ప్రధాన వార్తలు

చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని.. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ.. శనివారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది. సీఎంగా చంద్రబాబు పని అయిపోయింది. 👉జగన్ మొన్నీమధ్యే వెళ్లి వచ్చాక కేంద్ర మంత్రి వెళ్లి పొగాకు రైతులను కలిశారు. గతంలో గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్ పిలిచి చర్చలు జరిపేవారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా చేయాల్సిందంతా చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీడియా హైప్తోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. 👉రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి పాలనలో వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారు. కుప్పంలో జరిగే అరాచకాలు చంద్రబాబుకి కనిపించడం లేదా?. పోలీసుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అమాయకులపై, వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అడిగితే తాట తీస్తా! అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను సజ్జల వీడియో ప్రదర్శించి చూపించారు.👉హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తన ఉంటోంది. చంద్రబాబు తాను చేసే తప్పులను ఎదుటి వారిపై నెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా జగన్పై నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీకొడుకులు డ్రామాలు చేస్తున్నారు. యోగా బాగా అలవాటు ఉండేవారికి స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. కానీ, చంద్రబాబు మోహంలో అదే క్రూరత్వం, కుటిలత్వం కనిపిస్తున్నాయి. 👉చంద్రబాబు ఏడాది పాలనంతా డొల్లా. ఆయనకు అధికారం అంటే బాధ్యత లేదు. లేని స్కాం పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు. ఐదేళ్లు లిక్కర్స్కాం పేరుతో కథ నడిపిస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఆయన అధికారంలో వచ్చాక అనేక పథకాలకు కోత పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారు. 👉వైఎస్సార్సీపీ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబుకి అసలు పరిపక్వతే లేదు. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వడం లేదు. భూస్థాపితం చేస్తారట.. తాట తీస్తారట.. ఇవేనా ఆయన ఇచ్చే సమాధానాలు. రప్పా రప్పా ఫ్లకార్డులపై నానా రాద్దాంతం చేస్తున్నారు. ఆ ఫ్లకార్డు పట్టుకుంది టీడీపీ కార్యకర్తే. పవన్ కల్యాణ్ ఎక్కడ? రాష్ట్రంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. 👉వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ నిబద్ధతతో ఇచ్చిన హామీలు అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లక్షా 67 వేల కోట్లు అప్పు చేశారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడది చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ హామీలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే.. పోరాడుతూనే ఉంటుంది అని సజ్జల ఉద్ఘాటించారు.

అణు పరీక్షలతోనే ఇరాన్లో భూకంపమా?
తీవ్రత తక్కువే అయినా కూడా శక్తివంతమైన భూకంపం శుక్రవారం ఇరాన్ను వణికించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదని.. స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభించిందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించడంతోనే అక్కడ భూమి కంపించిందా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. జూన్ 20 శుక్రవారం ఇరాన్ సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. సెమ్నాన్కు 27 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైంది. అయితే టెహ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడం వల్లే భూమి కంపించిందనే అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం 9వ రోజుకి చేరింది. అణు ఒప్పందాలపై ఎలాంటి చర్చలు ఉండబోవని ఇరాన్ తాజాగా ప్రకటించింది కూడా. అయితే ఆ దేశ సైన్యం నడిపించే మిస్సైల్ కాంప్లెక్స్తో పాటు సీక్రెట్ స్పేస్ సెంటర్ కూడా సెమ్నాన్ ప్రాంతంలోనే ఉంది. అందుకే ఈ అనుమానం తెర మీదకు వచ్చింది. సాధారణంగా అణు పరీక్షలు నిర్వహించే క్రమంలో భూమి కంపించడం సహజమే. పేలుళ్ల ధాటికి టెక్టానిక్ ప్లేట్లు ఒత్తిడికి గురికావడం వల్ల భూకంపానికి దారితీసే అవకాశం ఉంది. అయితే భూకంప శాస్త్రవేత్తలు (Seismologists).. సహజ భూకంపాలకు, అణు కార్యక్రమాల వల్ల ఏర్పడే ప్రకంపనలకు తేడాను గుర్తించగలుగుతారు. ఇండియా టుడే కథనం ప్రకారం.. ఇరాన్ తాజా భూకంపానికి, అణు పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వేతో పాటు కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్(CTBTO) ధృవీకరించారు. మరికొందరు సిస్మాలజిస్టులు కూడా ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. కేవలం పది కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు జరపడం అసాధ్యమని తేల్చేశారు.ఇరాన్ భూకంపాల జోన్లోనే ఉంది. సాధారణంగా ఏడాదిలో అక్కడ 2,100 సార్లు భూమి కంపిస్తుంటుంది. ఇందులో 15 నుంచి 16 సార్లు.. రిక్టర్ స్కేల్పై 5 కంటే ఎక్కువ తీవ్రతతోనే భూమి కంపిస్తుంది. 2006-2015 మధ్య ఇరాన్ 96,000 భూకంపాలను చవిచూసింది.

DGCA సీరియస్.. ఎయిరిండియా నుంచి ముగ్గురి తొలగింపు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ క్షణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇటీవల బెంగళూరు నుంచి లండన్ హీత్రోకు బయలుదేరిన రెండు విమానాలు(మే 16, 17వ తేదీల్లోని AI133 సర్వీస్).. గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ.. ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏడు రోజుల గడువు విధించింది. అదే సమయంలో..నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఎయిరిండియాకు చెందిన ముగ్గురు సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉప్రకమించింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్నా ఎయిరిండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ‘‘నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా, వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని డీజీసీఏ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో.. వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజులలోపు డీజీసీఏకి నివేదించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని.. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు విమానం కూలినచోట మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా కన్నుమూశారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరింది. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

ICC: శుబ్మన్ గిల్కు జరిమానా?!.. కారణం?
టీమిండియా టెస్టు కెప్టెన్గా తన ప్రయాణంలో తొలి ప్రయత్నంలోనే శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా శతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు. తద్వారా టెస్టు సారథిగా అరంగేట్ర ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్గా నిలిచాడు.అజేయ శతకంలీడ్స్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో.. విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్కు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 175 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటికి పదహారు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఇక మరో సెంచరీ వీరుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో కలిసి 129 పరుగులు జోడించిన గిల్.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్తో కలిసి 138 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో టీమిండియా 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. చిక్కుల్లో పడే అవకాశంకాగా ఇంగ్లండ్తో మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు ప్రదర్శన పట్ల సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలు హర్షం వ్యక్తం చేశారు. గిల్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ను కొనియాడుతున్నారు. అంతాబాగానే ఉన్నా గిల్ చేసిన ఓ పని వల్ల అతడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా అతడు నలుపు రంగు సాక్సులు వేసుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్లేయర్ క్లాతింగ్- ఎక్విప్మెంట్ నిబంధన (క్లాజ్ 19.45)ల ప్రకారం.. టెస్టు మ్యాచ్లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా లేత బూడిద రంగులో మాత్రమే ఉండాలి.జరిమానా?ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గిల్కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. కాగా ఐసీసీలోని ఈ నిబంధనల ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డట్లు తేలితే ఫైన్ తప్పదు. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని రిఫరీ భావిస్తే అతడు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కేఎల్ రాహుల్ (42) ఓ మోస్తరుగా రాణించగా.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జైసూ, గిల్ శతకాలతో చెలరేగగా.. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇండియన్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న తర్వాత మన సినీ ఇండస్ట్రీకి వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు అత్యధిక వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్-10 చిత్రాలేవో చూసేయండి.ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ఈ తర్వాత సెకండ్ ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్తో సమానంగా సౌత్ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.2017లో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2: ది కన్క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది.గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆదిపోయింది. బాహుబలి-2 కంటే కేవలం రూ. 69 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. అయితే కేజీఎఫ్-2 సినిమాతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ఈ మూవీతోనే శాండల్వుడ్ పేరు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు

ఉక్రెయిన్ మొత్తం మాదే.. పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం మాదే. ఉక్రెయిన్ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.Russians and Ukrainians are one people, and in that sense, the whole of Ukraine is ours — Putin 😳 pic.twitter.com/krghibrx0m— Frontalforce 🇮🇳 (@FrontalForce) June 20, 2025ఖండించిన పుతిన్అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.ఈ సందర్భంగా పుతిన్..‘జెలెన్ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.

పల్నాడులో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. మేరుగు రాధా, కొండా శీను..
సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను పేర్కొన్నారు.👉ఇక, వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పుష్ప-2 సినిమాలో డైలాగు పోస్టర్ రూపంలో చూపించిన బోల్లెద్దు రవితేజ కేసులో గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో 223, 352, 351(2), 189(3), 192, 61(2), 126(2), 288, 298, 192 BNS r/w 190(2), BNS నాన్ బెయిల్ బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయడం గమనార్హం.👉అలాగే, రాజుపాలెం మండలం బలిచేపల్లికి చెందిన మేరుగ రాధాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్లో వచ్చిన పోస్టును ఆమె.. ఫార్వర్డ్ చేసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం విశేషం.👉మాచర్ల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండా శీనును నిన్న సాయంత్రం గుంటూరులో దుర్గి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు కొండా శీనును పోలీసులు తీసుకెళ్లారు. అయితే, కొండా శీనుకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదనఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే లింక్ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్టెల్ ఈ సైట్ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్అప్ మెసేజ్ వస్తుంది.

2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్లో హరీష్ రావు ఫొటో
సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఫుల్ జోష్లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్పై కేసు పెట్టడం.. కేసీఆర్ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాడు. కౌశిక్ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలే!
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం...ఆలివ్ ఆస్పత్రి అవగాహన సదస్సు
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి
అమ్మ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్!
'శుబ్మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
ఒక్క క్లిక్తో తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు
అదృష్టమంటే ఇదే!.. దారుణంగా ఢీకొట్టుకున్నారు.. కానీ..
అణు పరీక్షలతోనే ఇరాన్లో భూకంపమా?
30 లోపు ఇస్తాం.. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిఫ్లై
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
Plane Crash: విషాదంగా ముగిసిన మరో దంపతుల కథ..!
సాక్షి కార్టూన్ 20-06-2025
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
అదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలే!
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం...ఆలివ్ ఆస్పత్రి అవగాహన సదస్సు
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి
అమ్మ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్!
'శుబ్మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
ఒక్క క్లిక్తో తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు
అదృష్టమంటే ఇదే!.. దారుణంగా ఢీకొట్టుకున్నారు.. కానీ..
అణు పరీక్షలతోనే ఇరాన్లో భూకంపమా?
30 లోపు ఇస్తాం.. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిఫ్లై
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
Plane Crash: విషాదంగా ముగిసిన మరో దంపతుల కథ..!
సాక్షి కార్టూన్ 20-06-2025
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సినిమా

రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
ఏ సినిమా అయినా సరే హీరోయిజం పండాలంటే అందుకు ఎదురుగా ఉన్న పాత్ర కూడా అంతే పండాలి. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' విషయంలోనూ ఇదే జరిగినట్లు అనిపిస్తుంది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna Akkineni) లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన విలనిజంతో నటుడు జిమ్ షర్బ్ ఆకట్టుకున్నాడు. ఇదే ఇతడికి తొలి సినిమా అయినా సరే.. విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇంతకీ ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ముంబైకి చెందిన జిమ్ షర్బ్ సీనియర్ నటుడేం కాదు. ఇతడి వయసు జస్ట్ 37 ఏళ్లే. తండ్రి ఉద్యోగం వల్ల చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశాడు. తర్వాత 2014లో హిందీలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తొలి మూవీ షురురత్ కి ఇంటర్వెల్ ఫ్లాప్. దీంతో రెండేళ్లు వెయిటింగ్ తప్పలేదు. 2016లో వచ్చిన 'నీర్జా' ఇతడి కెరీర్ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. అలా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)బాలీవుడ్లో పద్మావత్, సంజు సినిమాల్లో ఇతడు విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలా శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు. 'కుబేర'లో అవకాశం దక్కించుకున్నాడు. స్వతహాగా హిందీ నటుడు అయినప్పటికీ.. డబ్బింగ్కి సరిపోయేలా యాక్టింగ్ చేయగలిగాడు. సినిమాలో ఇతడి నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మూవీ చివర్లో ఇతడి పాత్ర కూడా బిచ్చగాడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.అలా తెలుగులో 'కుబేర' సినిమాతో తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న జిమ్.. త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ విలనిజం చూసి చూసి జనాలకు మొనాటనీ వచ్చేసింది. ఇలాంటి టైంలో జిమ్కి అవకాశాలు వస్తే టాలీవుడ్లో కొత్త విలన్ పుట్టుకొచ్చినట్లే.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

విషాదంగా ముగిసిన దర్శకుడి మిస్సింగ్ మిస్టరీ!
మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మహేష్ జీరావాలా(Mahesh Jirawala ) మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆహ్మదాబాద్బాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అతని మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో దొరికిన యాక్టివా స్కూటర్, ఫోన్ కూడా అతన్ని గుర్తింపుని నిర్ధారించడంలో ఉపయోగపడ్డాయి.అసలేం జరిగింది?అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్లో జూన్ 12న లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాప్ అయిన కాసేపటికే ఆ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మృతి చెందారు. డీఎన్ఏ ద్వారా మృతదేహాలను గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు నుంచి దర్శకుడు మహేశ్ జీరావాలా కనిపించకుండా పోయారు. ఆ రోజు ఎయిర్ పోర్ట్ సమీపంలో ఒకరిని కలిసేందుకు వెళ్లాడని అతని భార్య హేతల్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో అతని ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతని మృతదేహం మాత్రం లభించలేదు. దీంతో ఇన్నాళ్ల పాటు అతని మిస్సింగ్ మిస్టరీ వీడలేదు.డీఎన్ఏ ద్వారా గుర్తింపు..విమాన ప్రమాదంలోనే మహేశ్ జీరావాలా మృతి చెంది ఉంటారాని తొలుత పోలీసులు భావించారు. అక్కడ లభించిన మొబైల్, యాక్టివా బండి ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించి, మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. కానీ మహేశ్ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆయన ఎయిర్పోర్ట్కు రాకపోవచ్చని, ఆ మృతదేహం అతనిది కాదని వాదించారు. దీంతో కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించి, మృతదేహం డీఎన్ఏతో పోల్చి చూశారు. డీఎన్ఏ రిపోర్ట్.. ఆ మృతదేహం మహేశ్దే అని నిర్ధారించడంతో మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది.మహేష్ జీరావాలా విషయానికొస్తే.. గుజరాత్లోని నరోదాకు చెందిన ఈయన అసలు పేరు మహేష్ కలవాడియా. మ్యూజిక్ ఆల్బమ్స్కు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. నిర్మాతగాను వ్యవహరించాడు. 2019లో ఆయన కాక్టెయిల్ ప్రేమి పాగ్ ఆఫ్ రివెంజ్ అనే గుజరాతీ సినిమాకు దర్శకత్వం వహించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Mega 157: స్కూల్లో డ్రిల్ మాస్టర్గా చిరంజీవి!
కాలేజ్ లెక్చరర్గా చిరంజీవి ఆడియన్స్ను ఎలా ఎంటర్టైన్ చేశారో ‘మాస్టర్’ (1997) సినిమాలో చూశాం. మరి... స్కూల్లో డ్రిల్ మాస్టర్గా ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నారో వచ్చే సంక్రాంతికి థియేటర్స్కి వెళ్లి చూడొచ్చట. చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. (చదవండి: 'కుబేర' విలన్.. ఇతడు ఎవరో తెలుసా?)ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్గా చిరంజీవి కనిపించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. అలాగే గురువారంతో ముస్సోరీలో పూర్తయిన ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్లో స్కూల్ నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరించారట అనిల్ రావిపూడి. ఈ సీన్స్లో చిరంజీవి, నయనతారతో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం పాల్గొన్నట్లుగా తెలిసింది. ఇంకా ఈ సినిమాలోని ఓ అతిథి ΄ాత్రలో వెంకటేశ్ నటిస్తారని, నటి క్యాథరీన్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని టాక్. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం
ఓ ఊహకు మంచి ఆలోచన తోడై దానికి క్రియేటివిటీ అనే మసాలాను జోడిస్తే అవుతుంది ఓ అద్భుతమైన సినిమా. ఒక వ్యక్తిని అది కూడా ఒక తల్లిని... పరిస్థితులు, సమాజం నిస్సహయరాయుల్ని చేస్తే... నలుగురు కలిసి అన్ని రకాలుగా ఒక మూలకు నెట్టేస్తే ఆమేం చేసిందన్న విషయాన్ని ఊహకు అందనట్టుగా అదే సమయంలో మనసుకు హత్తుకునేట్టుగా తీసే దర్శకులు ప్రపంచ స్థాయిలో చాలా మందే ఉన్నారు. బోలెడంత ఖర్చుతో , పెద్ద స్టార్ కాస్టింగ్ తో ఓ కథను తీయడం పెద్ద కష్టమేమీ కాదు, కాని అదే సమయంలో చిన్న ఆలోచనను చిన్న స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కత్తి మీద సామే. అలా తన ఆలోచనకు తానే నిర్మాతగా మారి, దర్శకత్వం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హాలివుడ్ దర్శకుడు టైలర్ పెర్రీ నిజంగా పెద్ద సాహసమే చేశాడు. ఆ సాహసం పేరే తాను తీసిన సినిమా స్ట్రా(Straw Movie Review). చిన్న ఆలోచనతో తన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసిన సినిమా ఈ స్ట్రా. ఇది ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం...జనయా ఓ సింగిల్ మదర్, తన కూతురితో చిన్నపాటి ఇరుకు గదిలో అతి కష్టం మీద సర్దుకుంటూ ఉంటుంది. ఓ షాపింగ్ మాల్ లో పని చేసే జనయాకు ఆనందం అన్న విషయమే తెలియదు, అంతగా ఆమె జీవితం కష్టాలమయం. కనీసం స్కూల్ లో కూతురికి ఓ రోజు బ్రెడ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఓ రోజు కూతురి బ్రెడ్ కోసం డబ్బులు లేక బ్యాంకు కు వెళ్ళి విత్ డ్రా చేయడానికి వెళితే, బ్యాంకు సిబ్బంది ఏదో కారణాల వల్ల డబ్బు ఇవ్వలేమని చెబితే వాళ్ళని ఎదిరించడానికి గన్ చూపిస్తుంది. బ్యాంకు లో గన్ చూపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అవాక్కయి పోలీసులకు ఫోన్ చేస్తారు.ఇక అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. జనయాకి బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారా, లేదా గన్ చూపించినదానికి జనయాను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. చూడడానికి ఇది చిన్న కథే అయినా ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తో చూసే ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా తరాజి పి హాన్సన్ జీవించిందని చెప్పవచ్చు. నిజానికి ఆ ఆలోచనకే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా పెద్ద వాళ్ళకు మాత్రమే. అలాగే ఇది తెలుగులోనూ లభ్యమవుతుంది. ఈ రివ్యూ చదివిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాని ఇలాంటి సినిమా మాత్రం చాలా అరుదు. మస్ట్ వాచ్.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ICC: శుబ్మన్ గిల్కు జరిమానా?!.. కారణం?
టీమిండియా టెస్టు కెప్టెన్గా తన ప్రయాణంలో తొలి ప్రయత్నంలోనే శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా శతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు. తద్వారా టెస్టు సారథిగా అరంగేట్ర ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్గా నిలిచాడు.అజేయ శతకంలీడ్స్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో.. విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్కు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 175 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటికి పదహారు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఇక మరో సెంచరీ వీరుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో కలిసి 129 పరుగులు జోడించిన గిల్.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్తో కలిసి 138 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో టీమిండియా 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. చిక్కుల్లో పడే అవకాశంకాగా ఇంగ్లండ్తో మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు ప్రదర్శన పట్ల సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలు హర్షం వ్యక్తం చేశారు. గిల్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ను కొనియాడుతున్నారు. అంతాబాగానే ఉన్నా గిల్ చేసిన ఓ పని వల్ల అతడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా అతడు నలుపు రంగు సాక్సులు వేసుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్లేయర్ క్లాతింగ్- ఎక్విప్మెంట్ నిబంధన (క్లాజ్ 19.45)ల ప్రకారం.. టెస్టు మ్యాచ్లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా లేత బూడిద రంగులో మాత్రమే ఉండాలి.జరిమానా?ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గిల్కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. కాగా ఐసీసీలోని ఈ నిబంధనల ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డట్లు తేలితే ఫైన్ తప్పదు. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని రిఫరీ భావిస్తే అతడు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కేఎల్ రాహుల్ (42) ఓ మోస్తరుగా రాణించగా.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జైసూ, గిల్ శతకాలతో చెలరేగగా.. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్?!
ఇంగ్లండ్తో తొలి టెస్టు ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు రెండో రోజు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్యూవెదర్ వివరాల ప్రకారం.. లీడ్స్లో శనివారం ఉదయం ఎండ కాస్తుంది. 28-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.అయితే, 25 శాతం మేర వర్షం కురిసేందుకు కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశాలు 86 శాతం ఉన్నాయి. 31 శాతం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేందుకు ఛాన్స్ ఉంది. టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆటలో రెండో, మూడో సెషన్లో వర్షం పడే ఛాన్సులు 77 శాతం ఉన్నాయి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడుతున్నాయి. టెండుల్కర్-ఆండర్సన్ (Tendulkar-Anderson Trophy) ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ క్రమంలో శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు మొదలైంది.ఇరగదీసిన భారత బ్యాటర్లుటాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. గిల్ సేనను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమై ఈ మేరకు అతడు తీసుకున్న నిర్ణయం భారత్కు కలిసి వచ్చింది. తొలి రోజు పొడిగా ఉన్న పిచ్పై టీమిండియా స్టార్లు బ్యాట్తో ఇరగదీశారు.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) ఫర్వాలేదనిపించగా.. యశస్వి జైస్వాల్ (101) సెంచరీతో చెలరేగాడు. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 127 పరుగులతో అజేయంగా ఉండగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకం (65*) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. గిల్, పంత్ క్రీజులో ఉన్నారు.వరుణుడు అడ్డుపడతాడా?అయితే, రెండో రోజు ఆటలో వీరు మరింత చెలరేగితే చూడాలని ఆశపడుతున్న అభిమానులకు వరుణుడు షాకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలిరోజు కూడా ఇదే తరహా హెచ్చరికలు కాగా.. ఆట సజావుగానే సాగింది. ఇక మొదటి రోజు టీమిండియా అభిమానులను నిరాశపరిచిన అంశం ఏదైనా ఉందంటే.. అది సాయి సుదర్శన్ డకౌట్ మాత్రమే.అదొక్కటే నిరాశఇంగ్లండ్ గడ్డ మీద ఈ తమిళనాడు బ్యాటర్ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 24 ఏళ్ల సాయి భారత్ తరఫున టెస్టు ఆడిన 317వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అతనికి టెస్టు క్యాప్ను అందించాడు. అయితే, దురదృష్టవశాత్తూ కెరీర్ తొలి ఇన్నింగ్స్ అతనికి కలిసి రాలేదు. నాలుగు బంతులే ఎదుర్కొన్న అతను ‘సున్నా’కే వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టు అరంగేట్రానికి ముందు సాయి భారత్ తరఫున 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్

అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్కు పంత్ వార్నింగ్.. వైరల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్తో చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.భారీ భాగస్వామ్యాలుజైసూ 101 పరుగులు సాధించి.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జైస్వాల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42)తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్తో కలిసి మూడో వికెట్కు 129 పరుగులు జతచేశాడు.అనంతరం గిల్కు తోడైన పంత్ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్ ఎంపిక విషయంలో గిల్కు పంత్ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సంధించిన ఫుల్లర్ బాల్ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు.అలా అయితే అవుట్ అయిపోతావు!ఆ సమయంలో నాన్- స్ట్రైకర్ ఎండ్లో ఉన్న పంత్.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్ స్టంప్లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.కాగా ఇంగ్లండ్తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్తో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్.. అతడికి డిప్యూటీగా రిషభ్ పంత్ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), లార్డ్స్ (లండన్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ (మాంచెస్టర్), కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు👉షెడ్యూల్: జూన్ 20- 24👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్Warning: When @RishabhPant17's on strike, expect some advice and plenty of chatter between the wickets! 😜🎙️Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/v53iqPg8cm— Star Sports (@StarSportsIndia) June 20, 2025

ఆరోజు ముగ్గురం సెంచరీలు చేశామన్న సచిన్.. గంగూలీ రిప్లై ఇదే
ఇంగ్లండ్ (Ind vs Eng Tests)తో టెస్టు సిరీస్ ప్రయాణంలో టీమిండియా శుభారంభం అందుకుంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో.. శుక్రవారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గిల్ సేన.. 85 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు సాధించి పట్టు బిగించింది.ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) రాణించగా.. యశస్వి జైస్వాల్ (101) శతకంతో చెలరేగాడు. ఇక టీమిండియా టెస్టు సారథిగా తొలి మ్యాచ్లో శుబ్మన్ గిల్ కూడా అద్భుత సెంచరీతో మెరిశాడు. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి గిల్ 127 పరుగులతో క్రీజులో ఉండగా.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) 65 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లో మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా ప్రదర్శనపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, జైస్వాల్, గిల్, పంత్లను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. ఇక అద్భుతమైన శతకాలు బాదిన జైస్వాల్, శుబ్మన్ గిల్లకు శుభాకాంక్షలు. రిషభ్ పంత్ కూడా వీరితో సమానంగా తన వంతు పని పూర్తి చేశాడు.ఈరోజు టీమిండియా బ్యాటింగ్ను చూస్తుంటే.. నాకు 2002లో హెడింగ్లీలో.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, నేను తొలి ఇన్నింగ్స్లో శతకాలు బాదడం గుర్తుకువచ్చింది. ఆ టెస్టులో మేము గెలిచాము.ఈరోజు.. యశస్వి, శుబ్మన్ తమ పని పూర్తి చేశారు. ఇక మూడో సెంచూరియన్ ఎవరు అవుతారో చూడాలి’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘హాయ్ చాంప్.. ఈసారి నలుగురు సెంచరీలు చేస్తారేమో.. పిచ్ బాగుంది.. పంత్.. కరుణ్ కూడా శతకాలు బాదుతారేమో!అయితే, 2002 నాడు తొలి రోజు పిచ్ స్వభావానికి ఇప్పటి వికెట్కు కాస్త తేడా ఉంది’’ అని బదులిచ్చాడు. కాగా 2002లో ఇదే వేదికపై సచిన్ టెండుల్కర్ గంగూలీతో కలిసి 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక టెండుల్కర్ 303 బంతుల్లో 193 పరుగులు సాధించగా.. గంగూలీ 128 రన్స్ స్కోరు చేశాడు. అదే విధంగా.. ‘వాల్’ రాహుల్ ద్రవిడ్ 148 పరుగులు చేయగా.. అప్పటి ఓపెనర్ సంజయ్ బంగర్ 68 రన్స్ రాబట్టాడు.కాగా ఇప్పటి వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. తాజాగా దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇక దఫా పర్యటనలో భారత్ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పిన తర్వాత.. టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. రోహిత్ స్థానంలో టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు ఈ సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది.Tendulkar at Leeds, 2002pic.twitter.com/o7MlA5Zn3L— Cricketopia (@CricketopiaCom) June 20, 2025 చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
బిజినెస్

61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదనఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే లింక్ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్టెల్ ఈ సైట్ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్అప్ మెసేజ్ వస్తుంది.

నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన
ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్ ఆంత్రప్రెన్యూర్గా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపార సామ్రాజ్య పునాదికి దారితీసిన అంశాల గురించి, తండ్రి సురేష్ ఒబెరాయ్ చిన్నతనం నుంచే తనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎలా నేర్పించారో చెప్పారు.దుబాయ్ ప్రాపర్టీ ఇన్సైడర్ పాడ్కాస్ట్లో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ‘వ్యాపార మెలకువలు నేర్చుకునే తొలినాళ్లలో నాలో ఆర్థిక అవగాహన పెంపొందించిన ఘనత నా తండ్రికే దక్కుతుంది. అతను ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి నేను దాన్ని ఎలా విక్రయించబోతున్నాననే దానిపై వ్యాపార ప్రణాళికను రూపొందించమని అడిగేవారు. దాంతో నేను 10 ఏళ్ల వయసు నుంచే వ్యాపారంలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా తండ్రి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను ధనవంతుడినని.. మేము కాదనే చెబుతుండేవారు. మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోమన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..‘ఈ కఠినమైన ప్రేమతో కూడిన విధానం టీనేజ్ నుంచే నన్ను తోటివారి కంటే భిన్నంగా ఆలోచించేలా చేసింది. చాలా మంది టీనేజర్లు స్కూళ్లలోని పాఠాలు నేర్చుకుంటుంటే.. నేను మాత్రం మార్కెట్, వ్యాపారం, స్టాక్స్.. వంటి ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. దాంతో నా మొదటి కంపెనీ కోసం 3 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాతి కాలంలో నా పెట్టుబడిదారుల కోసం చాలా డబ్బు సంపాదించాను. నా 23 ఏళ్ల వయసులో ఆ కంపెనీని విక్రయించాను. తర్వాత ఇతర కంపెనీలను కొనుగోలు చేశాను. ప్రస్తుతం తొమ్మిది సంస్థలను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లగలిగాను. మరో నాలుగు కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని యోచిస్తున్నాను’ అని తెలిపారు.

40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..
పని ఒత్తిడి పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది. అలా అని ముందే ఉద్యోగం మానేస్తే ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయనే భయాలున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు సరైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుని, దాన్ని పాటిస్తే 40 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చాలా మంది తమ కెరియర్ పీక్కు చేరుకున్నప్పుడు 40 ఏళ్లలో పనిచేయడం మానేసి మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. బాస్లు ఉండరు.. సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీస్కు వెళ్లాలా అనే బెంగా ఉండదు.. వీకెండ్ కోసం ఎదురుచూడటం అవసరం లేదు. అయితే నిజంగా 40 సంవత్సరాల వయసులో ఉద్యోగం మానేసి జీవితాంతం సౌకర్యవంతంగా జీవించవచ్చా? అనే అనుమానం ఉందా. అయితే కింది విషయాలు తెలుసుకోవాల్సిందే.40 ఏళ్లకే రిటైర్ కావడం సాధ్యమేనా?కొంతమంది ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధ్యమే. కానీ చాలా సవాలుతో కూడుకున్నది. ముందే రిటైర్ అవ్వడాన్ని ప్రధానంగా.. మీరు ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నారు.. కాలక్రమేణా మీ పెట్టుబడులు ఎలా పెరుగుతాయి.. అనే అంశాలు కీలకంగా మారుతాయి. 20-25 ఏళ్ల వయసు ఉన్నవారు 40 ఏళ్లకు రిటైర్ కావాలనుకుంటే ఆదాయంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రస్తుత వార్షిక ఖర్చులకు 79 రెట్లు పొదుపు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?ఫిన్నోవేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నేహాల్ మోటా మాట్లాడుతూ.. ‘40ల్లో రిటైర్ అవ్వడం సాధ్యమే. కానీ అధిక ఆర్థిక క్రమశిక్షణ, పక్కా ప్రణాళిక ఉండాలి. ఎక్కువ సంపాదించడంపైనే కాకుండా, అధికంగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. మధ్యతరగతి వేతనం పొందుతున్న వారు కూడా తమ ఆదాయంలో 50 శాతానికి పైగా పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెడితే త్వరగానే రిటైర్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలి?ఉదాహరణకు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న వ్యక్తిని తీసుకుందాం. నెలకు రూ.50,000 ఖర్చులు ఉన్నాయనుకుంటే 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల పదవీ విరమణలో మంచి కార్పస్ రావాలంటే నెలకు రూ.18,080 ఆదా చేయాల్సి ఉంటుంది. 20-25 ఏళ్ల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటే తాను నెలకు రూ.35000 వేతనంతో ఉద్యోగం సాధించినప్పటి నుంచి నెలవారీ ఆదాయంలో 60-70% లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేయాలి. అంటే దాదాపు నెలకు రూ.20,000 పొదుపు చేయాలి. ఉద్యోగం వచ్చి, పెళ్లి కావాడానికి ముందు పొదుపును మరింత పెంచాలి. ఈ మొత్తాన్ని 20-25 ఏళ్ల కాలానికి 10-12 శాతం వార్షిక రాబడి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. కాలక్రమేణా ఇది 40-45 ఏళ్ల వయసు నాటికి రూ.2–2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుంది.

జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
చంద్రుడిపై ఇటీవల కుప్పకూలిన జపాన్కు చెందిన హకుటో-ఆర్2 లూనార్ ల్యాండర్ శకలాలను అంతరిక్ష ఔత్సాహికుడు షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి సుబ్రమణియన్ ఈమేరకు ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. అయితే దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ధ్రువీకరించాల్సి ఉంది.చంద్రయాన్-2 ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) తీసిన చిత్రాలను ఉపయోగించి సుబ్రమణియన్ జపాన్ వ్యోమనౌక హకుటో-ఆర్2 శకలాలను గుర్తించినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో కమ్యునికేషన్ కోల్పోవడంతో అది ఎక్కడ క్రాష్ ల్యాండ్ అయిందనే వివరాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ల్యాండర్ చంద్రుడి ఉత్తరార్ధగోళంలోని శీతల ప్రదేశంలో ల్యాండ్ అవుతుండగా టోక్యోలోని మిషన్ కంట్రోల్ స్పేస్ క్రాఫ్ట్తో కమ్యూనికేషన్లు, టెలిమెట్రీ సంబంధాలను కోల్పోయింది.భారత్ 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతుండగా అందులో అమర్చిన ఓహెచ్ఆర్సీ ద్వారా జపాన్ లూనార్ ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని విశ్లేషించారు. ఆ సైటును గుర్తించడానికి అవసరమైన కీలకమైన డేటాను చంద్రయాన్ 2 అందించింది. అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు తెలిసింది. అయితే దీన్ని ఇస్రో ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్ఎవరీ సుబ్రమణియన్?షణ్ముగ సుబ్రమణియన్ చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో ఈయన చంద్రుడి పరిస్థితులను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాల్సి ఉండగా, కమ్యునికేషన్లో అంతరాయం ఏర్పడి క్రాష్ ల్యాండ్ అయింది. అయితే కాలంపాటు ఆ ల్యాండర్ ఎక్కడ కూలిందో సరైన వివరాలు లభించలేదు. ముందుగా సుబ్రమణియన్ చంద్రుడిపై పరిస్థితులను, చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఇస్రో ధ్రువీకరించింది.
ఫ్యామిలీ

జీ 7 ప్రముఖులకు పీఎం మోదీ అపురూపమైన బహుమతులు
భువనేశ్వర్: కెనడాలో జరిగిన జీ–7 సమ్మిట్లో పాల్గొనేందుకు హాజరైన ప్రముఖులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అద్భుతమైన రాష్ట్ర కళాకృతుల్ని బహుమానంగా అందజేశారు.జీ–7 సదస్సులో పాల్గొన్న కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్కు ప్రధాన మంత్రి వెండి తీగల అల్లిక క్లచ్ పర్స్ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రంలో కటక్ అందమైన వెండి తీగల సంప్రదాయ అల్లిక చేతి పనులకు (తారొకొసి) ప్రసిద్ధి. ఈ అపురూప కళ 500 సంవత్సరాలు పైబడిన ప్రాచీనమైనది. ఆనాటి మొఘల్ చక్రవర్తుల ఆదరణతో వెలుగొందిన కళ నేటికి నిలకడగా తళుక్కుమంటోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్కు ప్రపంచ ప్రఖ్యాత 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయం కాల చక్రం కానుకగా సమరి్పంచారు. ఇసుక రాయితో రూపుదిద్దుకోన్న కోణార్కు చక్రం ప్రతిరూపం రాష్ట్ర శిల్ప కళా నైపుణ్యాన్ని జీ 7 దేశాల్లో ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేశారు. సూర్య రశ్మి ఆధారంగా సమయం సూచించే రీతిలో ఈ చక్రంలో ఊచల్ని శిల్పులు చెక్కు చెదరకుండా పొందుపరచడం విశేషం. ఇది అంతులేని కాల చక్రాన్ని చూపుతుంది. పూరీ జిల్లా కళా గ్రామం రఘురాజపూర్ ప్రాంతపు పొట్టా చిత్రాన్ని క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్కు ప్రధాన మంత్రి బహుమతిగా సమర్పించారు. పొట్టా చిత్రం రాష్ట్రానికి చెందిన అందమైన సంప్రదాయ కళారూపం. ఇది వస్త్రంపై వివరణాత్మక, రంగురంగుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ చిత్రాలు పొట్టా (వస్త్రం), చిత్ర (చిత్రం)గా పేరొందాయి. సాధారణంగా భారతీయ పౌరాణిక గాథల శీర్షికల ఇతివృత్తంగా అర చేతిలో ఇమిడే అతి చిన్న చిత్రాలు మొదలుకొని సువిశాల పటాలు రూపొందించడంరఘురాజపూర్ కళాకారుల ప్రత్యేకతని జీ 7 ప్రతినిధులకు ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేయించడం విశేషం.

రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
భువనేశ్వర్: అదృష్టవశాత్తూ, దిఘా నదీముఖద్వారంలోకి అడుగుపెట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే 29 అరుదైన ,అత్యంత విలువైన 'తెలియా భోలా' చేపలను పట్టుకుని మిలియనీర్ అయ్యాడు.వేట కోసం విసిరిన వలలో ఔషధీయ విలువలతో నిండిన చేపలు చిక్కడంతో అతడి దశ తిరిగింది. దిఘా నదీ ముఖద్వారం పరిసరాలలో నానీ గోపాల్ ట్రాలరు నుంచి పన్నిన వలలో తెలియా భోలా చేపలు పడ్డాయి. ఒకేసారి 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చింది. దెబ్బకి లక్షాధికారి అయిపోయాడు.#WATCH | Balasore: Fisherman catches 29 Telia Bhola fish, sells for Rs 33 lakh and becomes a millionaire overnight.#Odisha pic.twitter.com/vr6TQUncrd— Kalinga TV (@Kalingatv) June 19, 2025 ఒక్కో చేప 20 కిలోలు పైబడి బరువు తూగింది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు ఈ చేపలు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలను ఔషధీయ విలువల కారణంగా తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడతారు. ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..!

ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

WE Reach వినూత్నంగా వీ రీచ్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని వెలికితీయడం, దానిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నగరంలోని ‘వీ హబ్’ (ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) మరో సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా వ్యాపారం నిర్వహించాలనుకునే మహిళల స్టార్టప్ ప్రయాణానికి దోహదపడే ప్రీ–ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ‘వీ రీచ్’ గురువారం హబ్ వేదికగా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరి చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీ రీచ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార ఔత్సాహికులైన మహిళలకు ఈ ఆధునిక వ్యవస్థకు అనుగుణంగా విభిన్న అంశాల్లో అవగాహన కల్పించనున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా టైర్–2, టైర్–3 ప్రాంతాల్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ బూట్ క్యాంప్ల ద్వారా 120 మంది మహిళలను ఎంపిక చేసి పారిశ్రామికవేత్తలుగా రెండు బ్యాచ్లుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వ్యాపార ఆలోచనకు అంకుర దశ నుంచీ వ్యాపారం స్థాపించే దశ వరకూ సమగ్ర మద్దతు అందించేందుకు రూపొందించారు. ఇందులో బిజినెస్ స్కిల్స్పై శిక్షణ, ఆర్థిక–డిజిటల్ లిటరసీ, మెంటార్íÙప్, ఎక్స్పోజర్ విజిట్లు, ఎమ్ఎస్ఎమ్ఈ ఫార్మలైజేషన్కు అవసరమైన సహకారాన్ని అందించడం వంటి కార్యక్రమాలుంటాయి. వీటివల్ల మహిళలు తమ సొంత వ్యాపారాన్ని స్థాపించి దాన్ని స్థిరంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు పొందుతారు. ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!దీర్ఘకాలిక మార్పుకు నాంది.. వీ రీచ్వీ రీచ్ కార్యక్రమ ప్రారభోతవం సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కలిగించడం, వారి సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. ‘వీ రీచ్’ వంటి కార్యక్రమాలు మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడమే కాకుండా, సమాజంలో దీర్ఘకాలిక మార్పుని తీసుకురాగల సామర్థ్యం కలవని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి సహకార కార్యక్రమాలు పెరగాల్సిన అవసరముందన్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరోవీహబ్ సీఈఓ సీత పల్లచొల్ల మాట్లాడుతూ.. ఈ మూడు నెలల ప్రోగ్రాంలో వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకున్న మహిళలు అవసరమైన బిజినెస్ రిజి్రస్టేషన్లు సమకూర్చుకొని తమ వ్యాపార యూనిట్లను లాంఛనప్రాయంగా ప్రారంభించి ఆర్థిక పరిపుష్టి వైపు బాటలు వేస్తారని పేర్కొన్నారు. వీ హబ్ దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటి ఇంక్యుబేటర్, నోడల్ సంస్థ అని అన్నారు.
ఫొటోలు
అంతర్జాతీయం

1,600 కోట్ల పాస్వర్డ్లు చోరీ!
వాషింగ్టన్: నేటి ఇంటర్నెట్ యుగంలో డేటా లీకేజీ సర్వసాధారణంగా మారిపోయింది. నెటిజన్ల గోప్య తకు భంగం కలుగుతోంది. వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అతిపెద్ద డేటా లీకేజీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలోనే 1,600 కోట్ల పాస్వర్డ్లు లీౖకైనట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ సంస్థలు వెల్లడించాయి. ఇది ఇంటర్నెట్ చరిత్రలో అతిపెద్ద డేటా లీకేజీ ఘటన అని తెలియజేశాయి. ఆపిల్, ఫేస్బుక్, గూగుల్, టెలిగ్రామ్తోపాటు ప్రభుత్వ వెబ్సైట్ల యూజర్ల లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చేరినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలు ఉపయోగించేవారి వివరాలు సైతం బయటకు లీౖకైనట్లు వెల్లడించాయి. రహస్యంగా ఉండాల్సిన పాస్వర్డ్లు పరులు చేతికి చేరుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్ స్కామ్లు, అకౌంట్ హ్యాకింగ్ వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతు న్నారు. సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలిచే మాల్ వేర్ను కంప్యూటర్లు, ఫోన్లలోకి పంపించి పాస్వర్డ్లు చోరీ చేస్తున్నారని చెప్పారు. డేటా లీకేజీ వెనుక అంతర్జాతీయ ముఠాల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా పనిచేస్తూ వ్యక్తుల రహస్య సమాచారాన్ని కొల్లగొట్టి, వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

పోటాపోటీగా దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్ యొనా యాహవ్ చెప్పారు. రెహోవోట్లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్ పట్టణంలో షెల్టర్లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ టెహ్రాన్లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్ మిస్సైల్ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇయాల్ జమీర్ చెప్పారు. ఇరాన్ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్లో హెబ్బొల్లా, యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్ సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కొత్తగా ఇరాన్తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్ అవీవ్లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. ఇరాన్లోని బ్యాంక్ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్వేర్లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్ నేతలుస్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్ యూనియన్ విదేశీవిధానాల చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

క్షమాపణలు చెప్పిన బ్యూటీఫుల్ ప్రధాని
థాయ్లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(38)కు అధికారం చేపట్టిన పది నెలలకే పదవీగండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడం.. ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.థాయ్లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా((Thailand PM Paetongtarn Shinawatra). గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.కాల్ సంభాషణ బయటకు..థాయ్లాండ్ (Thailand)కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్(Hun Sen)కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ (Lt. Gen. Boonsin Padklangను ఉద్దేశించి) తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్థాయ్ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ(500 సభ్యులన్న పార్లమెంట్లో 254 సభ్యుల మద్దతు) మాత్రమే మిగిలింది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా.. మరో మిత్రపక్షం వైదొలిగినా.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.చేతులు జోడించి..ఈలోపు ఈ బ్యూటీఫుల్ ప్రధాని డ్యామేజ్ కంట్రోల్కి దిగారు. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. నా ఉద్దేశం శాంతిని నెలకొల్పడమే. ఇకపై హున్ సేన్తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని తేల్చి చెప్పారామె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారామె. ఈ క్షమాపణ థాయ్లాండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా చూడాలి.

హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్ఎన్జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా
జాతీయం

ఆ తీర్పు న్యాయ చరిత్రలోనే మాయనిమచ్చ
న్యూఢిల్లీ: యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నకాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన తీర్పు ప్రపంచ న్యాయచరిత్రలోనే మాయనిమచ్చ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభివర్ణించారు. దేశంలో అత్యయిక స్థితి విధించి ఈనెల 25వ తేదీతో 50 ఏళ్లుపూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరుపునున్న నేపథ్యంలో ధన్ఖడ్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ఎమర్జెన్సీకాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీరి్పచ్చిన సుప్రీంకోర్టును ధన్ఖడ్ తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులనుద్దేశించి ధన్ఖడ్ ప్రసంగించారు. ఈ వివరాలను ఉపరాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మంత్రిమండలి అభిప్రాయాలకు వీసమెత్తయినా విలువ ఇవ్వకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ఫక్రుదీద్న్ అలీ అహ్మద్ ఆమోదముద్ర వేశారు. కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు. రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలున్నాయి. ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు, సూచనలు చేయొచ్చు. కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరా గాంధీ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని విపరిణామాలను వెంటనే దేశం చవిచూసింది. ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షకుపైగా పౌరులను ప్రభుత్వం కటకటాల వెనక్కు నెట్టింది’’అని ధన్ఖడ్ గుర్తుచేశారు.న్యాయస్థానం పాత్ర దారుణం ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు అమలుకాకుండా ప్ర భుత్వం అడ్డుకుంది. అలాంటప్పుడు జ నం న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తారు. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా తొమ్మిది హైకోర్టులు ఎమర్జెన్సీ విధించినా, విధించకపోయినా ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయని చరిత్రాత్మక తీ ర్పులు ఇచ్చాయి. కానీ ఆ తీర్పులను కొట్టే స్తూ సుప్రీంకోర్టు అత్యంత ప్రజాస్వామికవ్యతిరేక తీర్పును వెలువర్చింది. ఇది నిజ ంగా ప్రపంచం న్యాయచరిత్రలోనే చీకటిపేజీ. ఎమర్జెన్సీ అమల్లో ఉంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండబోమని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం, అధికారవాదం దేశంలో తిష్టవేశాయి. కోర్టుల్లో న్యాయం దక్కుతుందని భావిస్తున్న ప్రపంచం ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైంది. ఎంతకాలం ఎమర్జెన్సీ కొనసాగాలో అంతకాలం అది అమల్లోఉండేలా పాలకులు ఆశించిందే చివరకు జరిగింది’’అని ధన్ఖడ్ అన్నారు. ఈ పరిణామాల దృష్ట్యానే నేటి ప్రభుత్వం జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరపాలని సముచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీదాకా ఎమర్జెన్సీ అమల్లో ఉంది.

చిన్నారుల పాటకు రాష్ట్రపతి ముర్ము కంటతడి
న్యూఢిల్లీ: చిన్నారుల పాట విని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కరిగిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము శుక్రవారం 67వ బర్త్డే జరుపుకున్నారు. డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్కు వెళ్లిన ఆమెకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంధులైన చిన్నారులు రాష్ట్రపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పాట ఆలపించారు. ‘ఈ రోజులు మళ్లీ మళ్లీ రావాలి, నా హృదయం మళ్లీ మళ్లీ పాడాలి, మీరు వెయ్యేళ్లు జీవించాలి, ఇదే నా కోరిక, హ్యాపీ బర్త్ డే టూ యూ.. (బార్ బార్ దిన్ ఏ ఆయే, బార్ బార్ దిల్ యే గాయే, తు జియో హజారోం సాల్, యే మేరీ హై ఆర్జూ...)అంటూ సాగిన పాట విని ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయారు. ‘వాళ్లెంతో అందంగా, హృద్యంగా పాడారు. నేనెంతో ఉద్వేగానికి లోనయ్యా. వారి పాటవిని సంతోషంతో ఉప్పొంగిపోయా. నా కళ్ల వెంట నీళ్లు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి’అని ఆమె పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ముర్ముకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసించారు. ఒడిశాలోని మయూర్భంజ్లో 1958 జూన్ 20వ తేదీన ముర్ము జన్మించారు. దేశానికి 15వ రాష్ట్రపతిగా 2022 జూలై 25న బాధ్యతలు చేపట్టారు.

మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు
చురాచంద్పూర్/బిష్ణుపూర్: మణిపూర్లో మళ్లీ అశాంతి చెలరేగింది. గురువారం చురాచంద్పూర్ జిల్లాలోని చింగ్ఫీ గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కుకీ వర్గానికి చెందిన ఒక మహిళ మరణించింది. ఆ తర్వాత బిష్ణుపూర్ జిల్లాలోని ఫుబాలా గ్రామంలో కాల్పుల్లో ఒక మైతేయి రైతు గాయపడ్డాడు. ఈ సంఘటనలతో ఈ ప్రాంతంలో మళ్లీ జాతుల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఇరువర్గాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. పోలీసులు, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు బిష్ణుపూర్–చురాచంద్పూర్ సరిహద్దులో ఉన్న లోతట్టు గ్రామమైన ఫుబాలా వద్ద సాయుధులు కాల్పులు జరిపారు. పక్కనే ఉన్న కొండలలో నుంచి పొలాల్లో పనిచేస్తున్న రైతులపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. మైతేయి రైతు 60 ఏళ్ల నింగ్తౌజామ్ బిరెన్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడి తరువాత, భద్రతా దళాలు సమీపంలోని చింగ్ఫీ గ్రామంలో ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో అను మానిత ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగా యి. ఈ కాల్పుల్లో చురాచంద్పూర్లోని లాంగ్చింగ్మాన్బి గ్రామ అధిపతి ఖైఖోగిన్ హవోకిప్ భార్య హోయిఖోల్హింగ్ హవోకిప్ బుల్లెట్ తగిలి మరణించింది.

స్కూటీకి రూ. లక్ష... నంబర్కు రూ.14 లక్షలు
సిమ్లా: బైక్ లేదా కారు.. వాహనం ఏది కొ న్నా, రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకుంటాం. ఏదైతే ఏముందిలే? అని కొందరనుకుంటే.. ఇష్టమైన నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేయాలనుకుంటారు మరికొందరు. ఈ కోవలోకే వస్తాడు హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఈ వ్యక్తి. లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీకి వీఐపీ నంబర్ హెచ్పీ21సీ–0001 కోసం ఏకంగా రూ.14 లక్షలు చెల్లించాడు. ఆ నంబర్ కోసం వేలంలో ఇద్దరే పాల్గొనడం గమనార్హం. సోలన్ జిల్లాలోని బడ్డీకి చెందిన ఓ వ్యక్తి రూ.13.5 లక్షలు పాడగా.. హమీర్పూర్కు చెందిన సంజీవ్ కుమార్ అతని కంటే ఎక్కువగా రూ.14 లక్షలకు ఆ నంబర్ను కైవసం చేసుకున్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇదే. తనకు ప్రత్యేకమైన నంబర్లను సేకరించడం ఇష్టమని చెప్పే సంజీవ్ కుమార్.. ఫ్యాషన్ ముందు డబ్బులు లెక్క కాదంటున్నాడు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడం తప్పదని చెబుతున్నాడు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

కాలేజీ నుంచే ప్రేమ, సహ జీవనం.. గోవాకు తీసుకెళ్లి..
బనశంకరి: కన్నడిగ ప్రేమ జంట గోవా టూర్లో విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ గోవా పోలీసులు ప్రతాప్నగర వద్ద దార్బందోరా అటవీ ప్రదేశంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియున్ని అరెస్ట్ చేశారు. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలిసింది.గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ కెవిన్, రోష్ని గోవాలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. సంజయ్ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు, రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్లో పనిచేసేది. వారికి కాలేజీ రోజుల్లోనే పరిచయమై ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఇక పెళ్లాడాలని గోవా ట్రిప్కు వెళ్లారు. శనివారం రాత్రి బస్సులో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ గోవా పరిధిలోని దార్బందోరా అనే ప్రాంతంలో దిగిపోయారు. ఇద్దరూ సమీప అడవిలోకి వెళ్లారు, అక్కడ సంజయ్ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, ఆమె ఫోన్ను తీసుకుని వెళ్లిపోయాడు. ట్యాక్సీలో హుబ్లీకి చేరుకున్నాడు.బస్సు టికెట్లే క్లూ..మంగళవారం ఈ హత్య విషయం బయటపడింది. వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. రోష్ని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లు దొరకడంతో ఓ క్లూ లభించింది. పలు బస్టాండ్లలో సీసీ కెమెరాల చిత్రాలను సేకరించి ఆ జంట చిత్రాలను సంపాదించారు. అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి బుధవారం సాయంత్రం కల్లా అరెస్టు చేశారు. ఇక, బాధితురాలు స్వస్థలం హుబ్లీ అని సమాచారం.అనుమానంతో హత్య: ఎస్పీదక్షిణ గోవా ఎస్పీ తికమ్సింగ్ వర్మ మాట్లాడుతూ.. రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్ అనుమానం పెంచుకున్నాడని, హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా తీసుకున్నాడని తెలిపారు. మాయమాటలు చెప్పి ఆమెను గోవాకు తీసుకువచ్చాని చెప్పారు. ఎంతో క్లిష్టమైన కేసును ఛేదించామని తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రోష్నిని తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుని బెంగళూరుకు వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిసింది.

సాఫ్ట్వేర్ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్మెట్కు చెందిన అమృత్కు ఇచ్చి వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.