ఎంసెట్‌-2 లీకేజీ వ్యహారంలో ఇద్దరు అరెస్ట్‌ | Two arrested in Eamcet-2 leakage case | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 28 2016 4:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో తిరుమల్‌, రమేష్‌, విష్ణు అనే వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణు, దళారీ తిరుమల్‌ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా లీకేజీ వ్యవహారంలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఒకవైపు సీఐడీ నివేదిక కోసం ప్రభుత్వం కూడా వేచిచూస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement