ప్రధాన వార్తలు

ఆ వ్యాఖ్యలు దుర్మార్గం
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజాకు సినీతారలు బాసటగా నిలిచారు. అసహ్యకరమైన పదాలతో విమర్శించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్పై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ తారలు రాధిక, కుష్బూ, రమ్యకృష్ణ, మీనా, నవనీత్కౌర్, కవిత డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికైనా సిద్ధమంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇది సహించరానిదిఈ వీడియో చూడగానే ఒక స్నేహితురాలిగా, ఒక మహిళగా చాలా బాధ పడ్డాను. ఓ వైపు దేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా, ఇంకా మహిళలను కించ పరచడం, అక్రమ రవాణా, గృహ హింస, బహిరంగంగా తిట్టడం రోజూ జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ మాజీ మంత్రి తనయుడు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ఈ విధంగా తిట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానిది. ఈ సమయంలో కుల, మతాలకు అతీతంగా మగ, ఆడ అని తేడా లేకుండా అందరూ ఒక్కటై రోజాకు అండగా నిలబడాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో తక్షణం కలుగ చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. భారతమాతాకు జై అనే దేశంలో ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – రమ్యకృష్ణ నీకు పెళ్లాం, సోదరి లేరా?రోజా సినిమా హీరోయిన్గా నటించింది. రాజకీయాల్లోకి వెళ్లి మంత్రిగా పని చేసింది. అలాంటి రోజాపై ఇష్టానుసారం మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలి? నీకు పెళ్లాం, సోదరి లేరా? ఒక లీడర్గా ఆడవారి గురించి ఇంత దిగజారి మాట్లాడతారా? రుజువులు ఉంటే చూపించి మాట్లాడాలి కానీ, ఇలా నీచంగా దిగజారి మాట్లాడకూ డదు. మీకు రాజకీయాలు ప్రధానం కావచ్చు.. అయితే మహిళల ఆత్మగౌరవంతో పని లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారు సిగ్గుపడేలా చర్యలు తీసుకోవాలి. – నవనీత్ కౌర్పిరికిపంద చర్య ఇదిగౌరవం అంటే ఏమిటి.. ఎదుటి వారితో ఎటువంటి భాష మాట్లాడాలి.. అని నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తో కలిసి పని చేసినప్పుడు నేర్చుకున్నాం. అటువంటి ఆయన స్థాపించిన పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడటం శోచనీయం. రోజా ఏ పార్టీలో ఉన్నా.. ఆమె ఒక మహిళ అన్న విషయం మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలను ఇంత దిగజారుస్తారనుకోలేదు. మహిళలను రాజకీయాల్లోకి రాకుండా చేసే పిరికిపంద చర్య ఇది. ఆ ఎమ్మెల్యే మాటలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. – కవితనీచంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలిరోజాకు మా అందరి మద్దతు ఉంది. ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడిన వారిపై చర్య తీసుకోవాలి.– కుష్బూ రోజాను చూసి అసూయ పడుతున్నాడురోజా గురించి మాట్లాడిన వీడియో చూశాను. చాలా చాలా కోపం తెప్పించింది. ఒక మహిళ పైకి ఎదుగుతోంది అంటే బహిరంగంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఇలాంటి మాటలకు మహిళలు భయపడి లోపల కూర్చుంటారు అనుకుంటున్నారేమో.. కాలం మారింది. మహిళలు మరింత ధృడంగా తయారయ్యారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడంటే ఆయన రోజాను చూసి ఎంత అసూయ పడుతున్నాడో తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్, ఆలోచనలు ఎంత నీచంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రోజా చాలా ధైర్యం కలిగిన మహిళ. రోజా.. నేను నీకు అండగా ఉంటాను. సుప్రీంకోర్టు తక్షణం కలుగ చేసుకొని రోజాకు న్యాయం జరిగేట్టు చూడాలి. – మీనాఇంత నీచంగా ఎలా మాట్లాడతారు?రోజాపై అంత దారుణంగా మాట్లాడటం బాధ కలిగించింది. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు దారుణం. రాజకీయాల్లోకి మహిళలు మరింత ముందుకు రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మహిళల గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు? – రాధిక– సాక్షి, అమరావతి

‘మాతో ఆటలొద్దు’: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు విరుచుకుపడ్డారు. బ్రిక్స్లోని ఆరు దేశాలకు జూలై 6న విధించిన 10శాతం అదనపు సుంకాలను మరోమారు గుర్తుచేశారు. అమెరికన్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఏ దేశానికైనా ఇలాంటి దెబ్బే ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ డాలర్ తన హోదాను కోల్పోతే అది ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఆయన ఆయన మరో మరోమారు బ్రిక్స్ దేశాలపై (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) మాటల దాడి చేశారు. ‘బ్రిక్స్’ త్వరలోనే కనుమరుగవుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమూహంలోని దేశాలపై భాగమైన 10 శాతం అదనపు సుంకం విధించడంపై గతంలో చేసిన ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. #WATCH | US President Donald Trump says, "... This (The Genius Act) is really strengthening the US Dollar and giving the Dollar a great prominence. There is a little group called BRICS, and it is fading out fast. But BRICS tried and wanted to take over the Dollar and the… pic.twitter.com/wG6GEe8OOs— ANI (@ANI) July 18, 2025తమ ‘జీనియస్ చట్టం’ అమెరికా డాలర్ను బలోపేతం చేస్తుందని, డాలర్కు మరింత ప్రాముఖ్యతను తీసుకువస్తుందన్నారు. అయితే డాలర్ ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్ అనే చిన్న సమూహం త్వరలోనే కనుమరుగుకానున్నదని ట్రంప్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలకు తాము 10శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటించగానే ఆ దేశాలవారు మర్నాడే సమావేశం నిర్వహించారని, అయినా తనను కలుసుకునేందుకు ఎవరూ రాలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదాను ఎప్పటికీ కోల్పోనివ్వమని అన్నారు. బ్రిక్స్లోని ఆరు దేశాలు తమ తీరు మార్చుకుంటే ఈ సమస్య సద్దుమణుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.బ్రిక్స్ దేశాలు గత ఏడాది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలను దాటి ఇరాన్, ఇండోనేషియాలకు సభ్యత్వాన్ని కల్పించాయి. ఇటీవల బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాధినేతలు యూఎస్ సైనిక, వాణిజ్య విధానాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆయా దేశాలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కాగా ట్రంప్ 2025, జూలై 18న జీనియస్ చట్టంపై సంతకం చేశారు. ఇది ప్రపంచ డిజిటల్ కరెన్సీ విప్లంలో కొత్త అధ్యాయమని ట్రంప్ పేర్కొన్నారు.

ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్
సాక్షి, అమరావతి : కూటమి ప్రభుత్వ అసమర్థ, రెడ్బుక్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బక్కచిక్కిపోతోంది. సంపద పెరగకపోగా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన సంపదను కూడా కూటమి సర్కారు ఆవిరి చేసేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఇందుకు నిదర్శనం అమ్మకం పన్ను రాబడులు తగ్గిపోవడమే. దీంతోపాటు రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో తగ్గిపోయాయి. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర సంపద తిరోగమనంలోనే పయనిస్తోంది. అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. ఇందుకు కాగ్ గణాంకాలు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) బడ్జెట్ గణాంకాలను కాగ్ వెల్లడించింది.» సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక సంపద సృష్టించడం దేవుడెరుగు 2023–24లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన సంపద కూడా రాకుండా ఆవిరి చేసేస్తున్నారు. అప్పులను మాత్రం భారీగా పెంచేశారు. అయినా, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు.» 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.9,873 కోట్లు (21.41 శాతం) తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. అంటే... వైఎస్ జగన్ పాలనలో 2023–24 తొలి త్రైమాసికంలో వచ్చినంత కూడా రాకపోగా ఇంకా తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా రెవెన్యూ రాబడులు ఎంతో కొంత పెరగాలి గానీ అంతకుముందు సంవత్సరాల కంటే తగ్గకూడదు. ఒకవేళ తగ్గాయి అంటే రాష్ట్ర సంపద తిరోగమనంలో ఉన్నట్టే.» అమ్మకం పన్ను రాబడి కుడా తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో అమ్మకం పన్ను రాబడి రూ.369 కోట్లు తగ్గిపోవడంతో వృద్ధి 7.78 శాతం తిరోగమనంలోకి వెళ్లింది. అమ్మకం పన్ను రాబడి తగ్గిపోతున్నదంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్లు అర్థం అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే అమ్మకం పన్నులో వృద్ధి నమోదవుతుందని లేదంటే రాబడి తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు.» కూటమి ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర గ్రాంట్లు కుడా గణనీయంగా తగ్గడం గమనార్హం. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఏకంగా రూ.14,230 కోట్లు తగ్గిపోయాయి. 90.95 శాతం మేర కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినట్లు తేలుతోంది.» బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి పన్నేతర ఆదాయంలో తరుగుదలే తప్ప పెరగడం లేదు. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2025–26 తొలి త్రైమాసికంలో పన్నేతర ఆదాయం రూ.111 కోట్లు తగ్గిపోయింది. వృద్ధి 8.06 శాతం తగ్గింది.» మరోవైపు సామాజిక రంగ వ్యయం (విద్య వైద్యం, సంక్షేమ రంగాలకు చేసేది) గతం కన్నా సాధారణంగా పెరగాలి. కానీ, వైఎస్ జగన్ సర్కారుతో పోల్చితే బాబు ప్రభుత్వంలో తగ్గిపోయింది. 2023–24 తొలి త్రైమాసికంతో పోల్చితే 2025–26 తొలి త్రైమాసికంలో రూ.7,495 కోట్లు (15.28 శాతం) తగ్గింది.» ఈ ఆర్థిక ఏడాది మూడు నెలల్లో బాబు సర్కారు ఏకంగా రూ.36,384 కోట్లు అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మూలధన వ్యయం రూ.6,053 కోట్లు మాత్రమే అని పేర్కొన్నాయి. ఇదే 2023–24 తొలి త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.12,669 కోట్లు ఉండడం విశేషం. సాధారణంగా అమ్మకం పన్నులో ఎంతో కొంత వృద్ధి ఉండాలి. అలాంటిది 2023–24 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన అమ్మకం పన్ను రాబడి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రాలేదంటే ఆందోళన కలిగించే విషయమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. » సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంపదను కూడా రాబట్టలేక ఉన్నదానిని ఆవిరి చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై భారీ అప్పుల భారం మోపుతున్నారు.

‘గుప్తా’ధిపత్యంపై గుర్రు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుటా పోలీసు శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఏకపక్ష వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న డైరెక్టర్ జనరల్(డీజీ)స్థాయి అధికారులను బుజ్జగించేందుకు ప్రభుత్వం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. అసంతృప్తితో ఉన్న డీజీలను ప్రత్యేక భేటీకి పిలిచి సర్దిచెప్పేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) విజయానంద్ చేసిన యత్నాలు ఫలించలేదు. పోలీసు శాఖతోపాటు యావత్ ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో సంచలనంగా మారిన పరిణామాలు ఇలా ఉన్నాయి.మాట్లాడుకుందాం రండి..డీజీలకు సీఎస్ పిలుపుడీజీస్థాయి ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉండటం ప్రభుత్వ పెద్దలను కలవరానికి గురి చేసింది. తమ ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారిన సీనియర్ ఐపీఎస్ అధికారులు అసంతృప్తితో సహాయనిరాకరణ చేస్తే ప్రభుత్వం అభాసుపాలవుతుందని ఆందోళన చెందింది. దాంతో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి. ఐపీఎస్ అధికారుల బదిలీలూ చేపట్టలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వానికి అవమానకరమేనని అధికారవర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసంతృప్తితో ఉన్న డీజీలను డీజీపీ హరీశ్ కుమార్గుప్తాను సమావేశపరిచి సర్దుబాటు చేయాలని ఆయన సీఎస్ కె.విజయానంద్ను ఆదేశించినట్టు సమాచారం. ఫలితంగా విజయానంద్ డీజీస్థాయి ఐపీఎస్ అధికారులకు గురువారం కబురు పంపించారు. ఓసారి సమావేశమై మాట్లాడుకుందామని చెప్పారు. డీజీపీ హరీశ్కుమార్ గుప్తా కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని అన్ని విషయాలనూ మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుందామని చెప్పారు. డీజీలు సమావేశానికి వస్తే ఏదో విధంగా వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలని ఆయన భావించారు. అన్నీ మీకు తెలుసు కదా... మేమెందుకు రావాలి...!? డీజీల తిరస్కరణ సీఎస్ ప్రతిపాదనను డీజీలు తిప్పికొట్టారు. ఈ సమావేశానికి తామెందుకు రావాలని ఎదురు ప్రశ్నించారు. అధికారిక సమావేశమా? అనధికారిక సమావేశమా? అని కూడా సూటిగా ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పలేకపోయారు. అఖిలభారత సర్వీసులకు చెందిన సీనియర్ అధికారి అయిన సీఎస్కు ప్రభుత్వ పాలన, ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంటుంది. ఆ నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రస్తుతం పోలీసు శాఖలో సాగుతున్న వ్యవహారాలు కూడా ఆయనకు తెలుసు. అంతగా సర్దుబాటు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అవకతవకలను సరిదిద్దాలని డీజీలు వ్యాఖ్యానించారు. అంతేగానీ తామంతట తాము వచ్చి తమకు జరుగుతున్న అవమానాలు, నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగుల గురించి ఎందుకు ఏకరువు పెట్టాలని ప్రశ్నించారు. రిటైర్మెంట్కు కేవలం రెండు నెలల ముందు రెగ్యులర్ డీజీపీగా హరీశ్కుమార్ గుప్తాను ఎలా నియమిస్తారని డీజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. డీజీపీగా నియమితులైన తరువాత కూడా కీలకమైన విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఆయనే చీఫ్గా ఉండటం.. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీఐడీ విభాగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని ఆ విభాగం డీజీని నామమాత్రపు పాత్రకు పరిమితం చేయడం.. అగ్నిమాపక శాఖ డీజీని బదిలీ చేసి ఆ స్థానంలో ఐజీస్థాయి అధికారిని నియమించాలని భావించడం... సీఐడీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్, అగ్నిమాపక శాఖల చీఫ్లుగా జూనియర్ అధికారులను నియమించి తానే నియంత్రించాలని యోచించడం.. ఇవన్నీ డీజీపీ గుప్తా చేస్తున్న అవకతవక పనులే కదా అని డీజీలు సూటిగానే సీఎస్తో వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత ఆ తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప .. తాము వచ్చి తమ అభ్యంతరాలు వెల్లడించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డీజీలకు లెవల్ 17 పేస్కేల్ అమలు చేయాలని తాము ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలుచేసి తీరుతామని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదే రీతిలో గుర్తింపు లేకుండా చేసి అవమానిస్తే తాము మరింత తీవ్ర నిర్ణయం తీసుకునేందుకూ వెనుకాడబోమని డీజీలు కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామం ప్రస్తుతం పోలీసు శాఖతోపాటు ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.నవమి ప.1.28 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: భరణి రా.12.17 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.10.53 నుండి 12.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.7.45 నుండి 9.14 వరకు సూర్యోదయం : 5.38, సూర్యాస్తమయం : 6.34, రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కళాకారులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.వృషభం: కొన్ని పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మిథునం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాల పరిష్కారం. ఇంట్లో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.సింహం: కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.తుల: శుభవార్తా శ్రవణం. ఇంటాబయటా అనుకూలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.వృశ్చికం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఉద్యోగయత్నాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.ధనుస్సు: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు సామాన్యస్థితి.మకరం: చేపట్టిన పనులు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. స్వల్ప అనారోగ్యం.కుంభం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి.మీనం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్ బ్యాంక్’ గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 18న అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సులో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ వృద్ధి వ్యూహానికి కీలకమని శెట్టి తెలిపారు. ఆన్–బోర్డింగ్ను సరళతరం చేయడం, ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్లాంటి కొత్త ఆవిష్కరణలతో 52 కోట్ల పైగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నామని పేర్కొన్నారు. 24/7 డిజిటల్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. ధర ఎంతంటే..కృత్రిమ మేధస్సుతో నడిచే హైపర్-పర్సనలైజ్డ్ ఆఫర్లతో బ్యాంక్ ఓమ్ని-ఛానల్ ఎంగేజ్మెంట్ మోడళ్లను రూపొందిస్తోంది. యోనో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 8.77 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ గుర్తింపు కేవలం ఎస్బీఐకి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులకు గర్వకారణమని శెట్టి తెలిపారు.

ఒక్కోసారి నేను కూడా అప్సెట్ అవుతాను: కీర్తి సురేష్
ఇంతకు ముందు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి కీర్తిసురేశ్( Keerthy Suresh ). కాగా ఎప్పుడైతే హిందీ చిత్రంలో నటించడానికి అంగీకరించిందో, అప్పటి నుంచి దక్షిణాదిలో నటించిన చిత్రాలు సక్సెస్కు దూరం అయ్యాయి. బాలీవుడ్లో నటించిన ఏకైక చిత్రం బేబిజాన్ పూర్తిగా నిరాశ పరచింది. అదే సమయంలో తన చిరకాల బాయ్ఫ్రెండ్ను పెళ్లి చేసుకుని, సంసార జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే సమీప కాలంలో కీర్తి సురేశ్ నటించిన ఉప్పు కారం చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం గురించి కీర్తి సురేశ్ చాలా ఎక్కువగానే ఊహించుకుంది. కానీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. ఆ తరువాత మరో కొత్త చిత్రంలో నటించలేదు. కమర్శియల్ చిత్రాల్లో నటించి, హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాల్లో నటించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న నటికి ఇప్పుడు అవకాశాలు లేవంటే నమ్మశక్యం కాని పరిస్థితి. కొత్తగా అవకాశాలు రావడం లేదా? లేక ఈ బ్యూటీ అంగీకరించడం లేదా? అన్నది తెలియని పరిస్థితి. అయినా కీర్తిసురేశ్ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ ‘ఒక్కోసారి నేను అప్సెట్ అవుతుంటానని, అప్పుడు ఏం చేస్తానో తెలుసా. ఫుల్గా భోజనం చేస్తాను. అలాగే కారు తీసుకుని ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లతాను. ఆ సమయంలో కారులో మంచి సంగీతం వింటాను. అలానే ఇంట్లో ఒక పెట్ కుక్కను పెంచుకుంటున్నాను. నేను అప్సెట్ అయితే దాని ముఖం చూస్తే వెంటనే అంతా మాయం అవుతుంది.’ అని కీర్తి సురేశ్ పేర్కొంది. కాగా ఈ అమ్మడు ఇంతకు ముందు నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలు రివాల్వర్ రిటా, కన్నివెడి విడుదల కావలసి ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా కీర్తిసురేశ్కు మళ్లీ క్రేజ్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఈ అమ్మడు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది.

చినుకు సిటీ అంతా వణుకు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు, మూడు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్నిచోట్ల వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు కొట్టుకు పోయాయి. నగరం నలుమూలలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.ప్యాట్నీ నగర్లో వరదలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా తరలిస్తున్న సహాయక సిబ్బందికంటోన్మెంట్, బోయిన్పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 6 సెం.మీ పైగా వర్షం కురిసింది. ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన వారు నరకయాతన పడ్డారు. రోడ్లపై మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకులు వద్ద గంటల కొద్దీ తలదాచుకున్నారు. ఎటు చూసినా వరదే.. హైదరాబాద్లోని మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద, ఎల్బీనగర్, మలక్పేట, మూసారంబాగ్, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లపై వరద వాగుల్ని తలపించింది. షేక్పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చి»ౌలి, కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, ఏఎంబీ మాల్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. టోలిచౌకి నానల్ నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లింది. పాతబస్తీలోని డబీర్పురా, శివగంగా నగర్, రాజన్న బావి, ఛత్రినాక చౌరస్తా, అచ్చయ్య నగర్, హనుమాన్ నగర్, అంబికా నగర్, పటేల్ నగర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్బస్తీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, శ్రీనగర్ కాలనీ, శ్రీకష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్, వెంకటగిరి, అమీర్పేట తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఫిలింనగర్లోని పలు బస్తీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట, తార్నాక, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో నగరం రోడ్లపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాయి. అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో ఎక్కడ చూసినా వాహనాల బారులు కిక్కిరిసిపోయి కని్పంచాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ రాయదుర్గం, షేక్పేట్ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం, బయో డైవర్సిటీ, ఐకియా జంక్షన్, గచి్చ»ౌలి పీజేఆర్ ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి, మెహదీపట్నం, టోలిచౌకి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హఫీజ్పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో కిలోమీటరు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అంబర్పేట పటేల్నగర్, ప్రేమ్నగర్, అలీకేఫ్ చౌరస్తాల్లో, బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మాదాపూర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ట్యాంక్, ఎన్ఎఫ్సీఎల్ చౌరస్తా, విరించి ఆస్పత్రి చౌరస్తా, యూసుఫ్గూడ శ్రీకష్ణానగర్ రోడ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మూసారంబాగ్ బ్రిడ్జిని వరద ముంచెత్తింది. సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్వరద ఉధృతికి సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్యాట్నీనగర్ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో నాలుగు పడవల ద్వారా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను, వివిధ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 80 మందిని బయటకు తీసుకొచ్చారు. ఫైరింజన్ ద్వారా వర్షపు నీటిని తోడారు. మొదటి. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న స్థానికులు ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం... ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపి దాదాపు 200 ఫీడర్ల పరిధిలో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్కో సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో సరఫరా పునరుద్ధరణకు కొంత అదనపు సమయం పట్టిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొయినాబాద్ మండలం నదీమ్నగర్ గ్రామంలో మైసమ్మ దేవాలయం వద్ద దాదాపు 200 ఏళ్ల వయసున్న వేప చెట్టు నేలకొరిగింది.

అమెరికా కల చెదురుతోంది..!
ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్కు చెందిన పలు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు. వీసా అపాయింట్మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్ను చెక్ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు. ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్ రావడం లేదు. కొత్తగా అప్డేట్ చేసిన స్లాట్ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలే ముద్దు అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.214(బి)తోనే సమస్య! గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్లో ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

ఈ ఒక్కటి గెలిస్తే చాలు!
లండన్: భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. నేడు ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో జరిగే రెండో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ బృందం గెలిస్తే వరుస సిరీస్లతో పండగ చేసుకోవడం ఖాయం. టాపార్డర్ సూపర్ ఫామ్, బౌలింగ్లో నిలకడ కనబరుస్తున్న టీమిండియాకు విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కానేకాదు. ఇంగ్లండ్ మాత్రం వన్డే సిరీస్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం ఆతిథ్య జట్టుకు ప్రతికూల ఫలితాలిస్తున్నాయి. గత ఓటమి నుంచి బయటపడి, కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. జోరుమీదున్న భారత్ బ్యాటర్లు, బౌలర్లు అందరు ఫామ్లో ఉండటం భారత జట్టులో సమరోత్సాహాన్ని అమాంతం పెంచుతోంది. వన్డే జట్టులోకి రాగానే ప్రతీక రావల్ సత్తా చాటుకుంది. స్మృతి, హర్లీన్ డియోల్లు కూడా మెరుగ్గానే ఆడారు. కెపె్టన్ హర్మన్ప్రీత్, రిచా ఘోష్... ఈ ఇద్దరు మాత్రమే రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. కానీ మిడిలార్డర్లో జెమీమా, దీప్తి శర్మ మ్యాచ్లను గెలిపించే ఇన్నింగ్స్ ఆడటంతో బ్యాటింగ్ మరింత పటిష్టమైంది. బౌలింగ్లో క్రాంతి, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్జోత్లు సమష్టిగా ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు. లార్డ్స్ లోనూ మరో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తే ఎంచక్కా ఇక్కడే సిరీస్ను చేజిక్కించుకోవచ్చు. ఓడితే ఇక నెగ్గలేరు మరోవైపు భారత్తో పోలిస్తే... ఆతిథ్య ఇంగ్లండ్ది భిన్నమైన పరిస్థితి. సొంతగడ్డపై ఇదివరకే టి20 సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా కోల్పోయే స్థితిలో ఉంది. ‘లార్డ్స్’ పోరులో ఓడితే ఇక సిరీస్ నెగ్గే అవకాశమే ఉండదు. ప్రధాన ప్లేయర్లంతా కీలకమైన తరుణంలో చేతులెత్తేయడం... పరుగులో వెనుకబడటం, వికెట్లు తీయడంలో అలసత్వం... ఇవన్నీ ఆతిథ్య జట్టుకు కొండంత కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి ఒత్తిడి ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్లో నిలవడం కాస్త కష్టమైన పనే! గత మ్యాచ్లో ఓపెనర్లు టామీ బ్యూమోంట్, అమీ జోన్స్ల ఘోరమైన వైఫల్యం జట్టుకు ప్రతికూలమైంది. మిడిలార్డర్లో సోఫియా డంక్లీ, అలైస్ రిచర్డ్స్ల అర్ధసెంచరీలతో జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. అయితే బౌలర్లు నిరుత్సాహపరిచే ప్రదర్శనతో లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించింది. కేట్ క్రాస్, లారెన్ బెల్, సోఫీ ఎకిల్స్టోన్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే సిరీస్లో నిలవాల్సిన ఈ మ్యాచ్లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు బాధ్యత కనబరిస్తేనే ఆశించిన ఫలితాన్ని రాబట్టొచ్చు. తుదిజట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), ప్రతీక, స్మృతి మంధాన, హర్లీన్, జెమీమా, దీప్తిశర్మ, రిచా ఘోష్, అమన్జ్యోత్, స్నేహ్ రాణా, శ్రీచరణి, క్రాంతి గౌడ్.ఇంగ్లండ్: నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), బ్యూమోంట్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, సోఫియా డంక్లీ, అలైస్ రిచర్డ్స్, సోఫీ ఎకిల్స్టోన్, చార్లీ డీన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలెర్, లారెన్ బెల్. ఇంగ్లండ్ జట్టు, ప్రతీకలపై జరిమానా భారత టాపార్డర్ బ్యాటర్ ప్రతీక రావల్ మ్యాచ్ ఫీజులో కోత విధించారు. సౌతాంప్టన్లో తొలి వన్డే సందర్భంగా 18వ ఓవర్ వేసిన లారెన్ ఫైలెర్, ఆ మరుసటి ఓవర్ వేసిన సోఫీ ఎకిల్స్టోన్తో ప్రతీక అనుచితంగా ప్రవర్తించింది. ఇది ప్లేయర్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమే అని తేల్చిన రిఫరీ ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. మరోవైపు మందకొడి బౌలింగ్ నమోదు చేసినందుకు ఇంగ్లండ్ జట్టు మొత్తానికి జరిమానా పడింది. నిర్ణీత సమయంలో కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత పెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.4 లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు వన్డేలు జరిగాయి. రెండింటిలో భారత్, మరో రెండింటిలో ఇంగ్లండ్ గెలిచాయి. ఈ మైదానంలో ఇంగ్లండ్పై భారత్ అత్యధిక స్కోరు 230 కాగా, అత్యల్ప స్కోరు 169.
హైడ్రాపై ఆగ్రహం.. కోర్టు ఆదేశాలున్నా కూల్చివేస్తారా?
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
తన్నితే తన్నారులే.. సారీ చెప్పండి!
తల్లికి వందనం కొందరికేనా?.. నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే
‘మాతో ఆటలొద్దు’: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
ప్రశాంత్ కిషోర్కు గాయం.. విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిక
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. ధర ఎంతంటే..
ఒక్కోసారి నేను కూడా అప్సెట్ అవుతాను: కీర్తి సురేష్
జెఫ్రీ ఎప్స్టీన్ స్కామ్కు ఫుల్స్టాప్ పెట్టాలి
కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి
పాముతో ఆటలు.. చివరికి ఆ పామే
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
ఇది శాంపిల్ మాత్రమే. బాగా ప్రాక్టీస్ చెయ్!
భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
'మూడేళ్లుగా గోసపడ్డ కోటన్న.. నిల్చోలేడు, కూర్చోలేడు, నడవలేడు'
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
బీసీసీఐ పెన్షన్.. సచిన్, యువీకి ఎంతంటే?
వామ్మో.. బిగ్బాస్ దివి బోల్డ్ లుక్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
'వీరమల్లు' ఈ రుద్దుడు ఎందుకు..?
పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్
ఏసీ వేయలేదని విమానంలో ఇద్దరు ప్రయాణికుల దురుసు ప్రవర్తన
ఈ ఫోటోలోని టాలీవుడ్ కమెడియన్ ఎవరో గుర్తు పట్టారా?
విశాఖ: బాయ్స్ హాస్టల్ పక్కనే లాడ్జి.. ఛీ ఛీ ఇదేం పాడుపని..
హైడ్రాపై ఆగ్రహం.. కోర్టు ఆదేశాలున్నా కూల్చివేస్తారా?
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
తన్నితే తన్నారులే.. సారీ చెప్పండి!
తల్లికి వందనం కొందరికేనా?.. నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే
‘మాతో ఆటలొద్దు’: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
ప్రశాంత్ కిషోర్కు గాయం.. విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిక
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. ధర ఎంతంటే..
ఒక్కోసారి నేను కూడా అప్సెట్ అవుతాను: కీర్తి సురేష్
జెఫ్రీ ఎప్స్టీన్ స్కామ్కు ఫుల్స్టాప్ పెట్టాలి
కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
ఇది శాంపిల్ మాత్రమే. బాగా ప్రాక్టీస్ చెయ్!
భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
'మూడేళ్లుగా గోసపడ్డ కోటన్న.. నిల్చోలేడు, కూర్చోలేడు, నడవలేడు'
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
బీసీసీఐ పెన్షన్.. సచిన్, యువీకి ఎంతంటే?
వామ్మో.. బిగ్బాస్ దివి బోల్డ్ లుక్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
'వీరమల్లు' ఈ రుద్దుడు ఎందుకు..?
పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్
ఈ ఫోటోలోని టాలీవుడ్ కమెడియన్ ఎవరో గుర్తు పట్టారా?
ఏసీ వేయలేదని విమానంలో ఇద్దరు ప్రయాణికుల దురుసు ప్రవర్తన
విశాఖ: బాయ్స్ హాస్టల్ పక్కనే లాడ్జి.. ఛీ ఛీ ఇదేం పాడుపని..
భార్యపై కానిస్టేబుల్ అత్యాచారం సహకరించిన భర్త..!
సినిమా

ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
తెలుగు ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో బిగ్బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సోనియా ఆకుల. ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటికొచ్చేసింది. బిగ్బాస్లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. ఆ తర్వాతే కొన్ని రోజులకే డిసెంబర్లో యశ్వీర్ గ్రోనితో ఏడడుగులు వేసింది. నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ.. నెల రోజుల్లోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది.ఇటీవల తిరుమలను సందర్శించిన సోనియా.. తాజాగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భం ధరించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ విషయాన్ని అందరికంటే భిన్నంగా రివీల్ చేసింది. ఓ ప్రాజెక్ట్ రూపంలో ఫైల్ పట్టుకుని మరి వచ్చి తన భర్త యశ్వీర్ గ్రోనికి ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ శుభవార్త విన్న యశ్వీర్ గ్రోని తన భార్యను హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది. View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official)

పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
నమ్రత- శిల్ప శిరోద్కర్.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్గా రాణించినవారే! హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన నమ్రత 'వంశీ', 'అంజి' చిత్రాలతో తెలుగులో హీరోయిన్గా అలరించింది. సూపర్స్టార్ మహేశ్బాబును పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. శిల్ప శిరోద్కర్ కూడా అంతే! బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'బ్రహ్మ' అనే ఏకైక చిత్రంలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత వెండితెరకు టాటా చెప్పేసి న్యూజిలాండ్లో సెటిలైంది. 2010 తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడింది.ఆ ఆలోచనే లేదుఅందుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం నేను భారత్కు తిరిగిరాలేదు. అప్పుడు నా మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కనీసం అక్క (నమ్రత)కు దగ్గరగానైనా ఉండొచ్చనే న్యూజిలాండ్ నుంచి వచ్చేశాను. మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. 2010లో ఇక్కడికి వచ్చిన నేను ఎవరినీ పని కోసం అర్థించలేదు, ఎటువంటి ఫోటోషూట్లూ చేయలేదు. పైగా ఈ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) స్టంట్ల గురించి ఏమాత్రం అవగాహన లేదు. తట్టుకోలేకపోయా..నా మనసులో ఉన్నదల్లా ఒక్కటే.. నేను ఎక్కడికీ వెళ్లను, మా అక్కకు వీలైనంత దగ్గరగా ఉండాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. నిజానికి అప్పుడు అపరేశ్ (శిల్ప భర్త) ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అనుష్క (కూతురు) స్కూలుకు వెళ్తోంది, తనకంటూ స్నేహితులను సంపాదించుకుంది. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అమ్మానాన్న ఒకరితర్వాత ఒకరు తక్కువ కాల వ్యవధిలోనే చనిపోయారు. నేను తట్టుకోలేకపోయాను. ఎప్పుడూ ఏడుస్తూనే..ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కాదు. దేనిపైనా ఆసక్తి ఉండేది కాదు. ఒక రోబోలా తయారయ్యాను. బరువు పెరిగాను, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు, ఏం చేసేదాన్నీ కాదు. కేవలం నా కూతుర్ని స్కూల్లో దింపిరావడం, స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావడం.. ఈ ఒక్కటే చేసేదాన్ని. ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఒక్కోసారి నా తలను గోడకేసి బాదుకోవాలనిపించేది. జీవితంపై విరక్తి వచ్చింది.కూతుర్ని కొట్టా..డాక్టర్ను కలిశా.. యాంటీ డిప్రెసంట్స్ మందులు వాడాను. భర్తపై, కూతురిపై అరిచేదాన్ని.. ఒక్కోసారి ఆవేశంతో కూతుర్ని కొట్టేదాన్ని కూడా! కానీ, మా అక్కతో మాత్రం బాగా మాట్లాడేదాన్ని. తను మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకునేది. తనకు దగ్గరగా ఉండాలనుకున్నాను. ఏదేమైనా ఇండియాకు వచ్చేయాలనుకున్నాను, వచ్చేశాను. నాకోసం నా భర్త న్యూజిలాండ్లో మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చాడు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే?

మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబో.. అప్పుడే లీక్ చేశారుగా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం రిలీజ్ కాలేదు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల కావొచ్చని టాక్ వినిపిస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే చిరంజీవి విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఓ సీన్ షూట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నీటిలో పడవపై మెగాస్టార్, నయనతార కూర్చుని ఉండగా.. పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట లీక్ కావడంతో హల్చల్ చేస్తోంది. కేరళలోని అలప్పుజలో చిరంజీవి, నయనతారలపై పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాను మెగా157 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు.#Nayanthara & #Chiranjeevi from #Mega157. Shooting currently happening in Kerala #ChiruAnil pic.twitter.com/mmGgfUmYpE— Nayan wings (@Nayan_Universal) July 18, 2025#Nayanthara & #Chiranjeevi from #Mega157Shooting currently happening in Kerala #ChiruAnil pic.twitter.com/9i068f1PI3— PM7 MEDIA (@PM7Media) July 18, 2025#Nayanthara angel from #ChiruAnil shooting bts pic. #Mega157 Looks alike Kerala theme marriage or song. #Chiranjeevi @NayantharaU pic.twitter.com/STzb4HAkW2— Dreamer (@remaerdkihtraK) July 18, 2025

హీరోయిన్లు ఎక్కువసేపు కనిపించొద్దట, ఐటం సాంగ్ చాలట! హీరోలపై ఫైర్
హీరోలు వారి స్వార్థం కోసం సంగీతాన్ని చంపేస్తున్నారు అంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి (Kunal Kohli). ఐటం సాంగ్స్ ఉంటే చాలని ఫీలవుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కథానాయకుల తీరును ఎండగట్టాడు. అదే సమయంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా డెబ్యూ సినిమా 'సైయారా'కి పాటల వల్లే మంచి బజ్ వస్తుండటంపై ప్రశంసలు కురిపించాడు.ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టా?'ఈ రోజుల్లో హీరోయిన్ల పాత్రలను తగ్గించడం కోసం హీరోలు సంగీతాన్ని చంపేస్తున్నారు. కేవలం ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టు పాటలని ఫీలవుతున్నారు. ఇలాంటి తరుణంలో మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. నేడు (జూలై 18న సైయారా మూవీ రిలీజ్) ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. మంచి సినిమాలు, వినసొందపైన సంగీతం తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఆల్బమ్స్కు మంచి రోజులు రానున్నాయ్.హీరోలకు హక్కు లేదుసినిమా గురించి, అందులోని పాటల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సింది హీరోలు, వారి మేనేజర్లు కాదు.. కేవలం దర్శకనిర్మాతలకు మాత్రమే ఆ హక్కు ఉంది! సరికొత్త మార్పునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అన్నాడు. బాలీవుడ్లో అనేక సినిమాలు డైరెక్ట్ చేసిన కునాల్ తెలుగులో నెక్స్ట్ ఏంటి? మూవీ తీశాడు.పాటలతోనే మంచి బజ్సైయారా మూవీ విషయానికి వస్తే ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. తనిష్క్ బగ్చి, అర్స్లన్ అబ్దుల్లా, ఫహీం నిజామి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ మూవీకి విపరీతమైన బజ్ తీసుకొచ్చింది. సంగీతంతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేసిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. All have had HIT music. Today’s heroes have killed music by wanting to reduce the role of heroines and thinking that item songs are hit songs. Tmrw is a legendary day in indian cinema. The change has begun. Good films. Good music are back. Albums. Complete albums. Filmmakers not… https://t.co/vyPNqyioZ2— kunal kohli (@kunalkohli) July 17, 2025 చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే?
న్యూస్ పాడ్కాస్ట్

రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతల మృత్యుఘోష... ఏడాదిలో 250 మందిపైగా బలవన్మరణం

తప్పుడు కేసులకు భయపడం, మేము ఎల్లప్పుడూ ప్రజాపక్షమే... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వచేస్తేనే బనకచర్లకు గోదావరి జలాలు... పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం అసాధ్యం అంటున్న సాగు నీటి రంగ నిపుణులు

70 ఏళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, కేసీఆర్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా?. బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెడ్డిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడ్ లారీ బోల్తా ఆరుగురు కూలీలు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్లో జనాన్ని కబళిస్తున్న కల్తీ మద్యం... ఒక్క ఏడాదిలోనే 5 వేల 280 కోట్ల రూపాయలు దోచేసిన టీడీపీ లిక్కర్ సిండికేట్

ఏపీ ముఖ్యమంత్రిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

రైతుకు గడ్డు కాలం.. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

ప్రపంచకప్ చెస్ క్వార్టర్ ఫైనల్లో హంపి, హారిక, వైశాలి, దివ్య
బతూమి (జార్జియా): తాడోపేడో తేల్చుకోవాల్సిన గేమ్లలో భారత చెస్ స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ముఖ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రపంచకప్ మహిళల నాకౌట్ చెస్ టోర్నీలో ఈ నలుగురూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో గురువారం నిర్ణీత రెండు గేమ్ల తర్వాత భారత క్రీడాకారిణులు తమ ప్రత్యర్థులతో 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతలను నిర్ణయించేందుకు శుక్రవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. టైబ్రేక్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన హంపి 1.5–0.5తో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)పై... హైదరాబాద్ ప్లేయర్ హారిక 2.5–1.5తో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ మాజీ చాంపియన్ కాటరీనా లాగ్నో (రష్యా)పై... తమిళనాడు గ్రాండ్మాస్టర్ వైశాలి 3.5–2.5తో మెరూర్ట్ కమలిదెనోవా (కజకిస్తాన్)పై... ప్రపంచ జూనియర్ చాంపియన్, మహారాష్ట్ర అమ్మాయి దివ్య దేశ్ముఖ్ 1.5–0.5తో ఆసియా క్రీడల చాంపియన్ జు జినెర్ (చైనా)పై విజయం సాధించారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్లో యుజిన్ సాంగ్ (చైనా)తో హంపి; దివ్య దేశ్ముఖ్తో హారిక; టాన్ జోంగీ (చైనా)తో వైశాలి తలపడతారు.

కాన్వే హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హరారే వేదికగా శుక్రవారం ఆతిథ్య జింబాబ్వే జట్టును 8 వికెట్ల తేడాతో కివీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసింది.జింబాబ్వే బ్యాటర్లలో మాధేవేరే(36) టాప్ స్కోరర్గా నిలవగా.. బెన్నట్(21) పర్వాలేదన్పించాడు. బ్లాక్క్యాప్స్ బౌలర్లలో మాట్ హెన్రీ మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీయగా.. మిల్నే, శాంట్నర్, బ్రెస్వేల్, రచిన్ రవీంద్ర తలా వికెట్ సాధించారు.కాన్వే హాఫ్ సెంచరీ.. అనంతరం 121 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(59 నాటౌట్) ఆర్ధశతకంలో మెరవగా.. రచిన్ రవీంద్ర(30), డార్లీ మిచెల్(26 నాటౌట్) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో మాపోసా, ముజర్బానీ తలా వికెట్ సాధించారు. ఈ సిరీస్లో భాగంగా జూలై 20న హరారే వేదికగా జింబాబ్వే, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

బెన్ స్టోక్స్ను చూసి గిల్ నేర్చుకోవాలి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో రెండు మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా వందకు వంద మార్క్లు కొట్టేశాడు.ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన గిల్.. 607 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్లు లేనప్పటికి గిల్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడని గోవర్ కొనియాడాడు."రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల వంటి దిగ్గజాల లేకుండా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. దీంతో అందరి దృష్టి యువ కెప్టెన్ శుబ్మన్ గిల్పైనే ఉండేది. కానీ శుబ్మన్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలి రెండు ఇన్నింగ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఒక జట్టుకు నాయకత్వం వహించడానికి 34 ఏళ్ల వయస్సు ఉండనవసరం లేదు. టాలెంట్తో పాటు సరైన టెక్నిక్ ఉంటే చాలు 24 ఏళ్లకే కెప్టెన్ అవ్వచ్చు. అని గోవర్ స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్పై కూడా గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఒక బలమైన జట్టును తాయారు చేయడం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. నాయకుడు ముందుండి జట్టును నడిపిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమైన పనికాదు. అందుకు ఊదహరణగా బెన్ స్టోక్స్ను తీసుకొవచ్చు. లార్డ్స్లో టెస్టులో స్టోక్స్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత కొన్నాళ్లగా స్టోక్స్ నుంచి ఇటువంటి ప్రదర్శనను మిస్ అయ్యాము. గంటకు 120 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం, పేస్ బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేయడం వంటి నిజంగా అద్బుతం. స్టోక్సీ నుంచి గిల్ కచ్చితంగా కొన్ని విషయాలను నేర్చుకోవాలి" గోవర్ అన్నారు.చదవండి: అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు..

అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు..
టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి మరొకరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం కానున్నారు. అతడి అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లి ప్రొఫిషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో 14 ఏళ్ల ఆర్యవీర్.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ (SDS) తరపున ఆడనున్నాడు.ఇటీవల జరిగిన డీపీఎల్ వేలంలో లక్ష రూపాయల కనీస ధరకు సౌత్ ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తన డీపీఎల్ సీజన్ కోసం ఆర్యవీర్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్ తన సహచర బ్యాటర్లకు నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్యవీర్పై సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ సర్సందీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్యవీర్కు అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."ఆర్యవీర్ కోహ్లి ఒక రైజింగ్ స్టార్. అతడికి ప్రస్తుతం 14 ఏళ్లు మాత్రమే. అతడు భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. అతడిపై కోహ్లి అనే ట్యాగ్ ఎటువంటి ఒత్తిడి తీసుకురాదు. ఎందుకంటే అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది.అతడిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంది" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్సందీప్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ వద్ద ఆర్యవీర్ శిక్షణ తీసుకున్నాడు. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ ఆకాడమీలో ఆర్యవీర్ను రాజ్కుమార్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఆడనున్నాడు. రూ. 8లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.చదవండి: అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లేVIDEO | Virat Kohli's nephew, Aryaveer Kohli, trained with "no baggage" of his famed last name in the training session of the South Delhi Superstarz ahead of the second edition of the Delhi Premier League.Budding leg-spinner Aryaveer Kohli, son of Virat's elder brother Vikas,… pic.twitter.com/HYu2U39qqJ— Press Trust of India (@PTI_News) July 17, 2025
బిజినెస్

అమెరికాతో వాణిజ్య చర్చలు.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై భారత్ ఎంతో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్న వ్యవసాయ రంగం విషయంలో అప్రమ్తతంగా ఉండాలన్నారు. భారత్లో ఈ రంగంలో సబ్సిడీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. నియంత్రణల్లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి వచ్చి పడితే అప్పుడు స్థానిక ఉత్పత్తిదారులకు సమస్యలు మొదలవుతాయన్నారు. భారత వృద్ధి 6–7 శాతం స్థాయిలో స్థిరపడిందంటూ.. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ఫలితంగా ఒక శాతం లోపు వృద్ధి ప్రభావితం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో భారత్కు అనుకూలిస్తుందన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘ఉదాహరణకు వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించొచ్చు. దీనివల్ల మన పాలు, పాల పొడి, చీజ్ తదితర ఉత్పత్తులకు అదనపు విలువ తోడవుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారు’’అని రాజన్ పేర్కొన్నారు. కనుక ఎంతో జాగ్రత్తగా, తెలివిగా చర్చలు నిర్వహించాలంటూ.. భారత అధికారులు ఈ దిశగానే సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్ ప్రస్తుతం అమెరికాలోని చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. భారత్ ముందు అవకాశాలు.. తమ దేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు రాయితీలు ఇవ్వాలంటూ అమెరికా ఎప్పటి నుంచో భారత్ను డిమాండ్ చేస్తోంది. తాజా వాణిజ్య ఒప్పందం విషయంలోనూ తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ద్వారాలు పూర్తిగా తెరవాలంటూ పట్టుబడుతోంది. కానీ, ఈ విషయంలో భారత్ సుముఖంగా లేకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం తెలిసిందే. మన దేశంలో కోట్లాది మంది పాడి, సాగు రంగంపై ఆధారపడి ఉండడంతో కేంద్ర సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెట్టుబడులు, ఎగుమతులకు నష్టం కలిగిస్తాయని రాజన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్ ముందు అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్పారు. చైనా, ఇతర ఆసియా దేశాలపై అమెరికా విధించిన టారిఫ్లు భారత్ కంటే ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించారు. కనుక కొంత వరకు తయారీ అవకాశాలు భారత్కు రావొచ్చన్నారు. కానీ, అదే సమయంలో అమెరికాకు భారత్ తయారీ ఎగుమతుల గణనీయంగా లేవంటూ.. భారత్పై విధించే టారిఫ్లు ఎలాంటివి అయినా కొంత వరకు ప్రభావం చూపించొచ్చన్నారు. భారత్పై అమెరికా 26 శాతం అదనపు టారిఫ్లను (10 శాతం బేసిక్ సుంకానికి అదనం) విధించగా.. వాణిజ్య ఒప్పందానికి వీలుగా ఆగస్ట్ 1 వరకు అమలును వాయిదా వేయడం తెలిసిందే.

రిలయన్స్ రిటైల్ చేతికి కెల్వినేటర్ బ్రాండ్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ తాజాగా ఎలక్ట్రోలక్స్ గ్రూప్ కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ కెల్వినేటర్ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 160 కోట్లు. దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం గృహోపకరణాల విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు రిలయన్స్ రిటైల్కి ఇది ఉపయోగపడనుంది. రిలయన్స్ రిటైల్ గతంలో కెల్వినేటర్ బ్రాండ్కి లైసెన్సు తీసుకుని, ఉపయోగించుకుంది. దీని కింద ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు మొదలైనవి అమ్ముడవుతున్నాయి. భారతీయ వినియోగదారులకు విశ్వసనీయమైన అంతర్జాతీయ ఉత్పత్తులను అందించేందుకు కెల్వినేటర్ కొనుగోలు తోడ్పడుతుందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ ఈషా ఎం అంబానీ ప్రకటనలో తెలిపారు. కెల్వినేటర్కు అంతర్జాతీయంగా దాదాపు శతాబ్దంపైగా చరిత్ర ఉంది. అధునాతన టెక్నాలజీ, అత్యుత్తమ పనితీరుతో 1970లు, 1980లలో భారత్లో ఐకానిక్ స్థాయిని దక్కించుకుంది. అమెరికన్ బ్రాండ్ అయినప్పటికీ పలు సంస్థల చేతులు మారి చివరికి స్వీడన్కి చెందిన ఎలక్ట్రోలక్స్ గూటికి చేరింది. ఇటీవలి సీఐఐ, ఈవై సంయుక్త నివేదిక ప్రకారం భారత కన్జూమర్ డ్యూరబుల్స్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒక టి. 2027 నాటికి అతి పెద్ద మార్కెట్లలో నా లుగో స్థానానికి చేరనుంది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3 లక్షల కోట్ల స్థాయికి చేరుతుంది. మరోవైపు, క్రిసిల్ రేటింగ్స్ ప్ర కారం 2024–25లో ఈ పరిశ్ర మ (టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెíషీన్లు) రూ. 1.17 లక్షల కోట్ల స్థాయిలో ఉంది.

రిలయన్స్ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్లో అత్యధికంగా రూ. 26,994 కోట్ల రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో సాధించిన రూ. 15,138 కోట్లతో పోలిస్తే ఇది 78 శాతం వృద్ధి. ఇందుకు ప్రధానంగా భారీగా ఇతర ఆదాయం లభించడం, పటిష్టమైన కన్జూమర్ బిజినెస్ వృద్ధి దోహదపడ్డాయి. కాగా, మొత్తం ఆదాయం 5 శాతం బలపడి రూ. 2.48 లక్షల కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ. 2.36 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో లభించిన ఇతర ఆదాయంలో రూ.8,924 కోట్ల లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ (ఏషియన్ పెయింట్స్) విక్రయం ప్రధానంగా నిలిచింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా, ప్రధాన విభాగం చమురు శుద్ధి, పెట్రోకెమికల్ (ఓటూసీ) బిజినెస్ 1.5 శాతం నీరసించింది. ముడిచమురు ధరలు క్షీణించడంవంటివి ప్రభావం చూపాయి.ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,477 వద్ద ముగిసింది.జియో ప్లాట్ఫామ్స్ జోరు నికర లాభం రూ. 7,110 కోట్లు ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్ల విభాగం.. జియో ప్లాట్ఫామ్స్ క్యూ1 నికర లాభం 25% వృద్ధితో రూ. 7,110 కోట్లను తాకింది. స్థూల ఆదాయం 19% ఎగసి రూ. 41,054 కోట్లకు చేరింది. మొబిలిటీ, హోమ్స్ విభాగంలో సబ్ర్స్కయిబర్లు పెరగడం, డిజిటల్ సరీ్వసుల బిజినెస్ బలపడటం ఇందుకు సహకరించాయి. ఈ కాలంలో 20 కోట్ల 5జీ వినియోగదారులను దాటడం, 2 కోట్ల హోమ్ కనెక్ట్స్కు చేరడం ద్వారా జియో సరికొత్త గరిష్టాలకు చేరినట్లు మాతృ సంస్థ ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 7.4 మిలియన్ సబ్స్క్రయిబర్లతో జియో ఫైబర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్డ్ వైర్లెస్ సంస్థగా అవతరించినట్లు వెల్లడించారు.రిటైల్ లాభం రూ. 3,271 కోట్లు ఆర్ఐఎల్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ1లో 28 శాతం జంప్చేసి రూ. 3,271 కోట్లను తాకింది. వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,549 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్థూల ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 84,171 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 75,615 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో కొత్తగా 388 స్టోర్లను తెరిచింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 19,592కు చేరింది. నిర్వహణ సామర్థ్యం, ప్రాంతాలవారీగా విస్తరణ, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోపై నిరంతరం దృష్టి పెట్టడంతో రిలయన్స్ రిటైల్ నిలకడైన పనితీరును చూపినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలియజేశారు.రిలయన్స్ అన్ని విభాగాలలో పటిష్ట నిర్వహణ, ఆర్థిక పనితీరుతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అంతర్జాతీయ ఆటుపోట్ల మధ్య ఏడాది క్రితంతో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఇబిటా భారీగా మెరుగుపడింది. ఇంధన మార్కెట్లలో అత్యంత అనిశి్చత పరిస్థితులున్నప్పటికీ ఓటూసీ బిజినెస్ పటిష్ట వృద్ధిని సాధించింది. జియో–బీపీ నెట్వర్క్ ద్వారా విలువ జోడింపు సొల్యూషన్లకు తెరతీశాం. తద్వారా దేశీ డిమాండును అందుకున్నాం. ఇంధనం, పెట్రో ప్రొడక్టుల మార్జిన్లు దన్నుగా నిలిచాయి. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్–ఎండీ

నీట్ ఫెయిల్.. కట్ చేస్తే రూ.72.3 లక్షల ఉద్యోగం
అనుకున్నది సాధించాలనే తపన చాలామందికి ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. దాంతో కుంగిపోక ఇతర మార్గం ఎంచుకున్నా అందులోనూ ఉన్నతస్థాయికి వెళ్లొచ్చని బెంగళూరుకు చెందిన ఓ యువతి నిరూపించారు. డాక్టర్గా స్థిరపడేందుకు రాసే నీట్ పరీక్ష కోసం కేఎస్ రితుపర్ణ ఎంతో కష్టపడ్డారు. కానీ పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ పరీక్షలో అర్హత సాధించలేకపోయారు. దాంతో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇంజినీరింగ్లో చేరారు.మంగళూరులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో చేరారు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, నైపుణ్యాలు పెంచుకున్నారు. దాంతో ఇంజినీరింగ్ ఆరో సెమిస్టర్లో ఆమె రోల్స్ రాయిస్లో ఎనిమిది నెలల ఇంటర్న్షిప్ను సాధించారు. తన ప్రతిభను గుర్తించిన కంపెనీ 2024 డిసెంబర్లో ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ను అందించింది. రోల్స్ రాయిస్ జెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో ఏడాదికి రూ.39.6 లక్షలతో కంపెనీలో చేరారు. చేరిన నాలుగు నెలల్లోనే అంటే ఏప్రిల్ 2025లో తన నైపుణ్యాలను గుర్తించిన కంపెనీ తన వేతనాన్ని రూ.72.3 లక్షలకు పెంచింది.ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావా‘నేను నీట్కు ఎంతో ప్రయత్నించాను. కానీ అర్హత సాధించలేకపోయాను. దాంతో ఇంజినీరింగ్ ఎంచుకున్నాను. రోబోటిక్స్, ఆటోమేషన్ ఇంజినీరింగ్ అంటే ఎంతో ఇష్టం. అంకితభావంతో పనిచేస్తూ, కొత్త విషయాలను నేర్చుకోవడం, నూతన ఆలోచనలను టీమ్తో పంచుకోవడం, టెక్నికల్ సమస్యలకు పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించాను’ అని రితుపర్ణ తెలిపారు. రైతులకు సహాయం చేయడానికి కాలేజీలో రోబోను తయారు చేసిన ప్రాజెక్టులో ఆమె పనిచేశారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పతకాలు సాధించారు. ఏడో సెమిస్టర్ పూర్తి చేసుకున్న తర్వాత రోల్స్ రాయిస్ టెక్సాస్ జెట్ ఇంజిన్ విభాగంలో చేరనున్నారు. 20 ఏళ్ల యువతి కంపెనీ జెట్ విభాగంలో అత్యంత పిన్న వయస్కురాలుగా రికార్డులకెక్కనుంది.
ఫ్యామిలీ

టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్
యూత్, టెక్నాలజీ అనేవి వేరు వేరు పదాలు కాదు. టెక్నాలజీని ‘జీ హుజూర్’ అనేలా చేసి సమాజహితానికి ఉపకరించే డివైజ్లను ఆవిష్కరిస్తున్నారు యువ ఇన్వెంటర్ వంద కోట్ల కంపెనీ వోనర్!పదహారు ఏళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ‘వావ్’ అనిపించింది ప్రాంజలి అవస్థీ. మూడు కోట్లతో ప్రాంరంభమైన ఈ కంపెనీ వంద కోట్ల టర్నోవర్కు చేరడం విశేషం. ఏడేళ్ల వయసులోనే కోడింగ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంజలి పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం ఫ్లోరిడాలో స్థిరపడింది. ఫ్లోరిడా యూనివర్శిటీలో ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో ప్రాంజలికి ఏఐ గురించి వివరంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మొదట్లో ఒక ఏఐ కంపెనీలో పనిచేసిన ప్రాంజలి ఆ తరువాత ‘డెల్వ్. ఏఐ’ పేరుతో సొంత స్టార్టప్ మొదలు పెట్టి విజయం సాధించింది. అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఉపయోగించడం ద్వారా ‘డెల్వ్. ఏఐ’ సంక్లిష్ట డేటా ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారుల వనరులు, ఆదాయన్ని ఆదా చేస్తుంది.అథ్లెట్ టు టెక్నో ఎక్స్పర్ట్పదకొండు సంవత్సరాల వయసులో కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ మొదలుపెట్టింది పుహబి చక్రవర్తి. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. ఆటలో విజయం సాధించడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. పోటీల సమయంలో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొన్న పుహబి ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అనే ఏఐ మోడల్కు రూపకల్పన చేసింది. చిన్నప్పటి నుంచే పుహబికి కోడింగ్ అంటే ఇష్టం. తమ స్కూల్లో నిర్వహించిన ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్’ కార్యక్రమంలో పాల్గొన్న పుహబికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మంచి అవగాహన ఏర్పడింది. ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ కార్యక్రమంలో ఎఎన్ఎన్, సీఎన్ఎన్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకుంది. ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అప్లికేషన్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, డైట్ అనే మూడు భాగాలు ఉంటాయి. ఫిజికల్ హెల్త్కు సీఎన్ఎన్, మెంటల్ హెల్త్కు ఏఎన్ఎన్, డైట్కు జనరల్ లూపింగ్ను వాడింది. ఆరోగ్యకరమైన శారీరక, మానసిక జీవనశైలి విషయంలో అథ్లెట్స్కు ‘అథ్లెటిక్స్ ఎక్స్’ బాగా ఉపయోగపడుతుంది.గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్పద్దెనిమిది సంవత్సరాల కావ్య కొప్పారపు ‘గ్లియోవిజన్’ అనే ఏఐ టూల్ను డెవలప్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ ఇమేజ్లను త్వరగా విశ్లేషించడానికి ఉపకరించే టూల్ ఇది. డయాబెటిక్ రెటినోపతిని డిటెక్ట్ చేసే స్మార్ట్ఫోన్ సిస్టమ్ను కూడా డెవలప్ చేసింది. టెక్నాలజీకి సంబంధించి అమ్మాయిలను ప్రోత్సహించడానికి ‘గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్’ అనే సంస్థను ప్రారంభించింది. హెల్త్కేర్కు ఉపకరించే ఏఐ సాధనాలపై దృష్టి పెట్టిన కావ్య టైమ్స్ ‘25 మోస్ట్ ఇన్ష్లూయెన్సల్ టీన్స్’ జాబితాలో చోటు సాధించింది.యువ ఏఐ ఉద్యమం‘ఎన్కోడ్’ అనే సంస్థకు స్నేహ రెవనర్ ఫౌండర్, ప్రెసిడెంట్. రెగ్యులేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉపకరించే యూత్ ఆర్గనైజేషన్ ఇది. అమెరికాలోని ఈ ఆర్గనైజేషన్లో వెయ్యి మంది యువతీ,యువకులు ఉన్నారు. ఏఐ పాలసీ ఇనిషియేటివ్స్కు సంబంధించి ‘ఎన్కోడ్’ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. వర్క్షాప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. టైమ్స్ ‘మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ జాబితాలో స్నేహ చోటు సాధించింది.ఆ నలుగురు... వందలాది వన్య్రపాణులను రక్షిస్తున్నారురోడ్లపై జంతువులు ప్రమాదానికి గురికాకుండా ఉండడానికి కొలరాడో (యూఎస్)లోని ‘స్టెమ్ స్కూల్ హైల్యాండ్స్’కు చెందిన నలుగురు టీనేజ్ అమ్మాయిలు ప్రాజెక్ట్ డీర్’ అనే ఏఐ–పవర్డ్ వైల్డ్లైఫ్ డిటెక్షన్ డివైజ్ను డెవలప్ చేశారు. థర్మల్ ఇమేజింగ్, ఏఐ సాంకేతికతను ఉపయోగించి పనిచేసే డివైజ్ ఇది. చీకట్లో, దట్టమైన పొగమంచు ఆవరించినప్పుడు కూడా రోడ్డుపై జంతువులను డిటెక్ట్ చేస్తుంది. ‘రోడ్డుపై జంతువుల ఉనికిని కనిపెట్టిన వెంటనే ప్రాజెక్ట్ డీర్ డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది’ అంటుంది నలుగురు ఇన్వెంటర్లలో ఒకరైన బ్రి స్కోవిల్లీ. ‘ప్రాజెక్ట్ డీర్ డివైజ్లాంటి ఆవిష్కరణ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది పూర్తిగా కొత్త’ అంటుంది మరో స్టూడెంట్ సిద్దీ సింగ్. (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్)

శంకరుని మాటల మర్మం ఇదీ.. సర్వజ్ఞుల మాటలు
అల్లుణ్ణీ, కూతుర్నీ చూసివద్దామని వెళ్ళినప్పుడు, ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించి, తగిన మర్యాదలు చేయలేదని శంకరుడిపై కోపగించిన దక్షుడు, ప్రతీకారంగా శంకరుడిని అవమానించాలనే ఆలోచనతో ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి శంకరుడిని తప్ప సకల దేవతలనూ, మునిగణాలనూ పిలిచాడు. అది తెలుసుకున్న నారదుడువెంటనే కైలాసానికి వెళ్ళి పార్వతితో, ‘అమ్మా, మీ తండ్రిగారికి ఏమైందో తెలి యడం లేదు. మీ ఇరువురనూ తప్ప మిగతా అందరినీ పిలిచి, అన్ని హంగు లతో యాగం చేస్తున్నాడు. వినడానికే నాకు బాగా అనిపించక, నీ చెవిన వేసి పోదామని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. ఇక వెళ్ళొస్తాను!’ అని చెప్పి, అగ్గి రాజేసి వెళ్ళిపోయాడు. తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని పార్వతికి మనసులో కోరిక కలిగింది. అయితే, పిలవని పేరంటానికి వెళ్ళడం ఎలాగ? కలత చెందిన మనస్సుతో, చెప్పాలా వద్దా అని సందేహిస్తూనే, విషయం శంకరుడి చెవిలో వేసింది. సతి మాటలలోని ఉద్దేశాన్ని గ్రహించిన శంకరుడు ఇలా సమాధానం చెప్పాడన్నాడు పోతన, తాను రచించిన ‘వీరభద్ర విజయం’ కావ్యం ప్రథమాశ్వాసంలో:మెచ్చని మామలిండ్లకును మేకొని శోభనవేళ బిల్వమిన్పొచ్చముగల్గుబో దగుట పోలదు నల్లుర కెజ్జగంబులంబొచ్చెము లేదు కన్యలకు బుట్టినయిండ్లకు బోవ లోకము న్మెచ్చును బొమ్ము పబ్బముకు మీతలిదండ్రుల జూడ బైదలీ!‘ తనను ఇష్టపడని మామల ఇండ్లలో జరిగే శుభ కార్యాలకు, ఆహ్వానం లేకుండా వెళ్ళడం ఏ లోకంలోని అల్లుళ్ళకైనా మర్యాద కాదు. అయితే, ఆహ్వానం లేనప్పటికీ కన్యలకు తమ పుట్టినిండ్లకు వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. లోకం మెచ్చుకుంటుంది కూడా! అందు వలన, మీ తల్లిదండ్రులను చూడటానికి నీవు వెళ్ళు!’ అలా పార్వతి పుట్టినింటికి వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. పుట్టినింట్లో జరిగిన అవమానాన్ని భరించలేక, శివుడిని మనసులో తలుచుకుని శివయోగవహ్నిని మేలుకొలిపి, ఆ ఘోరాగ్నిలో తనను తాను భస్మం చేసుకుంది. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. కనుకనే, జరగబోయేది తెలిసిన శంకరుడు పార్వతిని ‘పోయిరమ్మని’ అనకుండా, కేవలం ‘పొమ్ము పబ్బమునకు’ అని మాత్రమే అన్నాడు. సర్వజ్ఞుల మాటలు భవిష్యత్తుకు దర్పణములుగా భాసిల్లుతాయి.– భట్టు వెంకటరావు

‘నిథమ్’.. పాకశాస్త్ర రిథమ్..
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘నిథమ్’ ఔత్సాహిక వ్యాపార వేత్తలకు, పాకశాస్త్ర నిపుణులకు రిథమ్ అన్నట్లుగా గుర్తింపు పొందుతోంది.. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో భాగంగా 20 రోజుల పాటు శిక్షణ పొందిన 29 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. దీంతోపాటు వీరందరికీ ఫుడ్ ట్రక్కులను మంజూరు చేశారు.. నిథమ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 29 మందికి ట్రైనీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిషెల్లి జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో నిథమ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎంకే గణేష్ సరి్టఫికెట్లు అందజేశారు. చెఫ్ తుల్జారామ్ ఆధ్వర్యంలో గురువారం పలు రకాల ఫిష్ వంటకాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఫిష్ పకోడా, ఫిష్ 65, ఫిష్ కట్లెట్, పట్రా రి మిర్చీ, ప్రాన్స్ పలావ్, అపోలోఫిష్, ఫిష్ ఇన్ హాట్ గార్లిక్, ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ వంటి పలురకాల వంటకాలతో విందుచేశారు. చేపలతో తయారు చేసిన వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సెర్ఫ్ నిథమ్ అధికారులు వీటిని రుచిచూసి శిక్షణార్థులను అభినందించారు. ఈ సందర్భంగా చెఫ్ తుల్జారామ్ వంటకాల తయారీపై పలు సూచనలు చేశారు. ముగింపు సమావేశం నిర్వహించి శిక్షణ పొందిన వారికి సరి్టఫికెట్లు అందించారు. కార్యక్రమంలో నిథమ్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిచెల్ జే ఫ్రాన్సిస్, ఫిషరీస్ శాఖ జనరల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపాధి మార్గంగా.. మహిళలు తమకాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్్ఫ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందించాం. ఫిష్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో భాగంగా మహిళలకు ఇది ఉపాధి మార్గంగా మారిందని, మహిళలను వ్యవస్థాపకులుగా మార్చడమే లక్ష్యంగా, జీవనోపాధి పొందేలా, తద్వారా పలువురికి ఉపాధి కల్పించేలా మొబైల్ ఫిష్ ట్రక్ క్యాంటీన్లను నడిపేందుకు ప్రోత్సహిస్తున్నాం. వ్యాపార ప్రమాణాలతో పాటు పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా శిక్షణ అందించాం. – డాక్టర్ సతీష్ సెర్ఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్)

మానవత్వం.. అ 'మూల్యం'..!
మానవత్వం మంటగలిసిపోతోంది.. అమూల్యమైన సేవలకు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.. కొందరి అమాయకత్వం, అవసరం.. ఇంకొందరికి వరంగా మారుతోంది.. సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఓ వైపు యువత స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకొస్తుంటే.. మరికొందరు బాధితుల అవసరాన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు.. ఇటీవలి కాలంలో రక్తదానంపై అవగాహన పెరగడంతో చాలా మట్టుకు ఆపద సమయాల్లో అవసరం తీరుతోంది.. సరిగ్గా అదే అదునుగా కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ఆస్పత్రులకు వచ్చేవారిని టార్గెట్ చేస్తూ బాధితులకు టోకరా వేస్తున్నారు.. మానవత్వం ముసుగులో సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు..బ్లడీ చీటర్స్.. అంతేకాదు.. డబ్బు స్వాహా చేసేదే కాకుండా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో నగరంలోని గాం«దీ, ఉస్మానియా, నిమ్స్తో పాటు జాతీయ స్థాయిలో పేరొందిన పలు కార్పొరేట్ ఆస్పత్రులకు అనేక మంది బాధితులు వస్తుంటారు. సరిగ్గా వీరినే ఆసరా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. సేవ పేరుతో సమాజం తలదించుకునే మోసానికి తెరతీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని సోషల్ మీడియాల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టే విజ్ఞప్తులను క్యాష్ చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.. అమూల్యమైన వారి సమయాన్ని ధనార్జన కోసం ఫణంగా పెడుతున్నారు. క్యాబ్ చార్జీ పేరుతో..?? ‘భర్తకు అనారోగ్య కారణాలతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ నుంచి నగరంలోని పెద్దాస్పత్రికి వచ్చాం. వైద్యులు మూడు యూనిట్ల రక్తం కావాలని అడిగారు. దీంతో తెలిసిన వారి సహాయంతో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ వంటి యాప్స్లో వివరాలతో అభ్యర్థన పెట్టాం. గంట తరువాత ఎవరో ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. రక్తం ఇవ్వడానికి సిద్ధం. నాతోపాటు ఇద్దరు స్నేహితులు కూడా వస్తారు. క్యాబ్ ఖర్చులకు, రక్తదానానికి ముందు ఆహారానికి రూ.1,000 ఫోన్ పే చేయమన్నాడు. అవసరానికి రక్తం ఇవ్వడమే గొప్ప, డబ్బుదేముందిలే అని ఫోన్ పే చేశాం.. తర్వాత ఎంతకీ రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది’ అని బాధితురాలు రాజమణి వాపోతున్నారు. ఇది ఒక్క రాజమణి సమస్యే కాదు.. నగరంలో నిత్యం వందల సంఖ్యలో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.. కొందరు కేటుగాళ్లు ఇదే పనిలో ఉన్నారని, ఇటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని, డబ్బుతూ పాటు అత్యవసర పరిస్థితుల్లో అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని పలువురు బాధితులు చెబుతున్నారు. ఇలాంటి వారి వల్ల దాత ఇప్పుడో.. ఇంకాస్త సమయానికో వస్తాడనే ఆశతో ఎదురుచూస్తూ కూర్చుంటే రోగుల ప్రాణాలను కోల్పోక తప్పదని చెబుతున్నారు. సమాచారమే.. వారి డేటా.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం కుటుంబసభ్యులు, మిత్రుల ద్వారా సామాజిక మాధ్యమైలన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో సహాయం కోరేవారి వివరాలే వారికి డేటాగా మారుతోంది.. అలాంటి సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు దాతల పేరుతో తక్షణమే బాధితులకు ఫోన్ చేస్తారు. ‘నాకు ఫలానా గ్రూపులో మెసేజ్ కనిపించింది. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధం. కానీ నేను నగరానికి దూరంలో ఉన్నాను.. అయితే నా దగ్గర ప్రస్తుతం ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు.. మీరు ఏమీ అనుకోకుండా ఫోన్పేగానీ, గూగుల్పేగానీ చేస్తే వెంటనే వస్తాను.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే సమయం పడుతుంది.. మీరు అర్జెంట్ అంటున్నారు కావబట్టి క్యాబ్ చార్జీలు ఇస్తే చాలు’ అని చెబుతారు.. డబ్బులు వేశాక ఫోన్ స్విచ్ఆఫ్ చేసేస్తారు.. ఆపదలో ఉన్న బాధితులు ఎలాగో పోలీసు స్టేషన్కి వెళ్లే పరిస్థితి ఉండదు.. ఒక వేళ వెళ్లినా వెయ్యి, రెండు వేల కోసం ఫిర్యాదు ఏం చేస్తాంలే.. అనే ఆలోచనతో ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేరే దాత కోసం వేటలో పడతారు.. సైబర్ క్రైమ్ హెల్ప్లైన్.. అవసరం, అమాకత్వం వంటివే మోసగాళ్లకు అనుకూలంగా మారే అంశాలు.. మరీ ముఖ్యంగా నగరంలో భాష సమస్య కూడా ఓ కారణమే. ఇలాంటి తరుణంలో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ సెల్కు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ నగరం మరోసారి ‘గివింగ్ సిటీ’గా నిలవాలంటే.. ప్రజలతోపాటు, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.రోజువారీ ఖర్చులకు.. బాధ్యతారాహిత్యంగా.. మనవీయ విలువలు లేని వారు.. పక్కవాడి బాధను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి మోసాలకు పాల్పడరు.. మరీ ముఖ్యంగా రోజు వారీ ఖర్చుల కోసం కొందరు యువత ఇలా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, గేమింగ్, బెట్టింగ్, డేటింగ్ యాప్స్ ఖర్చుల కోసం అవగాహనా రాహిత్యంతో.. మేం చేసేది చిన్న మోసమేగా అనే అపోహతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అంతేకానీ తాము చేసే ఈ చిన్న తప్పిదం వల్ల సమాజానికి ఓ పెద్ద ప్రమాదం జరుగుతోందని, ఓ నిందు ప్రాణం బలైపోయే పరిస్థితి ఉందని, ఓ కుటుంబం రోడ్డున పడుతుందనిగానీ ఆలోచించలేని మైండ్ సెట్ ఉన్నవారు మాత్రమే ఈ తరహా మోసానికి పాల్పడతారని చెబుతున్నారు. వీరి వల్ల నిజంగా రక్తం ఇచ్చే దాతలకు కూడా చెడ్డపేరు వస్తుందని, చివరికి మంచి వారిపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించకుండా మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. (చదవండి: జస్ట్ 15 నిమిషాల జర్నీలో అద్భుత జీవిత పాఠం..! డబుల్ ఎంఏ, ఏడు భాషలు..)
ఫొటోలు


విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)


జడివానకు హైదరాబాద్ అతలాకుతలం.. ట్రాఫిక్ జామ్తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)


హైదరాబాద్లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)


‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్బాస్ ఫేం పోస్ట్ (ఫొటోలు)


‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?


చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్గా తెలుగు బ్యూటీ!


ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)


కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)


'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)


రెడ్ శారీలో ‘జూనియర్’మూవీ ఈవెంట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
అంతర్జాతీయం

మా దేశానికి ట్రంప్.. పాక్ మీడియా కలరింగ్.. వైట్హౌస్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నారని పాక్ మీడియా ది డాన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై అమెరికాలోని వైట్ హౌస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్.. పాక్ పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేదని.. ఆయన పాకిస్తాన్కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది.అయితే, ఇస్లామాబాద్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారని పాక్ మీడియా కథనాలపై తాజాగా వైట్హౌస్ అధికారులు స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్కు వెళ్లడం లేదు. పాక్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఏమీ లేదు. జూలై 18వ తేదీన ట్రంప్.. పాకిస్తాన్లో పర్యటించడం లేదు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని కొట్టిపారేసింది. ఇదే సమయంలో పాక్ మీడియా తప్పుడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది.ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ట్రంప్.. పాక్ పర్యటిస్తున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. పాక్ మీడియా అత్యుత్సాహంతో ట్రంప్.. పర్యటనకు వస్తున్నట్టు కలరింగ్ ఇచ్చింది. ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తొలుత పాక్ను సందర్శించే అవకాశం ఉందని ది డాన్ వెల్లడించింది. ఆ తరువాతే భారత పర్యటన ఉంటుందని అంచనావేసింది. సెప్టెంబర్లో భారత్ క్వాడ్ సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి భారత్కు ట్రంప్ వస్తారని పేర్కొంది.#Newsfatafat | Pakistani media reported that U.S. President Donald #Trump would visit #Pakistan in September, marking the first visit by a U.S. president in two decades. However, the White House has denied the claim, stating that no such trip is scheduled. The reports have since… pic.twitter.com/I6JjWaTq38— ET NOW (@ETNOWlive) July 18, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో అమెరికా అధ్యక్షుడు పర్యటించడం చాలా అరుదు. 2006లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్.. పాకిస్తాన్లో పర్యటించారు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షులు ఎవరూ పాక్ పర్యటనకు వెళ్లలేదు. ఇదిలా ఉండగా.. ట్రంప్ విదేశీ పర్యటనలపై యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 25-జూలై 29 వరకు ట్రంప్.. స్కాట్లాండ్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17-19 మధ్య ట్రంప్ యూకే పర్యటన ఉందని ఆమె స్పష్టం చేశారు.

టీఆర్ఎఫ్ ఓ ఉగ్ర సంస్థ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన లష్కరే తొయిబా జేబు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. పహల్గాంలో 26 మందిని విచక్షణారహిత కాల్పులతో బలిగొన్న ఉగ్రవాద దాడికి స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఇది జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పుట్టుకొచ్చిన లష్కరే జేబు సంస్థ. కశ్మీర్లో భద్రతా బలగాలపై, పౌరులపై పలు దాడులకు పాల్పడింది. లౌకిక సంస్థ ముసుగులో మతపరమైన దాడులను కొనసాగించింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్ నుంచి నిధులు, మద్దతు అందుతున్నాయి. పహల్గాం మారణకాండను 2008లో ముంబైలో లష్కరే జరిపిన దాడుల తర్వాత భారత్పై జరిగిన అత్యంత ప్రాణాంతక ఉగ్ర దాడిగా అమెరికా అభివర్ణించింది. కశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలిచే టీఆర్ఎఫ్ పహల్గాం ఉగ్ర దాడి తన పనేనని తొలుత ప్రకటించింది. తర్వాత ఈ దాడి కారణంగా భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంతో ప్రకటనను వెనక్కు తీసుకుంది. స్వాగతించిన భారత్టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా మధ్య సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎఫ్ కార్యకలాపాలను, దానికి నిధులను అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించకూడదన్న నినాదానికి భారత్ కట్టుబడి ఉందని, ఉగ్రవాద సంస్థలు, వారి ముసుగు సంస్థలు జవాబుదారీగా ఉండేలా చేయడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిపి పని చేయడాన్ని కొనసాగిస్తామని తెలిపింది. ‘టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా గుర్తించినందుకు అమెరికా విదేశాంగ శాఖను, మంత్రి రూబియోకు మా అభినందనలు. ఉగ్రవాదంపై పోరులో భారత్–అమెరికా సహకారానికి ఇది తాజా నిదర్శనం’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గత ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పీఓకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇది ఇరు దేశాల నడుమ సాయుధ ఘర్షణకు దారితీయడం, పాక్ విజ్ఞప్తి మేరకు చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం తెలిసిందే.

బ్రిటన్లో 16 ఏళ్లకే ఓటు హక్కు
లండన్: ఓటు హక్కు వయో పరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరిగే ఎన్నికల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది. బ్రిటన్లో ప్రస్తుతం 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇకపై 16 ఏళ్లకే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించనుంది. బ్రిటన్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచి్చంది. ఓటింగ్ వయో పరిమితిని 16 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఓటింగ్ వయసును కుదించడాన్ని బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. యూకేలో ఓటర్ ఐడీ వ్యవస్థను సైతం విస్తరింపజేయబోతున్నారు. బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకున్నారు. అర్హులైన వారికి ఓటు హక్కును నిరాకరించకూడదన్నదే దీని ఉద్దేశం.

ఈ రాయి విలువ రూ. 37 కోట్లు !
న్యూయార్క్: పాత భవనాన్ని కూలగొట్టినప్పుడు బయటపడిన పునాది రాయిలా ఉందికదూ. నిజానికి ఇది ఇక్కడి రాయి కాదు. అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి పుడమిపై పడిన అత్యంత అరుదైన శిల ఇది. భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి ఇదే. దీనిని బుధవారం ప్రఖ్యాత సోత్బీ వేలం సంస్థ న్యూయార్క్లో వేలంవేయగా ఏకంగా రూ.37 కోట్ల(43 లక్షల డాలర్ల) ధర పలికింది. 38.1 సెంటీమీటర్ల పొడవు, 24.5 కేజీల బరువైన ఈ శిలకు ‘ఎన్డబ్ల్యూఏ 16788’ అని పేరు పెట్టారు. 2023 నవంబర్లో ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశంలో దీనిని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక చుక్క లేదా గ్రహశకలం భూవాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు భూమి గురుత్వాకర్షణకు లోనవుతాయి. దాంతో తోకచుక్క కొనలోని చిన్నపాటి శిలలు లేదా గ్రహశక లంలోని చిన్న రాతిభాగాలు ఇలా భూమి మీద పడతాయి. అలా అంగారకుని నుంచి వచ్చిన ఒక గ్రహ శకలంలోని చిన్న రాతి ముక్కే ఈ శిల. ‘‘అమెరికాలో పన్నులు, ఇత రత్రా ఖర్చులు కలుపుకుని ఇప్పు డీ రాయిని కొనుగోలుదారు సొంతం చేసుకోవాలంటే ఏకంగా రూ.45.61 కోట్లు చెల్లించుకోక తప్పదు. చరిత్రలో ఇప్పటిదాకా భూమిపై కేవలం 400 అంగారక శిలలే దొరికాయి. అవన్నీ చాలా చిన్నవి. ఇదొక్కటే పెద్దది. అందుకే ఇంత ధర పలికింది. భూ ఉపరితలం 75 శాతం సముద్రజలాలతో నిండి ఉంది. సముద్రంలో పడకుండా సహారా ఎడారిలో పడటం వల్లే మనకు ఇది దొరికింది’’ అని సోత్బీ సైన్స్, నేచరల్ హిస్టరీ విభాగ ఉపాధ్యక్షుడు కసాండ్రా హ్యాటన్ చెప్పారు. అయితే ఈ రాయిని కొన్నది ఎవరో సంస్థ బహిర్గతం చేయలేదు. బుధవారం మరెన్నో అరుదైన చారిత్రక వస్తువులను వేలంవేశారు. కోట్ల ఏళ్ల నాటి సెరటాసారస్ డైనోసార్ అస్థిపంజరం రూ.223 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం
జాతీయం

తస్మాత్ జాగ్రత్త.. అలాంటి రీల్స్ చేస్తే జైలుకే!
ఒరేయ్.. ఇది ఇన్స్టాగ్రామా?.. పొరపాటున గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశామా? అనేంత రేంజ్లో అసభ్యకరమైన కంటెంట్ కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న రోజులివి. పైగా అలాంటి కంటెంట్కే ఫాలోవర్స్లో మాంచి డిమాండ్ ఉందని రెచ్చిపోతున్న తీరూ చూస్తున్నాం. బూతులతో కొందరు.. హాట్ హాట్ ఫోజులతో మరికొందరు.. సెమీ శృంగారంతో ఇంకొందరు.. చెలరేగిపోతున్నారు. అయితే ఇకపై అలాంటి వేషాలు చెల్లకపోవొచ్చు!. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్న అక్కాచెల్లెలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్లు చేస్తోంది అసభ్యకరమైన కంటెంట్ కాబట్టి. వల్గర్ డైలాగులతో.. అతి జుగుప్సాకరమైన చేష్టలతో కంటెంట్ పోస్టు చేస్తూ వచ్చారు వాళ్లు. రానురాను వాళ్ల చేసే కంటెంట్ శ్రుతి మించిపోవడం.. అది తమ దృష్టికి వెళ్లడంతో సుమోటోగా కేసు నమోదు చేసి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇక.. అసోంలో ఓ ఘనుడు.. తన మాజీ ప్రేయసిపై కోపంతో ఆమె ముఖంతో ఏఐ జనరేటెడ్ అశ్లీల ఇమేజ్లను సృష్టించాడు. అలా ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. ఓ ప్రముఖ అడల్ట్స్టార్ ఈ అకౌంట్కు స్పందించడంతో.. రాత్రికి రాత్రే ఈ అకౌంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బాధితురాలు(సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే!) సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో ఆ సైకోను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ అకౌంట్ ద్వారా సదరు నిందితుడు ఏకంగా రూ.10 లక్షల దాకా సంపాదించడాని తెలుస్తోంది. రూల్స్కు పాతరేసి..ఒకప్పుడు కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్స్ కఠిన నిబంధనలే పాటించేది. అయితే రాను రాను ఆ పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు, యుద్ధాలు, ప్రమాదాలు.. ఈ తరహా కంటెంట్ విషయంలో మాత్రమే Disclaimerను ఫాలో అవుతోంది. అమ్మాయిల హాట్ ఫోజులకు, సెమీ న్యూడ్ కంటెంట్కు, బూతు డైలాగులకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సహా ఇతర యాప్లు అడ్డాగా మారిపోయాయి. ఇదే అదనుగా.. ఆదాయం కోసం అడ్డు అదుపు లేకుండా కంటెంట్ క్రియేటర్లు చెలరేగిపోతున్నారు. ఆఖరికి మీమర్లు కూడా తమ కంటెంట్ ప్రమోషన్ కోసం ఈ తరహా కంటెంట్ను తమకు తెలియకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయ్యే కంటెంట్ను ఫిల్టర్ చేస్తే సగటున ఒక రోజులో 72 శాతం ఈ తరహా కంటెంట్ ఉండడం గమనార్హం!!.ఏఐతో దారుణాలుఅర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడకం.. నాణేనికి రెండోవైపుగానూ ఉంటోంది. అశ్లీల, అసభ్య కంటెంట్ విషయంలో ఇప్పుడు ఏఐదే ముఖ్యపాత్రగా మారింది. ఇందునా సెలబ్రిటీల కంటెంట్ అగ్రభాగంలో ఉంటోంది. డీప్ఫేక్ ఫొటోలు, వీడియోలను ఇన్స్టాలాంటి పాపులర్ యాప్లోనూ విచ్చలవిడిగా అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి కంటెంట్కు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాకపోవడం గమనార్హం. అయితే..ఈ మధ్య సెలబ్రిటీలు ఈ తరహా కంటెంట్ విషయంలో సీరియస్గానే స్పందిస్తున్నారు. దీంతో అరెస్టులు, కేసుల భయంతో ఎడిటర్లు మరో మలుపు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకున్న యువతను టార్గెట్ చేసుకుంటున్నారు. అరెస్టులతోనే కట్టడి!భారత్లో కఠిన చట్టాలు లేకపోవడమే.. బోల్డ్ కంటెంట్ వైరల్ కావడానికి ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. చట్టసభలకే వదిలేసి.. ఈ తరహా వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు సైతం ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ప్రభుత్వాలే ఉక్కు పాదం మోపాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వాలు(తెలంగాణ సహా) ఈ తరహా కంటెంట్పై దృష్టిసారించాయి. తప్పుడు మార్గాల్లో సంపాదించాలని చూస్తే అరదండాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టు బాట పట్టాయి. ఈ ఏడాదిలో సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ పోస్టు చేసినందుకు చాలా అరెస్టులే జరిగినట్లు ఆయా రాష్ట్రాల సైబర్ విభాగాలు చెబుతున్నాయి. దీంతో ఈ తరహా కఠిన చర్యలతోనే అలాంటి రీల్స్కు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు కూడా ఓ అంచనాకి వస్తున్నారు.

కాంగ్రెస్కు షాక్.. లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం కుమారుడు చైతన్య బఘేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో, ఆయన అరెస్ట్ కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ.. రూ.2,160 కోట్లు మద్యం కుంభకోణం నుండి వచ్చిన ఆదాయాన్ని చైతన్య బాఘేల్ గ్రహీతగా ఉన్నారని ఆరోపించింది. 2019-2023 మధ్య భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే, ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | Bhilai, Chhattisgarh: Congress workers clash with police personnel and try to stop ED vehicles after Chaitanya Baghel, son of former CM Bhupesh Baghel, was taken into custody by the Enforcement Directorate.The Enforcement Directorate (ED) conducted fresh searches at the… pic.twitter.com/beb7Eq7Pnq— Press Trust of India (@PTI_News) July 18, 2025అయితే, ఈరోజు చైతన్య బఘేట్ పుట్టినరోజు కావడం విశేషం. పుట్టినరోజే ఆయనను ఇలా అరెస్ట్ చేయడం కుటుంబ సభ్యులను, ఆయన మద్దతుదారులను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తన కుమారుడి అరెస్ట్ఫై మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందిస్తూ.. ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదని వ్యాఖ్యలు చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. మరోవైపు.. చైతన్య బఘేల్ అరెస్ట్ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈడీ అధికారులను.. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. #WATCH | Former Chhattisgarh Chief Minister Bhupesh Baghel's son, Chaitnya Baghel (in yellow t-shirt), arrested by Enforcement Directorate, in connection with the ongoing investigation into alleged multi-crore liquor scam in the state, say officials.Visuals from Durg,… pic.twitter.com/bRPTxqfu0b— ANI (@ANI) July 18, 2025

భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో(భూమికి ఉద్యోగం) ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్పై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు.. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలన్న ఆయన అభ్యర్థననూ శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో విచారణ యధాతథంగా కొనసాగనుంది.ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాని కోరుతూ లాలూ ప్రసాద్ ముందుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. విచారణపై స్టే విధించడానికి ఎలాంటి కారణలూ లేవని తెలిపింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఆయన పిటిషన్ను పరిశీలించిన సుప్రీం కోర్టు ద్విససభ్య ధర్మాసనం తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది.యూపీఏ ప్రభుత్వ హయాంలో.. 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భారతీయ రైల్వే తరఫున మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వెస్ట్ సెంట్రల్ జోన్లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ 2022లో అభియోగాలు నమోదు చేసింది. అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లాలూ, అతని కుటుంబ సభ్యులకు భూములు బహుమతిగా ఇచ్చారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్ వ్యవహారం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. లాలూ కుటుంబ సభ్యులకు చెందిన 25 చోట్ల సోదాలు జరిపింది. ఆ సమయంలో.. రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.అయితే.. రాజకీయ దురుద్ధేశ్యంతోనే తనపై దాదాపు దశాబ్దన్నర తర్వాత కేసు నమోదు చేశారని లాలూ అంటున్నారు.

బెంగళూరులో హైటెన్షన్.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: ఓవైపు దేశరాజధానిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. ఇటు నగరంలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. బెంగళూరు ఈ ఉదయం ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.నగరంలోని రాజరాజేశ్వరీనగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ టీమ్లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి. ఇటు.. ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ , ఈమెయిల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా మారాయి.40 Bengaluru schools receive bomb threats via emails, bomb squads and police team are at the spot #Bengaluru #Schools #BombThreats pic.twitter.com/3t9NMeZRpQ— News18 (@CNNnews18) July 18, 2025
ఎన్ఆర్ఐ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్ఎస్టేట్కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్బీఐ 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!

లండన్లో వైభవంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు. ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

హైదరాబాద్లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
మానవత్వం మంటగలిసిపోతోంది.. అమూల్యమైన సేవలకు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.. కొందరి అమాయకత్వం, అవసరం.. ఇంకొందరికి వరంగా మారుతోంది.. సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఓ వైపు యువత స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకొస్తుంటే.. మరికొందరు బాధితుల అవసరాన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు!!.ఇటీవలి కాలంలో రక్తదానంపై అవగాహన పెరగడంతో చాలా మట్టుకు ఆపద సమయాల్లో అవసరం తీరుతోంది. సరిగ్గా అదే అదునుగా కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ఆస్పత్రులకు వచ్చేవారిని టార్గెట్ చేస్తూ బాధితులకు టోకరా వేస్తున్నారు.. మానవత్వం ముసుగులో సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు.. బ్లడీ చీటర్స్.. అంతేకాదు.. డబ్బు స్వాహా చేసేదే కాకుండా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్తో పాటు జాతీయ స్థాయిలో పేరొందిన పలు కార్పొరేట్ ఆస్పత్రులకు అనేక మంది బాధితులు వస్తుంటారు. సరిగ్గా వీరినే ఆసరా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. సేవ పేరుతో సమాజం తలదించుకునే మోసానికి తెరతీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని సోషల్ మీడియాల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టే విజ్ఞప్తులను క్యాష్ చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.. అమూల్యమైన వారి సమయాన్ని ధనార్జన కోసం ఫణంగా పెడుతున్నారు.సమాచారమే.. వారి డేటా..అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం కుటుంబసభ్యులు, మిత్రుల ద్వారా సామాజిక మాధ్యమైలన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో సహాయం కోరేవారి వివరాలే వారికి డేటాగా మారుతోంది.. అలాంటి సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు దాతల పేరుతో తక్షణమే బాధితులకు ఫోన్ చేస్తారు. ‘నాకు ఫలానా గ్రూపులో మెసేజ్ కనిపించింది. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధం. కానీ నేను నగరానికి దూరంలో ఉన్నాను.. అయితే నా దగ్గర ప్రస్తుతం ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు.. మీరు ఏమీ అనుకోకుండా ఫోన్పేగానీ, గూగుల్పేగానీ చేస్తే వెంటనే వస్తాను.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే సమయం పడుతుంది.. మీరు అర్జెంట్ అంటున్నారు కావబట్టి క్యాబ్ చార్జీలు ఇస్తే చాలు’ అని చెబుతారు.. డబ్బులు వేశాక ఫోన్ స్విచ్ఆఫ్ చేసేస్తారు.. ఆపదలో ఉన్న బాధితులు ఎలాగో పోలీసు స్టేషన్కి వెళ్లే పరిస్థితి ఉండదు.. ఒక వేళ వెళ్లినా వెయ్యి, రెండు వేల కోసం ఫిర్యాదు ఏం చేస్తాంలే.. అనే ఆలోచనతో ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేరే దాత కోసం వేటలో పడతారు.. రోజువారీ ఖర్చులకు.. బాధ్యతారాహిత్యంగా.. మానవీయ విలువలు లేని వారు.. పక్కవాడి బాధను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి మోసాలకు పాల్పడరు.. మరీ ముఖ్యంగా రోజు వారీ ఖర్చుల కోసం కొందరు యువత ఇలా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, గేమింగ్, బెట్టింగ్, డేటింగ్ యాప్స్ ఖర్చుల కోసం అవగాహనా రాహిత్యంతో.. మేం చేసేది చిన్న మోసమేగా అనే అపోహతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అంతేకానీ తాము చేసే ఈ చిన్న తప్పిదం వల్ల సమాజానికి ఓ పెద్ద ప్రమాదం జరుగుతోందని, ఓ నిండు ప్రాణం బలైపోయే పరిస్థితి ఉందని, ఓ కుటుంబం రోడ్డున పడుతుందనిగానీ ఆలోచించలేని మైండ్ సెట్ ఉన్నవారు మాత్రమే ఈ తరహా మోసానికి పాల్పడతారని చెబుతున్నారు. వీరి వల్ల నిజంగా రక్తం ఇచ్చే దాతలకు కూడా చెడ్డపేరు వస్తుందని, చివరికి మంచి వారిపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించకుండా మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.సైబర్ క్రైమ్ హెల్ప్లైన్..అవసరం, అమాకత్వం వంటివే మోసగాళ్లకు అనుకూలంగా మారే అంశాలు.. మరీ ముఖ్యంగా నగరంలో భాష సమస్య కూడా ఓ కారణమే. ఇలాంటి తరుణంలో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ సెల్కు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ నగరం మరోసారి ‘గివింగ్ సిటీ’గా నిలవాలంటే.. ప్రజలతోపాటు, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.:::సాక్షి, సిటీబ్యూరో

ప్రాణం తీసిన ప్రేమ పంచాయితీ!
క్రైమ్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిషన్రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయంలో యువతి బంధువులు అనేకసార్లు మల్లేశ్కు నచ్చజెప్పారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఈ క్రమంలో మల్లేశ్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతనిపై రౌడీషీట్ కూడా నమోదైంది. అయినప్పటికీ మల్లేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మల్లేశ్ గతంలో హార్వెస్టర్ నడిపించగా.. ఈ గొడవల నేపథ్యంలో హార్వెస్టర్ అమ్మేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గురువారం ఉదయం కూడా మల్లేశ్ సదరు యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. యువతి తండ్రికి ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో యువతి బంధువులు విసిగిపోయారు. ఇంటి నుంచి ద్విచక్రవానంపై బయలుదేరిన యువకుడిని వెంబడించి వెల్గటూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై విచక్షణారహితంగా కొట్టి ఆటోలో తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డులోని పాత వైన్స్ వెనకాల కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లుకాగా మల్లేశ్ ఒక్కడే కుమారుడు.

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు ప్రమాద స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పెద్దఅంబర్పేట నుంచి బొంగ్లూరు వెళ్తుండగా ఆదిభట్ల ఓఆర్ఆర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతోనే ఘోరం చోటు చేసుకుంది. ఘటన తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. కారు నుంచి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మృతుల వివరాలు, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ముఖ్యమంత్రి ఇలాకాలో.. ఐసీయూలో కాల్పుల కలకలం
పాట్నా: బీహార్లో క్రైమ్ సినిమా సీన్ను తలపించేలా ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు నిందితులు తాపీగా ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చొరపడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని కాల్చి చంపారు. గురువారం పాట్నాలోని రాజాబజార్ పారస్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బక్సర్ జిల్లాకు చెందిన పలు హత్యకేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న చందన్ మిశ్రా.. ప్రస్తుతం పేరోల్ మీద బయటకు వచ్చాడు. అనారోగ్యం కారణంగా పారస్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో ఐసీయూలోకి చొరబడి కాల్పులు జరిపిన దృశ్యాల ఆధారంగా చందన్ మిశ్రాను ప్రతీకారం తీర్చుకునేందుకే చందన్ షేరు గ్యాంగ్ ప్రాణాలు తీసినట్లు పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ భావిస్తున్నారు.మరోవైపు, పట్టపగలే నిందితులు ఆస్పత్రి ఐసీయూలోకి ప్రవేశించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన్ మిశ్రా హత్య వెనుక ఆస్పత్రి వర్గాల ప్రమేయో కూడా ఉండొచన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇందులో భాగంగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు, యాజమాన్యాన్ని సైతం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని ఆచూకీ గుర్తించేందుకు పాట్నా పోలీసులు.. బక్సర్ పోలీసుల సహకారంతో షూటర్ల ఫోటోలు సేకరించి వారి గాలింపు చర్యలు చేపట్టారు.𝐓𝐇𝐄 A̶M̶R̶I̶T̶ 𝐑𝐀𝐕𝐀𝐍 𝐊𝐀𝐀𝐋The Most Sensational CCTV Video So Far 😱This CCTV Footage is from Paras Hospital in #Patna, where a young man named Chandan Mishra, with a Criminal Background, was murdered yesterday.These Shooters are Captured in the CCTV video; See… pic.twitter.com/wGHAvROQrm— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 17, 2025సీఎం నితీష్ కుమార్ నివాసానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. పరాస్ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఆర్జేడీ, కాంగ్రెస్లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రభుత్వ అడంతో నేరస్తులే ఆస్పత్రి ఐసీయూలోకి చొరబడి రోగిని కాల్చి చంపారు.బీహార్లో ఎక్కడైనా ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 2005 కి ముందు ఇది జరిగిందా? అని నితిష్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా, ఈ ఏడాది నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సీఎం నితిష్ కుమార్ ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే, బీహార్లో వరుస హత్యలతో శాంతి భద్రతలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.
వీడియోలు


CAG Report: ఏపీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. బాబు పాలనపై కాగ్ నివేదిక


ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు


సీఎంను చంపేసిన Facebook


కూటమి ప్రభుత్వంలో వైద్యానికి నిర్లక్ష్య రోగం!


హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు


జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...


మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్


వణికిన మహానగరం


Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి


నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత