ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సరికొత్త రికార్డ్ సాధించింది. ఈ బ్యాంకు షేరు గురువారం నాటి ట్రేడింగ్లో 2.5 శాతం ఎగిసి రూ.1,938 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా హెచ్డీఎఫ్సీ రూ.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు ఈ ఘనతను సాధించిన తొలి బ్యాంకుగా రికార్డ్ నెలకొల్పింది. అలాగే టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనంతరం ఈ రికార్డ్ సాధించిన మూడవ కంపెనీగా నిలిచింది.