HDFC Bank
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్, హడ్కో ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 2% నామమాత్ర వృద్ధితో రూ.16,736 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.16,373 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 17,258 కోట్ల నుంచి రూ.17,657 కోట్లకు స్వల్పంగా బలపడింది. రుణ వృద్ధి నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,15,016 కోట్ల నుంచి రూ. 1,12,194 కోట్లకు క్షీణించింది. వడ్డీ ఆదాయం ప్లస్...ప్రస్తుత సమీక్షా కాలంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ.30,650 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.11,450 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.43 శాతం వద్ద నిలకడను చూపాయి. ఆస్తుల (రుణాల) నాణ్యత విషయానికివస్తే తాజా స్లిప్పేజీలు రూ. 6,400 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.42 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.31 శాతం నుంచి 0.46 శాతానికి ఎగశాయి. అనుబంధ సంస్థలలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 470 కోట్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 410 కోట్లు, అసెట్ మేనేజ్మెంట్ రూ. 640 కోట్లు, సెక్యూరిటీస్ రూ. 270 కోట్లు చొప్పున లాభాలు ఆర్జించాయి. టాటా కమ్యూనికేషన్స్ లాభం హైజంప్రూ.257 కోట్లుగా నమోదున్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 257 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 45 కోట్లు ఆర్జించింది. అయి తే పన్ను సంబంధిత రూ. 185 కోట్ల వన్టైమ్ ప్రొవిజన్ ఇందుకు కారణం. కాగా.. మొత్తం ఆదా యం 3% బలపడి రూ. 5,798 కోట్లను తాకింది.ఇదీ చదవండి: ఐపీవో గ్రే మార్కెట్పై సెబీ కన్నురాణించిన హడ్కోడిసెంబర్ క్వార్టర్లో రూ.735 కోట్ల లాభంన్యూఢిల్లీ: పట్టణ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలు అందించే ప్రభుత్వరంగ హడ్కో డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు పరంగా రాణించింది. సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతం వృద్ధితో రూ.735 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.519 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం ఇదే కాలంలో రూ.2,023 కోట్ల నుంచి రూ.2,770 కోట్లకు వృద్ధి చెందింది. వాద్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (వీపీపీఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. రూ.25,000 కోట్ల వరకు రుణాన్ని సమకూర్చే అవకాశాలను ఈ ఒప్పందం కింద పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. వీపీపీఎల్ అన్నది జవహర్లాన్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్.. 4 రోజులు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్బ్యాంకింగ్, ఇన్స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్లను రీలోడ్ చేయవచ్చు.జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్లలో యూపీఐ సర్వీస్ నిలిపేస్తారు. మర్చెంట్ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ సేవలపై పని చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.కస్టమర్లకు అలర్ట్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ అప్డేట్ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్లకు సూచించింది. -
తగ్గనున్న ఈఎంఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్న్యూస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.ఎంసీఎల్ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే?"ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్ఆర్ భావనను వివరిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.పీఎల్ఆర్ ఇలా..ఎంసీఎల్ఆర్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.ఈబీఎల్ఆర్ గృహ రుణాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.హోమ్ లోన్ రేట్లుఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ.. ఈ రెండు రోజుల్లో పనిచేయదు
యూపీఐ సేవలకు సంబంధించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. అవసరమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్లో రెండు రోజుల పాటు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవ అందుబాటులో ఉండదని ప్రకటించింది.కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నవంబర్ 5, 23 తేదీలలో అవసరమైన సిస్టమ్ నిర్వహణ పనులు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు అంతరాయం ఉంటుందని వెల్లడించింది.ఈ సేవలు అందుబాటులో ఉండవు» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్ని వినియోగించే హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పేలో ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ని వినియోగించే మర్చంట్ల వద్ద కూడా యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు -
హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
పండుగ సీజన్ నేపథ్యంలో హోచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక రుసుము ఎంత?వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్ వార్షిక రుసుము రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు. -
మామూలు బ్యాంక్ బ్యాలెన్స్పైనా ఎక్కువ వడ్డీ!
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనంపంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ఐడీఎఫ్సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. -
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డ్లకు లాయల్టీ ప్రోగ్రామ్ సవరించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఈ అప్డేట్తో ప్రభావితమైన కస్టమర్లకు బ్యాంక్ ఈమెయిల్ పంపింది.అక్టోబర్ 1 నుండి స్మార్ట్బై ప్లాట్ఫామ్లో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డ్ పాయింట్ల రిడీమ్ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరిమితం చేసింది. అలాగే తనిష్క్ వోచర్లపై రివార్డ్ పాయింట్ల రిడీమ్ను కూడా ఒక క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా , ఇన్ఫినియా మెటల్ కార్డ్లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి: వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్ఫినియా మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం ద్వారా మాత్రమే అందిస్తారు. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఈ కార్డు జాయినింగ్/రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు రూ. 12,500. దీనికి పన్నులు అదనం. ఫీజు రియలైజేషన్, కార్డ్ యాక్టివేషన్ తర్వాత వెల్కమ్, రెన్యూవల్ బెనిఫిట కింద 12,500 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవారికి వచ్చే ఏడాది రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు ఉండదు. -
కూర్చున్న చోటే కుప్పకూలిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి..
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాద ఘటన జరిగింది. గోమతినగర్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగిని ఆఫీసులోనే తన డెస్క్లో కుర్చీలో నుంచి కిందపడి కుప్పకూలి మరణించింది. గోమతి నగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాదఫ్ ఫాతిమా (45) అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూలానే మంగళవారం కూడా ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది.ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్టుండి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది. గమనించిన తోటి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పని ఒత్తిడి వల్ల టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చని సహోద్యోగులు చెబుతున్నారు.ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించామని తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.ఇక ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ సంఘటన దేశ ప్రస్తుత ఆర్థిక ఒత్తడిని ప్రతిబింబిస్తోందని, ఇలాంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయని తెలిపారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. దేశంలోని అన్ని కంపెనీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు. -
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీలు (ఫొటోలు)
-
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
ఐదు లక్షల మంది రైతులకు సాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా చిన్న రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో ఒకటైన ‘పరివర్తన్’ ద్వారా ఈ సాయం అందించనున్నట్లు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డీఎండీ) కైజాద్ ఎం బారుచా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్యాంకు గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. స్థిరమైన వృద్ధిని పెంపొందించడంతోపాటు అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తోంది. 2014లో ప్రారంభమైన ‘పరివర్తన్’ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సీఎస్ఆర్ ప్రోగ్రామ్ల్లో ఒకటి. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తున్నాం. గత పదేళ్ల కాలంలో రూ.5000 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ఈ నిధులు పెంచుతాం. ఇప్పటికే పరివర్తన్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా నిలిచాం. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 25,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. స్మార్ట్ తరగతులు, పాఠశాల ఫర్నిచర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా 25000 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటుకేంద్ర ప్రభుత్వం 2013 తరువాత కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 135లో సీఎస్ఆర్ నిబంధనను చేర్చింది. దాని ప్రకారం కార్పొరేట్ సంస్థల నికర లాభంలో రెండు శాతం సీఎస్ఆర్కు కేటాయించాలి. ఆర్థిక సర్వేలోని వివరాల ప్రకారం గడిచిన ఎనిమిదేళ్లలో అన్ని దేశీయ కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ కింద దాదాపు రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేశాయి. -
రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!
హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా దాదాపు మూడు గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం..బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపేస్తున్నారు. బ్యాంకు వినియోగదారులు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఈ చర్యలు తీసుకుంటుంది.ఇదీ చదవండి: ఏడాదిలో 42 వేల మంది రాజీనామా!హెచ్డీఎఫ్సీ ప్రకటించిన సమయంలో బ్యాంకు కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) హోల్టర్లకు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్పే, ఫోన్పే, వాట్సప్పే, పేటీఎం..వంటి థర్డ్పార్టీ యాప్ల ద్వారా హెచ్డీఎఫ్సీ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదు. -
భారత్లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్ మరింత విలువైన కంపెనీగా మారింది.ఫార్చూన్-గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలువాల్మార్ట్అమెజాన్స్టేట్గ్రిడ్సౌదీ అరమ్కోసినోపెక్ గ్రూప్చైనా నేషనల్ పెట్రోలియంయాపిల్యూనైటెడ్ హెల్త్గ్రూప్బెర్క్షైర్ హాత్వేసివీఎస్ హెల్త్ఇదీ చదవండి: 26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!గ్లోబల్ 500 జాబితాలో చేరిన భారత్లోని టాప్ కంపెనీలురిలయన్స్ ఇండస్ట్రీస్ఎల్ఐసీఇండియన్ ఆయిల్ఎస్బీఐఓఎన్జీసీభారత్ పెట్రోలియంటాటా మోటార్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్రాజేశ్ ఎక్స్పోర్ట్స్ -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే..
జూలై నెల ముగింపునకు వచ్చేసింది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. వచ్చే ఆగస్టు నెలలోనూ పలు నిబంధనలు మారనున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది. రానున్న మార్పుల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపులపై లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉంటుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ ఉంటుంది.రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.50,000 పైబడిన లావాదేవీలకు 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి పీఓఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే చేస్తే 1% ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ బ్యాంక్ సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ స్టోర్లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. అర్హత కలిగిన యూపిఐ చెల్లింపులపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1.5 శాతం, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 శాతం న్యూకాయిన్స్ లభిస్తాయి. -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మరింత రాబడి!
ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల లోపు వివిధ కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూలై 24 నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు తర్వాత, బ్యాంక్ ఎఫ్డీ గరిష్ట రేట్లు సాధారణ పౌరులకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతంగా ఉన్నాయి.పెరిగిన ఎఫ్డీ రేట్లు ఇవే..2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల కాలవ్యవధి డిపాజిట్పై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు అంటే 7.15% నుంచి 7.35% వరకు పెంచింది. అలాగే 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల కాలవ్యవధిపై నా 20 బేసిస్ పాయింట్లు 7.20% నుంచి 7.40% కి పెంచింది. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ రేట్లుటెన్యూర్ సాధారణ పౌరులకు సీనియర్ సిటిజన్లకు 7-14 రోజులు 3.00% 3.50%15-29 రోజులు 3.00% 3.50%30-45 రోజులు 3.50% 4.00%46-60 రోజులు 4.50% 5.00%61 - 89 రోజులు 4.50% 5.00%90 రోజులు < = 6 నెలలు 4.50% 5.00%6 నెలలు 1 రోజు < = 9 నెలలు 5.75% 6.25%9 నెలల 1 రోజు నుంచి < 1 సంవత్సరం వరకు 6.00% 6.50%1 సంవత్సరం నుండి <15 నెలల వరకు 6.60% 7.10%15 నెలల నుండి <18 నెలల వరకు 7.10% 7.60%18 నెలల నుండి <21 నెలల వరకు 7.25% 7.75%21 నెలలు - 2 సంవత్సరాలు 7.00% 7.50%2 సంవత్సరాల 1 రోజు నుండి < 2 ఏళ్ల 11 నెలల వరకు 7.00% 7.50%2 ఏళ్ల 11 నెలలు - 35 నెలలు 7.35% 7.85%2 ఏళ్ల 11 నెలల 1 రోజు < = 3 సంవత్సరాలు 7.00% 7.50%3 ఏళ్ల 1 రోజు నుండి < 4 ఏళ్ల 7 నెలల వరకు 7.00% 7.50%4 ఏళ్ల 7 నెలలు - 55 నెలలు 7.40% 7.90%4 ఏళ్ల 7 నెలలు 1 రోజు < = 5 సంవత్సరాలు 7.00% 7.50%5 ఏళ్ల 1 రోజు - 10 ఏళ్లు 7.00% 7.50% -
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 14 గంటలు అంతరాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు జూలై 13న అంతరాయం కలగనుంది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది కస్టర్లున్న అతిపెద్ద ప్రవేట్ బ్యాంక్ తమ కస్టమర్ బేస్ కోసం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ను కొత్త ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్కు బదిలీ చేస్తోంది. దీంతో 14 గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.పనితీరు వేగాన్ని మెరుగుపరచడం, అధిక ట్రాఫిక్ పరిమాణాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం, రిలియబులిటీ, స్కేలబిలిటీని పెంచడం ఈ మార్పు లక్ష్యం అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా జూలై 13న తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 13.50 గంటల పాటు పలు సర్వీసులు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..నెట్ & మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు జూలై 13న తెల్లవారు జామున 3:00 గంటల నుంచి 3:45 గంటల వరకు, మళ్లీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అందుబాటులో ఉండవు. బిల్లు చెల్లింపులు, డీమ్యాట్, కార్డులు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ఏటీఎం లావాదేవీల్లోనూ అంతరాయం ఉంటుంది. -
హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్)ను కొత్త ఇంజినీరింగ్ ప్లాట్ఫారమ్కు మారుస్తున్న నేపథ్యంలో యూపీఐ సేవలను తాత్కాలికంగా కొన్నిగంటల పాటు నిలిపేస్తామని ప్రకటించింది. దానికోసం జులై 13, 2024 శనివారం ఉదయం 3:00 నుంచి 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యూపీఐ సేవలు పనిచేయవని తెలిపింది.బ్యాంకింగ్ పనితీరు, సామర్థ్యం, విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్ ప్రకటనలో చెప్పింది. కస్టమర్లకు మరింత వేగంగా సేవలందించేందుకు ఈ మైగ్రేషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. బ్యాంక్ సర్వర్లను యాక్సెస్ చేసేపుడు అధిక ట్రాఫిక్ వాల్యూమ్ను నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్శనివారం బ్యాంక్ సెలవు కావడంతో ఈ అప్డేషన్ కోసం జులై 13ను ఎంచుకున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. యూపీఐ వినియోగదారులు మాత్రం శనివారం బ్యాంక్ ప్రకటించిన సమయాన్ని గమనించాలని కోరింది. కస్టమర్లు అంతకు ముందుగానే బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది. -
రేపటి నుంచి ఈ బ్యాంక్ అలర్ట్స్ బంద్.. కానీ ఇలా చేస్తే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ .100 లోపు విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం నిలిపివేయనుంది.జూన్ 25 నుంచి రూ.100 లకు పైబడిన చెల్లింపులు, రూ.500 లకు మించి అందుకున్న లావాదేవీలకు మాత్రమే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఉంటాయని బ్యాంక్ గతంలోనే ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్స్ అందుకునే అవకాశం ఉంది.ఈమెయిల్ ఇన్స్టా అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా..నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే టాప్ బ్యానర్ పై ఉన్న ఇన్ స్టాఅలర్ట్స్ పై క్లిక్ చేసి సూచనలను పాటించండి.మొబైల్ యాప్ ద్వారా అయితే మెనూకు వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. మేనేజ్ అలర్ట్స్ పై క్లిక్ చేయండిఇన్స్టా అలర్ట్స్ డీయాక్టివేట్ చేయాలంటే..» మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్తో నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వండి» పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ఇన్స్టా అలర్ట్స్పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ డీ రిజిస్టర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ ఎంచుకోండి.» అలర్ట్స్ రకాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ సెలెక్ట్ అయ్యాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. -
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు. -
అతిపెద్ద బ్యాంక్ ఆన్లైన్ సేవలు రెండు రోజులు బంద్!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆన్లైన్ సేవలు ఈ నెలలో రెండు వేర్వేరు తేదీల్లో కొన్ని గంటలపాటు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ మరోసారి మెయింటెనెన్స్ షెడ్యూల్ ను ప్రకటించడంతో పలు కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.(అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!)హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో అధికారిక ప్రకటన ప్రకారం.. బ్యాంక్ తన ప్లాట్ఫామ్లను జూన్ నెలలో రెండు వేర్వేరు తేదీలలో అప్గ్రేడ్ చేయనుంది. దటి షెడ్యూల్ మెయింటెనెన్స్ జూన్ 9న తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. రెండో మెయింటెనెన్స్ జూన్ 16న ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు నాలుగు గంటల పాటు ఉంటుంది. ఈ కాలంలో పలు సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..» ఖాతా సంబంధిత సేవలు» డిపాజిట్లు» నిధుల బదిలీలు (ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్)» అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్స్» ఎక్స్టర్నల్/మర్చంట్ చెల్లింపు సేవలు» ఇన్స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్» యూపీఐ చెల్లింపులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత మే 25న కూడా బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో సహా చాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ మెయింటెనెన్స్తో పాటు యూపీఐ లావాదేవీల ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్లోనూ బ్యాంక్ మార్పులు చేసింది. జూన్ 25 నుంచి రూ .100 కంటే తక్కువ విలువ యూపీఐ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్లను బ్యాంక్ కస్టమర్లకు పంపదు. అయితే రూ.100, అంతకంటే ఎక్కువ విలువ యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కొనసాగుతాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్: రేపు ఆన్లైన్ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఈ బ్యాంక్ కస్టమర్లు మే 25వ తేదీ శనివారం తెల్లవారు జామున నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది.బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా మే 25 ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లో అకౌంట్స్, డిపాజిట్లు, నిధుల బదిలీలు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, విత్ ఇన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు), ఆన్లైన్ చెల్లింపు, తదితర లావాదేవీలు అందుబాటులో ఉండవు.మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవల అంతరాయం గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్ కూడా పంపింది. పేర్కొన్న సమయంలో వినియోగదారులు డబ్బును డిపాజిట్ చేయలేరు. నిధులను బదిలీ చేయలేరు. యూపీఐ లావాదేవీలతో సహా ఎటువంటి ఆన్లైన్ చెల్లింపులు చేయలేరు. -
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్లో తెలిపారు.బ్యాంకింగ్లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావడానికి కృషి చేశారు. -
హెచ్డీఎఫ్సీ.. ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన దీపక్ పరేఖ్.. తదుపరి ఎవరంటే..
హెచ్డీఎఫ్సీ లైప్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 వ్యాపార వేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. పరేఖ్ అనంతరం ఎవరు ఈ కంపెనీని ముందుండి నడిపిస్తారనే వాదనలను తెరదించుతూ కొత్త ఛైర్మన్ను కూడా ఏకగ్రీవంగా నియమించారు. కేకి ఎం మిస్త్రీను సంస్థ ఛైర్మన్గా నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. 23 ఏళ్లుగా కంపెనీలో ఉన్న ఆయన ప్రస్తుతం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆయన క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే.. ఏప్రిల్ 24, 2024న వికె విశ్వనాథన్, ప్రసాద్ చంద్రన్ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఇటీవల వెంకట్రామన్ శ్రీనివాసన్ను ఐదేళ్ల కాలానికిగాను నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్గా నియమించినట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది. -
అందాల దీవుల్లో అడుగు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో అడుగుపెట్టింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్లో ఇప్పటివరకు ఏర్పాటైన మొదటి ప్రైవేటు బ్యాంకు ఇదే. భారత్కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం.. లక్షద్వీప్. ఇటీవల మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా లక్షద్వీప్లో అడుగుపెట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులు ఇక్కడికి రావాలని ప్రకటనలు చేశారు. ఫలితంగా ఈ దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన లక్షద్వీప్ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, స్థానికులు, పర్యాటలకు పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి. -
హెడీఎఫ్సీ బ్యాంక్ రుణాలు ఎన్నంటే..?
ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలు రూ.25 లక్షల కోట్లను అధిగమించాయి. 2024 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి ఈ మేరకు రుణాలున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2023 మార్చి 31 నాటికి ఈ రుణాల విలువ రూ.16.14 లక్షల కోట్లు ఉండగా, 55.4 శాతం వృద్ధితో రూ.25.08 లక్షల కోట్లకు చేరినట్లు నియంత్రణ సంస్థలకు బ్యాంక్ రిపోర్ట్ చేసింది. 2023 జులై 1న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల విలీనం తర్వాతి రుణాలు కాబట్టి, గత ఏడాదితో వీటిని పోల్చిచూడొద్దని బ్యాంకు వర్గాలు తెలిపాయి. త్రైమాసిక ప్రాతిపదికన 2023 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే (రూ.24.69 లక్షల కోట్లు) 2024 మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మాత్రమే రుణాలు పెరిగాయి. ఇదీ చదవండి: పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్వెజ్ ఖరీదు దేశీయ రిటైల్ రుణాలు 2023 మార్చి 31తో పోలిస్తే 109 శాతం, డిసెంబరు 31తో పోలిస్తే 3.7 శాతం వృద్ధి చెందాయి. వాణిజ్య-గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు వరుసగా 24.6 శాతం, 4.2 శాతం మేర పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు 2024 మార్చి 31 నాటికి రూ.23.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబరు 31 నాటికి రూ.22.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన రూ.18.83 లక్షల కోట్ల నుంచి 26.4 శాతం పెరిగాయి. -
Fact check: సచివాలయంపై తా‘కట్టు కథ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎల్లో మీడియా చేసిన కుట్ర బట్టబయలయ్యింది. రాష్ట్ర తాత్కాలిక సచివాలయాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారంటూ... ఒక పత్రికలో రాసిన కథనాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖండించింది. ‘సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ ఒక పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్త అవాస్తమని, ఇది ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని, దానిని ఖండిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడానికి ఎల్లో మీడియా ప్రతీ రోజు ఏదో ఒక విష ప్రచారంతో భారీ కుట్రలకు తెరతీస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రతిష్టను మంటకలపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందులో భాగంగానే ‘సచివాలయం తాకట్టు’ అంటూ ఒక విష కథనాన్ని పకడ్బందీగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ‘తాకట్టులో సచివాలయం’ అంటూ ఎల్లో పత్రిక ఒక వార్తను ప్రచురించడం... దాన్ని తమ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం.. దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి జిల్లా స్థాయి నేతల వరకు మాట్లాడటం... తిరిగి ఆ వార్తను అన్ని పత్రికల్లో ప్రచురింపజేస్తూ... ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలు నిజం అని నమ్మే విధంగా చేయడానికి ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేసింది. కానీ ఆ వార్తను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖండించడంతో తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారం మరోసారి బట్టబయలయ్యింది. -
హోమ్లోన్పై గుడ్న్యూస్.. త్వరలో కొత్త రుణాలు
HDFC Bank Home Loans : దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్ లోన్పై గుడ్న్యూస్ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్’ పేరిట ఓ లోన్ను ఏప్రిల్లో, హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. హోమ్ సేవర్ ప్రొడక్ట్ అనేది ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్బీఐ అందిస్తున్న మ్యాక్స్గెయిన్ హోమ్ లోన్ స్కీమ్కి పోటీగా దీన్ని భావించవచ్చు. ఇక హోమ్ రీఫర్బిష్మెంట్ లోన్ విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ లోన్ను అందించేది. ఇప్పుడు ఈ లోన్ను త్వరలో పునఃప్రారంభిస్తున్నారు. ఈ రెండు లోన్లు ఇప్పటికే ఉన్న కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు అందించనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్టగేజ్ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే బ్యాంకు గృహ రుణాలపై వసూలు చేసే రేటు కంటే హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటుతో లింక్ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా ఇప్పటివరకూ ఉన్న హెచ్డీఎఫ్సీ సర్వీస్ సెంటర్లను దశలవారీగా బ్యాంక్ బ్రాంచ్లుగా మార్చబోతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. -
దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
భారత్లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొదటిస్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంక్కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదిక తయారుచేశాయి. గతేడాది అక్టోబరు వరకు ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. అందులోని కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. టాప్ 3 కంపెనీలు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని టాప్-500 కంపెనీల (రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్) మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ. దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు. కంపెనీ స్థాపించి 10 ఏళ్లు కూడా పూర్తవని సంస్థలు 52 ఉన్నాయి. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా 500 కంపెనీల జాబితాలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాబితాలో 28వ స్థానం సాధించింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్లు 2023 ఎడిషన్లో మరోసారి టాప్-10 జాబితాలోకి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. హైదరాబాద్ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది. టాప్ కంపెనీలు(మార్కెట్ విలువ) ఇవే.. దివీస్ ల్యాబ్స్: రూ.90,350 కోట్లు డాక్డర్ రెడ్డీస్: రూ.89,152 కోట్లు మేఘా ఇంజినీరింగ్: రూ.67,500 కోట్లు అరబిందో ఫార్మా: రూ.50,470 కోట్లు హెటెరో డ్రగ్స్: రూ.24,100 కోట్లు లారస్ ల్యాబ్స్: రూ.19,464 కోట్లు సైయెంట్: రూ.17,600 కోట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్: రూ.17,500 కోట్లు డెక్కన్ కెమికల్స్: రూ.15,400 కోట్లు కిమ్స్: రూ.15,190 కోట్లు ఇదీ చదవండి: రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్.. ఈ జాబితాలో సువెన్ఫార్మా, నాట్కోఫార్మా, తాన్లా ప్లాట్ఫామ్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఆరజెన్ లైఫ్సైన్సెస్, అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, యశోదా హాస్పిటల్స్, మెడ్ప్లస్, ఒలెక్ట్రాగ్రీన్టెక్, ఎన్సీసీ, సీసీఎల్ ప్రొడక్ట్స్, హెచ్బీఎల్ పవర్, గ్రాన్యూల్స్, మేధా సర్వో డ్రైవ్స్, కేఫిన్ టెక్, ఎంటార్ కంపెనీలు ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ ఒకే - పరిమితుల పెంపునకు అనుమతి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, యాక్సిస్ మొదలైన 6 సంస్థల్లో అధిక వాటాల కొనుగోలుకి ఆర్బీఐ అనుమతించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వీటితో పాటు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లలో గ్రూప్ స్థాయిలో 9.5 శాతం వాటా వరకూ సొంతం చేసుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ కింద హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితర సంస్థలున్నాయి. పెట్టుబడి పరిమితుల పెంపు కోసం వీటి తరఫున ప్రమోటర్/గ్రూప్ స్పాన్సర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023 డిసెంబర్ 18న ఆర్బీఐకు దరఖాస్తు చేయగా.. ఈ నెల(ఫిబ్రవరి) 5న ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. వెరసి 2025 ఫిబ్రవరి 4వరకూ అంటే ఏడాదిపాటు ఆర్బీఐ అనుమతులు అమలుకానున్నాయి. ఆయా బ్యాంకుల్లో మరింత ఇన్వెస్ట్ చేసే యోచనేమీ లేనప్పటికీ, వాటిల్లో తమ గ్రూపు సంస్థల మొత్తం వాటాలు నిర్దేశిత 5 శాతం పరిమితిని దాటే అవకాశం ఉండటంతోనే పెట్టుబడి పరిమితిని పెంచాలని ఆర్బీఐని కోరినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. -
క్రెడిట్ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ రికార్డు!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. వినియోగంలో ఉన్న రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మైలురాయిని సాధించిన తొలి బ్యాంక్గా నిలిచింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. అన్ని బ్యాంకులు మొత్తంగా జారీ చేసిన 9.6 కోట్ల క్రెడిట్ కార్డులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దాదాపు 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక కార్డు వ్యయాల్లో 2023 మార్చి 31 నాటికి తమ వాటా 28.6 శాతం ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. లేటుగా ప్రారంభించినా.. క్రెడిట్ కార్డ్లను ప్రారంభించిన ప్రధాన బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చివరిది కావడం గమనార్హం. ఎస్బీఐ తన కార్డ్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించగా ఐసీఐసీఐ బ్యాంక్ 2000లో క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2001లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇతర బ్యాంకులు మందగించినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఓ వైపు కస్టమర్లతోపాటు మరోవైపు వ్యాపారులపైనా దృష్టి పెడుతూ స్థిరంగా దాని పోర్ట్ఫోలియోను అభివృద్ధి చేసుకోగలిగింది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 90లలో సిటీ బ్యాంక్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత దేశీయ ప్రైవేట్ బ్యాంకులు విస్తరించడంతో విదేశీ బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోయాయి. -
లిఫ్ట్లో ఇరుక్కుపోయి విలవిలలాడిన సెక్యూరిటీ గార్డు
నిజామాబాద్: కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లో దారుణం చోటుచేసుకుంది.. కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోవడంతో గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ రెండు కాళ్ళు బయట..బాడీ లిఫ్ట్ లో ఇరుక్కుపోడంతో కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరి ఉండడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 39% జంప్
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2023–24, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 12,735 కోట్లతో పోలిస్తే 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలు ఇలా... బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) క్యూ3లో స్వల్పంగా పెరిగాయి. 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికర ఎన్పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది. -
ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
2024లోనే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 'ఫిక్స్డ్ డిపాజిట్' వడ్డీ రేట్లను పెంచనున్నట్లు పెంచుతున్నట్లు ప్రకటించి శుభవార్త చెప్పింది. ఈ కథనంలో ఏ బ్యాంకు ఎంత మేర వడ్డీ పెంచింది, దాని వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ఈ వడ్డీ రేట్లు గతంలో ఉన్న వడ్డీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్లంటూ 0.50 శాతం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 రోజుల నుంచి 45 రోజులకు సాధారణ వడ్డీ 3.50 శాతం అనుకుంటే సీనియర్ సిటిజన్లను 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI) భారతదేశంలో రెండవ అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కూడా వడ్డీ రేట్లను 6.7 సంత నుంచి 7.25 శాతానికి పెంచింది. 61 రోజుల నుంచి 90 రోజులకు 6 శాతం, 91 రోజుల నుండి 184 రోజులకు 6.5 శాతం, 185 రోజుల నుంచి 270 రోజులకు 6.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు 7.25 శాతం వడ్డీ అందించనుంది. జనవరి 3 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC) 2023 అక్టోబరు నుంచి HDFC బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల కాలనీ వడ్డీ 6.6 శాతం, 15 నెలల నుంచి 18 నెలల వరకు వడ్డీ 7.10 శాతం, 18 నెలల నుంచి 21 నెలలకు వడ్డీ 7 శాతం, 21 నెలల నుంచి 2 సంవత్సరాల కాలనీ 7 శాతం వడ్డీ అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2023 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 6.85 శాతం వడ్డీ, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వ్యవధికి 7.25 శాతం వడ్డీ, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి వడ్డీ 6.5 శాతం అందిస్తోంది. వీటితో పాటు బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ అని పిలువబడే 399 రోజుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ పొందవచ్చు. ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 2023 డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.7 శాతం ఆఫర్ చేస్తోంది . 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతం అందిస్తుంది. డీసీబీ బ్యాంక్ (DCB Bank) 2023 డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం వినియోగదారుని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సంవత్సరానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు 7.15 శాతం వడ్డీని, 25 నెలల లేదా 26 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు 8 శాతం అందించడం జరుగుతుంది. -
ఆర్బీఐ కంటే ముందే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని కాలపరిమితుల రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా 0.05 శాతం (ఐదు బేసిస్ పాయింట్లు) పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడచిన ఐదు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లోనూ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5%) పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, హెచ్డీఎఫ్సీ తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి ఎగసింది. కాగా, సాధారణంగా అధిక రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది రుణ రేటు మాత్రం 9.20 శాతం వద్ద స్థిరంగా ఉంది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు షాకిచ్చింది. తాజా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక వడ్డరీట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బెంచ్మార్క్ లెండింగ్ రేట్లను సైలెంట్గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) గరిష్టంగా 10 పాయింట్ల బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 bps 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానిచేరింది మూడు నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్ఆర్ 9.25 శాతంగా ఉంటుంది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ సీఈవోకు డెలాయిట్లో కీలక పదవి
ప్రముఖ బ్యాంకర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పూరి (Aditya Puri)కి ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ డెలాయిట్ (Deloitte) కీలక పదవి ఇచ్చింది. కంపెనీ సీనియర్ సలహాదారుగా నియమించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి బిజినెస్ లీడర్లలో ఒకరిగా పేరుపొందిన ఆదిత్య పూరి 1994లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థలో 26 సంవత్సరాలపాలు సేవలందించారు. 2020లో పదవీ విరమణ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయిన డెలాయిట్లో చేరినందుకు సంతోషిస్తున్నానని ఆదిత్య పూరి పేర్కొన్నారు. విశేష అనుభవం, దూరదృష్టి గల ఆదిత్యపూరి నియామకంపై డెలాయిట్ సౌత్ ఏషియా సీఈఓ రోమల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జూన్లో భారతి ఎయిర్టెల్, సాఫ్ట్బ్యాంక్ ఇండియా మాజీ సీఈవో మనోజ్ కోహ్లీని సీనియర్ సలహాదారుగా డెలాయిట్ నియమించుకుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డు.. అదిరిపోయే ట్రావెల్ బెనిఫిట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారియట్ బాన్వాయ్ కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనికి రూ. 3,000 వార్షిక ఫీజు ఉంటుంది. ఎయిర్పోర్ట్ లాంజ్లకు యాక్సెస్, గోల్ఫ్ సెషన్లు, హోటళ్లలో కాంప్లిమెంటరీ బస తదితర ప్రయోజనాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చని సంస్థలు తెలిపాయి. ఏటా 25–30 శాతం కొత్త కార్డులను జారీ చేస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ బిజినెస్ హెడ్ పరాగ్ రావు తెలిపారు. ఇతర పోటీ ఆర్థిక సంస్థలు మొండి బాకీల సమస్యలు ఎదుర్కొంటున్నా తమ అసెట్స్ నాణ్యత మాత్రం మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 జూన్ ఆఖరు నాటికి మార్కెట్లో 1.83 కోట్ల పైచిలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు ఉన్నాయి. -
ఇక ముందూ ఇళ్లకు డిమాండ్.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి
కోల్కతా: ఇళ్ల కోసం డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్ చాలా తక్కువని చెప్పారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు. గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్డీఎఫ్సీ ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్పీఏలతో భారత బ్యాంకింగ్ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు. వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్కు తోడు ఈఎస్జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వృద్ధి అంచనాలను మించింది. భారత్ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్గా భారత్ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు. -
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్! షాకిచ్చిన టాప్ ప్రైవేట్ బ్యాంక్
HDFC Bank hikes loans interest rates: విలీనం తర్వాత అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్గా అవతరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ రుణ రేట్ల పెంపు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా ఉంది.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎగిసి 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. మూడు నెలలకుగానూ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.6 శాతం నుంచి 8.7 శాతాన్ని తాకింది. ఇక ఆరు నెలలకయితే 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9 శాతం నుంచి 8.95 శాతానికి ఎగసింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రేట్ను 9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ అంటే.. ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
హెచ్డీఎఫ్సీ సీఈవో శశిధర్ వార్షిక వేతనం ఎంతో తెలుసా?
HDFC Bank CEO Sashidhar Jagdishan Salary: మెగా మెర్జర్ తరువాత ప్రైవేటు బ్యాంకింగ్దిగ్గజం హెచ్డీఎఫ్సీ ప్రపంచ బ్యాంకింగ్లో 7వ ర్యాంక్ను సాధించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మార్కెట్ అంచనాలను మించి తొలి త్రైమాసిక లాభంలో 30 శాతం పెరిగింది. ఈ సందర్బంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీషన్ వార్షిక వేతనం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవో వార్షిక వేతనంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లతో పోలిస్తే, ఎఫ్వై23లో జగదీషన్ మొత్తం ఆదాయం రూ.10.55 కోట్లుగా ఉంది. రెమ్యునరేషన్ ప్యాకేజీలో రూ. 2.82 కోట్ల బేసిక్ జీతం, రూ. 3.31 కోట్ల అలవెన్సులు , పెర్క్విసైట్లు ఉండగా, రూ. 3.63 కోట్ల పనితీరు బోనస్ ఉన్నాయి.2021-2022కి, జగదీషన్కు మొత్తం రూ. 5.16 కోట్ల నగదు వేరియబుల్ పేను ఆర్బిఐ ఆమోదించింది, అందులో అతను రూ. 2.58 కోట్లు అందుకున్నారు. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) 2020-2021లో క్యాష్ వేరియబుల్ పేలో భాగంగా రూ. 1.05 కోట్లు అందుకున్నారు. అదే సమయంలో, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భారుచా మార్చి 31, 2023తో ముగిసే సంవత్సరానికి రూ. 10.03 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. ఇది మునుపటి వార్షిక వేతనం రూ. 10.64 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. (Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత) హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పుడు సాంకేతిక పరివర్తన సాధనలో ఉందని, భవిష్యత్తులో బ్యాంకును నిర్మించడంతోపాటు, సమర్ధవంతంగా నడపడంపై దృష్టి సారిస్తుందని షేర్హోల్డర్లను ఉద్దేశించి జగదీషన్ పేర్కొన్నారు. 2022-23లో, బ్యాంక్ రికార్డు స్థాయిలో 1,479 శాఖలను జోడించిందని, వీటిలో ఎక్కువ భాగం సెమీ అర్బన్, రూరల్ (ఎస్యుఆర్యు) లో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం మరో 675ని జోడించాలని యోచిస్తోందని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 5,000కి చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం మీద, ఏడాదిలో 1,500 నుండి 2,000 అదనపు శాఖలను జోడించాలని బ్యాంక్ యోచిస్తోందని శశిధర్ చెప్పారు. కాగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1లో నికర లాభం 29 శాతం జంప్చేసి రూ. 12,370 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. అలాగే మెగా విలీనం తరువాత బ్యాంకు షేర్లు బాగా లాభపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. అలాగే డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసి ఏడో స్థానాన్ని ఆక్రమించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ1 భేష్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 29 శాతం జంప్చేసి రూ. 12,370 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 9,579 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది (2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్జించిన రూ. 12,594 కోట్లతో పోలిస్తే తాజా లాభం స్వల్పంగా తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ. 44,202 కోట్ల నుంచి రూ. 61,021 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ వ్యయాలు 34 శాతం పెరిగి రూ. 15,177 కోట్లకు చేరాయి. ఈ జూలై 1 నుంచి బ్యాంక్ మాతృ సంస్థ, మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ ఆదాయం అప్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం నుంచి 1.17 శాతానికి నామమాత్రంగా పెరిగాయి. గతేడాది క్యూ4లో నమోదైన 1.28 శాతం నుంచి చూస్తే నీరసించాయి. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం ఎగసి రూ. 11,952 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం బలపడి రూ. 23,599 కోట్లకు చేరింది. ఇందుకు అడ్వాన్సుల(రుణాలు)లో నమోదైన 15.8 శాతం వృద్ధి, 4.1 శాతానికి బలపడిన నికర వడ్డీ మార్జిన్లు దోహదం చేశాయి. ఈ కాలంలో రూ. 9,230 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించింది. ఇందుకు రూ. 552 కోట్లమేర ట్రేడింగ్ లాభాలు సహకరించాయి. గతేడాది క్యూ1లో ఈ పద్దుకింద రూ. 1,077 కోట్ల నష్టం ప్రకటించింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,122 కోట్ల నుంచి రూ. 2,860 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతాన్ని తాకింది. ఇతర విశేషాలు... ► జూన్కల్లా బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,81,725కు చేరింది. ► అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు జంప్ చేసింది. ► హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లాభం దాదాపు యథాతథంగా రూ. 189 కోట్లుగా నమోదైంది. ► బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య 7,860కు చేరింది. వీటిలో 52 శాతం సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. ► గతేడాది 1,400 బ్రాంచీలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది సైతం ఈ బాటలో సాగనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. మార్కెట్ క్యాప్ రికార్డ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,679 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి మార్కెట్ విలువరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 18.91 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 12.77 లక్షల కోట్లు) తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది. అంతేకాకుండా డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసింది. ప్రపంచ బ్యాంకింగ్లో 7వ ర్యాంక్ ర్యాంక్ బ్యాంక్ పేరు మార్కెట్ క్యాప్ 1. జేపీ మోర్గాన్ 438 2. బ్యాంక్ ఆఫ్ అమెరికా 232 3. ఐసీబీసీ(చైనా) 224 4. అగ్రికల్చరల్ బ్యాంక్(చైనా) 171 5. వెల్స్ ఫార్గో 163 6. హెచ్ఎస్బీసీ 160 7. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 154 (విలువ బిలియన్ డాలర్లలో– విదేశీ బ్యాంకులు శుక్రవారం(14న) ధరల్లో) -
రికార్డు స్థాయిలో ‘క్రెడిట్ కార్డ్’ వినియోగం
ముంబై: క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డులపై రూ.1.4 లక్షల కోట్లు వ్యయం చేయడమే ఇందుకు నిదర్శనం. క్రెడిట్ కార్డులపై బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండగా, ఈ ఏడాది ప్రతీ నెలా 5 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నట్టు ఆర్బీఐ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి క్రెడిట్ కార్డుల సంఖ్య 50 లక్షలకు పైగా పెరిగింది. మే చివరికి మొత్తం 8.74 కోట్లకు కార్డుల సంఖ్య చేరింది. కొత్తగా జారీ అయిన క్రెడిట్ కార్డుల్లో 20 లక్షల యూజర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే గణనీయంగా వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో యాక్టివ్ (వినియోగంలో ఉన్నవి) క్రెడిట్ కార్డుల సంఖ్య 8.24 కోట్లు కాగా, ఫిబ్రవరిలో 8.33 కోట్లు, మార్చి చివరికి 8.53 కోట్లు, ఏప్రిల్ చివరికి 8.65 కోట్లు చొప్పున పెరుగుతూ వచి్చంది. 2022–23లో ఏడాది అంతటా క్రెడిట్ కార్డులపై వినియోగం ప్రతి నెలా సగటున రూ.1.1–1.2 లక్షల కోట్లుగా ఉంటూ వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలకు వచ్చే సరికి రూ.1.4 లక్షల కోట్లకు పెరిగింది. ఒక్కో కార్డుపై సగటు వ్యయం రూ.16,144గా ఉంది. మొదటి స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మే చివరి నాటికి 1.81 కోట్ల కార్డులతో (వినియోగంలో ఉన్న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ లీడర్గా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డు రుణాల పరంగానూ 28.5 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.73 కోట్ల కార్డులతో ఎస్బీఐ కార్డ్ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.46 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1.24 కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిటీ బ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో, 1,62,150 లక్షల కొత్త కార్డులు యాక్సిస్ బ్యాంక్ పోర్ట్ఫోలియోకు తోడయ్యాయి. మరోవైపు క్రెడిట్ కార్డు రుణాలు గణనీయంగా వృద్ధి చెందుతుండడంతో, ఈ విభాగంలో నిరర్థక ఆస్తులు (వసూలు కాని బకాయిలు/ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి 2.94 శాతానికి చేరినట్టు ఇటీవలే ట్రాన్స్యూనియన్ సిబిల్ ఓ నివేదిక రూపంలో వెల్లడించడం గమనార్హం. -
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్
మెగా మెర్జర్ తరువాత ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాల్లో నిలిచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ఎంసిఎల్ఆర్ను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అవకాశం ఉంది. సవరించిన వడ్డీరేట్లు శుక్రవారం ( జూలై 7 ) నుంచే అమలులోకి వచ్చాయి. బెంచ్మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దీంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఆటో లోన్ సహా అన్ని రకాల రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది. (డైనమిక్ లేడీ నదియా వ్యాపారం, ఆమె కిల్లర్ మూవ్ గురించి తెలుసా?) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 8.1 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు పెంపుతో ఇది 8.2 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది. మూడు నెలలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.5 శాతం నుంచి 8.6 శాతంగానూ,5 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.9 శాతంగా ఉండనుంది. అయితే ఏడాది ఆపైన వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం వద్ద యథాతథంగా ఉంటుంది. (మెక్డొనాల్డ్స్కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?) -
హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ డిమాండ్ క్షీణత
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ వితరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 బేసిస్ పాయింట్ల వరకు (3 శాతం) తగ్గి 13–13.5 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 15.4 శాతంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జూన్ 16 నాటికి ముగిసిన పక్షం రోజుల్లో రుణ వితరణ 15.4 శాతం పెరిగి ఈ ఏడాది రూ.140.2 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు ఈ డిమాండ్ను నడిపించినట్టు చెప్పింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13.2 శాతం వృద్ధి కంటే ఎక్కువ నమోదైంది. డిపాజిట్లు కూడా జూన్ 16తో ముగిసిన పక్షం రోజుల్లో 12.1 శాతం పెరిగాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం 337 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఇక గడిచిన 12 నెలల్లో డిపాజిట్లు రూ.20 లక్షల కోట్లకు విస్తరించగా, రుణాలు రూ.18.7 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో టాప్
న్యూఢిల్లీ: మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను విలీనం చేసుకున్న ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల రీత్యా టాప్ ర్యాంకుకు చేరింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)లో రూ. 60,000 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) రూ. 50,232 కోట్ల నికర లాభంతో ద్వితీయ ర్యాంకులో నిలిచింది. అయితే మొత్తం బిజినెస్(డిపాజిట్లు, అడ్వాన్సులు)లో ఎస్బీఐ 70.3 లక్షల కోట్లతో అగ్రపథాన నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 41 లక్షల కోట్లు మాత్రమే. కాగా.. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా ప్రపంచ రుణదాత సంస్థలలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. నెట్వర్త్ రూ. 4.14 లక్షల కోట్లను తాకింది. విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ 25 షేర్లకుగాను 42 బ్యాంకు షేర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులో హెచ్డీఎఫ్సీ వాటా 41 శాతానికి చేరనుండగా.. పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతంగా నమోదుకానుంది. బ్యాంకు షేర్ల జారీకి ఈ నెల 13 రికార్డ్ డేట్గా నిర్ణయించింది. షేర్ల మారి్పడి ద్వారా విలీనానికి తెరతీయగా.. లావాదేవీ విలువ 40 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్కాగా.. 4,000 మంది హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు బ్యాంకుకు బదిలీకానున్నారు. -
కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం!
HDFC Merger: భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో ఈ రోజు (జులై 01) విలీనం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతంలోనే వెల్లడైంది, కానీ ఈ రోజు ఇరు కంపెనీల బోర్డుల ఆమోదంతో మర్జర్కు లైన్ క్లియర్ అవుతుంది. దేశంలోనే తొలి హోమ్ ఫైనాన్స్ సంస్థగా పేరు పొందిన హెచ్డీఎఫ్సీ ఇక కనిపించదు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన విషయం తెలసిందే. కావున రికార్డ్ డేట్ తరువాత హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - వివో వై36 నుంచి వన్ప్లస్ నార్డ్ వరకు..) సంబంధిత అధికారులు నాన్ కన్వర్టెబుల్ డిబెంచర్స్ బదిలీకి జులై 12, హెచ్డీఎఫ్సీ కమర్షియల్ పేపర్స్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్ను ఫిక్స్ చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి హెచ్డీఎఫ్సీ తన పేరెంట్ కంపెనీ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కలవడానికి సుముఖత చూపింది. కాగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) నివేదికల ప్రకారం.. మార్చి 2023 నాటికి, హెచ్డీఎఫ్సీ & హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార విలువ రూ. 41 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో లాభాలు రూ. 60 వేల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక త్వరలో హెచ్డీఎఫ్సీలోని ఉద్యోగులందరు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా మారిపోతారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం
దేశీయ హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. ప్రైవేట్ బ్యాంక్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో విలీనం కానుంది. విలీనం ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీప్క్ పరేక్ తెలిపారు. విలీనానికి ఆమోదం తెలిపేందుకు హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంక్ బోర్డులు జూన్ 30న సమావేశం కానున్నట్లు పరేఖ్ వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ వైస్ ఛైర్మన్ , సీఈవో కేకే మిస్త్రీ మాట్లాడుతూ.. కార్పొరేషన్ స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా పేర్కొందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఏడాది ఏప్రిల్ 4న హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్డీఎఫ్సీని స్వాధీనం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 40 బిలియన్ల డాలర్లు. విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీకి 41 శాతం వాటా ఉంటుంది. హెచ్డీఎఫ్సీకి చెందిన ప్రతి 25 షేర్లకు గానూ హెచ్డీఎఫ్సీ షేర్ హోల్డర్లకు 42 షేర్లు చొప్పున లభిస్తాయి. విలీన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్గా కొనసాగుతుంది. -
దేశంలో విలువైన కంపెనీ రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మరోసారి గుర్తింపు సొంతం చేసుకుంది. ‘2022 బుర్గుండీ ప్రైవేటు హరూన్ ఇండియా 500’ జాబితా మంగళవారం విడుదలైంది. 16.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంటే, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. రూ.9.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం అనంతరం రిలయన్స్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరికొన్ని ప్రత్యేకతలు కూడా సొంతం చేసుకుంది. 2022–23 సంవత్సరానికి రూ.67,845 కోట్ల లాభంతో అత్యంత లాభదాయక సంస్థగానూ ఉంది. అలాగే, అత్యధికంగా రూ.16,297 కోట్ల పన్నును చెల్లించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ అన్లిస్టెట్ కంపెనీల్లో అత్యంత విలువైన సంస్థగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.1.97 లక్షల కోట్లుగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ రూ.1.65 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. రూ.69,100 కోట్లతో బైజూస్ మూడో అత్యంత విలువైన అన్లిస్టెడ్ సంస్థగా ఉంది. 2022 అక్టోబర్ 30 నుంచి 2023 ఏప్రిల్ 30 మధ్య ఆరు నెలల కాలంలో దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువల వ్యత్యాసాన్ని బర్గుండీ ప్రైవేటు, హరూన్ ఇండియా ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించాయి. మార్కెట్ విలువ ఆధారంగానే వాటికి ర్యాంకులను కేటాయిస్తుంటాయి. దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువ 2022 అక్టోబర్ 30 నాటికి రూ.227 లక్షల కోట్లుగా ఉండగా, 2023 ఏప్రిల్ 30 నాటికి 6.4 శాతం క్షీణించి రూ.212 లక్షల కోట్లకు పరిమితమైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.71.5 లక్షల కోట్లుగా ఉంది. దేశ జీడీపీలో ఇది 37 శాతానికి సమానం. అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువను పెంచుకున్నాయి. అదానీ గ్రూపులో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ 52 శాతం క్షీణించింది. -
సిబ్బందిని బండబూతులు తిట్టిన బ్యాంక్ ఉన్నతోద్యోగి.. వీడియో వైరల్
వ్యాపారానికి సంబంధించి ఉద్యోగులకు టార్గెట్లు అన్ని ప్రైవేటు కంపెనీల్లోనూ సాధారణంగా ఉండేవే. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పైత్యం మరీ ఎక్కువగా ఉంటుంది. రిటైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా బ్యాంకులు చేస్తుంటాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించేందుకు ఉద్యోగులకు టార్గెట్లు పెడుతుంటాయి. ఇలా టార్గెట్లను సాధించే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నతోద్యోగి కింది స్థాయి ఉద్యోగులపై నోరు పారేసుకున్నారు. బండబూతులు తిట్టారు. ఆన్లైన్లో జరిగిన మీటింగ్లో ఉన్నతోద్యోగి సిబ్బందిని దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేయగా వైరల్గా మారింది. సదరు బ్యాంక్ ఉన్నతోద్యోగి రోజుకు 75 ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించాలని టార్గెట్ ఇచ్చాడని, అది సాధించడంలో విఫలమైన ఉద్యోగిని బెంగాలీ భాషలో తిట్టాడని మరో యూజర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఈ వైరల్ వీడియోపై స్పందించిన బ్యాంక్ యాజమాన్యం సదరు ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ట్విటర్ పెట్టిన వీడియోపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీస్ మేనేజర్ అజయ్ స్పందిస్తూ ఆ ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేశామని, బ్యాంకు నిబంధనల మేరకు పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #HDFC bank’s Manager Mr. Pushpal Roy. Employees were treated in an unprofessional way. I would have given back right there. Not sure why & how employees are tolerating. He is completely demoralised and done blatant attacked on employees. Should be fired ! #toxicworkenvironment pic.twitter.com/m0IrfqXl6b — Sara (@srchetlur) June 5, 2023 -
కష్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్
-
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రైవేట్ రంగంలో అతి పెద్దగా బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) ఇప్పుడు కస్టమర్లకు మరింత చెరువుగా ఉండటానికి మరిన్ని కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే దేశంలోనో అనేక ప్రధాన నగరాల్లో విస్తరించి కస్టమర్లకు సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పట్టణ వాసులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి కూడా చేరువవ్వాలని మరో 675 కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం వల్ల 'హెచ్డీఎఫ్సీ'లో అకౌంట్ ఉన్న వారు దూరంగా ఉన్న బ్రాంచిలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకు తన ఉనికిని మరింత విస్తరించడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశ వ్యాప్తంగా 675 బ్రాంచిలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ ముందుకు సాగుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న కారణంగా HDFC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరిన్ని శాఖలతో విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఊరట..
ముంబై: మాతృసంస్థ హెచ్డీఎఫ్సీతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు కొంత ఊరట లభించింది. కొన్ని అంశాల్లో ఆర్బీఐ స్వేచ్ఛను కల్పించగా, కొన్నింటి విషయంలో ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. రెండు సంస్థల విలీనం జూలై నాటికి పూర్తవుతుందని అంచనా. తాము దరఖాస్తు చేసిన కొన్ని అంశాల్లో ఆర్బీఐ నుంచి సమాచారం వచ్చిందని, మరికొన్ని అంశాలు పరిష్కృతం కావాల్సి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) విషయంలో వెసులుబాట్లకు ఆర్బీఐ తిరస్కరించింది. ప్రాధాన్య రంగాలకు రుణాలు (పీఎస్ఎల్), పెట్టుబడుల విషయంలో మాత్రం ఉపశమనం కల్పించింది. విలీనం తేదీ నుంచి సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్సీఆర్ను నిబంధనలకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితర సంస్థలు ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలు (సబ్సిడరీలు)గా ఉండగా.. విలీనం తర్వాత ఇవి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సబ్సిడరీలుగా కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతించింది. విలీనానికి ముందే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్లో వాటాని హెచ్డీఎఫ్సీ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 50 శాతానికి పైగా పెంచుకోవచ్చు. ఉన్నత విద్యకు రుణాలు అందించే హెచ్డీఎఫ్సీ క్రెడాలియా ఫైనాన్షియల్ సర్వీసెస్లో నూరు శాతం వాటా హెచ్డీఎఫ్సీకి ఉంది. రెండేళ్లలో ఈ వాటాని 10 శాతానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు తగ్గించుకోవాలి. కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
HDFC Bank Q4 Results: లాభాలతో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 12,595 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం ఇదే స్థాయిలో బలపడి రూ. 45,997 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండు ప్రకటించింది. మొత్తం బ్రాంచీల సంఖ్య 7,821కు చేరింది. క్యూ4లో 6,000 మందికి ఉపాధి కల్పించింది. మొత్తం సిబ్బంది సంఖ్య 1,73,222ను తాకింది. స్టాండెలోన్ సైతం క్యూ4లో స్టాండెలోన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం పుంజుకుని రూ. 12,048 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 24 శాతం జంప్చేసి రూ. 23,352 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదుకాగా.. 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం రూ. 7,637 కోట్ల నుంచి రూ. 8,731 కోట్లకు పెరిగింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,312 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 0.4 శాతం బలపడి 19.3 శాతాన్ని తాకింది. అనుబంధ సంస్థలలో బ్రోకింగ్ విభాగం లాభం రూ. 236 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు నీరసించగా.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం 28 శాతం ఎగసి రూ. 545 కోట్లను దాటింది. -
హెచ్డీఎఫ్సీ రుణాల్లో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మార్చి చివరినాటికి రుణాల్లో 16.9 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ‘2022 మార్చి 31 నాటికి మొత్తం రుణాలు రూ.13.6 లక్షల కోట్లు. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో వాణిజ్య రుణాలు 30 శాతం, గ్రామీణ ప్రాంత రుణాలు 9.5 శాతం వృద్ధి సాధించాయి. దేశీయ రిటైల్ రుణాలు దాదాపు 21 శాతం, కార్పొరేట్, టోకు రుణాలు 12.5 శాతం దూసుకెళ్లాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి 31 నాటికి డిపాజిట్లు 20.8 శాతం ఎగసి రూ.18.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్తో హోమ్ లోన్ ఏర్పాటు కింద డైరెక్ట్ అసైన్మెంట్ రూట్ ద్వారా బ్యాంక్ రూ.9,340 కోట్ల రుణాలను మార్చి త్రైమాసికంలో కొనుగోలు చేసింది. హెచ్డీఎఫ్సీని 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు 2022 ఏప్రిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంగీకరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరం రెండవ, లేదా మూడవ త్రైమాసికంలో విలీనం పూర్తి అయ్యే అవకాశం ఉంది. -
హెచ్డీఎఫ్సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ పేరుతో ఓ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ను విడుదల చేసింది. ప్రయాణ, లైఫ్స్టయిల్ ప్రయోజనాలు ఈ కార్డుతో పొందొచ్చని బ్యాంక్ ప్రకటించింది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ను ఉచితంగా అందిస్తోంది. ప్రీమియం మైల్ స్టోన్ ప్రయోజనాలు కూడా కార్డులో భాగం. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! ఇది అందరికీ కాకుండా అధిక ఆదాయం ఉన్న వారికే బ్యాంక్ జారీ చేయనుంది. అంతర్జాతీయ ప్రయాణాలు, హోటళ్ల బుకింగ్లు, లైఫ్ స్టయిల్ కోసం ఖర్చు, కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా ఈ కార్డును తీసుకొచ్చింది. రిలయన్స్ డిజిటల్, మింత్రా, నైకాలో కొనుగోళ్లపై 5 రెట్ల రివార్డులు వస్తాయి. ప్రతి రూ.150 రిటైల్ వ్యయంపై 4 రివార్డు పాయింట్లు లభిస్తాయి. వార్షిక వ్యయం లక్ష్యాలను చేరుకున్న కస్టమర్లకు రెండు ఫ్లయిట్ టికెట్ వోచర్లు అందిస్తుంది. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్డీఎఫ్సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్లో 41 శాతం వాటా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్డీఎఫ్సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
హెచ్డీఎఫ్సీ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ క్రెడిట్ కార్డ్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ హోల్సేల్ కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ను విడుదల చేశాయి. ఫ్లిప్కార్ట్ హోల్సేల్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డ్ను తీసుకొచ్చాయి. డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్పై ఈ కార్డు పనిచేస్తుంది. 200కు పైగా దేశాల్లో ఈ కార్డ్ పనిచేస్తుందని ఇరు సంస్థలు తెలిపాయి. ఫ్లిప్ కార్ట్ హోల్సేల్ సభ్యులు (కిరాణా వర్తకులు).. ఈ క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్తో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ప్లాట్ఫామ్పై చేసే వ్యయంలో 5 శాతం క్యాష్ బ్యాంక్గా పొందొచ్చు. యాక్టివేషన్ క్యాష్ బ్యాక్ కింద రూ.1,500ను ఆఫర్ చేస్తున్నాయి. జాయినింగ్ ఫీజు లేదు. యుటిలిటీ బిల్లులు, ఇతర వ్యయాలపై అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇవీ చదవండి: ఫ్లిప్కార్ట్ సేల్లో బంపర్ ఆఫర్: నథింగ్(1) ఫోన్పై రూ. 30వేలు తగ్గింపు ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్!
తరచూ రైలు ప్రయాణాలు చేసే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఆర్సీటీసీ) ప్రత్యేకంగా మరో ట్రావెల్ క్రెడిట్ కార్డును తీసుకొస్తోంది. ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కలిసి కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ను ప్రారంభించాయి. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్పీసీఐ రూపే నెట్వర్క్లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్లలో ఈ కార్డును ఉపయోగించి బుక్ చేసే రైలు టిక్కెట్లపై ప్రత్యేకమైన ప్రయోజనాలతోపాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ మెరుగైన ఆన్లైన్ లావాదేవీలు, అత్యుత్తమ ప్రయోజనాలతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక లాంజ్లకు ప్రత్యేక యాక్సెస్ను అందిస్తుందని ఐఆర్సీటీసీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ సహిజ పేర్కొన్నారు. ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం పొందిన మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకు తమదేనని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావ్ తెలిపారు. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులతో కూడా ఐఆర్సీటీసీ ఇలాంటి భాగస్వామ్యాలు చేసుకుంది. ట్రావెల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు: ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్పీసీఐ రూపే నెట్వర్క్లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ టికెటింగ్ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్ ద్వారా బుక్ చేసిన టిక్కెట్లపై గరిష్ట తగ్గింపు. ఆకర్షణీయమైన జాయినింగ్ బోనస్, బుకింగ్లపై తగ్గింపులు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని ఎగ్జిక్యూటివ్ లాంజ్లకు యాక్సెస్. (ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో...) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్–లులు భాగస్వామ్యం
తిరువనంతపురం: ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూఏఈకి చెందిన లులు ఎక్సే్చంజ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు భారత్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) ప్రాంతంలో సీమాంతర చెల్లింపులను బలోపేతం చేస్తాయి. తొలి దశలో రెమిట్నౌ2ఇండియా సేవలను హెచ్డీఎఫ్సీ అందుబాటులోకి తేనుంది. యూఏఈ నుంచి కస్టమర్లు భారత్లోని ఏదేని బ్యాంక్ ఖాతాకు ఐఎంపీఎస్, నెఫ్ట్ విధానంలో హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ వేదికల ద్వారా నగదు పంపవచ్చు. భారత్లో లులు ఫారెక్స్, లులు ఫిన్సర్వ్ కంపెనీల బలోపేతానికి సైతం ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బ్యాంక్ తెలిపింది. -
యూపీఐకి క్రెడిట్ కార్డుల అనుసంధానం.. ఫస్ట్ టైమ్!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు వరకు యూపీఐకి కేవలం బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలను లింక్ చేసుకుని చెల్లింపులు చేసుకోవాల్సి వచ్చేది. ఆర్బీఐ క్రెడిట్ కార్డుల లింకింగ్ కూడా అనుమతించడంతో పరిశ్రమలో ఈ మేరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఇక నుంచి హెచ్డీఎఫ్సీ బ్యంక్ రూపే క్రెడిట్ కార్డులను ప్రముఖ యూపీఐ ప్లాట్ఫామ్లపై అనుసంధానించుకుని, వినియోగించుకోవచ్చు’’ అని హెచ్డీఎఫ్సీ బ్యంక్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కస్టమర్లకు డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా మారతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్రావు తెలిపారు. యూపీఐపై రూపే క్రెడిట్ కార్డ్ అనుసంధానం నిజంగా పరిశ్రమ రూపురేఖలను మారుస్తుందని భావిస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సీవోవో ప్రవీణ్ రాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ3 గుడ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్చేసి రూ. 12,698 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 19 శాతం బలపడి రూ. 12,260 కోట్లయ్యింది. ఈ కాలంలో 20 శాతం రుణ వృద్ధి కారణంగా నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 22,988 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం రూ. 300 కోట్లు పెరిగి రూ. 8,540 కోట్లకు చేరింది. రుణ నాణ్యత అప్: క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) నిలకడను చూపుతూ 1.23%గా నమోదైంది. నిర్వహణ వ్యయాలు 27 శాతం పెరిగి రూ. 12,464 కోట్లకు చేరగా.. 4,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,66,890ను తాకింది. . కాగా.. అనుబంధ సంస్థలలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నికర లాభం రూ. 258 కోట్ల నుంచి రూ. 203 కోట్లకు తగ్గింది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ. 304 కోట్ల నుంచి రూ. 501 కోట్లకు జంప్చేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% బలహీనపడి రూ. 1,586 వద్ద ముగిసింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ!
ముంబై: గృహ రుణాలకు సంబంధించి దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ రేటు భారీగా 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 8.65 శాతానికి ఎగసింది. పెరిగిన రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. మే నెల నుంచి హెచ్డీఎఫ్సీ రుణ రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. కాగా, 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే 8.65 శాతం కొత్త రేటు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యల్ప రేటు అని కూడా వివరించింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్
-
హెచ్డీఎఫ్సీ విలీనానికి 10 నెలలు
ముంబై: మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీని విలీనం చేసుకునేందుకు మరో 8–10 నెలల సమయం పడుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. విలీనం వల్ల హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 0.20–0.30 శాతం మేర పెరుగుతుందని తెలిపారు. ఈ రెండు సంస్థలు విలీనంపై ఆమోదం కోసం శుక్రవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాయి. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద విలీనం కానుంది. అయితే, విలీనం వల్ల బ్యాలన్స్ షీటు పెద్దగా మారనుంది. దీంతో ఆర్బీఐ నియంత్రణలకు అనుగుణంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన నగదు నిల్వలు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అవసరాలను వాటాదారులు ప్రస్తావించారు. ఈ విషయంలో ఆర్బీఐ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని అనుకున్నారు. దీనిపై హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ.. ఈ విషయంలో వాటాదారులు ఆందోళన చెందవద్దంటూ, ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ నుంచి ఏదైనా మినహాయింపు రాకపోయినా, విలీన సంస్థ వద్ద తగినంత లిక్విడిటీ ఉంటుందని.. తప్పనిసరి నిధుల అవసరాలను చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నట్టు తెలిపారు. కొన్నింటిని విక్రయిస్తాం.. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలన్నీ కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ కంపెనీలుగా మారతాయని.. బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి తెలిపారు. అదే సమయంలో బ్యాంకు కిందకు రాని కొన్ని వ్యాపారాలను (నిబంధనల మేరకు) విక్రయిస్తామని చెప్పారు. సబ్సిడరీల విలీనానికి ఆర్బీఐ, ఐఆర్డీఏఐ అనుమతి కోరతామన్నారు. వయసు రీత్యా తాను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరబోనని, చక్రవర్తి చైర్మన్గా సేవలు అందిస్తారని దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ డిపాజిట్లు అన్నీ బ్యాంక్ కిందకు వస్తాయని, వాటికి వడ్డీ చెల్లింపులు ఎప్పటి మాదిరే చేస్తామని జగదీశన్ తెలిపారు. -
మెరుగైన రాబడుల కోసం.. హెచ్డీఎఫ్సీ బిజినెస్ సైకిల్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా బిజినెస్ సైకిల్ ఫండ్ పేరిట కొత్త ఫండ్ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో నవంబర్ 25తో ముగుస్తుంది. సానుకూల పరిస్థితుల్లోకి మళ్లుతున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందించేందుకు ఈ ఫండ్ కృషి చేస్తుంది. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఇటు కంపెనీల ఆదాయ వృద్ధిపరంగాను, అటు వేల్యుయేషన్ల వృద్ధిపరంగాను ఒనగూరే ప్రయోజనాలను అందుకోవచ్చని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ నవ్నీత్ మునోత్ తెలిపారు. మూడేళ్లు అంతకు పైబడిన వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారికి ఇది అనువైనదిగా ఉండనుంది. చదవండి: ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి! -
వారెవ్వా.. ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఇది రెండో సారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు కాలవ్యవధి ఎఫ్డీలు 6.40% వడ్డీని పొందుతారు. 18 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై 6.50% వడ్డీని పొందనున్నారు. సీనియర్ సిటిజన్స్ హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు ఎఫ్డీల వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసింతే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం పెంచిన వడ్డీ రేటుపై మరో 0.50 శాతం అదనపు రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే సారి రెండు శుభవార్తలను అందించింది. బ్యాంక్లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీటితో పాటు రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి ఇప్పుడు 6.90% వడ్డీని అందిస్తోంది. చదవండి: ఆ ఐఫోన్ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై..
ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ సంస్థలు తన కస్టమర్లకు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ప్రతి రోజు లక్షలాది బ్యాంక్ ఖాతాదారులు అటు ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే వీటిలో పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం సేవలు అందిస్తున్న పలు బ్యాంకులు ఇటీవల ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్ చార్జీల బాదుడిని మొదలెట్టాయి. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో తెలుసుకుందాం! ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం పై ప్రతి ప్రాంతంలో ఉచితంగా 5 లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంక్ ఏటీఎం( ATM)లలో ఈ సంఖ్య మూడుకి తగ్గించింది. అవి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్. ఒకవేళ ఈ పరిమితి దాటి విత్డ్రా చేస్తే.. ఎస్బీఐ ఏటీఎంల్లో 5 లావాదేవీలు దాటాక ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి దాటి జరిపే వాటిపై రూ.20 వసూలు చేస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ HDFC బ్యాంక్ తన ఏటీఎం (ATM) నుంచి నెలకు 5 చొప్పున ఉచిత లావాదేవీలను అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మూడు కాగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు. ఆ తర్వాత, విత్డ్రా చేస్తే రూ. 21 కాగా, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 ఛార్జ్ చేస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ ICICI బ్యాంక్ కూడా 5, 3 రూల్స్ని పాటిస్తుంది. అనగా ఆరు మెట్రో స్థానాల్లో(ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్) ఐసీఐసీఐ ఏటీఎం ( ATM) నుంచి 5 విత్డ్రాలు, ఇతర బ్యాంక్ ATMల నుంచి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితం. దీని తర్వాత, బ్యాంకు ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో 5 ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకవేళ ఈ పరిమితి దాటిన ప్రతి నగదు లావాదేవీలపై రూ.21, ఆర్థికేతర లావాదీవీలపైన రూ.10 వసూలు చేస్తుంది. పీఎన్బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్ సిటీల పరిధిలో తమ ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు మాత్రమే ఉచితం. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, ఆర్థికేతర లావాదీవీల మీద రూ. 9 చార్జ్ చేస్తోంది. చదవండి: ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ -
భారీ పెంపు: పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పెంచింది. పీఎన్బీ రూ.2 కోట్ల వరకు ఎఫ్డీలపై రేట్లను సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం రెండో సారి. ఈ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం ఎఫ్డీలపై రేట్లను పెంచడం ఒక నెలలో ఇది రెండో పర్యాయం. వివిధ కాల పరిమితులపై రూ.2 కోట్ల వరకు చేసే ఎఫ్డీలపై 0.50 శాతం వరకు పెంచింది. రికరింగ్ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 26 నుంచే అమల్లోకి వచ్చాయి. -
దివాళీ బొనాంజా: బ్యాంకులు బంపరాఫర్లు.. కస్టమర్లకు పండగే!
కస్టమర్లకు బంపరాఫర్. దీపావళి సందర్భంగా కొత్త ఇల్లు, కారు కొనాలని అనుకుంటున్నారా? లేదా ఇల్లు రెనోవేట్ చేయాలని అనుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీరేట్ల నుంచి ఉపశమనం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ,ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు పరిమిత కాలానికి లోన్ ఆఫర్లను ప్రకటించాయి. ఎస్బీఐ గృహ రుణాలను సంవత్సరానికి 8.4 శాతం నుండి టాప్-అప్ రుణాలను 8.8 శాతం నుండి అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరానికి 8.45 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. 8.45 శాతం నుండి కార్ లోన్లను అందిస్తుంది. కారు రుణాలపై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంవత్సరానికి 7.9 శాతం చొప్పున కారు లోన్లను అందిస్తోంది. 50 శాతం పూర్తయిన తర్వాత (కనీసం 24 నెలలు) ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. బంగారం రుణాలపై, ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం మాఫీ చేసింది. ఐసీఐసీ బ్యాంక్ ప్రస్తుతం కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను అందిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను చెక్ చేసిన తర్వాత, ప్రీ-అప్రూవ్డ్ లోన్లను మంజూరు చేస్తుంది. కారు రుణాలపై, ప్రాసెసింగ్ రుసుము రూ. 1,999, కొత్త కారు రుణాలపై ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ మొత్తాలను అందిస్తుంది. కార్ లోన్లపై ఫోర్క్లోజర్, ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు. వ్యక్తిగత రుణాలపై 12 ఈఎంఐల తర్వాత ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు (12ఈఎంఐల కంటే ముందు ఫోర్క్లోజర్ చేస్తే 3 శాతం వసూలు చేస్తాయి). పంజాబ్ నేషనల్ బ్యాంకు పండుగ సీజన్లో పీఎన్బీ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 అనే పేరుతో గృహ రుణాలు, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.50 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. తిరిగి చెల్లించే వ్యవధి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కార్ లోన్లను అందిస్తుంది. ఇది సంవత్సరానికి వడ్డీ 7.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులు లేవు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పండుగ సీజన్లో గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 8.30 శాతం నుండి, కారు రుణాలను 8.70 శాతం నుండి అందిస్తోంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏడేళ్ల వరకు కార్ లోన్లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేసేలా 100 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తోంది. సాధారణంగా, బ్యాంకులు కారు రుణం 80-85 శాతం వరకు ఫైనాన్సింగ్ను అందిస్తాయి. ఇది 72 నెలల వరకు రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇతర ప్రముఖ బ్యాంకులతో పోలిస్తే, బ్యాంక్ ఎక్కువ కాలం పాటు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. గరిష్ట రుణ మొత్తం ఎక్కువగా ఉంటుంది. గృహ రుణాల కోసం 30ఏళ్ల వరకు సుదీర్ఘ కాల వ్యవధిని అందిస్తోంది. -
నిఫ్టీ సూచీ నుంచి హెచ్డీఎఫ్సీ తొలగింపు!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. విలీనానికి రికార్డ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే జనవరిలో ఇది ఉండొచ్చు. ఈ రికార్డ్ తేదీకి ముందే నిఫ్టీ–50 సూచీ నుంచి హెచ్డీఎఫ్సీని ఎన్ఎస్ఈ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ విలీనం దేశంలోనే పెద్దదిగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనానికి దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఇంకా కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంది. వాటాదారుల సమావేశం నవంబర్ 25న నిర్వహించనున్నారు. అలాగే, ఆర్బీఐ నుంచి తుది ఆమోదం కూడా రావాల్సి ఉంది. హెచ్డీఎఫ్సీకి నిఫ్టీ ఇండెక్స్లో 5.5 శాతం వెయిటేజీ ఉంది. దీంతో 1.3–1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు హెచ్డీఎఫ్సీ నుంచి వెళ్లిపోవచ్చని అంచనా. దీంతో నిఫ్టీ సూచీలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు నిఫ్టీ ఇండెక్స్లో 13 శాతం వెయిటేజీ రానుంది. ఇది పెద్ద మొత్తం కావడంతో ఇండెక్స్పై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఎస్ఈ దీనిపై ఓ చర్చా పత్రం విడుదల చేసింది. దీనిపై నవంబర్ 2 నాటికి అభిప్రాయాలు తెలియజేయాలని మార్కెట్ భాగస్వాములను కోరింది. విలీనం నేపథ్యంలో స్టాక్ ధరలు తీవ్ర అస్థిరతలకు గురి కాకుండా చూడడమే ఎన్ఎస్ఈ ఉద్దేశ్యం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22%ఎగసి రూ. 11,125 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 20 శాతం పుంజుకుని రూ. 10,606 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 8,834 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం బలపడి రూ. 21,201 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ 4.1 శాతంగా నమోదయ్యాయి. ఎన్పీఏలు మెరుగు ప్రస్తుత క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.35 శాతం నుంచి 1.23 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీల కేటాయింపులు రూ. 3,925 కోట్ల నుంచి తగ్గి రూ. 3,240 కోట్లకు పరిమితమయ్యాయి. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంపై వాటాదారుల సమావేశ నిర్వహణకు ఎన్సీఎల్టీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 40 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్కు 2022 ఏప్రిల్ 4న తెరలేచిన విషయం విదితమే. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
తెలుగు రాష్ట్రాల్లో 179 కొత్త శాఖలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 6–9 నెలల్లో కొత్తగా 179 శాఖలు ఏర్పాటు చేయనుంది. వీటిలో 90 తెలంగాణలో, 89 ఆంధ్రప్రదేశ్లో ఉండనున్నాయి. ఇందుకోసం 5,000 మంది సిబ్బందిని బ్యాంక్ తీసుకోనుంది. వ్యాపారవర్గాల కోసం రూపొందించిన స్మార్ట్హబ్ వ్యాపార్ యాప్ను ఆవిష్కరించిన సందర్భంగా బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ (దక్షిణాది) తరుణ్ చౌదరి గురువారం ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 588 శాఖలు ఉన్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో 10,000 రకాల పైచిలుకు ఆఫర్లు కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, స్మార్ట్హబ్ యాప్తో చెల్లింపులు, బ్యాంకింగ్ సర్వీసులు పొందడం వ్యాపార వర్గాలకు సులభతరం అవుతుందన్నారు. గతేడాది జూలైలో ప్రయోగాత్మకంగా యాప్ను ప్రవేశపెట్టామని, ఈ నెలాఖరు నాటికి యూజర్ల సంఖ్య 10 లక్షలకు చేరుకోనుందని చౌదరి తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీనానికి ఎన్హెచ్బీ ఆమోదం!
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమయ్యేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) నుంచి తమకు ఆమోదముద్ర లభించిందని గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. అలాగే రెండు అనుబంధ సంస్థలు.. హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ విలీనానికి కూడా అనుమతి దక్కిందని పేర్కొంది. ఆగస్టు 8న ఎన్హెచ్బీ ఈ మేరకు నిరభ్యంతర పత్రం జారీ చేసినట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల విలీన ప్రతిపాదనకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు స్టాక్ ఎక్ఛేంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. విలీన సంస్థకు దాదాపు రూ. 18 లక్షల కోట్ల మేర అసెట్లు ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ఇది పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో పబ్లిక్ షేర్హోల్డింగ్ 100 శాతానికి చేరుతుంది. హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్ల వాటా 41 శాతంగా ఉంటుంది. చదవండి👉 వాడకం మామూలుగా లేదుగా! పెరిగిపోతున్న క్రెడిట్ కార్డ్ల వినియోగం..ఎంతలా అంటే? -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.9,579 కోట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 21 శాతం పెరిగి రూ.9,579 కోట్లుగా నమోదైంది. కానీ, మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.10,055 కోట్లతో పోల్చినప్పుడు (సీక్వెన్షియల్గా) కొంత తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం వృద్ధితో రూ.19,481 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 4 శాతంగా ఉంది. ఇతర ఆదాయం సైతం 35 శాతం వృద్ధిని చూపించి రూ.7,700 కోట్లకు దూసుకుపోయింది. ఆస్తుల నాణ్యత స్థూల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు/ఎన్పీఏలు) జూన్ చివరికి 1.28 శాతానికి మెరుగుపడ్డాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 1.47 శాతంగా ఉన్నాయి. రుణాల్లో వృద్ధి కార్పొరేట్, హోల్సేల్ రుణాల్లో వృద్ధి 15.7 శాతానికి పరిమితం కాగా, రిటైల్ రుణాల్లో 21.7% వృద్ధి నమోదైంది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా రుణాల్లో 28.9 శాతం వృద్ధి సాధ్యమైంది. చదవండి: Google Play Store: 8 యాప్లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
’కరెంటు అకౌంట్’ నిబంధనల మార్పు,ప్రైవేట్ బ్యాంకులకు ఊతం!
ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్) విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 2020లో దేశీయంగా సీఎంఎస్లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్ నివేదిక వివరించింది. 2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్ బ్యాంకింగ్ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్ బ్యాంకింగ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్ క్యాపిటల్ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది.