర్కిల్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోమ్ను పరిశీలించామని ప్రమాదం ఏమీలేదని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.ఏఎస్ఐ సూపరింటెండింగ్ చీఫ్ రాజ్కుమార్ పటేల్ తెలిపారు. తోటలలో ఒకటి వర్షం నీటితో మునిగి పోయింది. దీన్ని తాజ్ మహల్ను సందర్శించిన పర్యాటకులు వీడియో తీశారని పేర్కొన్నారు.🇮🇳 Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits India's AgraWork is ongoing to drain the water from one of the Seven Wonders of the World.pic.twitter.com/C5shcu4HZh— RT_India (@RT_India_news) September 12, 2024 తాజ్ మహల్ మొత్తం దేశానికి గర్వకారణమని వేలాది పర్యాటకులు ఆకర్షిస్తున్న ఈ ప్రదేశంలో పర్యాటక పరిశ్రమలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుందని దీనిపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే తమ ఏకైక ఆశాదీపమని టూర్ గైడ్ ఒకరు కోరారు. కాగా ఆగ్రాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాజధాని నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు జలమయ మైనాయి. వర్ష కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
విశాఖ జిల్లా గాజువాకలోని శ్రవణ్ షిప్పింగ్ లో ప్రమాదం
-
అయ్యో పాపం.. గాఢ నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి కుటుంబం
మైసూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో ఊపిరాడక మరణించిన ఘటన మైసూరు యరగనహళ్లిలో జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు సఖరాయపట్టణ నివాసులు కుమారస్వామి (45), భార్య మంజుల (39), వీరి పిల్లలు అర్చన (19), స్వాతి (17)లు మృతులు. ఈ కుటుంబం చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణ గ్రామానికి చెందిన వారు. మైసూరు యరగనహళ్లిలో మూడేళ్ల నుంచి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రజక వృత్తితో జీవనం సాగిస్తున్నారు.చిన్న ఇంట్లో, కిటికీలు మూసేసివారిది 10 ఇన్ టు 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చిన్న ఇల్లు. ఇంటి వెనుక, ముందు ఒక్కో కిటికీ ఉన్నాయి. దుస్తులను ఇసీ్త్ర చేసేందుకు గ్యాస్ను వినియోగిస్తున్నారు. సొంతూర్లో పెళ్లికి వెళ్లి వచ్చి సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన వారు కిటీకీలు మూసేసి నిద్రించారు. ప్రయాణం చేసిన అలసటతో గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఒక సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయింది. అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా దట్టంగా వ్యాపించడం, ఆ గ్యాస్ను పీల్చి స్పృహ తప్పినవారు కొన్ని గంటల తరువాత ప్రాణాలు వదిలారు. అందరి చెవులు, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఇల్లు మొత్తం గ్యాస్ వాసన వస్తోంది.ఒక రోజంతా అలాగేసోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న వారు మంగళవారం ఉదయానికి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరూ చూసుకోలేదు. బుధవారం ఉదయం కుమారస్వామికి బంధువులు ఫోన్కాల్ చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో వారు ఇంటి ఇరుగుపొరుగు వారికి బంధువులు తెలియజేయగా వారు ఫైర్, పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉండగా, అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 3 గ్యాస్ సిలిండర్లను విచారణ కోసం సీజ్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారు. నగర పోలీసు కమిషనర్ రమేశ్ బానోత్ ఆ ఇంటిని పరిశీలించారు. విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు. అనుకోకుండా గ్యాస్ లీక్ అయ్యిందా, లేక కావాలనే చేశారా? అనేది అనుమానాస్పదంగా ఉంది. -
యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?
ఫెర్టిలైజర్సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు. రోజుకి 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ నిర్మించారు. 2023 డిసెంబర్ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్ను పర్యవేక్షిస్తుంది. పైప్లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్ స్టీమ్ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్ పైప్లైన్ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్ను పునరుద్ధరించారు. ప్లాంట్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్ స్టీమ్ పైప్లైన్లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్ షట్డౌన్ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో గ్యాస్ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లి మిటెడ్ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది. ప్లాంట్పై ఒత్తిడి మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్ పెరగడంతో రామగుండం ప్లాంట్లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. -
అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఘటన మరిచిపోక ముందే.. మరొకటి వార్తల్లోకి ఎక్కింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు చోటు చేసుకోవడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వచ్చింది. అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 5.71 టిఎంసీల నీరు ఉండగా.. ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించారు. -
టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి, చైర్మన్ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్ అధికారులే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్కాపీల (ప్రింటెడ్ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా అందిందని సిట్ అధికారులు తేల్చారు. రాజశేఖర్రెడ్డి తనకు కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) షమీమ్కు గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. సిట్ అధికారులు ఏప్రిల్ 11న హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్ డామెర రమేశ్కుమార్ ఇంతకుముందు కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు. కేవలం ప్రింటెడ్ పత్రాలే ఇస్తూ.. లీకైన పేపర్లలో గ్రూప్–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్ కంప్యూటర్ నుంచి ప్రవీణ్, రాజశేఖర్ చేజిక్కించుకున్నవి సాఫ్ట్కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్లైన్ షేరింగ్ జోలికి పోలేదు. న్యూజిలాండ్లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్కు మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్ఔట్స్ రూపంలో ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ కోసం పేపర్ ఇచ్చి.. రాజశేఖర్ తన పెన్డ్రైవ్లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్రెడ్డికి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్ఓ షమీమ్ కూడా గ్రూప్–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్.. తాను ఇచ్చే పెన్డ్రైవ్ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్టాప్కు కనెక్ట్ చేయాలని, ఎనీడెస్క్ ద్వారా న్యూజిల్యాండ్లో ఉన్న ప్రశాంత్కు యాక్సెస్ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్ ఇచి్చన పెన్డ్రైవ్ను తీసుకువెళ్లిన షమీమ్ తన ఇంటివద్ద ల్యాప్టాప్కు కనెక్ట్ చేసింది. తర్వాత రాజశేఖర్ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్ ద్వారా ఈ ల్యాప్టాప్ను యాక్సెస్ చేసిన ప్రశాంత్రెడ్డి.. ఆ పెన్డ్రైవ్లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్కు ప్రవీణ్ ఇదే పంథాలో తన కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్.. ఎక్కడా లీకేజ్ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్టాప్ షమీమ్, రమేశ్, సురేశ్లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్లో ఉన్నది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్టాప్లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. మరోవైపు సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. చదవండి: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్ -
ఆయిల్ పైప్ లైన్ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం
పాట్నా: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్కు చెందిన గువహటి-బరౌనీ పైప్లైన్ను బిహార్లో ధ్వంసం చేశారు దుండగులు. ఖగడియా జిల్లా బకియా గ్రామంలో పైప్ను కట్ చేసి ఆయిల్ను లీక్ చేశారు. దీంతో వేల లీటర్ల చమురు నేలపాలైంది. ఆయిల్ పైప్ లీకైన విషయం తెలియగానే సమీప గ్రామస్థులు వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. చమురు కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పైప్ లీకైన తర్వాత వేల లీటర్ల చమురు రోడ్డుపై, పొలాలపై పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను మాత్రం ఇంకా గుర్తించలేదు. ఐఓసీ అధికారులు హుటాహుటిన పైప్ లీకైన ప్రదేశానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమ ఇంజనీర్లను పిలిపించి లీకేజీని రిపేర్ చేశారు. అయితే పైప్ ఎలా లీకైందనే విషయం ఐఓసీ ఇంజనీర్లకు మాత్రమే తెలిసి ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పొరపాటున ఇక్కడ ఏమైనా జరిగి ఉంటే పెను విపత్తు సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
చెర్నోబిల్లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్
కీవ్: ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం యూరప్ గుండెల్లో మరోసారి గుబులు పుట్టిస్తోంది. రష్యా కాల్పుల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో బుధవారం ప్లాంటుకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ జనరేటర్లు బ్యాకప్ పవర్ అందజేస్తూ నెట్టుకొస్తున్నాయి. కానీ వాటిలో రెండు రోజులకు సరిపడా డీజిల్ మాత్రమే అందుబాటులో ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. విద్యుత్ సరఫరా ఆగిపోయి విద్యుత్కేంద్రంలోని అణు వ్యర్థాల కూలింగ్ వ్యవస్థ దెబ్బ తింటే అణు ధార్మిక లీకేజీ తప్పదంటున్నారు. అణు, ధార్మిక భద్రత వ్యవస్థలపై నియంత్రణ చేజారి 1986ను మించిన ప్రమాదానికి దారి తీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో యూరప్ అంతా మరోసారి భయం గుప్పిట్లో గడుపుతోంది. చెర్నోబిల్ కేంద్రాన్ని రష్యా దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్ లైన్ల మరమ్మతు కోసం కాల్పులను తాత్కాలికంగా ఆపాలని రష్యా సైన్యానికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ద్మిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వాడకంలో లేని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం నుంచి తమకు డేటా అందడం ఆగిపోయిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది. అందులో పని చేస్తున్న సిబ్బంది భద్రత పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. వాళ్లు 13 రోజులుగా నిరంతరాయంగా పని చేస్తున్నారని సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ అన్నారు. అయితే, ‘‘కరెంటు కోతతో ప్లాంటు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ‘‘అణు వ్యర్థ నిల్వల నుంచి వచ్చే వేడిని చల్లార్చేందుకు ప్లాంటులో నిత్యం అందుబాటులో ఉండే కూలింగ్ వాటర్ చాలు. అందుకోసం అదనపు కరెంటు సరఫరా అవసరం లేదు’’ అని ఒక ప్రకటనలో ఐఏఈఏ పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వ అణు సంస్థ ఎనర్గోటమ్ మాత్రం విద్యుత్కేంద్రంలోని 20 వేల అణు వ్యర్థ యూనిట్లను చల్లబరిచి ఉంచేందుకు నిరంతర కరెంటు సరఫరా తప్పనిసరని అంటోంది. ‘‘లేదంటే అణు ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. గాలి ద్వారా ఉక్రెయిన్తో పాటు బెలారస్, రష్యా, యూరప్లోని ఇతర దేశాలకూ వ్యాపించి వినాశనానికి దారి తీస్తాయి’’ అని ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చింది. 1986లో ఏం జరిగింది? చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1986లో భద్రత పరీక్షల సందర్భంగా ఇందులోని నాలుగో రియాక్టర్ పేలి పెద్ద ప్రమాదానికి దారితీసింది. పేలుడులో చనిపోయింది ఇద్దరే అయినా, ఆ తర్వాత అది పెను వినాశనానికే దారి తీసింది. మంటలను ఆర్పిన సిబ్బందిలో 30 మందికి పైగా మూడు నెలల్లోపే మృత్యువాత పడ్డారు. పేలుడు వల్ల 100 రకాలకు పైగా రేడియో ధార్మిక పదార్థాలు వెలువడ్డాయి. వీటి ప్రభావం యూరప్పై ఏళ్ల తరబడి కొనసాగింది. రేడియో ధార్మికత బారిన పడి నానారకాల వ్యాధులతో వేలాది మంది నరకయాతన అనుభవించి మరణించారు. చెర్నోబిల్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిప్యాట్ నగరంలోని దాదాపు 50 వేల మందిని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోపే పూర్తిగా ఖాళీ చేయించారు. మొత్తమ్మీద పరిసర ప్రాంతాల నుంచి 20 లక్షల మందిని ఖాళీ చేయించినట్టు అంచనా. (చదవండి: ఉక్రెయిన్ వీడిన 10 లక్షల మంది చిన్నారులు) -
రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలకు వారం రోజులపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన 500 ఏళ్ల నాటి రాయలచెరువుకు పూర్తిస్థాయిలో ముప్పు తప్పింది. వారం కిందట భారీ వరదలతో చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలకు 55 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాదిమంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి శనివారం సాయంత్రం రాయల చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు లీకేజీలను వందశాతం అరికట్టామని, పశువులతో సహా పునరావస కేంద్రాలకు వెళ్లిన దాదాపు 15 వేల మంది ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఆయన ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించామన్నారు. 120 మంది నిపుణుల పర్యవేక్షణలో 453 మంది కార్మికులు వారం రోజులుగా రోజుకు 19 గంటలపాటు యుద్ధప్రతిపాదికన పనులు చేశారన్నారు. భారతీ సిమెంట్ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్ను కలిపి లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్ పద్ధతిలో అరికట్టామని వివరించారు. నీటి ప్రవాహానికి ఈ బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల బోల్డర్స్ (పెద్దపెద్ద బండరాళ్లు)ను వీటికి దన్నుగా ఉంచామన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడినా కట్టకు ఇబ్బంది లేకుండా ఔట్ఫ్లో 8 వేల క్యూసెక్కులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశామని చెవిరెడ్డి వెల్లడించారు. ఏడు రోజుల తర్వాత ఇంటికి.. నిర్వాసితులు ఇంటికి వచ్చిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానన్న చెవిరెడ్డి.. మొదటి రోజు నుంచి చెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేవీ హెలికాప్టర్లలో నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక చెవిరెడ్డి శనివారం ఇంటికి వెళ్లారు. -
సాక్షి ఎఫెక్ట్: ‘ర్యాలంపాడు’ లీకేజీల అడ్డుకట్టకు చర్యలు
గద్వాల రూరల్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిరి్మంచిన ర్యాలంపాడు రిజర్వాయర్ కట్ట లీకేజీలపై అధికారులు దృష్టిసారించారు. రిజర్వాయర్ కట్టకు బీటలు పడి పెద్ద ఎత్తున లీకేజీ ఏర్పడిన సంఘటనపై సోమవారం ‘సాక్షి’లో ‘ర్యాలంపాడు’కి బీటలు శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కట్ట నుంచి ఎక్కడెక్కడ లీకేజీలున్నాయి? ఎంత పరిమాణంలో నీరు వృథా అవుతోంది.. తదితర అంశాలపై చర్చించారు. రిజర్వాయర్ పరిస్థితిపై ఇటీవల ఇద్దరు సీఈల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికను పరిశీలించారు. ఇదిలా ఉంటే లీకేజీలకు మరమ్మతు చేయాలంటే.. ముందుగా ర్యాలంపాడులోని నీటిని బయటకు పంపాల్సి ఉంటుందని, అయితే దీనివల్ల ప్రస్తుతం 1.36 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు దెబ్బతింటాయని గద్వాల జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సీజన్కు సాగునీటిని అందించి వచ్చే యాసంగిలో జలాశయంలోని నీటిని పూర్తిగా బయటకు తోడేసేందుకు వీలుపడుతుందన్నారు. -
కరోనా లీక్: డబ్ల్యుహెచ్ఓ నిపుణుడి వ్యాఖ్యల కలకలం
లండన్: కరోనా కేసులు తొలిసారి గుర్తించిన ప్రాంతంలోని ఒక ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై అప్పట్లోనే అనుమానాలు వచ్చాయని డబ్ల్యుహెచ్ఓ నిపుణుడు పీటర్ బెన్ ఎంబరెక్ చెప్పారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై చైనాలో పరిశోధనకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలో ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే సదరు ల్యాబ్ ప్రమాణాలపై తనకు అనుమానాలు వచ్చాయని డానిష్ టీవీ డాక్యుమెంటరీలో బెన్ తెలిపారు. వూహాన్లోని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ల్యాబ్లో కరోనా వైరస్లను ఉంచారని, కానీ ఆ ల్యాబ్ భద్రతా ప్రమాణాలు కరోనా వైరస్ కట్టడి చేసే స్థాయిలో లేవని బెన్ తెలిపారు. చైనా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చి, మహమ్మారి మూలాలపై విచారణ సమయంలో లీక్ సిద్ధాంతాన్నివిరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారని బెన్ మాటమార్చడం సంచలనంగా మారింది. సదరు బృందం మాత్రం అప్పట్లో వూహాన్ నుంచి కరోనా విడుదల కాలేదంటూ నివేదికనిచ్చింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన బెన్ తాజాగా అనుమానాలు వ్యక్తం చేయడంపై కలకలం రేగుతోంది. ‘‘ది వైరస్ మిస్టరీ" పేరుతో వచ్చిన తాజా డాక్యుమెంటరీలో బెన్ చైనాకు పోవడం, వూహాన్ మార్కెట్లో స్టాల్స్ను పరిశీలించడం, తన అనుమానాలు వ్యక్తం చేయడం తదితర దృశ్యాలున్నాయి. కరోనా వైరస్ ఏదో ఒక ప్రాణి నుంచి మనిషికి ఈ మార్కెట్లోనే వచ్చిఉంటుందని బెన్ అనుమానపడ్డారు. అలాగే వూహాన్లోని చైనా ల్యాబ్పై ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్కు దగ్గరలో ఉన్న సీడీసీ చైనా ల్యాబ్పై తనకు చాలా అనుమానాలున్నాయన్నారు. గబ్బిలాల నుంచి శాంపిళ్లు తీస్తున్న ల్యాబ్ వర్కర్కు కరోనా తొలిసారి సోకి ఉండే ప్రమాదం ఉందని గతంలో బెన్ అభిప్రాయపడ్డారు. బెన్ వ్యాఖ్యలు అనుమానాలను బలపరుస్తున్నాయని, చైనా ల్యాబ్పై స్వతంత్ర పరిశోధన జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చైనా నుంచి మరింత పారదర్శకతను ఆశిస్తున్నామని సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. ల్యాబుల్లో ప్రమాదాలు జరగడం సహజమన్నారు. డబ్ల్యుహెచ్ఓ మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సిఉందంటూ ఒక ప్రకటనతో సరిపుచ్చింది. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) -
‘సాగర్’లో లీకేజీలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి వరదనీరు లీకవుతోంది. క్రస్ట్గేట్లకు ఇటీవలే మరమ్మతు చేయించినా లీకేజీలకు బ్రేక్ పడలేదు. దీంతో గేట్ల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్ డ్యామ్కు 26 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉండగా 4 గేట్లకు గతేడాది మరమ్మతు చేశారు. ఈ ఏడాది మిగిలిన 22 గేట్ల మరమ్మతులకు రూ. 70 లక్షలు కేటాయించారు. డ్యామ్ గేట్ల నిర్వహణ విభాగంలో సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు మరమ్మతు పనులను రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. రబ్బరు సీళ్లు అమర్చడం, ఇనుప తీగలకు గ్రీజింగ్ చేయడం, గేర్లలో ఆయిల్ మార్చడం, గేట్లు ఎత్తే మోటర్ల స్టార్టర్లకు కాయిల్స్ బిగించడం వంటి పనులను ప్రైవేటు సంస్థలు చేపట్టాయి. ఆ వెంటనే జలాశయానికి వరద రావడంతో వారంలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అదనపు నీటిని దిగువకు విడుదల చేసేందుకు రేడియల్ క్రస్ట్ గేట్లను పైకి ఎత్తారు. నీటి రాక తగ్గడంతో శుక్రవారం సాయంత్రం మూసేసినా మళ్లీ శనివారం ఉదయం రెండు గేట్లను పైకెత్తి తిరిగి మధ్యాహ్నం మూసేశారు. అయితే గేట్లు మూసేసినా వాటిలోంచి నీరు ధారగా కారుతోంది. ముఖ్యంగా 6, 8, 11, 14, 15, 21, 25, 26 నంబర్ గేట్ల నుంచి నీరు ఎక్కువగా లీకవుతోంది. గేట్ల నుంచి నీరు లీకవడానికి రబ్బరు సీళ్లను సరిగ్గా అమర్చకపోవడమే కారణమని రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. దారుణంగా స్పిల్ వే... స్పిల్ వేకు మరమ్మతులు నిర్వహించక దాదాపుగా 8 ఏళ్లు దాటింది. ఏటా డ్యామ్ నిర్వహణలో భాగంగా స్పిల్ వేకు మరమ్మతులు చేయాలి. ఈ 8 ఏళ్లలో డ్యామ్ క్రస్ట్గేట్లను ఐదుసార్లు ఎత్తగా పైనుంచి నీటి తాకిడికి స్పిల్వే దెబ్బతింటుంది. అందువల్ల ఏటా స్పిల్ వే నిర్వహణ చేపట్టాలి. ప్రస్తుతం స్పిల్ వే వద్ద పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది. ఇలాగే ఉంటే డ్యామ్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లీకేజీలను తగ్గిస్తాం... గేట్ల లీకేజీలను తగ్గించే ఏర్పాట్లు చేస్తాం. అన్నింటికీ కొత్త సీళ్లు వేయడం వల్ల నీరుకారడం సహజం. నిన్నటి వరకు వరదలు కొనసాగాయి. ఇప్పటికీ గేట్ల మీద నుంచి గాలికి నీటి తెప్పలు దుముకుతున్నాయి. జలాశయంలో కొంత నీరు తగ్గగానే వాక్ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి బోల్ట్ నట్స్ను బిగిస్తే కొంత మేరకు లీకేజీలు తగ్గే అవకాశాలున్నాయి. నిర్వహణలో లోపాలేమీ లేకుండా చూస్తాం. – సీఈ శ్రీకాంత్రావు. -
‘ఊపిరి’ ఆగింది.. గాల్లోకి 22 ప్రాణాలు
సాక్షి ముంబై: మహారాష్ట్ర నాసిక్లో అత్యంత హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంకుకు లీకేజీ ఏర్పడి ప్రాణవాయువు అందక 24 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 150 మంది ఉండగా... అందులో 11 మంది వెంటిలేటర్పై... మిగతా వారు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. ఉన్నట్లుండి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి బెడ్స్పై గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలారు ఈ అభాగ్యులు. లీకేజీ జరిగిన కొద్దిసేపట్లోనే 22 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. అనంతరం సాయంత్రం మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 34 నుంచి 77 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారని తెలిపారు. బుధవారం 12.30 గంటల ప్రాంతంలో లీకేజీ గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది... ప్రత్యామ్నాయ సిలిండర్లను తెప్పించి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఈలోపే ఘోరం జరిగిపోయింది. సీరియస్గా ఉన్న పేషెంట్లను మరోచోటికి తరలించేందుకు బ్బంది పరుగులు పెట్టడం, ఏం జరుగుతుందో తెలియక రోగుల బంధువుల అర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణలో గందరగోళం నెలకొంది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 24 మంది చనిపోయారని నాసిక్ కలెక్టర్ సూరజ్ మందారే విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేమి జరిగింది? నాసిక్లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రి అయిన జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో 150 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో 13 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకు ఉంది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ ట్యాంక్ సాకెట్ ఒకటి విరిగి లీకేజీ ప్రారంభమైంది. అయితే ట్యాంకర్ ద్వారా ట్యాంకులో ఆక్సిజన్ నింపుతుండగా ఇది జరిగిందనేది మరో వాదన. ఇది చూస్తుండగానే అధికమైంది. 12.30 ప్రాంతంలో ఆక్సిజన్ భారీగా లీకవ్వడం మొదలైంది. దీంతో అందరూ ముందుగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం ఈ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాని లీకేజీ ఆగలేదు. అప్పటికి ట్యాంకులో 25 శాతం మేర మాత్రమే ఆక్సిజన్ ఉండగా... లీకేజీతో అది ఇంకా తగ్గిపోయింది. ట్యాంకులో ప్రెషర్ తగ్గి... పేషెంట్లకు ఆక్సిజన్ అందలేదు. మరోవైపు ఆసుపత్రిలో అరుపులు, కేకలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఆక్సిజన్ లీకేజీ కారణంగా ఇటువైపు ఉన్న అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు ఆక్సిజన్ అందక నీటి నుంచి బయటపడ్డ చేప పిల్లల్లా కొట్టుకోసాగారు. అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు, నర్సులు, వైద్యులు ఈ సంఘటనతో అవాక్కయ్యారు. అందుబాటులో ఉన్న సిలిండర్లతో ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నించారు. ఇతర ఆసుపత్రులు నుంచి హుటాహుటిన డ్యూరా సిలిండర్లను తెప్పించారు. ఈ సమయంలో ఆసుపత్రి వర్గాలు కొందరు రోగులకు వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు కూడా చేపట్టారు. ఆక్సిజన్ ట్యాంకు నిర్వహణ బాధ్యతను చూస్తున్న ప్రైవేటు కంపెనీకి సమాచారం ఇచ్చి వారిని పిలిపించారు. ఇలా సుమారు గంటకుపైగా చేసిన ప్రయత్నాలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లీకేజీని ఆపగలిగారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 24 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటన అనంతరం బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో ఆ పరిసరాలలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అత్యంత విషాదకరమైన ఈ సంఘటన అనంతరం మృతుల కుటుంబీకులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ... ఏం మాట్లాడాలన్నా మాట పెగలడం లేదన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంథించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించింది. మరోవైపు ఈ సంఘటన అనంతరం ఆసుపత్రికి చేరుకున్న నాసిక్ జిల్లా ఇంచార్జీ మంత్రి ఛగన్ భుజ్బల్ కూడా మృతుల కుటుంబీకులకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రూ. అయిదు లక్షల మద్దతు అందించనున్నట్టు ప్రకటించారు. ఇలా మొత్తం రూ.10 లక్షలు మృతుల కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి 24 మంది కోవిడ్ రోగులు మృతిచెందడంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గుండెలను మెలిపెట్టే దురదృష్టకర సంఘటన. తీవ్ర వేదనను కలిగించింది. ఆత్మీయులకు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను..’అని మోదీ ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా కూడా సంతాపం ప్రకటించారు. మిగిలిన పేషెంట్లు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. నిర్లక్ష్యం కారణంగానే.. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని మృతుల కుటుంబీకులు ఆరోపించారు. 60 ఏళ్ల తన తల్లిని మంగళవారమే ఈ ఆసుపత్రిలో చేర్చించామని, ఆమె వెంటిలేటర్పై ఉందని... ఇలా చనిపోవడానికి ఆమెను ఇక్కడ చేర్పించలేదని లీలా సర్కార్ అనే మహిళ గుండెలవిసేలా రోదించారు. ఊపిరి ఆడట్లేదని అమ్మ చెప్పగానే... నర్సింగ్ సిబ్బందిని పిలిచానని, ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మరోవైపు తన తమ్ముణ్ని రక్షించుకోలేకపోయానంటూ మరోవ్యక్తి రోదించడం అక్కడున్న వారికి కన్నీళ్లు తెప్పించింది. ఆక్సిజన్ సరిగా సరఫరా కావడంలేదని ముందునుంచే తెలుపుతూ వచ్చామని, అయినా ఆసుపత్రి వారు పట్టించుకోలేదని మరి కొందరు వాపోయారు. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఇంత మంది మరణించారని ఆరోపించారు. చదవండి: ప్రశ్నలు సంధించాల్సిన సమయమిది చదవండి: ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్ -
నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్...
-
అంబర్పేట్లో విష వాయువుల కలకలం
సాక్షి, హైదరాబాద్: అంబర్పేటలో విష వాయువుల లీకేజీ కలకలం రేపింది. మారుతినగర్లో విష రసాయనాలు లీకేజీ కావడంతో శుక్రవారం ఉదయం స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెసిడెన్షియల్ ఏరియాలో డెక్కన్ కెమికల్స్ కంపెనీ యాసిడ్ నిల్వలు ఉంచింది. ఈ రసాయనాలు నిల్వ చేసిన ట్యాంకర్ పగలడంతో విష వాయువులు లీకవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఊపరి ఆడక ఇబ్బంలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డెక్కన్ కంపెనీని సీజ్ చేశారు. -
మేల్కోకపోతే ముప్పే!
అనంతపురం హాస్పిటల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల పనితీరులో ఏమ్రాతమూ మార్పు రాలేదు. ఇటీవల ఆస్పత్రిలోని ఇన్ఫెక్షన్ డీసీస్ వార్డు (ఐడీ)లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పాటు రెండు వారాల క్రితం సూపరింటెండెంట్ చాంబర్ ముందు ఆక్సిజన్ లీకేజీ జరిగినా అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో ఎఫ్ఎం వార్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు. ఇప్పటికైనా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మేలుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తవని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. పూర్తి కాని పనులు కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో సర్వజనాస్పత్రిలో కోటి రూపాయలతో పైప్లైన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.36 లక్షలతో 150 పడకలకు వన్ లైన్ ఎయిర్, 30 పడలకు టూ లైన్ ఎయిర్, జూన్ 12న రూ.64 లక్షలతో 60పడకలకు మెడికల్ గ్యాస్లైన్ త్రీ లైన్, 400 పడకలకు వన్ లైన్ ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన సన్డాట్కామ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సంబంధించి 700 పాయింట్లలో ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇంకా 150 నుంచి 200 పాయింట్లలో పైప్లైన్ పనులు పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యతేదీ? ఆక్సిజన్ పైప్లైన్ పనుల్లో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైప్లైన్ పనులు జరిగే సమయంలో సంబంధిత ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు కానీ, కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితోనే వాల్స్కు తూతూమంత్రంగా వెల్డింగ్ పనులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగానే రెండు చోట్ల పైప్లైన్ లీకేజీలు జరిగినట్లు తెలుస్తోంది. గండం గడిచింది సర్వజనాస్పత్రిలో ఈ నెల ఆరో తేదీన జరిగిన ఆక్సిజన్ పైప్లైన్ లీకేజీ పట్ల ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ సకాలంలో స్పందించడంతో గండం గడిచింది. ఏమాత్రం జాప్యం చేసినా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకల మీదున్న రోగుల ప్రాణాలకే ఇబ్బంది కలిగేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. విచారణకు ఆదేశం ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్ గంధం చంద్రుడు విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్, ఆర్ఎంఓ, అనస్తీíÙయా హెచ్ఓడీ డాక్టర్ నవీన్కుమార్తో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు అందుబాటులో ఉండి ఆస్పత్రిలో ఎక్కడైనా ప్రమాదకర ప్రాంతాలుంటే వాటిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో అధికారులు నివేదిక సమర్పించనున్నారు. ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ లక్ష్మీపతిరెడ్డి ఏమన్నారంటే..‘ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్లైన్ పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లీకేజీలు జరిగిన మాట వాస్తవమే. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మరో రెండ్రోజుల్లో విధులకు హాజరై తదుపరి వాటిపై స్పష్టత ఇస్తా. పైప్లైన్ పనులు అసంపూర్ణం ఆస్పత్రిలో పైప్లైన్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. పైప్లైన్ వాల్స్ ఊడిపోవడం కారణంగానే లీకేజీ జరిగింది. రెండు వారాల క్రితం తన కార్యాలయం సమీపంలోనే లీకేజీ అయ్యింది. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను కోరుతాం. ఆస్పత్రిలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ రామస్వామినాయక్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
మినీ ఆక్సిజన్ సిలిండర్ లీక్
గద్వాల అర్బన్: జిల్లా ఆస్పత్రిలో మినీ ఆక్సిజన్ సిలిండర్ లీకైంది. దీంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీస్తుండగా.. ఒకరు మృత్యువాత పడ్డారు. సోమవారం ఉదయం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఎన్బీహెచ్యూ వార్డులో అప్పుడే పుట్టిన శిశువుకు ఆక్సిజన్ పెట్టేందుకు ఓ నర్సు యత్నించగా.. మినీ సిలిండర్ స్ట్రక్ కావడంతో ఫ్లోమీటర్ కింద పడి పగిలింది. ఆ సమయంలో శబ్దంతో పాటు గ్యాస్ లీకైంది. దీంతో ఎన్బీహెచ్యూ, ఐసీయూ, జనరల్ వార్డుల్లోని రోగులు, వారి బంధువులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో శబ్దం పెద్దగా రావ డంతో రోగులు ఆందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు. భయంతో రోగి మృతి కాగా, గద్వాల మండలం శెట్టిఆత్మకూర్కు చెందిన లక్ష్మన్న (46) డయాలసిస్ పేషెంట్. బ్లడ్ షుగర్ లెవల్ తగ్గిందని సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతడికి వైద్యసిబ్బంది క్యాజువాలిటీ వార్డులో ఉంచి చికిత్స నిర్వహించారు. అయితే గ్యాస్ లీకేజీ అయిందని తెలుసుకున్న అతను భయంతో బయటకు పరుగులు తీస్తూ ఊపిరి ఆడక మృతి చెందాడు. -
కేటీపీఎస్లో హైడ్రోజన్ లీక్
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం 9వ యూనిట్లోని టర్బో జనరేటర్లో సోమవారం హైడ్రోజన్ గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైడ్రోజన్కు గాల్లో కలిసి బాంబులా పేలే సామర్థ్యం ఉండటంతో ఉద్యోగులు, కార్మికులు పని ప్రదేశం నుంచి పరుగులు పెట్టారు. అయితే కొందరు ఉద్యోగులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు. 250 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్లో రూ. 100 కోట్లతో రెన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్(ఆర్అండ్ఎం) పనులు చేపట్టారు. గత జూన్ మొదటి వారంలో పనులు ప్రారంభంకాగా, ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు సింక్రనైజేషన్ చేస్తున్నారు. స్టీమ్ జనరేట్ అయ్యేటప్పుడు ఏర్పడే ఉష్ణోగ్రతను తగ్గించేందుకు జనరేటర్కు హైడ్రోజన్ (హెచ్2) పంపిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ పైపులైన్ దగ్గర హైడ్రోజన్ లీక్ కావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పని ప్రదేశం నుంచి వందలాది మంది దూరంగా పరుగులు తీశారు. అయితే కొందరు ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించి ఫైర్ ఇంజన్లను అందుబాటులోకి తెప్పించారు. ధైర్యసాహసాలతో హైడ్రోజన్ లీకైన చోట నుంచి కార్బన్డై ఆక్సైడ్ను పంపి ప్రమాదాన్ని అరికట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా ఊపిరి బిగపట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించారు. లీకేజీ ఉన్న ప్రదేశంలో సీల్ వేయడంతో ప్రమాదం తొలగిపోయింది. ఈ క్రమంలో కర్మాగారంలోని అన్ని ఫైర్ ఇంజన్లను, ఇతర ఫైర్ సేఫ్టీ పరికరాలను తెప్పించుకున్నారు. హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో గాలిలో కలిస్తే బాంబులా పేలి కర్మాగారం ధ్వంసమయ్యే పరిస్థితి ఉండేదని, ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం భారీగా ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఒక రోజు ఆలస్యంగా సింక్రనైజేషన్.. ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో జెన్కో యాజమాన్యం ఆదేశాల మేరకు 9వ యూనిట్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు నిర్వహిస్తోంది. పనులకు వందలాది మంది టెక్నీషియన్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కరోనా వైరస్ ఉధృతిలోనూ ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో 50 రోజుల్లోపు పూర్తి కావాలి్సన పనులకు 60 రోజులు పట్టింది. చివరి క్షణంలో హైడ్రోజన్ గ్యాస్ లీక్ కలవరానికి గురిచేసింది. దీంతో సోమవారం సింక్రనైజేషన్ చే యాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేశారు. సకా లంలో స్పందించి ప్రమాదాన్ని అరికట్టడంతో జెన్కో ఉన్నతాధికారులు సైతం ఇక్కడి ఉద్యోగులను అభినందించారు. ముప్పు తప్పింది హైడ్రోజన్ లీకేజీని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం లేకుండా బయటపడగలిగాం. పనిచేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కోవిడ్ సమయంలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి పనిచేశాం. కరోనా వల్లే పనుల్లో కొంత జాప్యం జరిగింది. మంగళవారం సాయంత్రానికి విద్యుదుత్పత్తిని అందుబాటులోకి తెస్తాం. –కె.రవీంద్ర కుమార్, సీఈ -
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్లైన్ లీక్..
-
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్లైన్ లీక్..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ కలకలం రేపుతోంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్లైన్ లీకైంది. భారీగా గ్యాస్ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలానికి పరికరాలను తరలించారు. -
కందికట్కూర్కు ‘లీకేజీ’ భయం
ఇల్లంతకుంట (మానకొండూర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామం వద్ద నిర్మించిన మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నుంచి రెండు రోజులుగా నాలుగైదు చోట్ల నీటి ఊటలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనకట్ట నుంచి నీరు లీకవడంతో తమకు ముప్పేమైనా ఉంటుందా? అని గ్రామస్తులు ఆందోళనలకు గురవుతున్నారు. గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద బోగం ఒర్రె ప్రాం తంలో బుంగపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడి మాదిరిగానే ఇక్కడ బుంగ పడుతుందని భయపడుతున్నారు. కాగా, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ సమీపంలో మధ్యమానేరు ఆనకట్ట నుంచి శనివారం మూడు చోట్ల ఊట లొచ్చాయి. దీంతో అధికారులు రాళ్లు, మట్టితో ఆ ప్రాంతాన్ని పూడ్చివేయించారు. ఆదివారం మళ్లీ రెండుచోట్ల ఊటలు రావడం ప్రారంభమైంది. ఇది చూసి గ్రామస్తులు ఆనకట్ట నుంచి వస్తున్న లీకేజీ ఊట ఎక్కడ ఉప్పెనగా మారుతుందోనని ఆందో ళన చెందుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆనకట్ట వెంట నిర్మించిన కాల్వలో సీపేజీ నీళ్లు పారుతున్నాయి. నాలుగైదు చోట్ల కట్ట నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి. భయం అవసరం లేదు: శ్రీకాంత్రావు, ఎస్ఈ మధ్యమానేరు ఆనకట్ట నుంచి వస్తుంది సీపేజీ వాటర్ మాత్రమే. ఆనకట్టకు ప్రమాదం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకున్న స్థాయిలో కూడా రావడం లేదు. కట్ట లీకేజీపై సీఎం పేషీ ఆరా మధ్యమానేరు ఆనకట్ట లీకేజీపై సీఎం పేషీ అధికారులు ఆదివారం ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
28,29 తేదీల్లో నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా తాగునీటిపైప్లైన్కు భారీ లీకేజీ ఏర్పడడంతో ఈనెల 28, 29 తేదీల్లో పలుప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. బండ్లగూడ వద్ద కృష్ణా ఫేజ్–1కు సంబంధించి 2200 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ తాగునీటి పైపులైన్కు భారీ లీకేజీ ఏర్పడడంతో రెండురోజుల పాటు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఈనెల 28 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి 29 (గురువారం) సాయంత్రం 6గంటల వరకు మొత్తం36 గంటలపాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. 28న మంచినీటి సరఫరానిలిచిపోయే ప్రాంతాలివే.. అలియాబాద్, మిరాలాం, కిషన్బాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్,వినయ్ నగర్, సైదాబాద్, ఆస్మాన్ ఘడ్, చంచల్గూడ, యాకుత్పుర, మలక్పేట్, మూసారాంబాగ్, బొగ్గులకుంట,అఫ్జల్గంజ్, హిందీనగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం, చిలకలగూడ, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు. ఈనెల 29న నీళ్లు బంద్ ఇక్కడే.. భోజగుట్ట, మారేడ్ పల్లి, సైనిక్ పురి పరిసర ప్రాంతాలు. -
పగిలిన మిషన్ భగీరధ పైప్లైన్
-
స్మార్ట్ బాల్తో లీకేజీలకుచెక్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న విలువైన తాగునీటి వృథాకు కారణమైన పైప్లైన్ లీకేజీలకు చరమగీతం పాడాలని జలమండలి నిర్ణయించింది. దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పైపులైన్ల నాణ్యత, మన్నికను త్వరలో పరిశీలించనున్నారు. అమెరికా, సింగపూర్, ఇజ్రాయిల్ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న ‘స్మార్ట్బాల్’ టెక్నాలజీ ఆధారంగా పురాతన తాగునీటి పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించాలని నిర్ణయించింది. ప్రధానంగా ఎనిమిదవ దశకంలో ఏర్పాటుచేసిన సింగూరు, మంజీరా పైపులైన్లతోపాటు 17 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కృష్ణా మొదటిదశ పైపులైన్లను ప్రయోగాత్మకంగా ఈ సాంకేతికత ఆధారంగా పరిశీలించనున్నారు. దీంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్కు తరలిస్తోన్న విలువైన తాగునీరు పైపులైన్ల లీకేజీలతో వృథా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనుండడం విశేషం. తాగునీటి వృథా..వ్యథ ఇదీ.. మహానగరానికి వందలకిలోమీటర్ల దూరం నుంచి తరలిస్తోన్న సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి జలాల్లో సుమారు 40 శాతం విలువైన తాగునీరు లీకేజీలు, చౌర్యం కారణంగా వృథా అవుతోంది. నిత్యం జలమండలి సరఫరా చేస్తున్న 440 మిలియన్ గ్యాలన్లలో 40 శాతం మేర సరఫరా నష్టాలున్నాయి. అంటే సుమారు 176 మిలియన్ గ్యాలన్ల జలాలు వృథాఅవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నీటిని తరలించే పురాతన తాగునీటి పైపులైన్లే. వీటిలో ఆర్సీసీ(రీ ఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్)తో తయారైనవే అధికంగా ఉన్నాయి. పైపులైను మార్గంలో వాటి పైనుంచి భారీ వాహనాలు వెళ్లిన ప్రతీసారీ లీకేజీలు ఏర్పడి ఫౌంటెన్లను తలపిస్తున్నాయి. పలుమార్లు ఈ నీరంతా ప్రధాన రహదారులపైకి చేరి ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. లీకేజీలకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు, మూడు రోజులు పలు ప్రాంతాలకు నీటిసరఫరాను నిలిపివేయాల్సిన దుస్థితి తలెత్తింది. సుమారు 100 కి.మీ మార్గంలో పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరోవైపు పాతనగరంలో సుమారు 1100 కి.మీ మార్గంలో దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పంపిణీ చేసే పైపులైన్లు (చిన్నపరిమాణంలోనివి)ఉన్నాయి. వీటికి కూడా లీకేజీల పరంపర తప్పడంలేదు. స్మార్ట్ బాల్ సాంకేతికత పనిచేస్తుందిలా... రాడార్, జీపీఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేసే బంతి ఆకృతిలో ఉన్న పరికరాన్ని పురాతన తాగునీటి పైపులైన్లలోనికి తీగ ద్వారా ప్రవేశపెడతారు. పైపులైన్ లోపలకు వెళ్లిన ఈ పరికరం భూగర్భంలో ఉన్న తాగునీటి పైపులైన్ గోడలను క్షుణ్ణంగా తనిఖీచేస్తుంది. జీపీఆర్ఎస్ సాంకేతికత ఆధారంగా ఈ దృశ్యాలను పైన ఉన్న కంప్యూటర్కు గ్రాఫ్ రూపంలో చేరవేస్తోంది. ఈ గ్రాఫ్ను నిపుణులు పరిశీలించడం ద్వారా పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, దాని సామర్థ్యం, మన్నిక వంటి అంశాలను నిర్ధారించవచ్చు. అవసరమైన చోట మరమ్మతులకు తక్షణం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పురాతన భారీ ఆర్సీసీ పైపులైన్ల స్థానంలో మైల్డ్స్టీల్(ఎంఎస్), చిన్న పరిమాణంలో ఉన్న ఆర్సీసీ పైపులైన్ల స్థానంలో డక్టైల్ ఐరన్(డీఐ)పైపులైన్లను ఏర్పాటుచేయాలని జలమండలినిర్ణయించింది. లీకేజీలకు చరమగీతం పాడేందుకే తాగునీటి పైపులైన్ల లీకేజీలను సమూలంగా నివారించేందుకు ముందుగా పురాతన పైపులైన్ల నాణ్యత,మన్నికను నిర్ధారించాలని నిర్ణయించాము. తద్వారా విలువైన తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కలుషిత జలాల నివారణ,తాగునీటి సరఫరాలో తరచూ తలెత్తే అంతరాయాలను పూర్తిగా నివారించవచ్చు. స్మార్ట్బాల్ సాంకేతికత వినియోగంతో సత్ఫలితాలుంటాయని భావిస్తున్నాము. – ఎం.దానకిశోర్,జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
ఎయిర్పోర్ట్లో జలపాతం.!
గువాహటి: అస్సాంలోని లోక్ప్రియ గోపినాథ్ బోర్డొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గువాహటి ఎయిర్పోర్ట్) జలపాతాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్పోర్ట్ పైకప్పు నుంచి వర్షపు నీరు ప్రయాణికుల లాంజ్లోకి చేరింది. ఏసీ, లైట్ల రంధ్రాల నుంచి కారుతున్న వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటపాటు ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు చేరడం వల్ల లగేజ్ స్ర్కీనింగ్ మెషీన్లు పాడయ్యాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అంతకు మించి ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్లోకి వర్షపు నీరు చేరడం వల్ల పలువురు ప్రయాణికుల లగేజ్ తడిసిపోయింది. చాలామంది ప్రయాణికులు తమ లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గువాహటి ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించిన ప్రయాణికుల లాంజ్లో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని నెటిజన్లు పౌరవిమానాయాన శాఖ మంత్రి జశ్వంత్ సిన్హాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నారు. -
జలపాతాన్ని తలపించిన గువాహటి ఎయిర్పోర్ట్
-
అవాస్తవ కథనాలపై లీగల్ చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ గోప్యత విషయంలో మీడియాల్లో వస్తున్న కథనాలపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) స్పందించింది. అసత్య కథనాలను, అవాస్తవాలను ప్రసారం చేసినా, ప్రచురించినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జెడ్డీ నెట్ అనే వ్యాపార సంబంధిత వెబ్సైట్.. ఆధార్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆధార్ వ్యవస్థ పటిష్టంగా లేదని.. వినియోగదారుల వ్యక్తిగత విషయాలతోపాటు బ్యాంక్ వివరాలను కూడా సులువుగా బుట్టదాఖలు చేసే పద్ధతులు ఉన్నాయని.. అందుకు ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు సరిపోతాయంటూ పేర్కొంది. గతంలో ఇలాంటి వ్యవహారాలు(ఏజెంట్ల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ల ద్వారా, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా లీక్ కావటం) వెలుగులోకి వచ్చినప్పుడు వాటిని సరిచేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ, ఇప్పటికీ అది ఆగలేదని జెడ్డీ నెట్ కథనం తెలిపింది. దీనిపై యూఐడీఏఐ స్పందించింది. ఆధార్ గోప్యతపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆధార్ సమాచారం అత్యంత సురక్షితంగా ఉందని.. సూపర్ కంప్యూటర్ నుంచి ఆధార్ సమాచారాన్ని తస్కరించాలంటే వందల కోట్ల సంవత్సరాలకు పైగా పడుతుందని పేర్కొంది. కాగా, ఆధార్ డేటా భద్రతపై సుప్రీం కోర్టులో ప్రజంటేషన్ ఇచ్చిన యూఐడీఏఐ 2048-ఎన్క్రిప్షన్ కీ సిస్టమ్లో భద్రంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్ ; తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : అత్యవసరంగా ల్యాండై, ఇంధనాన్ని నింపుకొని తిరిగి బయలుదేరిన ఆ విమానం ఈ పాటికి పెను ప్రమాదంలో చిక్కుకొనిఉండేది. శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తతతో ఆ ముప్పుతప్పినట్లైంది. అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చౌకవిమానయాన సంస్థ సిటీలింక్కు చెందిన విమానం ఒకటి ఆదివారం ఉదయం జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి జకార్తా(ఇండోనేషియా)కు బయలుదేరింది. అయితే, మార్గం మధ్యలోనే ఇంధనం నిండుకోవడంతో పైలట్ దాన్ని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటింకే సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్టు సిబ్బంది.. సిటీలింక్ విమానంలో ఇంధనాన్ని నింపారు. ఇక అది టేకాఫ్ కోసం రన్వేపైకి కూడా వెళ్లింది. అంతలోనే ఇంధనం లీకవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. అంతే, క్షణం ఆలస్యం కాకుండా విమానాన్ని నిలిపేయాలని పైలట్కు ఆదేశాలు వెళ్లాయి. కలకలం : ఎండకు సైతం భగభగమండే గుణమున్న విమాన ఇంధనం.. రన్వేపై ధారలా కారిపోవడంతో ఎయిర్పోర్టు ప్రాంగణంలో కలకలం చెలరేగింది. తక్షణమే ఫైరింజన్లను రప్పించి, రన్వే మొత్తాన్ని శుభ్రంగా కడిగేశారు. సాకేతిక నిపుణులు విమానంలో లీకేజీ లోపాన్ని సరిచేశారు. ఒకవేళ ఆ విమానం టేకాఫై ఉంటేగనుక పెనుప్రమాదమే జరిగి ఉండేదని ఎయిర్పోర్టు అధికారులు చెప్పారు. -
విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజి వాస్తవమే
న్యూఢిల్లీ : విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజీ వాస్తవమేనని రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు. అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ..మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ వార్తలపై వెంటనే స్పందించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగిందన్నారు. మొబైల్ ఫోన్ల భద్రత, రక్షణ కోసం ఫోన్ల తయారీ సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి..ఆయా ఫోన్ల ఆర్కిటెక్చర్, ఫ్రేమ్ వర్కు తదితర వివరాలను సమర్పించాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు మంత్రి తెలిపారు. మొబైల్ డేటా విదేశాలకు లీకవుతున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత తమ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ విభాగం దీనిపై లోతుగా పరిశీలన జరిపిందని చెప్పారు. మొబైల్ ఫోన్ల నుంచి షేర్ అవుతున్న డేటా సంకేత సంక్షిప్త సందేశం (ఎన్క్రిప్ట్) రూపంలో ఉంటున్నందున అది ఎలాంటి సమాచారమో కనిపెట్టడం కష్టమవుతోందని మంత్రి చెప్పారు. ఈ డేటా కేవలం తమ ప్రతిభా సామర్థ్యాలను మరింతగా పెంపొందిచుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయని మంత్రి వివరించారు. -
కేశవదాసుపాలెంలో గ్యాస్ లీక్
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలం కేశవదాసుపాలెం శివారులో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేగింది. గ్రామ శివారులో సోమవారం ఉదయం గ్యాస్ లీకైతున్నట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అదికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. -
దేవాదుల పైపులైన్ లీకేజీ
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలోని వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరి గూడెం శివారులో దేవాదుల పైపులైన్ గేట్ వాల్వు లీక్ అయింది. దీంతో పైప్లైన్ నుంచి 30 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. అలాగే ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండిరామారం వెళ్లే పైప్ లైన్ మూడుచోట్ల లీక్ అయింది. రెండో దశ దేవాదుల పైప్లైన్ నుంచి సుమారు మూడు గంటలుగా నీరు వృథాగా పోతున్నది. పంట పొలాల్లోకి నీరు భారీగా చేరుకుంది. -
లీకేజీలు చాలా చిన్నవిషయం
-
లీకేజీలు చాలా చిన్నవిషయం: మంత్రి నారాయణ
అమరావతి: ఏపీ సచివాలయంలో తాజా లీకేజీలపై మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించారు. లీకేజీలు చాలా చిన్న విషయమని.. భూతద్ధంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. స్లాబ్ పై ఉన్న డక్ షీట్ బయటకు రావడం వల్లే నీళ్లు లీకయ్యాయని మంత్రి తెలిపారు. మనం కట్టుకున్నఇళ్లలో కూడా మొదట్లో చాలా లోపాలుంటాయని.. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వర్షం తగ్గగానే మరమ్మత్తులు చేస్తామన్నారు. లోపాలను రెండేళ్లపాటు నిర్మాణ సంస్థలే సరిచేస్తాయని ఆయన తెలిపారు. కాగా మంగళవారం సచివాలయంలో బయటపడ్డ లీక్ లపై మంత్రి నారాయణను మీడియా ప్రశ్నించింది. అయితే మొదట ఆ విషయం తనకు తెలియదని నారాయణ తోసిపుచ్చడం గమనార్హం. -
కేశవదాసుపాలెంలో గ్యాస్ లీకేజీ
రెండు వారాల్లో మూడుసార్లు ఇలా.. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న సిబ్బంది సఖినేటిపల్లి(రాజోలు) : కేశవదాసుపాలెంలో మంగళవారం ఉదయం వరి చేలో గ్యాస్ లీకేజీ అయింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ ఎగజిమ్మిన గ్యాస్ క్రమేపీ తగ్గుముఖం పట్టింది. భూగర్భంలో పుష్కర కాలం క్రితం వేసిన పైపులైన్లు తుప్పుపట్టి, పైపునకు ఏర్పడిన పిన్హోల్ నుంచి ఈ గ్యాస్ పైకి వచ్చింది. మండలంలోని అంతర్వేదికరలో కేవీ 13, 14, 15 బావులకు సంబంధించిన పైపులైన్లతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఏడు బావుల పైపులైన్లు కేశవదాసుపాలెం వరిపొలాలు మీదుగా మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్కు వేశారు. స్థానిక రైతు బెల్లంకొండ నారాయణ రావు వరిచేల మీదుగా వెళ్లిన ఈ లైన్లుల్లో ఏ పైపులైను నుంచి గ్యాస్ లీకేజీ అవుతోందో గుర్తించడానికి ఓఎన్జీసీ సిబ్బందికి కొంత సమయం పట్టింది. ఎట్టకేలకు కేవీ 15 బావి నుంచి మోరి జీసీఎస్కు వెళ్లిన గ్యాస్పైపులైనులో లీకేజీ అవుతున్నట్టుగా గుర్తించి, తదనుగుణంగా పైపులైనులో గ్యాస్ను అదుపు చేయడంతో పరిస్థితి చక్కబడింది. గ్యాస్ అదుపులోకి తెచ్చిన సిబ్బంది పైపునకు మరమ్మతులు చేశారు. తహసీల్దారు డీజే సుధాకర్రాజు పరిస్థితిని ఎప్పటికప్పుడు అమలాపురం ఆర్డీఓ గణేష్కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీఓ ఆదేశాలతో రాజోలు ఫైర్స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలంలో మోహరించారు. -
నీటి బుగ్గ కాదు..
అసలే తీవ్ర వర్షాభావం. భూగర్భజలాలు సైతం పాతాళానికి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతుకు బోర్లు తవ్వినా నీరు లభించడం లేదు. అయితే.. కదిరి మండలం పట్నం సమీపంలో శుక్రవారం ఒక్కసారిగా భూమిలో నుంచి నీరు ఉప్పొంగింది. చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఇక్కడ కూడా భూగర్భజలం ఉబికి రాలేదు. సత్యసాయి పైపులైన్కు లీకేజీ ఏర్పడటంతో ఇలా జరిగింది. - కదిరి -
ఆకాశానికి ఎగిరిన గంగ
-
బాబోయ్! భాగ్యనగర్
గ్యాస్ పైపులైను నుంచి లీకైన గ్యాస్ భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు కాకినాడ రూరల్ : సూర్యారావుపేట లైట్హౌస్ ప్రాంతంలోని ఎ¯ŒSసీఎస్ ఆయిల్ ఫ్యాక్టరీ సమీపాన భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ నుంచి లీకవడంతో అక్కడి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సుమారు రెండు గంటలపాటు అటుగా వెళ్లేందుకు ప్రజలు, కార్మికులు హడలెత్తారు. లీకేజీ సమాచారం అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ సంస్థ సిబ్బంది, ఎన్ఎఫ్సీఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్స్కు చెందిన అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలి వచ్చాయి. అప్పటికే ఉధృతంగా ఎగజిమ్ముతున్న గ్యాస్ను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అరగంట అనంతరం లీకేజీని అరికట్టారు. ప్రమాదకరం కాదు ప్రొక్లెయిన్తో మొక్కలను తొలగిస్తూ్తండగా దాని బకెట్ పైపులైనకు తగిలి రంధ్రం పడి ఉంటుందని ‘భాగ్యనగర్’ డిప్యూటీ మేనేజర్ డీవీ అనిల్కుమార్ చెప్పారు. ఈ గ్యాస్ అంత ప్రమాదకరం కాదని, ప్రతి 50 మీటర్లకు హెచ్చరిక బోర్డు ఉంటుందని, పైపులైనును నిత్యం నలుగురు పెట్రోలింగ్ చేస్తూంటారని వివరించారు. ఎక్కడైనా గ్యాస్ లీకవుతున్నట్లు తెలిస్తే తక్షణం సరఫరాను ఆపేందుకు వీలుగా ప్రతి కిలోమీటరుకు కంట్రోల్ వాల్వ్ ఉంటుందన్నారు. కాగా, ఆ ప్రాంతంలో ఎటువంటి పొక్లెయిన్ కనిపించలేదని, నాసిరకమైన పైపులు వాడడంతో తరచూ ఏదో ఒకచోట గ్యాస్ లీకవుతూనే ఉందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి : కురసాల కన్నబాబు పగటివేళ జరిగింది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ జరగలేదని, అదే అర్ధరాత్రి లీకైతే పరిస్థితేమిటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు భాగ్యనగర్ గ్యాస్ సంస్థ అధికారులను నిలదీశారు. తాగునీటి పైపులనే దాదాపు పదడుగుల లోతులో వేస్తారని, అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ పైపులైనును అడుగు లోతు కూడా లేకుండా వేసుకుపోయారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అరమవుతోందని విమర్శించారు. గ్యాస్ పైపులైనుకు రెండడుగుల దూరంలో ఆయిల్ కంపెనీకి క్రూడాయిల్ సరఫరా చేసే పైపులైన్లు ఉన్నాయని, 50 మీటర్ల దూరంలో పెద్ద ఆయిల్ ఫ్యాక్టరీలు, నాఫ్తలి¯ŒS ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్యాస్ లీకేజీని ఎవ్వరూ గమనించకుండా ఉంటే వాటి పరిస్థితి, సమీపంలో ఉన్న మత్స్యకారులు పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పైపులైన్లు విషయంలో భాగ్యనగర్ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రస్తుతం వేసిన పైపులు నాసిరకంగా ఉండడం, భూమికి పైపైనే పైపులైను ఉండడంతో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను ప్రజలు నిత్యం ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. దీనిపై భాగ్యనగర్ గ్యాస్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడనున్నట్లు కన్నబాబు వివరించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ, బొమ్మిడి శ్రీనివాస్, పార్టీ నాయకులు శెట్టి బాబూరావు, గొల్లపల్లి ప్రసాద్, కర్రి చక్రధర్, జంగా గగారి¯ŒS తదితరులు ఉన్నారు. -
సూర్యారావుపేటలో గ్యాస్ పైప్లైన్ లీకేజీ
కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సూర్యారావుపేట లైట్హౌస్ వద్ద గ్యాస్ లీకేజీ అయింది. రోడ్డు పక్కన చెట్లు కొడుతుండగా పొరపాటున గడ్డపార పైప్లైన్లోకి దిగబడినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో భాగ్యనగర్ పైప్లైన్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని వెంటనే మరమ్మతులు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. -
లీకేజీల పర్వం.. తీరని దాహం
లీకేజీలకు నిలయంగా కోయిల్సాగర్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాకు ఇబ్బందులు నీటిఉధృతి తట్టుకోలేక పగిలిపోతున్న పైపులు మహబూబ్నగర్ రూరల్: పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో ఏర్పాటుచేసిన కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తరచూ లీకేజీలకు గురవుతుండడంతో స్థానికులు నీటికోసం అనేక తంటాలు పడుతున్నారు. 2007లో పబ్లిక్హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వారు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పైప్లైన్ల ఏర్పాటు విషయంలో, పనుల నిర్వాహణ విషయంలో మున్సిపల్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యమే పాలమూరు పట్టణ ప్రజలకు తరచూ తాగునీటి ఇబ్బందులను తెస్తుంది. కోయిల్సాగర్ నుంచి మహబూబ్నగర్ వరకు ఏర్పాటుచేసిన పైప్లైన్ నాణ్యవంతంగా లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ పైపులు లీకేజీలు అవుతున్నాయి. అందువల్ల కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టణంలో కేఎల్ఐ పథకం ద్వారా తాగునీటి సరఫరా అయ్యే ప్రాంతాలు ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. 15 రోజులకోసారి పైప్లైన్ల లీకేజీలు కోయిల్సాగర్ తాగునీటి పథకం కోసం ఏర్పాటుచేసిన పైపులు 15 రోజులకోమారు పగిలిపోతుండడంతో పట్టణ ప్రజలకు నీటి సమస్య ఎదురవుతుంది. పథకం ప్రారంభ సమయంలో నాణ్యమైన పైపులను ఏర్పాటు చేసింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పలు రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. అప్పట్లో సంబంధిత అధికారులు మాముళ్లకు కక్కుర్తిపడి పైపులు ఏ మేరకు నాణ్యతగా ఉన్నాయానే విషయాన్ని గమనించకుండా పైపుల బిగింపు పూర్తి చేయడంతో ఇప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. తరచూ పైపులు లీకేజీలు అవుతుండడంతో ప్రజలు సైతం విసిగెత్తుకుంటున్నారు. ఈ క్రమంలో వారంరోజుల క్రితం బండమీదిపల్లి సమీపంలో గల సరస్వతి శిశుమందిర్ పాఠశాల, ధర్మాపూర్ సమీపంలో జేపీఎన్సీ వద్ద మళ్లీ పైపులు పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ ప్రజలు నీటి కోసం అల్లాడారు. మున్సిపల్ అధికారులు మాత్రం తీరికగా పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తుండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై మున్సిపల్ ఏఈ వెంకన్నను వివరణ కోరగా ‘కోయిల్సాగర్ పైప్లైన్ లీకేజీ అయిన మాట వాస్తవమే. నీటి ఉద్ధతిగా ఉన్నందున పైపులు లీకేజీలు అవుతున్నాయి. అయినా మరమ్మత్తులు చేయించి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని’ చెప్పారు. -
గోరుకల్లు కట్ట పరిశీలన
– లీకేజీలను పరిశీలించిన ఎక్స్ఫర్ట్ కమిటీ సభ్యులు – రిజర్వాయర్ను సందర్శించిన ఎక్స్పర్ట్ కమిటీ – సాయంత్రం వరకు పరిశీలన – నిర్మాణలోపాలపై ఆరా పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ కట్టకు లీకేజీలు ఏర్పడి నీరు బయటకు పారుతుండడంతో శనివారం ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉండగా కట్టకు నాలుగు చోట్ల నీటి ఊటలు బయటకు వస్తున్నాయి. అవుటర్ రెగ్యులేటర్ వద్ద రాతి కట్ట నుంచి రెండించుల నీరు లీకవుతోంది. సమీపంలోనే రెండు ఆయిల్ ఇంజిన్ల మేర నీరు బయటకు పోతోంది. దీన్ని దష్టిలో ఉంచుకుని విశ్రాంత ఇంజినీర్లు సుబ్బారావు, రైతు సత్యనారాయణ, సీఈ సీడీఓ గిరిధర్రెడ్డి, సీఈ నారాయణరెడ్డి, ఈఈ సుబ్బారాయుడుతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీ శనివారం జలాశయాన్ని సందర్శించింది. లీకేజీ నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేకంగా కాల్వ తీయించారు. కాంక్రీట్ పనులు, గుర్రాల వాగు వద్ద కట్టకు నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రెండు పాయింట్ల వద్ద కట్టపై టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా డ్రిల్లింగ్ చేయించారు. కట్ట కింది భాగంలో మట్టి బురదగా ఉండడంతో డ్రిల్లింగ్కు ఆటంకం ఏర్పడింది. అలాగే అవుట్ రెగ్యూలేటర్ వద్ద కట్ట నుంచి రాళ్లను తొలగించి పరిశీలించారు. హెలిప్యాడ్ పాయిండ్ వద్ద ప్రత్యేకంగా ప్రొక్లెయిన్తో గుంత తవ్వించగా మూడు అడుగుల లోతులోనే నీరు పడడంతో కమిటీ సభ్యులు ఆలోచనలో పడ్డారు. జలాశయానికి పూనాది వేసిన ఇంజినీర్లను రప్పించే చర్యలు చేపట్టారు. నిర్మాణంలో లోటుపాట్లపై కంపెనీ ప్రతినిధులను ఆరా తీస్తున్నారు. విషయాన్ని తేల్చేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. పంపింగ్ నిలిపివేత.. ప్రస్తుతం 14.5 మీటర్ల వద్ద జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 234.4 అడుగుల మేర నీరు వచ్చినట్లు చెబుతున్నారు. కట్టకు సంబంధించి నేల నుంచి దిగువకు 180అడుగుల లోతులో పునాదులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కట్టకు ఏర్పడిన లీకేజీలను దష్టిలో ఉంచుకుని జలాశయంలోకి పంపింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ఎస్సాఆర్బీసీ ప్రధాన కాల్వ నుంచి నీటిని దిగువకు వదుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 నుంచి 7 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితి దష్ట్యా అందుకు సాధ్యం కాదని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి కట్ట పరిస్థితిని పరిశీలించారు. -
లీకేజీ.. టేకిటీజీ
సోమశిల జలాశయంలో రోజూ సుమారు 70 క్యూసెక్కులు వృథా అవుతున్న వైనం లీకేజీ అరికట్టలేక నీటి లెక్కల్లో జిమ్మిక్కులు 70 క్యూసెక్కులు.. రోజూ జిల్లా జలనిధి సోమశిల జలాశయం నుంచి వృథా అవుతున్న నీరు.. వినేందుకు నమ్యశక్యంగా లేకున్నా ఇది నిజం. లీకేజీని అరికట్టాల్సిన అధికారులు అసలు పనిచేయకుండా నీటి గణాంకాల్లో జిమిక్కులు చేస్తున్నారు. సోమశిల : సోమశిల జలాశయం పెన్నార్ డెల్టాకు నాలుగురోజుల క్రితం విడుదల నిలుపుదల చేవారు. అయితే స్లూయిజ్ గేట్ల నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ గేట్ల నుంచి సుమారు 70 క్యూసెక్కుల నీరు ధారాపాతంగా పోతోంది. ఈ విషయం ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు తెలిసినా ఏ చర్య తీసుకోలేని దుస్థితి. ఈ స్లూయిజ్ గేట్ల ద్వారా విపరీతంగా లీకేజీ సమస్య ఉంది. గేట్ల వ్యవస్థ ప్రారంభం నుంచే ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. చూసేందుకు ఇది చిన్న సమస్యే అయినా అధికారుల చిత్తశుద్ధి లోపం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఇది నిరదర్శంగా ఉంటుంది. దీంతో ప్రతిసంవత్సరం నీరు వృథా అవుతూనే ఉంది. స్లూయిజ్ గేట్లు మరమ్మతులకు గురై సంవత్సరాలు గడిచిచాయి. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రోలర్స్ కూడా మరమ్మతులు గురియ్యాయి. ఈ నేపథ్యంలో గేటు దిగడం గగనమైపోతోంది. దీంతో సుమారు 70 క్యూసెక్కులు ఒక్క రోజులోనే లీకేజీ రూపంలో వృథా అవుతున్నాయి. ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఓ మార్గం అన్వేషించారు. వృథా నీటిని ఆవిరి రూపంలో ఖర్చయ్యే నీటి లెక్కల్లో కలిపి చూపిస్తున్నారు. ఓ వైపు జలాశయం అడుగంటుతోంది. ఇంకా మరో 16 రోజులవరకు రెండో పంటకు నీరివ్వాలి. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా మౌనంగానే ఉంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : దేశ్నాయక్, ఇన్చార్జి ఈఈ, సోమశిల సోమశిల గేట్ల లీకేజీ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలించింది. అయినా ఇది దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య. ఉన్నతాధికారులు దీనిని పరిశీలించారు. త్వరలోనే లీకేజీ అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం మార్గాలకు అన్వేషిస్తున్నారు. -
‘కడెం’ లీకేజీకి మందు ఎండుగడ్డి
రబ్బర్ సీల్స్ వేసినప్పటికీ.. కడెం : కడెం ప్రాజెక్టుకు తిరిగి ఎండుగడ్డే గతి అవుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధతి తగ్గినందున కొద్దిరోజులుగా నీరు వరదగేట్ల ద్వారా వథాగా బయటికి పోతోంది. ఇలా దాదాపు రోజూ 50 క్యూసెక్కుల నీరు వథాగా పోయింది. ప్రస్తుతం ఆయకట్టుకు నీరు చాలా అవసరం. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రాజెక్టు అధికార్లు వరదగేట్ల నుంచి అవుతున్న లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా సాధారణ ఎండు గడ్డితోనే ఈ లీకేజీలున్న చోట పెడుతున్నారు. అధికార్లు నాలుగు రోజుల నుంచి లీకేజీని ఆపేందుకు ఇతర ప్రాంతం నుంచి తెప్పించిన ఎండుగడ్డితో లీకేజీ అవుతున్న చోట పెట్టి బయటకు వెళ్తున్న నీటిని ఆపుతున్నారు. శుక్రవారం కూడా ఈ పనులు జరిగాయి. ఇంకా రెండు రోజుల్లో గేట్లన్నింటికీ గడ్డిపెట్టే పని పూర్తవుతుందని ప్రాజెక్టు జేఈ శ్రీనాథ్ వివరించారు. రబ్బర్ సీల్స్ పెట్టినప్పటికీ. . ప్రాజెక్టు నిర్మాణ కాలంలో వరదగేట్లకు నీటి లీకేజీలను ఆపేందుకు ఉపయోగించే టాప్, బాటమ్ రబ్బర్ సీల్స్ పాతవి కావడంతో అవి దెబ్బతిన్నాయి. దీంతో రెండేళ్ల క్రితమే రు.25 లక్షలతో కొత్తవి రబ్బర్ సీల్స్ తెప్పించి ప్రాజెక్టున్న అన్ని గేట్లకు పెట్టించారు. వీటి ద్వారా నీటి చుక్క కూడా బయటకు వెళ్లకూడదు. కానీ ప్రస్తుతం నీరు చాలా వరకు లీకేజీ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే రబ్బర్ సీల్స్ ఏ మేరకు నాణ్యమైనవో తెలిపోతుంది. ఈ విషయమై ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ను ‘సాక్షి’ వివరణ కోరగా రబ్బర్ సీల్స్ పెట్టినప్పటికీ వాటిలో చెత్తా చెదారం రావడంతో, ఇలా నీరు లీకేజీ అవుతోందని, అన్ని ప్రాజెక్టుల్లో రబ్బర్ సీల్స్ వేసినప్పటికీ కూడా ఇలాగే లీకేజీ జరుగుతుందని వివరణ ఇచ్చారు. -
పాకాలకు లీకేజీ గండం
తూముల నుంచి వృథాగాపోతున్న నీరు మరమ్మతులు చేయించడంపై దృష్టిసారించని అధికారులు ఏళ్లు గడుస్తున్నా షటర్లు మార్చని వైనం ఆందోళనలో ఆయకట్టు రైతులు ఖానాపురం : ‘ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుదాం’ అంటూ జల పరిరక్షణ కోసం నినాదాలు ఇస్తుంటారు అధికారులు. కానీ వర్షం రూపంలో ప్రకృతి ప్రసాదించిన జల వనరులు కళ్లెదుటే నేల పాలవుతున్నా పట్టించుకోని దుస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. మండలం పరిధిలోని పాకాల సరస్సు తూములకు లీకేజీ గండం చుట్టుముట్టింది. రెండు తూముల షటర్లు శిథిలావస్థలో ఉన్నాయి. అయినా ఐబీ అధికారులు గత కొన్నేళ్లుగా మరమ్మతు చేయించలేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో తూముల నుంచి నీరు వృథాగాపోతోంది. ఈ లీకేజీల కారణంగా రబీ సీజన్లో క్యారీ ఓవర్ సిస్టమ్ ప్రకారం 10 ఫీట్ల వరకు ఉండాల్సిన నీటిమట్టం 5 ఫీట్లకు పరిమితం అవుతోంది. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1902 సంవత్సరంలో కాకతీయుల పాలనా కాలంలో పాకాల సరస్సు తూములు నిర్మించారని చెబుతారు. వాటికి మరమ్మతులు చేయించడంపై అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించాలి. కాగా, సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 అడుగులు. ఇది పూర్తిస్తాయిలో నిండితే ఖరీఫ్, రబీలో ఆయకట్టు రైతులు ఆనందోత్సాహాలతో పంటల సాగుకు నడుం బిగిస్తుంటారు. అన్నదాతల ఆనందం పదికాలాల పాటు పరిఢవిల్లాలంటే జలసిరులను అందిస్తున్న పాకాల సరస్సును కంటికిరెప్పలా కాపాడాల్సిన అవసరం ఉంది. నీటి వృథాను అరికట్టాలి తూముల నుంచి నీరు వృథాగా పోకుండా చూడాలి. అప్పుడే సరస్సు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంటుంది. షటర్లకు మరమ్మతులు చేయించాలి. తద్వారా ఆయకట్టు రైతులకు ఎటువంటి బెంగ ఉండదు. – జినుకల సురేష్, రైతు, అశోక్నగర్ రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పాకాలలో ప్రధాన తూముల ద్వారా నీరు వృథాగా పోతున్న విషయం వాస్తవమే. తూములు, కాల్వల మరమ్మతుల కోసం రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించాం. దీన్ని ప్రభుత్వానికి పంపుతాం. తూములు, షటర్లకు మరమ్మతులు చేసి లీకేజీలను అరికడతాం. – సుదర్శన్రావు, ఐబీ డీఈ -
తెలంగాణ ఎంసెట్-2 రద్దు
-
ఎంసెట్ కన్వీనర్, మంత్రుల ఫ్లెక్సీ దహనం
బెల్లంపల్లి : ఎంసెట్ పేపర్ లీకేజీ నిందితులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ బొమ్మల దహనం చేశారు. బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా కల్వర్టు వద్ద ఎంసెట్ కన్వీనర్ రమణరావు, విద్యా, వైద్య శాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్షా్మరెడ్డిల ఫ్లెక్సీ బొమ్మలను కాల్చివేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎంసెట్ పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రధాన నిందితుడు రాజగోపాల్రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థులను మినహాయించి మిగతా విద్యార్థులకు కౌన్సెలింగ్ చేసి సీట్లు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కష్ణదేవరాయులు, బాగ్ కన్వీనర్ ఎన్.మురళీశ్రావణ్, కళాశాల ఇన్చార్జి హిమవంత్, నాయకులు అఖిల్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ఇద్దరు అరెస్ట్
-
తుంగభద్ర దిగువ కాల్వకు గండి
– కాల్వకు నీటిసరఫరా నిలిపివేత – మరమ్మతులకు చర్యలు సాక్షి, బళ్లారి : తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగు నీటినందించే తుంగభద్ర దిగువ కాల్వకు శనివారం గండి పడింది. బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధిలోని గుండ్లుకెరి సమీపంలో బుక్కసాగరకు ఆనుకుని కాలువకు గండి పడింది. నీరంతా బయటకు పారుతుండడంతో ఆ ప్రాంతవాసులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ రంగారెడ్డి, సంబంధిత అధికారులు గండి ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కాలువకు మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆంధ్రా సరిహద్దు కాదు కదా కర్ణాటక పరిధిలోని బళ్లారి జిల్లాకు కూడా పూర్తిగా చేర కుండా గండిపడింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. పనులు పూర్తయిన వెంటనే తిరిగి కాలువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. -
ఆ కోచింగ్ సెంటర్లో ఏం జరిగింది?
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో దిల్సుఖ్నగర్లోని ఓ సెంటర్పై అనుమానాలు సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీ ఆరోపణల వ్యవహారంలో దిల్సుఖ్నగర్లోని ఓ కోచింగ్ సెంటర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి, పరీక్షకు ఒకరోజు ముందు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను హైదరాబాద్కు రప్పించుకుని పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఈ కోచింగ్ సెంటర్పై ఆరోపణలు వస్తున్నాయి. చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న ఆయా విద్యార్థులకు ఎంసెట్-2 ఫలితాల్లో వెయ్యి లోపు ర్యాంకులు వచ్చాయని అదే కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి తెలిపారు. నిర్వాహకులు అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో తనకు వేల ల్లో ర్యాంకు వచ్చిందని, డబ్బులు చెల్లించడంతో చదువులో తనకంటే బాగా వెనకబడిన విద్యార్థులకు వెయ్యి లోపు ర్యాంకు వచ్చిందని సదరు విద్యార్థి చెబుతోంది. మెడికల్ సీటు కావాలంటే దిల్సుఖ్నగర్లోని ఈ కోచింగ్ కేంద్రంలో సంప్రదించాలంటూ కొందరు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఫోన్ కూడా వెళ్లాయి. దీంతో వారి ఫోన్ నెంబర్లు, కాల్ డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మధ్యవర్తులు ఏం మాట్లాడారన్న కోణంలో పరిశీలిస్తున్నారు. మధ్యవర్తులు నిజంగా పేపర్లోని ప్రశ్నలను బయటకు తేగలిగారా? లేదా డమ్మీ పేపర్ను రూపొందించి అదే అసలుగా నమ్మించి డబ్బు దండుకున్నారా? అన్న అంశాలను కూడా ఆరా తీస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ ఆస్కారమెంత? ఎంసెట్-2 ప్రశ్నపత్రాల ముద్రణ విజయవాడలో జరిగిందా? లేదా? అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. అయితే ప్రాథమికంగా తేల్చిన దాని ప్రకారం విజయవాడలో పేపర్ ముద్ర ణ జరగలేదని తెలుస్తోంది. పైగా ప్రింటింగ్ ప్రెస్లో ప్రశ్నలు మాత్రమే ముద్రిస్తారని, అవి ఏ పరీక్షకు సంబంధించినవో ఎవరికీ తెలియదని చెబుతున్నారు. ఒక్క ముద్రణ సంస్థ యజమానికి మాత్రం కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు. ఒకవేళ ముద్రణ సంస్థ నుంచి ప్రశ్నలు లీక్ అయితే అది యజమానికి తెలియకుండా జరిగిందా అన్న కోణంలో అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. 15 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ముద్రణ సంస్థ నుంచి ఎంసెట్ పేపర్ లీక్ అయ్యింది. అది ముద్రణ సంస్థ యజమాని నిర్లక్ష్యం కారణంగా.. అందులో పని చేసే వ్యక్తి నుంచి మధ్యవర్తులు పేపర్ కాపీని పొందినట్టు పోలీసు విచారణలో తేలింది. అయితే ప్రసు ్తతం ఆ పరిస్థితి లేదని ఎంసెట్ అధికారులు భావిస్తున్నారు. అసలు వాస్తవం ఏంటన్నది సీఐడీ విచారణలో వెలుగులోకి రానుంది. 25లోగా ప్రాథమిక విచారణ! ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. సీఐడీ అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలు గురువారం రంగంలోకి దిగాయి. ఈ నెల 25న ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉన్నందున ఆలోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని సీఐడీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఆరోపణలు చేస్తున్న వారిని విచారించాలని నిర్ణయించింది. ఒక బృందం వరంగల్ చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టింది. ఎంసెట్-1లో వచ్చిన ర్యాంకులు, ఎంసెట్-2లో వచ్చిన ర్యాంకులను బేరీజు వేస్తోంది. వరంగల్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు ఎంసెట్-2లో మంచి ర్యాంకులు సాధించారు. సీఐడీ అధికారులు వారి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. అలాగే విజయవాడలో ఆ విద్యార్థులు కోచింగ్ తీసుకున్న కేంద్రానికి మరో బృందం బయల్దేరింది. అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించడంతోపాటు వారు నిర్వహించిన మాక్ టెస్టు పేపర్లను సీఐడీ స్వాధీనం చేసుకుంది. రూ.70 లక్షలు, కోటి ఇస్తే మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ కొందరు తల్లిదండ్రులకు కాల్స్ వచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న సీఐడీ.. వారి సెల్ఫోన్ కాల్డేటాను విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. ర్యాంకులు సాధించిన వారి తల్లిదండ్రుల కాల్డేటాతో పాటు మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ఫోన్కాల్స్ను విశ్లేషిస్తోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిపై సీఐడీతోపాటు నిఘా ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి, ఎంసెట్-2 నిర్వహణకు ముందు వీరు ఎక్కడ ఉన్నారు, వారి ఆర్థిక వ్యవహారాలపై సమాచారం సేకరిస్తున్నారు. సీఐడీకి మరిన్ని వివరాలు ఎంసెట్-2 పరీక్షకు సంబంధించిన ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు సీఐడీ అధికారులకు గురువారం మరిన్ని వివరాలు అందజేసినట్లు తెలిసింది. విద్యార్థుల వారీగా మార్కులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లు సమాచారం.వాటితోపాటు ఎంసెట్-1లో ఎక్కు వ మార్కులు వచ్చి ఎంసెట్-2లో తక్కువ మార్కులు వచ్చిన వారి వివరాలను, ఎంసెట్-1లో తక్కువ మార్కులు వచ్చి, ఎంసెట్-2లో ఎక్కువ మార్కులు వచ్చిన వివరాలను కూడా అందజేసినట్లు తెలిసింది. -
పగిలిన దేవాదుల పైప్లైన్
హసన్పర్తి: వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టు సమీపంలో బుధవారం రెండు చోట్ల దేవాదుల పైప్లైన్ పగిలింది. పైప్ నుంచి నీరు సుమారు 50 మీటర్ల ఎత్తు వరకు నీరు ఎగసిపడుతోంది. సుమారు మూడు గంటల సేపు నీరు వృథాగా పోయింది. లీకేజీతో చుట్టుపక్కల పొలాలన్నీ జలమయం అయ్యాయి. జిల్లా భారీ నీటిపారుదల శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ లీకేజీ అయింది. మధ్యాహ్నానికి అధికారులు వచ్చి మరమ్మత్తుల చేపట్టారు. -
అలా నిండి.. ఇలా ఖాళీ!
♦ కాగ్నాలో వరదనీటికి పడని అడ్డుకట్ట ♦ కర్ణాటకకు తరలిపోతున్న వరద జలాలు ♦ చెక్డ్యాం కిందిభాగం నుంచి లీకేజీలు! ♦ మట్టికట్ట కోతకు గురికావడంతో ఇబ్బంది ♦ షీట్ఫైలింగ్ పనుల కోసం ప్రతిపాదన ♦ ఇప్పటికే డ్యాం పనులు 90శాతం పూర్తి ♦ కాంట్రాక్టర్కు రూ.8.50 కోట్ల చెల్లింపులు ♦ ప్రభుత్వం వద్ద రీ డిజైన్ ఫైల్ పెండింగ్ కాగ్నా నదిలోకి వర్షపు నీరు అలా వచ్చి ఇలా కిందకు వెళ్లిపోతోంది. వర్షాకాలంలో కర్ణాటకకు వృథాగా తరలిపోతున్న వరదజలాలను వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కాగ్నాపై ఆనకట్ట (చెక్డ్యాం) నిర్మించారు. అయితే కోట్లు వ్యయం చేసినా పూర్తిస్థాయిలో లక్ష్యం నెరవేరలేదు. తాండూరు : తాండూరు వద్ద కాగ్నా నదిపై ఏడాదిన్నర క్రితం సుమారు రూ.8.50 కోట్లతో చెక్డ్యాం పనులను సాగునీటి పారుదల శాఖ అధికారులు చేపట్టారు. ఈ చెక్డ్యాం నిర్మాణంతో కాగ్నా పరీవాహక ప్రాంతంలో సుమా రు తొమ్మిది వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు తాండూరు పట్టణానికి తాగునీటిని అందించొచ్చు. 12 శాతం లెస్తో ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ సుమా రు 90 శాతం పనులు పూర్తి చేశారు. మొత్తం డబ్బు కాంట్రాక్టర్కు చెల్లింపులు జరిగిపోయాయి. చెక్డ్యాంతో కాగ్నా నదిలో 0.035 మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు నిలుస్తుంది. దీంతో కాగ్నా పరిధిలో భూగర్భజలాలు పెరగటంతో పాటు చుట్టుపక్కల వ్యవసాయ బోరు బావులు కూడా పూర్తిగా రీఛార్జ్ అవుతాయి. కొన్ని రోజులుగా తాండూరు ప్రాంతంలో జోరుగా కురిసిన వర్షాలకు కాగ్నా నదికి వరదనీరు పోటెత్తింది. ఈ వరదనీరు ఇప్పుడు పూర్తిస్థాయిలో నిలవని పరిస్థితి నెలకొంది. పనుల్లో నాణ్యత లోపమా? లేదా? లీకేజీల కారణమా? ప్రస్తుతం వరదనీరు పూర్తిస్థాయిలో ఆగడం లేదు. చెక్డ్యాం కిందిభాగం నుంచి నీరు వృథాగా తరలిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్డ్యాం వద్ద డౌన్స్ట్రీమ్ కటాఫ్ వాల్ నిర్మాణాన్ని ఐదు మీటర్ల లోతుగా కాంక్రీట్తో నిర్మించాలి. కానీ సుమారు మూడు అడుగులకు పరిమితమయ్యారు. కాగ్నాలో మూడు అడుగుల తర్వాత తవ్వితే నీళ్లు, ఇసుక పైకి రావడం వల్ల పూర్తిస్థాయిలో ఈ పనులు చేయడం సాధ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ అధికారులు ఈ విషయాన్ని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు నివేదించారు. సీడీఓ అధికారులు చెక్డ్యాం పనులకు రీ డిజైన్ చేయాలని ప్రతిపాదించారు. డౌన్స్ట్రీమ్ కటాఫ్ వాల్ కింది భాగంలో కాంక్రిట్కు బదులు షీట్ఫైలింగ్ చేయాలని సీడీఓ అధికారులు సూచించారు. ఈ మేరకు అధికారులు రీ డిజైన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. వరదనీరు పోటెత్తడంతో చెక్డ్యాం కుడివైపు మట్టి కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. ప్రభుత్వం కొత్త డిజైన్కు ఆమోదముద్ర వేస్తే పూర్తిస్థాయిలో ఆనకట్ట పడి, వృథా జలాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లీకేజీలు లేవు.. కాగ్నా చెక్డ్యాం పనుల్లో లీకేజీలు లేవు. లీకేజీలున్నాయనేది అపోహ మాత్రమే. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్డ్యాం సామర్థ్యం మేరకు కాగ్నాలో నీరు నిలిచింది. డౌన్స్ట్రీమ్ కటాఫ్ వాల్ కాంక్రీట్ పనులకుగాను కొత్త డిజైన్తో తొమ్మిది అడుగల లోతులో షీట్ఫైలింగ్ పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. సుమారు రూ.4 కోట్ల అదనపు నిధులతో రూపొందించిన కొత్త డిజైన్కు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే షీట్ పనులు మొదలవుతాయి. - నికేష్, ఇరిగేషన్ ఏఈ -
బాబ్బాబు.. ఎలాగైనా ఆపండి..!
రోడ్డుపాలవుతున్న గోదావరి జలాలు.. పైపులైన్కు పగిలి 48 గంటలైనా పట్టించుకోని అధికారులు.. లీకేజీని అరికట్టాలని కాంట్రాక్టర్లను బతిమాలుతున్న వైనం చింతల్: నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి జలాల పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిష్ర్పమోజనంగా మారుతోంది. ఈ నెల 1వ తేదీ అర్థరాత్రి చింతల్ హెచ్ఎంటి వాటర్ట్యాంక్ సమీపంలో భారీ పైపులైన్ పగిలిపోవడంతో నీళ్లు ప్రధాన రహదారిని ముంచేశాయి. శనివారం ఉదయం 10 గంటలకు తాపీగా అక్కడికి చేరుకున్న వాటర్వర్క్స్ అధికారులు సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అయినా లీకేజీలు ఆగకపోవడంతో వాటర్ వర్క్స్ అధికారులు స్థానిక కాంట్రాక్టర్ను సంప్రదించగా, తాను మేజర్ పైపులైన్ పనులు చేయలేనని చెప్పడంతో అధికారులు ఇతర కాంట్రాక్టర్ల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడం, సోమవారం కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు, జలమండలి ఉన్నతాధికారులు ఆరు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసేందుకు ఆ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న అధికారులు ఎలాగైనా పనులు పూర్తి చేయాలని పలువురు కాంట్రాక్టర్లను కాళ్లవేళ్ల పడుతున్నట్లు సమాచారం. ఇదే పైపులైన్కు నెల రోజుల్లో రెండు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టడం గమనార్హం. -
తాగునీటి పైప్లైన్కు లీకేజీ
శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని తీసుకెళ్లే పైప్లైన్కు నిజామాబాద్ డిచ్పల్లి సమీపంలోవాల్వ్ లీకేజీ ఏర్పడింది. 44వ నంబర్ జాతీయ రహదారి పక్కనుంచే ఈ పైప్లైన్ వెళుతోంది. పైప్లైన్ లీకేజీతో శనివారం ఉదయం నుంచీనీరు వృధాగా పోతోంది. దీంతో ఈ సమాచారాన్ని 'సాక్షి' ప్రతినిధి గ్రామీణ నీటి సరఫరా విభాగానికి తెలియజేశారు. -
ఎన్టీపీసీ నిలిచిపోయిన విద్యుత్
కరీంనగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ఆరో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా విద్యుత్కు అంతరాయం ఏర్పాడటం వల్ల నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే మరమ్మతులు పనులను చేపట్టారు. మిగతా యూనిట్లలో 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్తత్పి కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. -
పైపులైను లీకేజి..ఎకరాల్లో పంటనష్టం
-
గూడెం ఎత్తిపోతల పైపులైను లీకేజి
-
పైపులైను లీకేజీతో 3 రోజులుగా నీరు బంద్
బాపట్ల(గుంటూరు): రెండు శాఖల మధ్య వివాదంతో 25 గ్రామాల ప్రజలు తాగు నీరు అందక మూడు రోజులుగా అవస్థలు పడుతున్నారు. వివరాలివీ..గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో అటవీ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా దరివాగు కొత్తపాలెం సమీపంలో శనివారం గుంతలు తీస్తుండగా మంచినీటి పైపులైనుకు రంధ్రం పడింది. నీరు వృథాగా పోతుండటంతో సరఫరాను వెంటనే ఆపివేశారు. అటవీ శాఖ అధికారులే పైపు లీకేజికి కారణంగా కాబట్టి వాళ్లే లీకేజీని ఆపాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులు పట్టించుకోలేదు. ఆర్డబ్ల్యుఎస్ శాఖ పైపులైను సంగతి తమకెందుకని అటవీ అధికారులు మిన్నకుండిపోయారు. రెండు శాఖల మధ్య నలుగుతున్న వ్యవహారంతో ప్రజలకు మూడు రోజులుగా ఇబ్బంది తప్పటం లేదు. -
తిరుపతిలో పెట్రోల్ బంక్లో లీకేజీ
తిరుపతి: తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్లో ఓ పెట్రోల్ బంక్లో లీకేజీ అవుతుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ లీకేజ్
-
గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగిసిన మంటలు
-
ఇంట్లో గ్యాస్ పేలుడు
-
లీకేజీ.. డ్యామేజీ..!
దేవరకద్ర రూరల్ : ప్రధాన సాగు, తాగునీటి వనరు కోయిల్సాగర్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. దశాబ్ధాల తరబడి ప్రాజెక్టుకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో క్రమంగా శిథిలస్థితికి చేరుతోంది. పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు గేట్ల రబ్బర్వాచర్లు అరిగిపోవడంతో నీరంతా లీకేజీల రూపంలో వృథాగా పోతోంది. వందలకోట్లు వెచ్చించి ప్రాజెక్టు నింపుతున్న అధికారులు నాణ్యతపై దృష్టిసారించడం లేదు. అలుగుపై 1981లో ఏర్పాటుచేసిన క్రస్ట్గే ట్ల షట్టర్లకు ఇప్పటివరకూ మరమ్మతులు చేపట్టలేదు. దీంతో షట్టర్ల కింద నీరంతా లీకేజీ అవుతుంది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులకు నీరు చేరగానే లీకేజీలు ప్రారంభమవుతున్నాయి. కోయిల్సాగర్ అలుగుపై పిచ్చిమొక్కలు తొలగించడం లేదు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రాయి సున్నంతో నిర్మించిన అలుగుకు కనీసం మరమ్మతులు చేపట్టకుండానే ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నింపుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల పెద్దవాగు ద్వారా నీటి ప్రవాహం లేకపోవడంతో ఎత్తిపోతల ద్వారానే నీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టు రెండువైపులా ఉన్న ఆనకట్టపై సీసీ పనులు కూడా చేయకుండానే వదిలేశారు. ధన్వాడ, కోయిల్కొండ మండలాలకు వెళ్లేందుకు ప్రాజెక్టు అలుగు కింద ఏర్పాటుచేసిన రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. ప్రస్తుతం నీటి లీకేజీల వల్ల రోడ్డంతా నీటిలో మునిగిపోయింది. రెండు దశాబ్దాల క్రితం రోడ్డు వేసిన తరువాత మళ్లీ రోడ్డు గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాజెక్టు కింద సీసీరోడ్డు నిర్మాణం చేపడితేనే గాని రాకపోకలకు సౌకర్యవంతంగా ఉండదు. ఆరు దశాబ్దాల క్రితం నిజాం నవాబు పాలనలో కోయిల్సాగర్ ప్రాజెక్టును ఎనిమిదేళ్లలో నిర్మించారు. రూ.85 లక్షల వ్యయంతో 1947లో పనులు ప్రారంభించి 1955లో ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు. వందశాతం రాయి, సున్నంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు ఆనకట్టను మరమ్మతులు చేయడంతో పాటు కట్ట ఎత్తు పెంచడానికి అలుగుపై రూ.92లక్షల వ్యయంతో క్రస్టుగేట్లను 1981లో ఏర్పాటుచేశారు. నాటినుంచి ప్రాజెక్టు వద్ద ఎలాంటి పనులు చేపట్టలేదు. ఇటీవల ఎత్తిపోతల పథకంలో భాగంగా కాల్వలను వెడల్పుచేసే పనులు కొత్తకాల్వల పొడగింపు పనులు మాత్రమే చేశారు. గతంలో ఆయకట్టు భూములు 12వేల ఎకరాల మేరకు ఉన్నప్పుడు చిన్న మధ్యతరహా నీటిపారుదల శాఖ కింద ప్రాజెక్టు ఉండేది. ప్రస్తుతం ఎత్తిపోతల వల్ల ఆయకట్టు 50,250 ఎకరాలకు పెరగనుండడంతో భారీ నీటిపారుదల శాఖ పరిధిలోకి చేరింది. గెస్ట్హౌస్లు మరీ అధ్వానం.. కోయిల్సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చే అధికారుల విడిది కోసం ఏర్పాటు చేసిన గెస్ట్హౌస్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో భూత్బంగ్లాలను తలపిస్తున్నాయి. ఇక్కడ పనిచేసే గ్యాంగ్మెన్లు కూడా కనీసం వాటిన శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించడం లేదు. ఎప్పుడైనా అధికారులు, నాయకులు వస్తున్నారంటే హడావుడి చేయడం తప్ప మళ్లీ జోలికి వెళ్లిన దాఖలాల్లేవు. ప్రాజెక్టు శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టుకు మరమ్మతు చేపడితే నాలుగుకాలాల పాటు ఉంటుంది. లేదంటే నిష్ర్పయోజనమే! -
‘ఆర్ఆర్సీ’ లీకేజీ కలకలం!
తీగలాగితే డొంక కదులుతోంది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తాండూరులో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో స్థానిక ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డిస్టిబ్యూషన్(టీఆర్డీ)లో టెక్నిషియన్గా పనిచేస్తున్న మహేం దర్ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ఆర్సీ’ వ్యవహారం బయట పడిన నాటి నుంచే పోలీసులు మహేందర్ కోసం ఆరా తీసున్నట్టు సమాచారం. - తాండూరు తాండూరు: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తాండూరులో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో తాండూరు ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్(టీఆర్డీ)లో టెక్నిషియన్ మహేందర్రెడ్డి సూత్రధారి అని జరుగుతున్న ప్రచారం రైల్వే వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో మహేందర్ ప్రమేయం ఉన్నట్టు ప్రచార మాధ్యమాల్లో రావడంతో ఇక్కడి రైల్వే వర్గాలు విస్మయం చెందుతున్నాయి. ఇక్కడ పనిచేసే మహేందరేనా? వేరే వ్యక్తా అని వారు భావిస్తున్నారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడిన నాటినుంచి అతడు విధులకు హాజరుకాకపోవడంతో మహేందర్రెడ్డిపై అనుమానాలు బలపడుతున్నాయి. వరంగల్ జిల్లా జనగాం(శామిర్పేట్)కు చెందినట్టుగా భావిస్తున్న మహేందర్ విజయవాడలో శిక్షణ పూర్తి చేశారు. 2012 సెప్టెంబర్లో తాండూరులో టీఆర్డీలో టెక్నిషియన్గా నియామకమయ్యాయరు. పాతతాండూరులో ఆయన కిరాయి ఇంట్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, మూడు నెలల పాప ఉన్నారు. ఈనెల 1వ తేదీ వరకు మహేందర్ విధులకు హాజరయ్యాడని తెలిసింది. అయితే మరుసటి రోజు తనకు 15 రోజులపాటు సెలవు కావాలని అధికారులకు లిఖితపూర్వకంగా కోరాడు. అయితే అతనికి ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదని తెలిసింది. అయితే ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారం వెలుగుచూసినప్పటి నుంచి మహేందర్ విధులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఆయన కిరాయికి ఉంటున్న ఇంటికి తాళం వేసింది. కుటుంబసభ్యులను తన స్వగ్రామానికి పంపించినట్టు సమాచారం. సంబంధిత అధికారులు మహేందర్కు సెల్ఫోన్లకు కాల్ చేసినా అవి స్వీచాఫ్ వస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచేసిన రోజునే రైల్వే పోలీసు వర్గాలు మహేందర్ గురించి ఆరా తీశారని సమాచారం. మొత్తమ్మీద ఆర్ఆర్సీ వ్యవహారంలో మహేందర్ పాత్ర తాండూరులో రైల్వే వర్గాల్లో కలకలం రేపుతోంది. -
ఆగని సాగర్ గేట్ల లీకేజీలు
- గత నెలలోనే గేట్లకు అమర్చిన రబ్బర్ సీళ్లు - నాణ్యత పాటించకపోవడంతోనే లీకేజీలంటున్న రిటైర్డ్ ఇంజినీర్లు నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాం గేట్ల నుంచి నీరు లీకవుతోంది. 2013 సంవత్సరంలో అమర్చిన రబ్బరు సీళ్లు కొన్నిగేట్ల వద్ద నలిగిపోయినీరు లీకేజీ అవుతుండడంతో రూ.2.7లక్షల వ్యయంతో గత నెలలోనే రబ్బరు సీళ్లను అమర్చారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడం.. రబ్బరు సీళ్ల అమరిక సరిగా లేక గేట్ల వెంటనీరు కారుతుందని రిటైర్ ఇంజినీర్లు తెలిపారు. నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతున్నపు్పుడు నీరు కారే దగ్గర గతంలోనైతే పుట్టీలో ఈతగాళ్లను గేట్ల వద్దకు పంపి జనప, గోగునార, పీచును పెట్టించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం 6, 9, 10, 11 గేట్లనుంచి బాగా నీరు లీకవుతోంది. మరికొన్నిచోట్ల మామూలుగా ఉంది. రబ్బరు సీళ్లు వేసిన తర్వాత కూడా నీరు కారుతుందంటే మరేదైనా సమస్య ఉండొచ్చని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గేటు కూర్చునే ఎస్ఎస్ ప్లేటుకు అమర్చిన రాడ్లకు ఆవలివైపునుంచి సిమెంటు దెబ్బతిని నీరు చిమ్ముతుందా అనేది కూడా చూడాల్సి ఉందని తెలుపుతున్నారు. ఈలీకేజీలను అరికట్టకపోతే లీకేజీలు పెరిగి గేటు అలైన్మెంటు దెబ్బతినే అవకాశాలు ఉంటాయని అనుభవజ్ఞులైన ఇంజినీర్లు తెలుపుతున్నారు. -
హిమాయత్ సాగర్కు లీకేజీలు
రాజేంద్రనగర్: హిమాయత్సాగర్లోకి చేరిన వరదనీరు వృథాగా పోతోంది. లీకేజీల కారణంగా 17 వరద గేట్ల నుంచి నీరంతా కిందికి వెళ్తోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువప్రాంతం నుంచి హిమాయత్సాగర్కు భారీగా వరదనీరు చేరింది. ఈ నీరు రానున్న వేసవికాలం వరకు నగర వాసుల దాహార్తిని తీర్చనుంది. అయితే లీకేజీల కారణంగా గేట్ల నుంచి నీరంతా వృథాగా వెళ్తోంది. వరద గేట్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించకపోడంతో ఈ పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయంత్రానికి హిమాయత్సాగర్ నీటిమట్టం 1,755.5 అడుగులు, గండిపేట్ జలాశయం నీటిమట్టం 1,772 అడుగులుగా నమోదైంది. -
సీఎం క్యాబిన్ లీకేజీ..!
సాక్షి, ముంబై : వరుసగా కురుస్తున్న వర్షాలకు మంత్రాలయ కురుస్తోంది. వివిధ శాఖల మంత్రుల క్యాబిన్లు వర్షానికి లీకేజీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూర్చునే క్యాబిన్, ఆయన చాంబర్లూ ఇందుకు మినహాయింపుకాదు. సీఎం క్యాబిన్లో అక్కడక్కడా బకెట్లు అమర్చాల్సిన దుస్థితి. లీకేజీల వల్ల వరండాలో, మంత్రుల చాంబర్లలో పరచిన ఖరీదైన తివాచీలు తడిసి పాడైపోయాయి. కొన్ని చోట్ల పైన అమర్చిన పీపీ షీట్లు విరిగి కిందపడ్డాయి. 2012లో మంత్రాలయ భవనంలో అగ్ని ప్రమాద ఘటన జరిగిన తర్వాత కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆధునీకీకరించారు. దీంతో అనేక మంది మంత్రులు తమ క్యాబిన్లల్లో కుర్చీలు, కిటికీ కర్టెన్లు, ఏసీలు, సీలింగ్ పైన ప్లాస్టర్ ప్యారిస్ (పీపీ)తో తయారైన అందమైన షీట్లు అమర్చుకున్నారు. తీరా క్యాబిన్లల్లోకి వర్షం నీరు చేరుతుండడంతో కోట్ల విలువైన సామగ్రి పాడైపోతోంది. నాసిరకంగా మరమ్మతు పనులు కాలిపోయిన నాలుగు నుంచి ఏడో అంతస్తు ఆధునికీకరణ పనుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులను చేపట్టిన ప్రైవేట్ కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. భవన సముదాయం చిన్నపాటి వర్షానికే లీకేజీ అవుతోంది.ఉద్యోగులు పనిచేసే చోట కూడా అక్కడక్కడా వర్షపు నీరు లీకేజీ అవుతోంది. టేబుళ్లు, ఫైళ్లకు రక్షణ లేకుండా పోయింది. కొన్ని అంతస్తుల్లో వర్షపు నీరు నిల్వ ఉండంతో తొందరపాటులో ఉదయం ఉద్యోగులు జారీ పడుతున్న సంఘటనలు పెరిగిపోయాయి. ఇప్పటికైనా భవన సముదాయంలో లీకేజీల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
బ్లోఅవుట్కు కారకులెవరు?
తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే ఇంక పీఎస్యూ నిర్వాహకులకు వాటిపై ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అలసత్వం, నిర్లక్ష్యం పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు! తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామంలో గ్యాస్ను సరఫరా చేసే ‘గెయిల్’ పైప్లైన్ బద్దలై సంభవించిన భీకరమైన విస్ఫోటనంలో అనేకమంది నిండు ప్రాణాలు కోల్పోయారు. సహజవనరులతో, పాడిపంటలతో, సుందరమైన ప్రకృతికి ఆలవాలమైన జిల్లాలో కొన్ని గ్రామాలను ఈ ఘోరకలి దఫదఫాలుగా కబళించుతూ రాష్ట్రాభివృద్ధికి, పర్యావరణ రక్షణకు పెద్ద చేటుగా మారింది. 1993 నుంచి తాజాగా నగరం గ్రామ దుర్ఘటనతో కలుపుకుని ఒకే జిల్లాలో గత 21 సంవత్సరాలలో ఏకంగా ఏడుసార్లు బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజి సంఘటనలు సంభవించాయి. తెలుగు గ్రామసీమల్లో తొలికోడి మేలుకొలుపులతోనే రైతులు, వ్యవసాయ కూలీలు, గృహిణులూ, తమతమ నిత్యవ్యాపకాల్లో మునిగిపోవడం సహజం. కాఫీలకూ, వంటకాలకూ పొద్దుపొడవకముందే పొయ్యి అంటించుకోవడం పల్లెల్లో సాధారణ దృశ్యం. కాని నగరం గ్రామంలో జరిగిన ఘోరకలికి ప్రభుత్వరంగ చమురు సహజవాయువు ఉత్పత్తి కంపెనీ ఓఎన్జీసీ, ఉత్పత్తి చేసిన గ్యాస్ను సరఫరా చేసే మరో ప్రభుత్వరంగ కంపెనీ ‘గెయిల్’ తమ నిర్వహణ లోపాలకు దేనికదే గ్రామస్తులపైకి నెట్టే పనిలో ఉన్నాయి! అసలు లీకేజీకి బాధ్యత తమది కాదన్నట్టుగా, ‘దాసుడి తప్పు దణ్ణంతో సరి’ అన్న చందంగా ఒక సామాన్య ‘టీ’ దుకాణదారుడు ‘స్టవ్’ వెలిగించినందువల్లనే ఈ పేలుడు సంభవించిందని చెప్పి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపుతో సరిపెట్టుకుందామని ఈ సంస్థలు చూస్తున్నాయి! మాడి, మసైపోయిన కుటుంబాలకు పరిహార చెల్లింపులతో చేతులు దులుపుకోవడం ధనికవర్గ వ్యవస్థలో ఒక క్రూరమైన జోక్! అంతేగాని, తాజా ఘటనకు సంబంధించి గ్రామస్తులు గత రెండు మాసాలనాడే ఇదే పైప్లైన్వల్ల లీకేజీ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినప్పుడు, ఆ లైన్ను తాత్కాలికంగా సర్దుబాటు చేసి వెళ్లారేగాని, మళ్లీ దానివైపు చూసిన పాపాన పోలేదనీ, ఫలితంగా అదే పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయిందని వెల్లడించారు. అంటే లీక్ అయిన గ్యాస్ క్రమంగా పరిసరాలలో వ్యాపించిపోయి ఉంది. ఆ సమయంలో ‘టీ’ దుకాణదారు ఇంట్లో ఉన్న పొయ్యికీ దీనికీ సంబం ధం లేదు. కాని ఆ సమయంలో పొయ్యి అంటించబోగా భగ్గుమని మంటలు రావడానికి కారణం అప్పటికే పైప్లైన్ నుంచి లీకయి వాతావరణంలో వ్యాపిం చిన గ్యాస్ వెంటనే అంటుకుందని అర్థమవుతుంది. పైగా పాశ్చాత్య దేశాల్లో గ్రామాల మధ్యనుంచో, గ్రామాలను ఆనుకునే గ్యాస్ పైప్లైన్లు వేయరనీ, గ్రామాలకు 5-6 కిలోమీటర్ల దూరంగా ఈ లైన్లు పరుస్తారని నిపుణులు చెపుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిమిత నష్టం పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీలు సంభవించవని కాదు. అయితే అవి ఎక్కువ భాగం కోస్తా తీరానికి దూరంగా సముద్రంతర వేదికలు ఆధారంగా డ్రిల్లింగ్లు, ప్రయోగాలు, లైన్ల నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో భారీ విస్ఫోటనాలు సంభవిస్తాయి. అలాంటివి ఆస్ట్రేలియా, నార్వే, నార్త్ సీ ప్రాంతాల్లో జరిగాయి. ఆ ప్రయోగాలు, డ్రిల్లింగ్లూ గ్రామాలనూ, కుటుంబాలనూ బూడిదపాలు చేయలేదు, శ్మశానవాటికలుగా మార్చలేదు. కాని ఇండియాలో మాత్రం ‘గెయిల్’, ఓఎన్జీసీ సంస్థలు ఇందుకు సంబంధించి అంతర్జాతీయ భద్రత, రక్షణ ప్రమాణాల నిబంధనలను పాటించడం లేదు. పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ఆయిల్ పరిశ్రమ ‘‘భద్రతాధికార సంస్థ’’(ఓఐఎస్డీ) నిబంధనలనూ పాటించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ ప్రాధికార సంస్థ అయిన ‘సేఫ్టీ డెరైక్టరేట్’ పెట్రోలియం-గ్యాస్ మంత్రివర్గం కనుసన్నల్లోనే పనిచేయాలి! భద్రతా ప్రమాణాలు గాలికి 2009లో మరొక ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జైపూర్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో డజను మంది ఆహుతి అయినప్పుడు ఆయిల్ పరిశ్రమ తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి ప్రత్యేక సదస్సు జరిగినా ఫలితం లేకపోయింది. ఆయిల్ పరిశ్రమల నిర్మాణం, నిర్వహణ సమయాలలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రూపొందించిన సాధికారమైన ప్రమాణాలను పాటించడంలో ప్రభుత్వరంగ సంస్థలు విఫలమవుతున్నాయని చమురు పరిశ్రమ నిపుణులు పలుసార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ‘గెయిల్’, ఓఎన్జీసీ కంపెనీలు తరచుగా ఆ ప్రమాణాలను పాటించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? కేంద్ర ప్రభుత్వ విధానాల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. 1991లో ప్రపంచబ్యాంకు రుద్దిన ప్రజావ్యతిరేక సంస్కరణలను బేషరతుగా కేం ద్రం ఆమోదించింది లగాయతు నియంత్రణ వ్యవస్థ నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుని కేవలం దేశ, బహుళజాతి కంపెనీలకు ‘బ్రోకర్’గా పని చేయసాగింది. ఫలితంగా ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు అంతకుముం దు ‘నవరత్నాల’లో భాగంగా ఉన్నా, ఆ సంస్థలలోని ప్రభుత్వ, అంటే ప్రజల వాటా ధనాన్ని కాస్తా క్రమంగా విదేశీ కంపెనీలకు, లేదా రిలయ న్స్ లాంటి దేశీయ కార్పొరేట్ దిగ్గజాలకు అమ్ముతూ వచ్చింది. దాంతో కంపెనీలపై ప్రభుత్వానికి నియంత్రణ, అధికారాలు సడలిపోయాయి. ఆ సంస్థల లాభాలు కాస్తా ప్రైవేట్ కంపెనీల పరమవుతున్నాయి. విదేశీ దిగ్గజాలకు ఎర్రతివాచీ ప్రపంచంలో పెట్రోలియం, గ్యాస్ వనరులపై కన్నుపడడం అనేది ఓ భారీ వ్యాపారం. ఇందులో బహుళజాతి కార్పొరేట్ కంపెనీల పాత్ర పెద్దది. ఈ వనరుల కోసమే, వాటిమీద ‘భల్లూకపు’ పట్టు సాధించడం కోసమే అఫ్ఘానిస్థాన్, ఇరాక్, తదితర పశ్చిమాసియా, మధ్యాసియా గ్యాస్ నిల్వల కోసం యుద్ధాలే జరిగాయి, జరుగుతున్నాయి! అలాగే మన దేశం లోని ఆయిల్ సంపదపై విదేశీ కంపెనీల పెత్తనానికి ద్వారాలు తెరిచింది కాంగ్రెస్, యునెటైడ్ ఫ్రంట్, బీజేపీ ప్రభుత్వాలేనని మరచిపోరాదు. వీటిలో యూపీఏ, ఎన్డీఏలది ప్రధాన పాత్ర. ఈ రెండు ప్రధాన కూటములూ విదేశీ ఆయిల్ కంపెనీల ఒత్తిళ్లకు లొంగిపోయి, దేశీయంగా చమురు ఉత్పత్తికి గండికొట్టాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలను కుంటుపరిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. విదేశీ కంపెనీలకు, వారితో మిలాఖత్ అయిన రిలయన్స్ లాంటి ఒకటి రెండు దేశీయ కుబేర కంపెనీలు వాళ్ల ఇష్టమొచ్చినట్లు ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల ధరలను ఏకపక్షంగా నిర్ణయించి ప్రజలపై రుద్దే శక్తినీ ఇచ్చాయి! 1998లో కిరోసిన్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్పై సబ్సిడీలను ఉపసంహరించిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుదే. ‘గెయిల్’ కింద నిర్వహిస్తున్న ప్రధాన గ్యాస్ క్షేత్రాలలో షేర్లను 18 శాతం పైగా విదేశీ కంపెనీ ‘ఎన్రాన్’కు, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్కు అమ్మేసింది బీజేపీయే. చివరికి గ్యాస్ను మండించడానికి సైతం ప్రపంచ బ్యాంకు నుంచి రుణంకోసం అంగలార్చిందీ ప్రభుత్వ ఆయిల్ సంస్థే! తమ స్వప్రయోజనాల కోసం అధికార పక్షాలే ప్రభుత్వరంగ సంస్థలను ఇలా నిర్వీర్యం చేసి, వాటిలోని ప్రజాధనాన్ని కాస్తా తక్కువ శాతానికి వాటాల రూపంలో విదేశీ, స్వదేశీ గుత్త కంపెనీలకు ధారాదత్తం చేసిన తర్వాత ఇంక పీఎస్యూల నిర్వాహకులకు ఆసక్తి చచ్చిపోతుంది. ఆ మేరకు అల సత్వం, నిర్లక్ష్యం, పెరిగి బాధ్యతలు సడలిపోతాయి. అప్పుడు నాణ్యతా ప్రమాణాలు గాలిలో దీపాలవుతాయి. ప్రజల ప్రాణాలకూ గ్యారంటీ ఉండదు! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఏబీకే ప్రసాద్ -
కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ షటర్ల లీకేజీ