Jupudi
-
22న విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని 22న జూపూడిలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్న దృష్ట్యా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్ను దారిమళ్లిస్తున్నాం. విశాఖపట్నం నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలు, లారీలను హనుమాన్ జంక్షన్ వద్ద నిలిపివేస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నందిగామలో నిలిపివేస్తాం. చెన్నై నుంచి వచ్చే వాహనాలను గుంటూరులో నిలిపివేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రవిచంద్ర పేర్కొన్నారు. (అమూల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం) -
చంద్రబాబు ఫొటో లేకపోతే కార్లు వెనక్కు తీసుకోండి
కలెక్టర్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ఆదేశం ఎస్సీ కార్పొరేషన్కు రూ. 2,177 కోట్లు గొల్లప్రోలు (పిఠాపురం) : ఎస్సీ లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ సబ్సిడీపై అందజేసిన ఇన్నోవా కార్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో లేకుంటే వాటిని వెనక్కు తీసుకొని కొత్త లబ్ధిదారులకు అందజేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వరంలో గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాలులో పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ నిరుద్యోగ యువత, అంబేడ్కర్ సంఘాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జూపూడి, కలెక్టర్ కార్తికేయమిశ్రా హాజరయ్యారు. తొలుత డాక్టర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్, బాలయోగి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూపూడి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 2,177 కోట్లు వివిధ పథకాల ద్వారా 1,26,519 మంది ఎస్సీ లబ్ధిదారులకు అందజేశామన్నారు. జిల్లాలో రూ. 300 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయన్నారు. ఎస్సీ లబ్ధిదారులంతా వివిధ పథకాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 120 ఇన్నోవా కార్లు అందజేశామని, ఈఏడాది మరో 220 ఇన్నోవాకార్లు, 500 ట్రాక్టర్లు, బొలేరో వాహనాలు ఎస్సీ యువత ఉపాధి కోసం అందజేస్తామని తెలిపారు. యూత్వే పోర్టల్లో 2.96 లక్షల మంది రిజిస్టరైన నిరుద్యోగులకు నైపుణ్యశిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ యాక్షన్ప్లాన్ రూపొందించిన ఘనత జూపూడికి దక్కుతుందన్నారు. భూమి కొనుగోలు చేసుకునే రైతులు అర్జీలు పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ నియోజవర్గంలోని 4 వేల మంది నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే ధ్యేయంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగయువత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు అందజేశారు. గొల్లప్రోలు, కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యులు మడికి సన్యాసిరావు, బత్తుల చైతన్యరాజేష్కుమార్, పిఠాపురం ఎంపీపీ ముంజవరపు విజయలత, సెంట్రల్బ్యాంకు డైరెక్టర్ గుడాల రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వి. డేవిడ్రాజు, ఎస్సీ నాయకులు దానం లాజర్బాబు, లింగంరాజు, ఆలపు సూరిబాబు, భీమారావు, ఎంపీడీఓలు పి. విజయథామస్, నారాయణమూర్తి, తహసీల్దార్లు వై. జయ, రత్నకుమారి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
జూపూడి (ఇబ్రహీంపట్నం) : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే జాబ్మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించేందుకు గ్రామీణ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో బీసీ, ఎస్సీ యువతకు జాబ్మేళా నిర్వహించినట్లు ఇప్పుడు కాపు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు సీఎం చంద్రబాబు మంజునాథ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హోంమంత్రి చినరాజప్పకు పరాభవం చినరాజప్ప జాబ్మేళాకు హాజరు కాకముందే మంత్రులు ఉమా, రవీంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి వేదికపై ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సమయంలో రాజప్ప రావటంతో ఆయనకు స్వాగతం పలికారు. చినరాజప్ప మాట్లాడగానే మిగిలిన మంత్రులు జెడ్పీ సమావేశం ఉందని వెళ్లిపోయారు. దీంతో వేదికపై చినరాజప్ప అసహనానికి గురైనట్లు కనిపించింది. జాబ్మేళాకు తొలిరోజు నిరుద్యోగుల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, కార్పొరేషన్ డైరెక్టర్ అమరేంద్ర, నోవా కళాశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
'జూపూడి, కారెం చంద్రబాబుకు దళారీలు'
నెల్లూరు (సెంట్రల్) : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కారెం శివాజిలు సీఎం చంద్రబాబుకు దళారులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. నెల్లూరులోని ఒక హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూపూడి, కారెం శివాజికి ఆ పదవులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరూ కోరుకోరు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం ఆయన నియంత పాలనకు నిదర్శనమన్నారు. సీఎం వ్యాఖ్యలకు రాష్ర్ట వ్యాప్తంగా దళితులు నిరసనలు చేపడుతుంటే కారెం, జూపూడిలు బాబుకు వత్తాసు పలకడం దళితులకు ద్రోహం చేయడమేనన్నారు. దళితుల ముసుగులో అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్న కారెం శివాజిని ఉన్నతమైన పదవిలో కూర్చోపెట్టడం ఎంత వరకు సబబన్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా వారం రోజుల పాటు ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 23న ప్రభుత్వ కార్యాలయాల ముందు చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్లు తెలిపారు. -
’8 కోట్ల మంది ప్రజల గుండెలపై కత్తులు పెట్టారు ’
-
యెల్లో మీడియాపై మండిపడ్డ జూపూడి ప్రభాకర్
-
జూపూడి ప్రభాకర్ రావు మీడియా సమావేశం
-
విజయమ్మ కోమాలోకి వెళ్లే అవకాశం-జూపూడి
-
వైఎస్ను మరచిన ప్రభుత్వం: జూపూడి