వైఎస్ను మరచిన ప్రభుత్వం: జూపూడి | | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 7 2013 2:56 PM | Last Updated on Thu, Mar 21 2024 9:14 AM

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంమీద ఏర్పడిన ఈ ప్రభుత్వం ఆయనను మరచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వైఎస్ఆర్ జయంతి గురించి మాటకూడా మాట్లాడకపోవడం దారుణం అన్నారు. ఆయన మీద గౌరవం ఉంటే జయంతి వేడుకలు ఘనంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ప్లీనరీలోనే వైఎస్ఆర్ 64వ జయంతి జరపాలని నిర్ణయించామని, అయితే పంచాయతీ ఎన్నికలు కారణంగా ప్లీనరీ వాయిదా పడిందని తెలిపారు. వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు రేపు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement