రైతు నేత తల పగలగొట్టిన పోలీసులు | ysrcp farmer leader severly injured in police lathicharge | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 10 2015 4:03 PM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మార్చ్ ఫాస్ట్ను అడ్డుకునే క్రమంలో పోలీసులు అదుపు తప్పి ప్రవర్తించారు. వాళ్లు విచ్చలవిడిగా లాఠీచార్జి చేయడంతో.. కడప జిల్లాకు చెందిన రైతు విభాగం నాయకుడు ప్రసాదరెడ్డి తలకు గాయాలయ్యాయి. కమలాపురానికి చెందిన ప్రసాదరెడ్డి రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. పోలీసుల విచక్షణా రహితంగా కొట్టడంతో ఆయన దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయి. ఆయన తలకు వెనుక భాగంలో తీవ్రంగా గాయమైంది. పార్టీ నాయకురాలు రోజా ఆయనను పరామర్శించి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement