TS Eamcet
-
జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్య మండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (టీఎస్ఈఏపీ సెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెట్ ఫలితాలను ఈ నెల 18న విడుదల చేశారు.సెట్లో అర్హత సాధించిన వారికి కాలేజీల్లో కన్వీనర్ కోటా పరిధిలో ఉండే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ తేదీ లపై ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలువురు ఉన్నతాధికారులు సమావేశయ్యా రు. అనంతరం షెడ్యూల్ను విడుదల చేశారు. 12 నుంచి స్లైడింగ్... ఒకే కాలేజీలో వివిధ బ్రాంచ్లు మారాలనుకునే వారు ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్లను 13వ తేదీ ఫ్రీజ్ చేస్తారు. 16 న సీట్ల కేటాయింపు ఉంటుంది. 17వ తేదీలోగా విద్యార్థులు స్లైడింగ్లో కేటాయించిన బ్రాంచ్కు అంగీకరిస్తున్నట్టు రిపోర్టు చేయాలి. జూన్ 8 నుంచి ఈ–సెట్ కౌన్సెలింగ్ డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–సెట్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ 8 నుంచి కౌన్సెలింగ్ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది.కౌన్సెలింగ్ తేదీలు ఇలా... -
ఒక్క క్లిక్తో ఈఏపీ సెట్ ఫలితాలు
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాను ఒక్క క్లిక్తో తెలుసుకోండి... ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సైతం పాల్గొన్నారు. పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్లో 80 శాతం, అగ్రికల్చర్లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. అలాగే.. రెండు కేటగిరీల్లో ఏపీకి చెందిన విద్యార్థులే టాప్ ఫైవ్ ర్యాంకుల్లో సత్తా చాటడం గమనార్హం. సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయినట్లు తెలిపారామె. అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ దక్కినట్లు ప్రకటించారు. అగ్రికల్చర్ పరీక్షలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు మంత్రి సబిత. అగ్రికల్చర్ & మెడిసిన్(AM) కేటగిరీ టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ ఇందులో టాపర్గా నిలిచాడు. ఇక.. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో విశాఖపట్నంకు చెందిన సానపాల అనిరుధ్ టాపర్గా నిలిచాడు. ఇందులోనూ టాప్ 5లో నలుగురు ఏపీవాళ్లే కావడం గమనార్హం. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. -
TS EAMCET: ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మా, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే నెలలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) శుక్రవారం విడుదల చేసింది. వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో ఎంసెట్ దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 10లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్లో 5 జోన్లు (కర్నూలు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ప్రక్రియ పూర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈసారి నర్సింగ్ కూడా.. నర్సింగ్ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఎంసెట్కు ఇంటర్లో (జనరల్ 45 శాతం, రిజర్వేషన్ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్లో ఇంటర్కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు. వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్ ఇంటర్ నుంచి 70 శాతం, సెకండి యర్ నుంచి వంద శాతం సిలబస్ ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం https://eamcet. tsche. ac.in వెబ్సైట్కు లాగిన్ అవ్వాలని ఎంసెట్ కన్వీనర్ డీన్కుమార్ తెలిపారు. -
Telangana: మే 7 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఎంసెట్–2023ను మే 7న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ ఎంసెట్ను మే 7 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా ఎంసెట్ను జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తోంది. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెట్స్కు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఫీజుల వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ల కన్వీనర్లు త్వరలో విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. -
ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, బయోటెక్నాలజీ కోర్సుల కోసం ఎంసెట్–22(బైపీసీ) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం విడుదల చేశారు. రెండుదశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్, హెల్ప్లైన్ కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ సమాచారాన్ని టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో ఈ నెల 27న అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. -
11న ఎంసెట్ రెండో విడత డౌటే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11న జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణపై సాక్షాత్తు అధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు. ఫీజుల వ్యవహారంలో పీటముడి వీడకపోవడమే దీనికి కారణమంటున్నారు. వాస్తవానికి విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ కన్నా, రెండో విడత అత్యంత కీలకం. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ర్యాంకులపై దాదాపు స్పష్టత వస్తుంది. జాతీయ కాలేజీల్లో కోరుకున్న బ్రాంచ్ రాని విద్యార్థులు రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరగడంతో గత కౌన్సెలింగ్లో సీటు వచ్చినా వదిలేసుకున్న విద్యార్థులు కూడా రెండో దశపై ఆశలు పెట్టుకుంటారు. ఇతర బ్రాంచీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులు పొందేందుకు ఈ దశ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ తర్వాత డిగ్రీ కాలేజీల్లో చేరే అవకాశం ఉంది. ఫీజుల నిర్ణయం తేలేనా? ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) దోబూచులాడుతోందన్న విమర్శలొస్తున్నాయి. జూలైలో కాలేజీల ఆడిట్ రిపోర్టులు పరిశీలించి, కొత్త ఫీజులు నిర్ణయించిన ఎఫ్ఆర్సీ అంతలోనే యూటర్న్ తీసుకుంది. ఆడిట్ నివేదికలు సరిగ్గా పరిశీలించలేదని భావించడం, మళ్లీ కాలేజీలను పిలిచి ఆడిట్ నివేదికలను ఆమూలాగ్రం పరిశీలించడం, తర్వాత కొన్ని కాలేజీల ఫీజులు తగ్గించడం అనేక సందేహాలకు తావిస్తోంది. రెండోసారి ఆడిట్ నివేదికల్లో కన్పించిన తప్పులు మొదటిసారి ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫీజులు తగ్గించామని చెబుతున్నప్పటికీ.. 2019తో పోలిస్తే ఎక్కువ కాలేజీల ఫీజులు పెరిగాయని పలువురు అంటున్నారు. రెండుసార్లు పరిశీలించినా, మరోసారి సంప్రదింపులకు 20 కాలేజీలను పిలవడం, ఆ తర్వాత ఏం చేయబోతున్నారో స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫీజుల వ్యవహారంపై ఎటూ తేల్చకపోవడంతో ఈ ప్రభావం రెండో దశ కౌన్సెలింగ్పై పడే అవకాశముంది. ఇలా జాప్యమైతే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ఈసారి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. -
కసరత్తు చేస్తే... కోరుకున్న సీటు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 1.56 లక్షల మంది ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీపడనున్నారు. 21, 22 తేదీల్లో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఉంటుంది. 23వ తేదీ నుంచి ఆన్లైన్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కన్వీనర్ కోటా కింద దాదాపు 75 వేల సీట్లు ఉంటే, మరో 35 వేల వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. మొత్తం 1.10 లక్షల సీట్లున్నా, బీటెక్లో చేరుతున్నది ఏటా 80 వేల మందే ఉంటున్నారు. 58 శాతం వరకూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కొత్త కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. ఈసారి డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. దీంతో ఆచితూచి ఆప్షన్లు ఇవ్వాలని, గతంలో జరిగిన కౌన్సెలింగ్లను అధ్యయనం చేసి తమ ర్యాంకు ఆధారంగా ఒక అంచనాకు రావాలని, అప్పుడు టాప్ కాలేజీ కాకపోయినా కోరుకున్న బ్రాంచి దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లయినా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు ఇచ్చే ప్రాధాన్యతలు కీలకంగా మారనున్నాయి. టాప్ ర్యాంకుల్లో ఇలా.. ఆప్షన్లు ఇచ్చే విషయంలో తికమకపడి అస్పష్టతతో ఆప్షన్లు ఇస్తుంటారు. దీంతో కొంతమంది అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్లో 500లోపు ఎంసెట్ ర్యాంకర్లు ఆప్షన్లు ఇస్తారు. వీళ్లల్లో చాలామంది ఆయా కోర్సుల్లో చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్లకు జేఈఈ వంటి ర్యాంకులు కూడా వచ్చి ఉంటాయి. 500–1000 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 25% వరకే వచ్చిన సీటులో చేరుతుంటారు. అంటే వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనో, టాప్ ప్రైవేట్ కాలేజీల్లోనో చేరతారు. 1000–1500 ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 50% పైగా టాప్ టెన్ కాలేజీల్లో నచ్చిన బ్రాంచిలో చేరే వీలుంది. ఇక 1500 నుంచి 5 వేల ర్యాంకు వరకు వచ్చిన ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఇతర టాప్ కాలేజీ ల్లో కన్వీనర్ కోటా కింద అవకాశం దక్కించు కునే అవకాశం ఉంటుంది. వీరిలో 80% వచ్చిన సీటును వదులుకోవడం లేదు. ఏదో ఒక బ్రాంచిలో ఇష్టం లేకున్నా చేరి తర్వాత కౌన్సెలింగ్లో నచ్చిన బ్రాంచి దక్కించుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. 10 వేల ర్యాంకు తర్వాత... విద్యార్థులు డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు, టాప్ కాలేజీలకే తొలి ఆప్షన్ ఇస్తారు. ఇలాంటప్పుడు 10 వేల పైన ర్యాంకు వచ్చిన వారు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గత ఐదేళ్ళ ఎంసెట్ కౌన్సెలింగ్ను పరిశీలిస్తే... 40 వేల ర్యాంకుపైన వచ్చిన వాళ్లు కూడా టాప్ కాలేజీలకు మొదటి ఆప్షన్ ఇస్తు న్నారు. కొంతమంది పోటీ ఉన్న బ్రాంచికి కాకుండా, సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి బ్రాంచిలకు ప్రాధాన్యత ఆప్షన్లుగా ఇస్తున్నారు. పోటీ లేదని, సీటు వస్తుందని భావిస్తారు. 10 వేల ర్యాంకు తర్వాత కూడా సీటు వచ్చే కాలేజీ ల్లో ఆప్షన్లు ఇవ్వడం లేదు. దీంతో వాళ్ల తర్వాత ర్యాంకు వారు ఆ కాలేజీలకు ఆప్షన్లు ఇస్తే వారికి సీటు వెళ్తుంది. వారు చేరితే టాప్ కాలేజీల్లో సీటు రాక తర్వాత కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సరైన అంచనా అవసరం ►ఆప్షన్లు ఇచ్చే ముందు తమకు వచ్చిన ర్యాంకు ప్రకారం గతంలో ఎక్కడ, ఏ కాలేజీలో సీటు వచ్చిందనే దానిపై ప్రాథమిక అంచనాకు రావాలి. వాటిల్లో నచ్చిన బ్రాంచిని ఎంపిక చేసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ►ఈసారి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గాయి. అయితే పోటీ పెద్దగా ఉండే అవకాశం కన్పించడం లేదు. అంతా కంప్యూటర్ సైన్స్ గ్రూపుల వైపు వెళ్తున్నారు. కాబట్టి డిమాండ్ లేని కోర్సులు కోరుకునే వారు మంచి కాలేజీకి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ►వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారికి కౌన్సెలింగ్లో వచ్చే సీటు సాధారణంగా మంచి కాలేజీలోనే అయి ఉంటుంది. కాబట్టి కోరుకున్న కాలేజీ, బ్రాంచి.. తర్వాత జరిగే కౌన్సెలింగ్లో అయినా దక్కుతుందనే ధీమాతో ఉండొచ్చు. వీళ్ళు తుది దశ కౌన్సెలింగ్ వరకు వేచి చూసి, ఆ తర్వాతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మంచిది. -
TS EAMCET Counselling Dates 2022: 21 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది. చదవండి: ఇంజనీరింగ్లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు -
Telangana: ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఎంసెట్) ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అదే సమయంలో ఈసెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఎంసెట్(ఇంజనీరింగ్) రిజల్ట్స్ కోసం.. ఎంసెట్(అగ్రికల్చర్) రిజల్ట్స్ కోసం.. ఈసెట్ రిజల్ట్స్ కోసం.. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యేది అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశా లల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఎంసెట్) ఫలితాల వెల్లడి తేదీ గురువారం ఖరారుకానుంది. దీనిపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. ఇందులో ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఎంసెట్ ఫలితాల తీరు తెన్నులు, ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీలో చర్చిస్తారు. ఎంసెట్ ఫలితాల విడుదల ఈ నెల 15వ తేదీలోపే ఉండే వీలుంది. తామంతా సిద్ధంగానే ఉన్నామని, మంత్రి ఎప్పుడు తేదీ ఇస్తారో చూడాలని అధికారులు అంటున్నారు. ఎంసెట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవ్వ నుంది. మరోవైపు జేఈఈ ఫలితాలు వెల్లడవ్వడం, ఈ నెలాఖరు నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల నేపథ్యంలో కౌన్సెలింగ్ను ఎన్ని దఫాల్లో పూర్తి చేయాలనే విషయాలపై అధికా రులు చర్చిస్తారు. కాగా, ఫలితాల వెల్లడి తర్వాత జేఎన్టీయూహెచ్ తన పరిధిలోని ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేసి, అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. -
ఎస్సై పరీక్ష.. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్టికెట్తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్టికెట్లు పంపిణీ చేశామని, హాల్టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు రీషెడ్యూల్.. తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు.. 1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు -
ఎంసెట్కు 91 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం జరిగిన టీఎస్ ఎంసెట్కు తొలి రోజు 91.31 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో భారీ స్పందన ఉంటే, ఏపీలో కాస్త తక్కువే కనిపించింది. సమస్యాత్మకంగా భావించిన వరద బాధిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ 96 శాతం హాజరు నమోదై నట్టు అధికారులు తెలిపారు. తొలిరోజు ఎంసెట్ విజయవంతంగా ముగిసిందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి స్పష్టం చేశారు. జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డితో కలసి ఆయన నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. టీఎస్ ఎంసెట్ ఈ నెల 14 నుంచే జరగాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా 14, 15న జరగాల్సిన పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. విద్యార్థుల పోటాపోటీ.. గతంలో పోలిస్తే ఈసారి ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులకు కలిపి దాదాపు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 88, ఏపీలో 19... మొత్తం 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజున రెండు రాష్ట్రాల్లోనూ 58,547 మంది పరీక్ష రాయాల్సి ఉంటే, 53,509 (91.31 శాతం) మంది హాజరయ్యారు. ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో జరిగిన ఈ పరీక్షకు తెలంగాణవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో 46,570 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 44,169 (94.84 శాతం) హాజ రయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 11,977 మంది దరఖా స్తు చేసుకోగా, పరీక్షకు హాజరైంది మాత్రం 9,340 మంది (77.98 శాతం) మాత్రమే. ఇటీవలే ఏపీలో ఎంసెట్ జరగడంతో అక్కడ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదని అధికారులు విశ్లేషించారు. పరీక్షపై విద్యార్థుల సంతృప్తి ఎంసెట్ పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రితం సంవత్సరం కన్నా ప్రశ్నపత్రం తేలికగా ఉందని హైదరా బాద్లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద ఎంసెట్ విద్యార్థిని పద్మప్రియ, నిఖిలేష్ తెలిపారు. ఆన్లైన్ మోడ్లో ఎలాంటి సమస్యా లేకుండా పరీక్ష రాయగలిగినట్లు వెల్లడించారు. మొత్తం ప్రశ్నల్లో కెమెస్ట్రీ తేలికగా చేసే వీలుందని, ఫిజిక్స్ కాస్త మధ్యస్తంగా ఉందని, మేథ్స్ సుదీర్ఘ ప్రశ్నలతో ఉందని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. మొత్తం మీద విద్యార్థులు ఈ పరీక్షను తేలికగా రాయగలిగినట్లు ఆయన తెలిపారు. -
Telangana: ప్రారంభమైన టీఎస్ ఎంసెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి(సోమవారం) మూడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18,19,20 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు విడుతలుగా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 1,72,241 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణ లో 89, ఏపీ లో 19 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు నిర్వాహణ అధికారులు. ఒక్క నిమిషం నిబంధన అమలు కానుంది. అంటే.. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్ధులను గంట ముందు నుండే పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన అగ్రి, మెడికల్ ఎంసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 79 వేల 365 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెట్ వర్క్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంసెట్ నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేశారు. నిమిషం రూల్ అమలు చేస్తున్నారు, సమయానికి నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోనికి పంపిస్తారు. మొబైల్స్ , వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ జాగ్రత్తలు అభ్యర్థులంతా ఖచ్చితంగా పాటించాలని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు. -
Telangana: ఎంసెట్ నిర్వహణపై.. ఉన్నత విద్యామండలి చైర్మన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఎంసెట్ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. వర్షాలున్నా, పరీక్షకు ఇబ్బంది ఉండదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. 17 నుంచి 19 వరకూ ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ తేదీలను గతంలోనే ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం 3 రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పరీక్ష తేదీల మార్పుపై అధికారులు తొలుత కసరత్తు చేశారు. కానీ మండలి సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ మాత్రం ఎంసెట్ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో పలు పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకొని ఎంసెట్ తేదీలు ఖరారు చేసినందున ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని ఉన్నత విద్యామండలికి సూచించింది. ఇదే విషయాన్ని మండలి చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్కు హాజరుకాలేని విద్యార్థులుంటే ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 17 నుంచి జరిగే ఇంజనీరింగ్ ఎంసెట్ సమయానికి వర్షాలు తగ్గుతాయనే విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలో ఎంసెట్ వాయిదా వేస్తే ఇప్పటికే సిద్ధమైన విద్యార్థులు ఇబ్బంది పడే వీలుందని లింబాద్రి తెలిపారు. పేద విద్యార్థులకు నష్టం: విద్యార్థి సంఘాలు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఎంసెట్ వాయిదా కుదరదని ఓ సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ చెబితే ప్రభుత్వం వినడం ఏమిటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్రెడ్డి ప్రశ్నించారు. -
ఎంసెట్ వాయిదా..!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్ ఎంసెట్) విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అనూహ్యంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపిలేని వర్షాల దృష్ట్యా ఎంసెట్ను వాయిదా వేసే యోచనలో ఉన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి సోమవారం భేటీ కానుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, వాతావరణ శాఖ నివేదిక ఆధారంగా వాస్తవపరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే, తాజాగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. చాలా ప్రాంతాలు జలమయ మయ్యాయి. విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు వెళ్లడం కూడా కష్టమేనని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అనేకచోట్ల విద్యుత్ సరఫరాకు, ఇంటర్నెట్ సదుపాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరీక్షాకేంద్రాల్లో కూర్చునే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని ఎంసెట్ను వాయిదా వేయడమే సరైనదని అధికారులు భావిస్తున్నారు. కొంత సమయం ఇద్దామా? ఈసారి ఎంసెట్కు కూడా విపరీతమైన పోటీ ఉందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వచ్చినట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ చేపట్టాల్సి ఉంది. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు తప్పకుండా ఉండాల్సిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు మౌలిక సదుపాయాలకు అంతరాయం ఏర్పడుతోంది. బేటరీలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల సాయంతో పరీక్షలు నిర్వహించినా, చాలామంది విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవడమే కష్టంగా ఉందని అంటున్నారు. పరీక్షల కోసం ఏపీ, తెలంగాణలో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా పరిస్థితి ప్రతికూలంగానే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పరిస్థితిని అంచనా వేసి నిర్ణయిస్తాం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణ సాధ్యమా? కాదా? అన్న విషయాన్ని సోమవారం చర్చిస్తాం. అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి ఓ నిర్ణయానికి వస్తాం. ఎంసెట్ నిర్వహణకు సిద్ధంగానే ఉన్నాం. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ సలహా తీసుకుంటాం. 14వ తేదీ నాటికి పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే, పరీక్ష నిర్వహణకు వెనుకాడబోం. – ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
6 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్–2022) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈసారి కూడా ఈ పరీక్షను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్లో 5 జోన్లలో.. జూలై 14 నుంచి 20వ తేదీ మధ్య ఈ పరీక్ష జరుగుతుంది. ఇంటర్మీడియెట్ తత్సమానమైన పరీక్ష రెండో ఏడాది రాస్తున్న అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఎంసెట్ను రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ ఎంసెట్ ద్వారా ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచ్ల్లో సీట్లు పొందే వీలుంది. 70 శాతం సిలబస్తోనే.. ఈసారి కూడా 70 శాతం ఇంటర్ సిలబస్లోంచే ఎంసెట్ ప్రశ్నావళి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇంటర్ సిలబస్ను కుదించిన సంగతి తెలిసిందే. ఎంసెట్లో మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు ఉండవు. 3 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. కనీస మార్కులతో ఇంటర్ పాసైనా ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఎవరి జోన్లో వారు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. https://eamcet.tsche.ac.in వెబ్సైట్కు లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పెరగనున్న అభ్యర్థుల సంఖ్య! ఈసారి కూడా ఎంసెట్ అభ్యర్థుల సంఖ్య పెరిగే వీలుంది. ఇంటర్ విద్యార్థులందరూ కనీస మార్కులతో ఉత్తీర్ణులైన నేపథ్యంలో అందరూ ఎంసెట్ రాసేందుకు అవకాశం ఏర్పడింది. 2021లో నిర్వహించిన ఎంసెట్కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94,550 మంది (85.70) అర్హత సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 175 ఉన్నాయి. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 79,790 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 6 నుంచి ఈసెట్ దరఖాస్తులు డిప్లొమా కోర్సులు పూర్తి చేసి, ఇంజనీరింగ్లో ప్రవేశం పొందాలనుకునే వారికి నిర్వహించే ఈ–సెట్ కోసం కూడా ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ఈసెట్ విభాగం తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూన్ 8గా పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https:// ecet. tsche. ac. in వెబ్సైట్కు లాగిన్ అవ్వొచ్చు. జూలై 13న ఈసెట్ నిర్వహించనున్నారు. ఫీజును రూ.400 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు), రూ.800 (ఇతరులకు) ప్రకటించారు. -
14న ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్–2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. దీనిపై సమీక్ష సమావేశం సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో నోటిఫికేషన్ వెలువరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు అంగీకారం కుదిరిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు వివరించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్దిష్ట మైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్ లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్ పరిశీలించి.. ఇబ్బంది లేకుండా చూసేందుకే కసరత్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పరీక్ష కేంద్రాలుండాలి? ఎక్కడ ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది? అనే అంశాలను టీసీఎస్ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు. జూన్ చివరి వారం.. మే నెలలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయి. ఇదే నెలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు విద్యార్థులు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వారం ఎంసెట్ నిర్వహణకు అనుకూలమైనదిగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీసీఎస్కు వివరించినట్లు వారు తెలిపారు. దీంతో పాటే పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోగా ఎంసెట్ ర్యాంకుల వెల్లడికీ కసరత్తు చేయాలని తీర్మానించారు. వాస్తవానికి గతంలో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండేది. కానీ, ఈసారి దానికి అవకాశం లేదని ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫస్టియర్ పరీక్షల్లో కనీస మార్కులతో ప్రమోట్ చేశారు. కాబట్టి ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇంటర్ పరీక్ష ఫలితాలకు, ఎంసెట్ ర్యాంకుల వెల్లడికి సంబంధం ఉండదు. అందుకే త్వరగా ఫలితాలు వెల్లడించే వీలుంది. అలాగే కౌన్సెలింగ్ తేదీలపై మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఫలితాలు, ఐఐటీ, నీట్ ప్రవేశాల తేదీలను బట్టి ఎంసెట్ కౌన్సెలింగ్ను ఖరారు చేయాలనే యోచనలో అధికారులున్నారు. -
టీఎస్ ఎంసెట్: నేటి నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్స్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్కు సంబంధించి నేటి నుంచి 16 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలవనుంది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ 161 కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఇంజనీరింగ్ కోటాలో 85,149 సీట్లకు గానూ 60, 697 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇక అడ్మిషన్ష్ కౌన్సిలింగ్ లిస్టులో పలు ఇంజనీరింగ్ కాలేజీలు లిస్టులో చోటు దక్కించుకోలేదు. ఇక 91 బీ ఫార్మసీ కాలేజీల్లో 7,640 సీట్లు ఉండగా.. అందులో 2,691 కన్వీనర్ కోటా ఉన్నాయి. 44 ఫార్మా డీ కాలేజీల్లో 1295 సీట్లు ఉండగా.. 454 కన్వీనర్ కోటా ఉన్నాయి. -
టీఎస్ ఎంసెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్– 2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన సూచించారు. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు గన్ఫౌండ్రీ(హైదరాబాద్): రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నాటిక్ సంగీతం, కూచిపూడి, కథక్ నృత్యాలు, భరతనాట్యం, సితార్, మృదంగం, వీణ, నాదస్వరం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కనీసం 10 సంవత్సరాల వయసు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–24758090, భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–27801788, అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–23523850, విద్యా రణ్య ప్రభుత్వ సంగీత కళాశాల కోసం 87024 23628 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ (ఎంసెట్).. ఆగస్టు 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఎంసెట్).. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్.. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్, ఆగస్టు 23న లాసెట్.. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్సెట్, జులై 17న పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 8 నుంచి ఆపై తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహించే యోచన చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది. -
Telangana: ఎంసెట్, లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువును జూన్ 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. బుధవారం వరకు 2,01,367 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్ కోసం 1,35,151 మంది, అగ్రికల్చర్ కోసం 66,216 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్ కమిటీ పేర్కొంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించింది. చదవండి: Telangana: జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు! -
ఎంసెట్లో ముందుగా ఏ పరీక్ష?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్లో ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించాలా? ఇంజనీరింగ్లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించాలా? అన్న విషయంలో ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్పూర్ చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. సాధారణంగా అందులో ముందు 3 రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్ను ఆరు సెషన్లలో (రోజుకు రెండు సెషన్లు) నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైతే 8న కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు, ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒక రోజు గడువే ఉంటోంది. దీంతో మ్యాథమెటిక్స్ విద్యార్థుల వెసులుబాటు కోసం ముందుగా ఇంజనీరింగ్ ఎంసెట్ కాకుండా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్ను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది ఉన్నత విద్యామండలి. అయితే నీట్ తేదీలను ప్రకటించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పుడే అగ్రికల్చర్ ఎంసెట్ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో ఎంసెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూన్లో పాలీసెట్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్ను ఈసారి జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ చివరలో పాలీసెట్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మే 17 నుంచి 26వ తేదీ వరకు ఉండటంతో పాలీసెట్ను జూన్లో నిర్వహించేలా ఎస్బీటీఈటీ కసరత్తు చేస్తోంది. చదవండి: తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల సింగరేణిలో 2087 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్... -
తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలు ఖరార య్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఆయా తేదీలను శుక్రవారం ప్రకటించారు. ప్రధానమైన ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ బీఈ/బీటెక్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాల కోసం ఎంసెట్ను నిర్వహించనున్నట్లు తెలి పారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీఈ/బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈసెట్ను జూలై 1వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి జూన్ 14వ తేదీ తరువాత ఎప్పుడైనా సెట్స్ను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మం డలి సిద్ధంగా ఉన్నా, ఆన్లైన్ పరీక్షలను నిర్వ హించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ ఖాళీ స్లాట్స్ జూన్ లో ఎక్కువగా లేకపోవడం, పైగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరమ్యే ఎంసెట్ పరీక్ష లను నిర్వహించేందుకు టీసీఎస్కు జూన్ లో సిబ్బంది కొరత ఉంటుందనే కారణంతో జూలై లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడిం చారు. అయితే తక్కువ మంది విద్యార్థులు హాజ రయ్యే పీజీఈసెట్ను జూన్ 20 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఫార్మ్–డి(పీబీ), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో దీని ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా అనేక ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్న టీసీఎస్ ప్రతినిధులతో చర్చించి, ఖాళీగా ఉన్న స్లాట్స్లో సెట్స్ తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అలాగే అన్ని సెట్స్కు నిర్వహణ యూనివర్సిటీలను, కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు. 70 శాతం సిలబస్తో ఎంసెట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్, ‘ప్రథమ’లో పూర్తి సిలబస్తో ఎంసెట్ను నిర్వహి స్తామన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం జరిగినందున ఇంటర్బోర్డు కూడా సిలబస్ను, మోడల్ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచిందన్నారు. ఎంసెట్ పేపరు సెట్టింగ్ సమయంలో ఆ సిలబస్నే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు. సిలబస్ వివరాలను కూడా ఎంసెట్ నోటిఫికేషన్ సమయంలో వెబ్సైట్లో ఎంసెట్ కమిటీ అందుబాటులో ఉంచుతుందని వివరించారు. ఎంసెట్ నోటిఫికేషన్ వారం, పదిరోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో లేదా ఆగస్టులో... మరో నాలుగు సెట్స్ తేదీలను ఇంకా ఖరారు చేయలేదని పాపిరెడ్డి తెలిపారు. వాటిని జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్సెట్, 3 ఏళ్లు, 5 ఏళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. సాధారణ పరిస్థితుల్లో మార్చిలో ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు జరిగేవన్నారు. వాటి ప్రకారం మే నెలలో ఎంసెట్, ఇతర సెట్స్ నిర్వహించే వారిమన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ పరీక్షలన్నీ రెండు నెలలు ఆల స్యంగా నిర్వహించాల్సి వస్తోంద న్నారు. యూనివర్సిటీల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, ప్రస్తుతం ప్రత్యక్ష బోధన మొదలైనందున త్వరలోనే ఆయా పరీక్షల తేదీలు ఖరారు అవుతాయన్నారు. వాటిని బట్టి ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని వివరించారు. చదవండి: బాబోయ్... ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? -
ఎంసెట్ అగ్రి, మెడికల్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు వెలువడ్డాయి. శనివారం జేఎన్టీయూహెచ్లోని యూజీసీ–హెచ్ఆర్డీసీ ఆడిటోరియంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చరల్–మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించారు. తొలుత ఇంజనీరింగ్ ఫలితాలు ప్రకటించారు. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలకు సంబంధించి ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చరల్–మెడికల్ స్ట్రీమ్ కేటగిరీలో 78,981 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 63,857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 59,113 మంది అర్హత సాధించారు. హాజరైన విద్యార్థుల్లో 92.57 శాతం మంది క్వాలిఫై అయ్యారు. తొలి 3 ర్యాంకులు బాలికలవే.. టీఎస్ ఎంసెట్–20 అగ్రికల్చరల్–మెడికల్ స్ట్రీమ్లో టాప్10 ర్యాంకుల్లో తొలి 3 ర్యాంకులను బాలికలే కైవసం చేసుకున్నారు. మిగతా 7 స్థానాల్లో బాలురు ఉన్నారు. టాపర్గా ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు నిలిచారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే... ఈ పరీక్షల్లో బాలురు 20,127 మంది పరీక్షకు హాజరు కాగా 18,377 మంది (91.30%) అర్హత సాధించారు. 43,730 మంది బాలికలు పరీక్ష రాయగా 40,736 మంది (93.15%) అర్హత సాధించారు. ఎంసెట్ అగ్రి, మెడికల్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. -
తెలంగాణ ఎంసెట్ ప్రారంభం
-
తెలంగాణ ఎంసెట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం హాల్టికెట్తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్ను కూడా నిర్వాహకులు ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్ చెక్ చేసి, చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపుతున్నారు. పరీక్షా కేంద్రాలను కూడా శానిటైజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకోనున్నారు. తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ సెషన్లో ఈ మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుంది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ జరగనుంది. -
నేటి నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ను నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచే అనుమతి స్తామని ఎంసెట్ కమిటీ పేర్కొంది. ఉదయం పరీక్ష 9 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుందని, ఆ సమయం కంటే నిమిషం ఆలస్య మైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది. వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచిం చింది. హాల్టికెట్తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్ను కూడా ఇచ్చామని తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునా శానిటైజేషన్ చర్యలు చేపట్టామని, విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి గుర్తుంచుకోండి.. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకుంటారు. విద్యార్థులు తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. డాక్టర్ సర్టిఫికెట్ అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలైన హైఫీవర్, తీవ్రమైన దగ్గు, శ్వాస సంబంధ సమస్య ఉంటే వెనక్కి పంపిస్తారు. వారు ఆ పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్కు తమ వివరాలతో ఒక లెటర్ రాసి ఇస్తే వారికి తరువాత రోజు సెషన్లలో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపడతారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు సమాచారం ఇస్తే వారికి తరువాత ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిరు. ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్ అధికారి/ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, హాల్టికెట్తోపాటు ఆధార్ వంటి ఏదేని ఒరిజినల్ ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి. రఫ్ వర్క్ కోసం వినియోగించిన బుక్లెట్ను ఇన్విజిలేటర్కు తిరిగి ఇచ్చివేయాలి. మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులే తెచ్చుకోవాలి. విద్యార్థులు తమ హాల్టికెట్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రవేశాల సమయంలో అడుగుతారు. -
సెట్స్ దరఖాస్తులు 4,68,271
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) రాసేందుకు 4.68 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పాలీసెట్కు ఈనెల 10తో దరఖాస్తు గడువు ముగిసిపోగా, ఆ తరువాత నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయా సెట్స్కు 4,68,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఎంసెట్కు 2,21,505 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తరువాత పాలీసెట్కు 64,454 మంది, ఐసెట్కు 55,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3 వరకు ఎంసెట్ హాల్టికెట్ల డౌన్లోడ్ జూలై 6–9 తేదీల మధ్య నిర్వహించే ఎంసెట్కు గతేడాది కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 2.17 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి 2,21,505 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,42,645 మంది, అగ్రికల్చర్ కోసం 78,565 మంది, రెండింటి కోసం 295 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. జూలై 1న 250 కేంద్రాల్లో పాలీసెట్ పదో తరగతి ఉత్తీర్ణులై.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూలై 1న పాలీసెట్ 2020 ప్రవేశపరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఫీజు చెల్లించినప్పుడే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే పాలీసెట్కు 38,404 మంది బాలురు, 26,050 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలని సూచించారు. జూలై 4న ఈసెట్ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) ఉద్దే శించిన ఈసెట్ను జూలై 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఆన్లైన్లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు తమ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కాగా, జూలై 1 నుంచి 4 వరకు నిర్వహించే పీజీఈసెట్ హాల్టికెట్ల డౌన్లోడ్కు ఇప్పటికే చర్యలు చేపట్టామని పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 30 వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 5 నుంచి ఎడ్సెట్ హాల్టికెట్లు జూలై 15న నిర్వహించే ఎడ్సెట్ కోసం జూలై 5 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు. ఇక పీఈసెట్కు హాజరయ్యేందుకు 5,457 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు. ఈసారి స్కిల్టెస్టును రద్దు చేశామని, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు మాత్రమే ఉంటుందని, త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. జూలై 13న జరిగే ఐసెట్కు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. జూలై 2 నుంచి లాసెట్ హాల్టికెట్లు లాసెట్కు దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 28,805 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 20,575 మంది పురుషులే. ఈసారి న్యాయవిద్య కోర్సుల్లో చేరేందుకు ఐదుగురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో చేరేందుకు, ఇద్దరు ఐదేళ్ల కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. జూలై 10న నిర్వహించే లాసెట్ కోసం.. 2వ తేదీనుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. -
సెట్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈనెల 31 నుంచి జూన్ 10 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూలైలో అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంసెట్, ఈసెట్, పీజీఈ సెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీలా సెట్, ఐసెట్, పీఈసెట్కు హాజరయ్యేందుకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చేనెల 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆ తరువాత ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
జూలై 6 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్ : జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజా షెడ్యూల్ను ఖరారు చేసింది. జూలైలోనే ఇతర అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. శనివారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపైనా, ప్రవేశ పరీక్షలపైనా చర్చించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా నిబంధనలకు లోబడి, యూనివర్సిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడిం చారు. పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్మిట్టల్, మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్కు 6.. అగ్రికల్చర్కు 3 సెషన్లు జూలై 6 నుంచి నిర్వహించే ఎంసెట్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 6, 7, 8 తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుందన్నారు. ఇక 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే 10న ఉదయం సెషన్ కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. 10న జరిగే లాసెట్కు విద్యార్థులు తక్కువే ఉంటారు కాబట్టి ఆ సదుపాయాలను కూడా దీనికి వినియోగించుకుంటామని చెప్పారు. ఇక రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్లో 25 వేల నుంచి 30 వేల మంది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఎంసెట్కు 2,10,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,35,974 మంది ఇంజనీరింగ్ కోసం, 74,567 మంది అగ్రికల్చర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. కాగా, కామన్ ఎంట్రెన్స్ టెస్టŠస్ దరఖాస్తుల గడువు వచ్చే నెల పది వరకు పెంచినట్టు పాపిరెడ్డి తెలిపారు. జూన్ 20 నుండి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తామని, మొదట ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఇవి ముగిసిన వారం తర్వాత బ్యాక్ లాగ్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్
-
తెలంగాణ ఎంసెట్ తేదీల ప్రకటన
తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాలెజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిఠ్ఠల్, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఫ్రొఫెసర్ వి.వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్ను విడుదల చేశారు. కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పడటంతో అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై శనివారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్, జులై 4న తెలంగాణ ఈసెట్, జులై 10న లాసెట్, జులై 1 నుంచి 3 వరకు టీఎస్ పీజీఈసెట్, జులై 1న టీఎస్ పాలిసెట్, 13న ఐసెట్, 15న ఎడ్సెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. -
జూలై 6 నుంచి ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలి స్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్లోనూ ఎంసెట్ను నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్న అధికారులు.. జూలై 6 నుంచి ఎంసెట్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ దీనిపై చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ఉన్నందున, జూలైలో వీలైనంత ముందుగా ఎంసెట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. జూలై 6 నుంచి మొదలుపెడితే 15లోగా పూర్తి చేయవచ్చని, తద్వారా విద్యార్థులు 18వ తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్కు సిద్ధం కావచ్చని అంటున్నారు. ఒకవేళ జూలై తొలివారంలో నిర్వహంచకపోతే ఆగస్టుకు వెళ్లే అవకాశం ఉంది. జూలై 23 వరకు జేఈఈ మెయిన్ ఉండగా, అదే నెల 27 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్, తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాస్తారు. మరోవైపు రెండు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్కు హాజరవుతారు. కాబట్టి ఈ మూడు సెట్స్ తేదీలు క్లాష్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఓ అధికారి చెప్పారు. అందుకే జూలై మొదటివారంలోనే ఎంసెట్ను నిర్వహించేలా ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఒకవేళ జూలైలోనూ కరోనా అదుపులోకి రాకుండా, పరిస్థితి ఇబ్బందికరంగా మారితే ఏపీ ఎంసెట్ తరువాత ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ ఎంసెట్ నిర్వహించాల్సి వస్తుంది. ఎంసెట్ కౌన్సెలింగ్పైనా కసరత్తు జేఈఈ మెయిన్ ఫలితాల తరువాతే అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ను నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలిపోకుండా చూడటంతో పాటు మెరిట్ విద్యార్థులకు ఆ సీట్లు లభించేలా చూడవచ్చని భావిస్తున్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల కంటే ముందే ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తే జేఈఈ ద్వారా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో సీట్లు లభించనున్న విద్యార్థులు కూడా ఎక్కువ మంది ముందుగా రాష్ట్ర కాలేజీల్లోనే చేరిపోతారు. ఆ మేరకు కన్వీనర్ కోటాలో సీట్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆ తరువాత మెరిట్లో ఉండే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. వారు కోరుకున్న కాలేజీలో, బ్రాంచీలో సీట్లు లభించవు. అదే జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్ర కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఈ పరిస్థితిని నివారించవచ్చు. జేఈఈ విద్యార్థులు కూడా తమకు వచ్చిన ర్యాంకులను బట్టి తమకు ఎక్కడ (ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలలో) సీటు లభిస్తుందనే అంశంపై ఓ అంచనాకు వస్తారు. అపుడు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో చేరే జేఈఈ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. తద్వారా తక్కువ సంఖ్యలో బ్లాక్ అయ్యే ఆ సీట్లను తదుపరి కౌన్సెలింగ్లో అందుబాటులో ఉంచి, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరక్కుండా చూడవచ్చని భావిస్తున్నారు. అందుకే జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు జూలై 31 నాటికి వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించకుండా ఆగాలని భావిస్తున్నారు. మొత్తానికి ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ చేపడితే ఇబ్బంది ఉండదన్న భావనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీచేసిన అకడమిక్ కేలండర్ ప్రకారం కొత్త విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులను ప్రారంభించవచ్చని చెబుతున్నారు. -
ఎంసెట్ 15 రోజులు వాయిదా
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్ తదితర సెట్లను 15 రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈసెట్ను మే 2న నిర్వహించాల్సి ఉంది. అలాగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్ నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్డౌన్ను ముందుగా ఈనెల 14వ తేదీ వరకు ప్రకటించిన నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. అయితే శనివారం లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తామని పాపిరెడ్డి తెలిపారు. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడతాయని పేర్కొన్నారు. అయితే ఈ వాయిదా ప్రభావం విద్యా సంవత్సరంపై లేకుండా అన్ని చర్యలు చేపడతామని, ఇబ్బందేమీ ఉండదని వెల్లడించారు. వివిధ సెట్లలో ముందుగా నిర్వహించాల్సిన ఈసెట్, ఎంసెట్ వాయిదా పడనుండగా, ఆ తర్వాత మే 13 నుంచి నిర్వహించాల్సిన పీఈసెట్, 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన ఐసెట్, 23న నిర్వహించాల్సిన ఎడ్సెట్, 27న నిర్వహించాల్సిన లాసెట్, 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాల్సిన పీజీఈసెట్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. -
19న ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్–2020 నోటిఫికేషన్ను ఈనెల 19న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్ష తన జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ.. 20 జోనల్ కేంద్రాల పరిధిలోని 55 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 105 కేంద్రాల్లో ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఇందులో రాష్ట్రంలో 16 జోనల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ జోనల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్కు ఒక్కో దానికి రూ.800 పరీక్ష ఫీజుగా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు ఫీజు సగానికి (రూ.400) తగ్గించినట్లు వెల్లడించారు. రెండింటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు రూ.1,600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ. 800) ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఈ నిబంధనను యథావిధిగా అమలు చేస్తామన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఈసారి టెస్ట్ సెంటర్లను రీఆర్గనైజ్ చేశామని ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు.} ప్రభుత్వం ఆమోదిస్తే ఈడబ్ల్యూఎస్... రాష్ట్రంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా అమలుకు సంబంధించి అం«శం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఈసారి ప్రవేశాల్లో అమలు చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కాలేదన్నారు. తాము మాత్రం ముందస్తుగా దాని అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన ప్రత్యేక కాలమ్ను విద్యార్థులు చేసుకునే దరఖాస్తులో పొందుపరుస్తున్నట్లు కన్వీనర్ వెల్లడించారు. ప్రభుత్వం జీవో మార్చితేనే కెమిస్ట్రీ మినహాయింపు అమలు.. ఇంజనీరింగ్లో చేరేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్తోపాటు కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఇతర సబ్జెక్టులు చదివిన వారికి అవకాశం ఇవ్వాలని, కెమిస్ట్రీ తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొన్న అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వివరణ ఇచ్చారు. ఏఐసీటీఈ ఆ నిబంధనను తీసుకువచ్చినా తాము రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఎంసెట్ నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపడుతున్నామన్నారు. ఏఐసీటీఈ చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను మార్చితే అమలు చేస్తామన్నారు. ఇదీ ఎంసెట్–2020 షెడ్యూలు.. 19–ఫిబ్రవరి : ఎంసెట్ నోటిఫికేషన్ 21–ఫిబ్రవరి నుంచి 30–మార్చి వరకు : ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 31– మార్చి నుంచి 3–ఏప్రిల్ వరకు: ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 6–ఏప్రిల్ వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం 13–ఏప్రిల్ వరకు: రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 20–ఏప్రిల్ వరకు: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుకు చాన్స్ 17–ఏప్రిల్: హాల్టికెట్ల జనరేషన్ 27–ఏప్రిల్ వరకు..: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్ 20–ఏప్రిల్ నుంచి 1–మే వరకు: వెబ్సైట్ నుంచి హాల్టికెట్ల డౌన్లోడ్ 4–మే, 5–మే, 7–మే: ఇంజనీరింగ్ ఎంసెట్ 9–మే, 11–మే: అగ్రికల్చర్ ఎంసెట్ -
ఈనెల 20న ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశా ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కమిటీ సమావేశాలు బుధవారం నుం చి మొదలు కానున్నాయి. ఒక్కొక్క సెట్ కమిటీ సమావేశాన్ని ఒక్కో రోజు నిర్వహించేందుకు సెట్స్ కన్వీనర్లు తేదీలు ఖరారు చేశారు. ఆయా సెట్స్కు సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. బుధవారం ఐసెట్, 17న ఎడ్సెట్, 19వ తేదీన పీఈ సెట్ సమావేశాలను నిర్వహించేందుకు చర్య లు చేపట్టనున్నాయి. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎంసెట్ కమిటీ సమావేశాన్ని ఈనెల 15న లేదా 18న నిర్వహించే అవకాశముంది. అదే రోజు ఈసెట్ కమిటీ స మావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వా త లాసెట్ కమిటీ సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆ యా సెట్స్కు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనున్నారు. వాటితోపాటు అర్హతలు, ఇతర నిబంధనలను కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్ను ఈ నెల 20 లేదా 21న జారీ చేసే అవకాశం ఉంది. మార్చి 2న పాలిసెట్ నోటిఫికేషన్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2020 నోటిఫికేషన్ను మార్చి 2వ తేదీన జారీ చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. ఇందులో పరీక్ష ఫీజు, ఇతర నిబంధనలను, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనుంది. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనుంది. -
ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూలు మారింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్స్ కన్వీనర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్ను ఈ ఏడాది మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఎంసెట్ను (ఇంజనీరింగ్) మే 4వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. 4వ తేదీన రెండు సెషన్లుగా, 5వ తేదీన ఒక సెషన్గా, 7వ తేదీన రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును సవరించారు. 8వ తేదీ కూడా ఎంసెట్ నిర్వహణ కోసమే రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎక్కువగా ఉంటే 8వ తేదీన కూడా ఇంజనీరింగ్ ఎంసెట్ను నిర్వహిస్తారు. మే 25వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ రంజాన్ నేపథ్యంలో లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మే 27 నుంచి నిర్వహించాల్సిన పీజీ ఈసెట్ పరీక్షలను సవరించిన షెడ్యూలు ప్రకారం మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్ష, ఈసెట్, పీఈ సెట్, ఐసెట్, ఎడ్సెట్ పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాలు, రంజాన్ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఆన్లైన్ పరీక్షలు అయినందునా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వికలాంగులకు ఫీజు రాయితీపై ఆయా సెట్స్ కమిటీల సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులను పెంచబోమని స్పష్టం చేశారు. ఫేసియల్ రికగ్నైషన్.. ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైష న్ విధానం అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. దాని ద్వారా పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే విధానాన్ని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమయంలో విద్యార్థుల ముఖం, కళ్లు స్కాన్ చేసి, వాటి ఆధారంగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టాలని భావి స్తున్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీఎస్టీఎస్)తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
మేలో ‘సెట్’ల పండుగ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్లో (బీఈ/బీటెక్లో) ప్రవేశాల కోసం 2020 మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను మంగళవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీలాసెట్ పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సె లింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులను బట్టి సెషన్స్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్సెట్కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు. నిమిషం నిబంధన యథాతథం.. ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఈసారి నేషనల్ పూల్ లేదు.. ఇంజనీరింగ్లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్ట సవరణతోనే విదేశీ వర్సిటీలు ప్రస్తుతం ఉన్న పార్లమెంటు చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం విదేశీ యూనివర్సిటీలు దేశంలో యూనివర్సిటీ లేదా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం కేంద్రం తెస్తున్న నూతన విద్యా విధానంలో ఆ అంశంపై చర్చిస్తోందని, అందులో ఓకే చెబితే విదేశీ యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు. -
జూన్ 3 లేదా 4న ఎంసెట్ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాలు జూన్ 3 లేదా 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలను బోర్డు ఈ నెల 27న వెల్లడించిన నేపథ్యంలో ఆ ఫలితాల డేటాను తీసుకొని ఎంసెట్ ఫలితాల ప్రాసెస్ను పూర్తి చేయాలని నిర్ణయించింది. రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల డేటా, గతంలోనే పాసైనా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సమాచారాన్ని కూడా తీసుకొని ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయాల్సి ఉంది. బోర్డు నుంచి డేటా వచ్చేందుకు ఒకట్రెండు రోజులు పట్టనున్న నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకులను జూన్ 3 లేదా 4న విడుదల చేయాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. బోర్డు డేటాను బుధవారం ఇస్తే ఈ నెల 31న ఫలితాలను వెల్లడించే అవకాశాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన టీఎస్ ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల కానుంది. 6వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 6 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తులలో సవరణ చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదువేల రూపాయలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు, పదివేల రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ పరీక్ష మే 3 నుంచి మే 6 వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1వరకు పరీక్ష ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ మే 8వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. నిమిషం ఆలస్యం అయిన పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
జూలైలో ఎంసెట్ రెండో విడత అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ రెండో విడత అడ్మిషన్ల షెడ్యూల్ను కన్వీనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. బీఈ, బీటెక్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఫీజు చెల్లింపులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు. వివరాలకు tseamcet.nic. inను సంప్రదించవచ్చు. కాగా, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 67,946 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సెలింగ్లో 52,621 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. అందులో 38,705 మంది విద్యార్థులు తమ సీట్లను కన్ఫామ్ చేసుకున్నారని వెల్లడించారు. షెడ్యూల్ వివరాలు.. - ఫీజు చెల్లింపులు: జూలై 6 నుంచి 8 వరకు - వెరిఫికేషన్: జూలై 7 నుంచి 8 వరకు - వెబ్ఆప్షన్లు: జూలై 7 నుంచి 10 వరకు - సీట్లు కేటాయింపు: జూలై 12న - ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 12 నుంచి 14 వరకు - కాలేజీలో రిపోర్టు చేయాల్సింది:జూలై 13 నుంచి 15 వరకు - తరగతులు ప్రారంభం: జూలై 16 నుంచి -
12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
-
12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
► ఇదీ ప్రవేశాల షెడ్యూల్ ►సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 12 నుంచి 21 వరకు ►వెబ్ ఆప్షన్లు : జూన్ 16 నుంచి 22 వరకు ►ఆప్షన్లలో మార్పులు: జూన్ 22 నుంచి 23 వరకు ►మొదటి దశ సీట్ల కేటాయింపు : జూన్ 28న ►కాలేజీల్లో చేరడం : జూలై 3వ తేదీలోగా.. హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12 నుంచి టీఎస్ ఎంసెట్–2017 కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రవేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు. జేఎన్టీయూహెచ్ అధికారులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపును ఈ నెల 10లోగా ఇస్తామని పేర్కొనడంతో షెడ్యూల్ను ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 16 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమావేశంలో సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ వాణీప్రసాద్, క్యాంపు ఆఫీసర్ బి.శ్రీనివాస్, జేఎన్టీయూహెచ్ అధికారులు పాల్గొన్నారు. ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి.. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు ఈసారి ఆధార్, బయోమెట్రిక్ను తప్పనిసరి చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ మార్కుల మెమో, ఇంటర్ మెమో–పాస్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈ ఏడాది జనవరి 1, ఆ తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు, స్పెషల్ కేటగిరీవారు ఆయా సర్టిఫికెట్లు, నాన్ లోకల్ వారైతే వారి తల్లిదండ్రులు తెలంగాణలో గతంలో పదేళ్లపాటు నివసించినట్లు ఉన్న ధ్రువీకరణ పత్రం, రెగ్యులర్ స్టడీ లేనివారు ఏడేళ్లపాటు ఇక్కడ నివసించి ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్కు సంబంధించిన వారు, ఎన్సీసీ, స్పోర్ట్స్, వికలాంగులు వంటి స్పెషల్ కేటగిరీకి చెందిన వారికి మాసబ్ ట్యాంకు సాంకేతిక విద్యా భవన్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు.. తేదీ ర్యాంకు 12–6–2017 1 నుంచి 6 వేలు 13–6–2017 6,001 నుంచి 16 వేలు 14–6–2017 16,001 నుంచి 26 వేలు 15–6–2017 26,001 నుంచి 36 వేలు 16–6–2017 36,001 నుంచి 46 వేలు 17–6–2017 46,001 నుంచి 56 వేలు 18–6–2017 56,001 నుంచి 68 వేలు 19–6–2017 68,001 నుంచి 80 వేలు 20–6–2017 80,001 నుంచి 92 వేలు 21–6–2017 92,001 నుంచి చివరి ర్యాంకు వరకు. ర్యాంకులవారీగా వెబ్ ఆప్షన్ తేదీలు.. తేదీలు ర్యాంకు 16–6–2017, 17–6–2017 1 నుంచి 36 వేలు 18–6–2017, 19–6–2017 36001 నుంచి 56 వేలు 20–6–2017, 21–6–2017 56001 నుంచి 80 వేలు 21–6–2017, 22–6–2017 80001 నుంచి చివరి ర్యాంకు వరకు 22–6–2017, 23–6–2017 వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 28–6–2017 సీట్లు కేటాయింపు, వెబ్సైట్లో వివరాలు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హెల్ప్లైన్ కేంద్రాలు.. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 21 హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలు.. – హైదరాబాద్లో: జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతాపూర్, గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, ఈస్ట్ మారేడ్పల్లి, క్యూ క్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ (జూపార్కు ఎదురుగా), సాంకేతిక విద్యా భవన్, మాసబ్ ట్యాంక్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి – ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, కరీంనగర్ – డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ జీఎంఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్, కరీంనగర్ – ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఖమ్మం – వనపర్తి, మహబూబ్నగర్, బెల్లంపల్లి (ఆదిలాబాద్), కొత్తగూడెం, రాజగోపాల్పేట్ (సిద్దిపేట), నల్లగొండ, వరంగల్, నిజమాబాద్, మెదక్ (వుమెన్) గవర్నమెంట్ పాలిటెక్నిక్లలో. – నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నల్లగొండ. – గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ బ్లాక్, నిజమాబాద్ – యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారి హన్మకొండ. – కాకతీయ యూనివర్సిటీ వరంగల్. -
రేపు ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జేఎన్టీయూహెచ్లో ఫలితాల విడుదలకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12న ఎంసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఇంజనీరింగ్ విభాగంలో 1,41,190 మంది దరఖాస్తు చేసుకోగా, 1,39,100 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 79,061 మంది దరఖాస్తు చేసుకోగా, 73,601 మంది పరీక్ష రాశారు. -
తెలంగాణ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
హైదరాబాద్: టీఎస్ ఎంసెట్- అగ్రికల్చర్, ఇంజినీరింగ్ల ప్రాథమిక కీను జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-హైదరాబాద్ శనివారం రాత్రి విడుదల చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ పీఆర్వో ఉషా ఓ ప్రకటన విడుదల చేశారు. 'కీ'లో తప్పులు ఏవైనా వుంటే అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. మరే ఇతర మార్గాల ద్వారా పంపిన అభ్యంతరాలను యూనివర్సిటీ పరిగణలోకి తీసుకోదని తెలిపారు. టీఎస్ ఎంసెట్- అగ్రికల్చర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి టీఎస్ ఎంసెట్- ఇంజినీరింగ్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒక్క నిమిషం కష్టాలు
► ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు ► అనుమతించని అధికారులు హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత ఎంసెట్ పరీక్ష అనుభవాల దృష్ట్యా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. అక్కడక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని మేడ్చల్-మియాపూర్ రహదారిలోని రైల్వే ట్రాక్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడటంతో.. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న ఓ విద్యార్థిని ఓ నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు ఆమెను పరీక్షకు హాజరు కానివ్వలేదు. కస్తూర్బా జూనియర్ కళాశాలలో పరీక్ష రాయాల్సిన ఇద్దరు విద్యార్థులు రెండు నిమిషాల ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి హాజరవడంతో అధికారులు వారిని పరీక్షకు అనుమతించలేదు. గాంధీనగర్కు చెందిన శేఖర్, సందీప్ అనే విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల పరీక్షకు ఆసల్యంగా వచ్చారు. ట్రాఫిక్ జాం వల్లే సమయానికి రాలేకపోయామని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. నిజమాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా రావడంతో.. సుష్మ అనే విద్యార్థినిని అనుమతించలేదు. దీంతో విద్యార్థిని కన్నీరుమున్నీరుగా విలపించింది. అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ కోడ్ విడుదల కాగా ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న ఎంసెట్ 2017 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్ష కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ టి. పాపి రెడ్డి సెట్ కోడ్ ఎస్2ను విడుదల చేశారు. -
అవును.. ఎంసెట్ పేపర్ లీకైంది
తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకైందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజి విషయంపై కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చింది. దాంతో మళ్లీ పరీక్ష నిర్వహించే విషయంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలపాలని హైకోర్టు కోరింది. అనంతరం ఈ అంశంపై విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. ఏపీ ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమందికి తెలంగాణ ఎంసెట్లో మాత్రం వందల్లో ర్యాంకులు రావడంతో ఎంసెట్-౨ పేపర్ లీకై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేయగా, సీఐడీ విచారణతో మొత్తం గుట్టు రట్టయింది. పేపర్ లీకైనందున పరీక్ష రద్దుచేయాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. -
విద్యార్థులపైనా క్రిమినల్ కేసులు
సంచలనం సృష్టించిన ఎంసెట్-2 లీకేజి కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితుడు రాజగోపాలరెడ్డి (65)తో పాటు ఎల్బీనగర్ ప్రాంతంలో రెజొనెన్స్ అకాడమీని నడుపుతున్న వెంకటరామయ్య అలియాస్ వెంకటరమణను కూడా సీఐడీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కొంతమంది విద్యార్థులపై కూడా క్రిమినల్ కేసులు నమోదుచేసే అవకాశం కనిపిస్తోంది. కొందరు విద్యార్థులు తమ అకౌంట్ల నుంచి ఏకంగా 50 లక్షల వరకు కూడా లావాదేవీలు చేసిన వ్యవహారాన్ని సీఐడీ త్వరలో బయటపెట్టబోతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిలో చాలామంది విద్యార్థులు పరారీలో ఉన్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ముందుగా తిరుమల్, విష్ణు అరెస్టయ్యారు. తర్వాత రమేష్, బండారు రవీంద్ర అనే ఇద్దరిని సీఐడీ అరెస్టుచేసింది. తాజాగా కీలక నిందితులు ఇద్దరు దొరికారు. వీళ్లలో వెంకటరామయ్య అలియాస్ వెంకటరమణ రెజొనెన్స్ అకాడమీకి పీఆర్వోనని మాత్రమే తొలుత చెప్పాడు. కానీ అతడే యజమాని అని సీఐడీ చెబుతోంది. విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఇతడు ఎంసెట్ మెడికల్ అకాడమీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బండారు రవీంద్ర అనే వ్యక్తి రమేష్కు సహకరించాడు. ఇతడు మెడికల్ అకాడమీ మెస్ ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. అకాడమీ నుంచి నలుగురు విద్యార్థులను పుణె క్యాంపునకు రవీంద్ర, వెంకటరమణ కలిసి పంపారు. విద్యార్థుల నుంచి వీరు మొత్తం రూ. 35 లక్షలు వసూలుచేశారు. ఆ డబ్బును రవీంద్ర, వెంకటరమణ కలిసి రమేష్కు ఇచ్చారు. బ్రోకర్ విష్ణు పంపిన 14 మందితోపాటు విజయవాడకు చెందిన జ్యోతిబాబు పంపిన ఆరుగురు విద్యార్థులకు కూడా పేపర్ లీక్ చేశారు. మొత్తం విద్యార్థులందరి వద్ద నుంచి కలిపి రాజగోపాల్ రెడ్డి రూ. 1.25 కోట్లు వసూలు చేశాడు. విద్యార్థులను పంపిన బ్రోకర్లకు కూడా అతడు బాగానే ముట్టజెప్పాడు. కింగ్పిన్ ఎవరు? తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజి కేసులో అసలైన కింగ్పిన్ మాత్రం ఇంతవరకు దొరకలేదు. రాజగోపాలరెడ్డి కీలక నిందితుడని భావిస్తున్నా.. అతడు కూడా ఒక బ్రోకర్ మాత్రమేనని సీఐడీ నమ్ముతోంది. ఈ మొత్తం కేసుకు అనేక రాష్ట్రాలతో సంబంధం ఉంది. చెన్నై సహా చాలా నగరాలకు విద్యార్థులను తరలించినట్లు చెబుతున్నారు. దీంతో మొత్తం వివరాలన్నీ సమగ్రంగా తెలియాలంటే కింగ్పిన్ ఎవరో తెలియాలని, అతడు దొరికితేనే అసలు ఎంతమందికి పేపర్ లీకైంది.. ఈ కుంభకోణంలో ఎంతమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఉందనే విషయాలు తెలుస్తాయి. -
తెలంగాణ ఎంసెట్-2 రద్దు
-
తెలంగాణ ఎంసెట్-2 రద్దు
మెడికల్ పేపర్ లీక్ కావడంతో.. ఎంసెట్-2ను రద్దుచేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటివరకు మెడికల్ కోర్సుల కోసం దాదాపు ఐదు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులంతా మరోసారి ప్రవేశపరీక్ష రాసి తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున ఇంకా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే.. పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది 56 వేలమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.. రద్దు చేయడం తగదన్న వాదనలు గట్టిగా వినిపించాయి గానీ.. ఒక్కరికి పేపర్ లీకయినా పరీక్ష రద్దుచేయాలని న్యాయ నిపుణులు సూచించడంతో ఇక పరీక్షను రద్దు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడైనా రద్దుచేసి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారానే ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు. కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లను జారీచేసి, ఆగస్టు మొదటివారంలో పరీక్ష నిర్వహించి, రెండోవారంలో ఫలితాలు ప్రకటించి సెప్టెంబర్ నాటికే తరగతులు ప్రారంభిస్తే విద్యాసంవత్సరం వృథా కాకుండా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. -
ఎంసెట్పై నిర్ణయం సోమవారమే!
తెలంగాణలో ఎంసెట్ మెడికల్ పేపర్ లీకవ్వడంతో.. ఆ పరీక్షను రద్దుచేయాలా లేక తప్పు చేసినట్లు తేలిన విద్యార్థుల ఫలితాలను మాత్రం ఆపి మిగిలిన వారికి ఇవే ఫలితాలను కొనసాగించాలా అనే విషయంలో సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎంసెట్ వ్యవహారంపై డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. లీకేజిపై సీఐడీ దర్యాప్తు చేసి రూపొందించిన నివేదికను ఆయనకు అందించారు. పరీక్షను రద్దు చేయొద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తున్న విషయాన్ని కూడా సీఎంకు చెప్పినట్లు సమాచారం. ఇది 56 వేలమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.. రద్దు చేయడం తగదన్న అభిప్రాయాలే ఉన్నతాధికారుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం 100-150 మంది చేసిన తప్పునకు మొత్తం అందరినీ శిక్షించడం ఎంతవరకు సబబన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ విషయంపై హైకోర్టు న్యాయవాదులతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా సంప్రదించి ఓ నిర్ణయానికి రావాలన్న ఉద్దేశంలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తుది నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేశారని అంటున్నారు. -
ఎంసెట్ కేసులో మరొకరి అరెస్టు.. నగదు స్వాధీనం
ఎంసెట్ -2 లీకేజి వ్యవహారంలో మరో వ్యక్తిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రమేష్ అలియాస్ షేక్ రహీమ్ అనే వ్యక్తిని అరెస్టుచేసిన సీఐడీ వర్గాలు.. అతడి నుంచి రూ. 37.5 లక్షలు స్వాధీనం చేసుకున్నాయి. రమేష్ స్నేహితుడి ఖాతా నుంచి మరో రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 మంది విద్యార్థుల నుంచి రమేష్ దాదాపు రూ. 1.73 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. అందులో కొంత మొత్తాన్ని విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసిన మరో బ్రోకర్కు ఇచ్చారు. విద్యార్థులను పుణెకు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చారు. కాగా, ఎంసెట్-2 లీకేజిలో ఇప్పటివరకు ముగ్గురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరికొందరు బ్రోకర్లు, ఈ కుట్రకు సూత్రధారులపై సీఐడీ దృష్టి సారించింది. ఒకటి రెండు రోజుల్లోనే మరికొందరిని అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!
-
లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!
అది 2014 సంవత్సరం. మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష పేపర్ లీకైన విషయం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అందులో కీలక నిందితుడు రాజగోపాల రెడ్డి. అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు. కట్ చేస్తే.. 2016 సంవత్సరం.. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీకైందని సీఐడీ నిర్ధారించింది. ఇందులోనూ కీలక నిందితుడు రాజగోపాలరెడ్డే!! అప్పుడూ ఇప్పుడూ కూడా అదే వ్యక్తి మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్లను లీక్ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం తాజాగా తెలంగాణ సీఐడీ విచారణలో తేలింది. ఎంసెట్ పేపర్ లీకేజి విషయంలో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గతంలో నిందితుడైన రాజగోపాలరెడ్డితో పాటు కన్సల్టెన్సీ యజమాని విష్ణు, దళారీ రమేష్లతో పాటు.. తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిలో విష్ణుకు ఒక కన్సల్టెన్సీ ఉంది. దాని ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజిమెంటు కోటా సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకునేవాడని అంటున్నారు. ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారని, వాళ్లు పరారీలో ఉన్నారని సమాచారం. కేసు ఛేదించిందిలా... సీఐడీ అధికారులు ముందుగా బ్రోకర్ల కాల్ డేటా సేకరించారు. ర్యాంకులు వచ్చిన పిల్లల తల్లిదండ్రుల కాల్ డేటా కూడా చూస్తే రెండూ కలిశాయి. వాళ్లిద్దరు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నట్లు తేలింది. జేఎన్టీయూ సిబ్బంది ఇద్దరి పేర్లు కూడా ఈ కాల్ డేటాలో వచ్చాయి. ఒకరు ప్రొఫెసర్, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ అని తెలిసింది. లీకేజి స్కాం విలువ 50 కోట్లు, కాగా.. మొత్తం 74 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్కు డీజీపీ అందజేశారు. లీకు ఎలా చేశారంటే... బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచింది. రాజగోపాలరెడ్డి (63) ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. మేనేజిమెంట్ కోటాలో వైద్యసీట్ల విక్రయానికి దళారీగా వ్యవహరించేవాడు. అక్రమ మార్గంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడంటూ బెంగళూరులో కూడా ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పేపర్ల ముద్రణ జరుగుతుందని ముందే తెలిసిన రాజగోపాలరెడ్డి.. హైదరాబాద్లో ఉన్న కన్సల్టెన్సీ ద్వారా ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లలో బాగా స్థితిమంతులైన పిల్లల వివరాలు సేకరించి, వాళ్ల తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రధానమైన పరీక్షలకు మూడు సెట్ల పేపర్లను సిద్ధం చేస్తారు. ఏ సెట్ను ఉపయోగించేదీ ఆరోజు ఉదయమే ప్రకటిస్తారు. అందుకే మొత్తం మూడు సెట్ల పేపర్లనూ లీక్ చేయించాడు. ఏ సెట్ వచ్చినా వాటిలోని ప్రశ్నలన్నీ తెలుసు కాబట్టి.. సులభంగా ర్యాంకులు సాధించేలా ఆ విద్యార్థులను రెండురోజుల పాటు బెంగళూరులో సిద్ధం చేశారు. సరిగ్గా పరీక్షరోజు ఉదయమే వాళ్లను విమానాల్లో హైదరాబాద్ రప్పించారు. దాంతో ముందు అనుకున్నట్లుగానే మంచి ర్యాంకులు వచ్చాయి. -
పరీక్షల తేదీలు
⇒ టీఎస్ ఎంసెట్: మే 15 ⇒ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అండ్ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ: మే 15 ⇒ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)- రిషికేష్ జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్): మే 23 ⇒ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్లో మెయింటెయినర్ (ఎలక్ట్రీషియన్): మే 29 -
ఎంసెట్ కౌన్సెలింగ్.. తెలుసుకోవాల్సినవెన్నో..
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్.. మే 27న నోటిఫికేషన్.. జూన్ 27 నాటికి క్లాసుల ప్రారంభం టీఎస్ ఎంసెట్.. మే 15న పరీక్ష.. జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్.. జూలై 1 నాటికి క్లాసుల ప్రారంభం.. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ సమాచారం మొత్తం సీట్లు: 1,57,074 ప్రభుత్వ కళాశాలలు: 17 ప్రైవేటు కాలేజ్లు: 305 కౌన్సెలింగ్ తేదీలు కౌన్సెలింగ్ ప్రకటన: మే 27, 2016 సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 6 వెబ్ ఆప్షన్స్ నమోదు: జూన్ 9 నుంచి 18 వరకు సీట్ అలాట్మెంట్: జూన్ 22 క్లాసుల ప్రారంభం: జూన్ 27 టీఎస్ ఎంసెట్ ఇన్ఫో.. ఇంజనీరింగ్ దరఖాస్తులు: 1.43 లక్షలు ఎంసెట్ తేదీ: మే 15 ఫలితాలు: మే 27లోపు కౌన్సెలింగ్ నోటిఫికేషన్: జూన్ మొదటి వారం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ: జూన్ 20 నాటికి పూర్తి క్లాసుల ప్రారంభం: జూలై 1 నుంచి సీట్లు: గత ఏడాది గణాంకాల ప్రకారం మొత్తం సీట్లు 1,26,468. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కళాశాలల గుర్తింపు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం.. మొత్తం 1,26,468 సీట్లకుగాను 20 వేల సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఇంజనీరింగ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ తేదీలు కూడా వెల్లడించారు.. మరోవైపు.. తెలంగాణ ఎంసెట్కు సర్వం సిద్ధమైంది. మే 15న టీఎస్ ఎంసెట్ను నిర్వహించనున్నారు. టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను సైతం ప్రకటించారు. ఇప్పుడు విద్యార్థుల కర్తవ్యం సరైన బ్రాంచ్, కాలేజ్ ఎంపిక. మెచ్చిన కాలేజీ, నచ్చిన బ్రాంచ్లో సీటు రాకుంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఔత్సాహికులకు సలహాలు.. సూచనలు.. తొలి ప్రాధాన్యం బ్రాంచ్ ఎంపిక విద్యార్థులు బ్రాంచ్ ఎంపికను తొలి ప్రాధాన్యంగా భావించాలి. తమ ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా వ్యవహరించాలి. క్రేజ్ కోణంలోనే బ్రాంచ్లను ఎంపిక చేసుకోకూడదు. ఆ బ్రాంచ్తో నాలుగేళ్లు చదవాలి. కాబట్టి ఆ కాలంలోనూ, తర్వాత ఆ బ్రాంచ్కుండే ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇష్టం లేని బ్రాంచ్ను ఎంపిక చేసుకుంటే అకడమిక్గా రాణించలేకపోవచ్చు. కాలేజ్.. ఎంపికలో కీలక కసరత్తు ఏఐసీటీఈ నిబంధనలు కాలేజ్ ఎంపికలో ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకు అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? గుర్తించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్సైట్లో లభిస్తుంది. ప్రత్యక్షంగా కళాశాలలను పరిశీలించి కూడా సమాచారం తెలుసుకోవాలి. టీచింగ్ - లెర్నింగ్ కళాశాలలో బోధన పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలిస్తుంటాయి. ఎన్బీఏ గుర్తింపు ఎన్బీఏ గుర్తింపు బ్రాంచ్లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు మొత్తం బ్రాంచ్లలో ఒకట్రెండు బ్రాంచ్లకే ఎన్బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్బీఏ అక్రెడిటెడ్ అని వెబ్సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటన లిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థుల ఆదరణ గతేడాది సదరు కాలేజ్లో సీట్ల భర్తీ విషయంలో ఓపెనింగ్- క్లోజింగ్ ర్యాంకుల వివరాలు సేకరించాలి. ఉదాహరణకు ఓయూసీఈ, ఏయూసీఈ వంటి యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదే విధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో ఈసీఈ, సీఎస్ఈ, ట్రిపుల్ఈ వంటి బ్రాంచ్లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే.. ఆయా కళాశాలల పనితీరు ఆధారంగా అవి విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. నచ్చిన కాలేజ్ కోరుకున్న కళాశాలలో సీటు రాకపోవచ్చు. అలాంటి పరిస్థితికి కూడా ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. ఇష్టంలేని కాలేజ్లో చేరాల్సి వస్తే.. అకడమిక్గా రాణించేందుకు కృషిచేయాలి. సెల్ఫ్లెర్నింగ్ టూల్స్పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా ఎంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ-లెర్నింగ్ పోర్టల్స్, ఆన్లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్రూమ్స్, వర్చువల్ లేబొరేటరీ వంటి సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు, అమలవుతున్న కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే మెచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్లో సీటు వచ్చినా విద్యార్థులు క్లాస్ రూమ్లో నేర్చుకునేది 40 నుంచి 50 శాతం మధ్యలోనే. మిగతాదంతా వాస్తవ పరిస్థితుల ఆధారంగా స్వీయ లెర్నింగ్పై ఆధారపడి ఉంటోంది. మెచ్చిన బ్రాంచ్ ఎంసెట్లో ర్యాంకు వచ్చినా మెచ్చిన బ్రాంచ్లో సీటు వచ్చే అవకాశం లేదనిపిస్తే.. ప్రత్యామ్నాయంగా సదరు బ్రాంచ్కు అనుబంధంగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్లవైపై దృష్టిసారించాలి. వీటి ద్వారా లభించే అవకాశాల గురించి తెలుసుకోవాలి. ప్లేస్మెంట్స్ ఇంజనీరింగ్లో చేరుతున్న ప్రతి విద్యార్థి ప్రధాన ఉద్దేశం భవిష్యత్లో మంచి అవకాశాలు అందుకోవడమే అనేది నిస్సందేహం. కాబట్టి కాలేజీని ఎంపిక చేసుకునే క్రమంలో.. సదరు కళాశాలలో గత నాలుగేళ్ల ప్లేస్మెంట్స్ గణాంకాలు పరిశీలించాలి. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.. వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో గమనించాలి. జేఎన్టీయూ పరిధిలోని కళాశాలల సంఖ్య, అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య పరంగా మరో పది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటికే 58 కళాశాలలకు వాటి ప్రమాణాలలేమి కారణంగా నోటీసులు ఇచ్చాం. కొన్ని కళాశాలలు బ్రాంచ్ల వారీగా క్లోజర్ దరఖాస్తు చేసుకున్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే గతేడాది కంటే కొంత మేర సీట్లు తగ్గుతాయి. - ప్రొఫెసర్.ఎన్.యాదయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ-హైదరాబాద్ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు వెల్లడయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్లు, ఆ బ్రాంచ్ల బోధనలో పేరు గడించిన ఇన్స్టిట్యూట్ల గురించి అన్వేషణ సాగించాలి. తమ ర్యాంకు పరిధికి సదరు బ్రాంచ్లో గత ఏడాది సీటు లభించిన కాలేజ్ల వివరాలు తెలుసుకుని వాటిలో బెస్ట్ కాలేజ్లతో జాబితా రూపొందించుకుని సిద్ధంగా ఉండాలి. -ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబా, కన్వీనర్, ఏపీ ఎంసెట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్స్ పరంగా కంపెనీలు కోరుకునే స్కిల్స్, విద్యార్థుల్లో వాటిని పెంపొందించేందుకు కొన్ని కళాశాలలు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ల పేరుతో స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణనిస్తున్నాయి. అప్పుడే అకడమిక్ నైపుణ్యాలతోపాటు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా అలవడతాయి. కౌన్సెలింగ్కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు విద్యార్హతల సర్టిఫికెట్లు కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఫీజు రీయింబర్స్మెంట్ అర్హులు) ఎంసెట్ హాల్టికెట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ నివాస ధ్రువీకరణ పత్రం ప్రత్యామ్నాయాలెన్నో ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి లేకపోయినా.. బ్రాంచ్, కాలేజీ నచ్చినా నచ్చకున్నా ముందు బీటెక్లో చేరదాం.. ఆ తర్వాత ఆలోచిద్దాం..! అనే ధోరణి ఎంత మాత్రం సరికాదు అంటున్నారు నిపుణులు. మెచ్చిన బ్రాంచ్లో, నచ్చిన కాలేజ్లో సీటు రాకపోతే డిగ్రీ కోర్సులపై దృష్టిపెట్టొచ్చు. ఇవేకాకుండా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉండే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీనే కావాలనుకునే విద్యార్థులు ఇటు బీఎస్సీ చేస్తూనే ఏఎంఐఈ, ఏఎంఐఈటీఈ వంటి ఇన్స్టిట్యూట్లలో మెంబర్షిప్ ద్వారా బీటెక్ తత్సమాన అర్హత గల సర్టిఫికెట్ సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.