HDFC Bank
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్, హడ్కో ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 2% నామమాత్ర వృద్ధితో రూ.16,736 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.16,373 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 17,258 కోట్ల నుంచి రూ.17,657 కోట్లకు స్వల్పంగా బలపడింది. రుణ వృద్ధి నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,15,016 కోట్ల నుంచి రూ. 1,12,194 కోట్లకు క్షీణించింది. వడ్డీ ఆదాయం ప్లస్...ప్రస్తుత సమీక్షా కాలంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ.30,650 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.11,450 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.43 శాతం వద్ద నిలకడను చూపాయి. ఆస్తుల (రుణాల) నాణ్యత విషయానికివస్తే తాజా స్లిప్పేజీలు రూ. 6,400 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.42 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.31 శాతం నుంచి 0.46 శాతానికి ఎగశాయి. అనుబంధ సంస్థలలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 470 కోట్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 410 కోట్లు, అసెట్ మేనేజ్మెంట్ రూ. 640 కోట్లు, సెక్యూరిటీస్ రూ. 270 కోట్లు చొప్పున లాభాలు ఆర్జించాయి. టాటా కమ్యూనికేషన్స్ లాభం హైజంప్రూ.257 కోట్లుగా నమోదున్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 257 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 45 కోట్లు ఆర్జించింది. అయి తే పన్ను సంబంధిత రూ. 185 కోట్ల వన్టైమ్ ప్రొవిజన్ ఇందుకు కారణం. కాగా.. మొత్తం ఆదా యం 3% బలపడి రూ. 5,798 కోట్లను తాకింది.ఇదీ చదవండి: ఐపీవో గ్రే మార్కెట్పై సెబీ కన్నురాణించిన హడ్కోడిసెంబర్ క్వార్టర్లో రూ.735 కోట్ల లాభంన్యూఢిల్లీ: పట్టణ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలు అందించే ప్రభుత్వరంగ హడ్కో డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు పరంగా రాణించింది. సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతం వృద్ధితో రూ.735 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.519 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం ఇదే కాలంలో రూ.2,023 కోట్ల నుంచి రూ.2,770 కోట్లకు వృద్ధి చెందింది. వాద్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (వీపీపీఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. రూ.25,000 కోట్ల వరకు రుణాన్ని సమకూర్చే అవకాశాలను ఈ ఒప్పందం కింద పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. వీపీపీఎల్ అన్నది జవహర్లాన్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్.. 4 రోజులు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్బ్యాంకింగ్, ఇన్స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్లను రీలోడ్ చేయవచ్చు.జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్లలో యూపీఐ సర్వీస్ నిలిపేస్తారు. మర్చెంట్ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ సేవలపై పని చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.కస్టమర్లకు అలర్ట్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ అప్డేట్ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్లకు సూచించింది. -
తగ్గనున్న ఈఎంఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్న్యూస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.ఎంసీఎల్ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే?"ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్ఆర్ భావనను వివరిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.పీఎల్ఆర్ ఇలా..ఎంసీఎల్ఆర్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.ఈబీఎల్ఆర్ గృహ రుణాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.హోమ్ లోన్ రేట్లుఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ.. ఈ రెండు రోజుల్లో పనిచేయదు
యూపీఐ సేవలకు సంబంధించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. అవసరమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్లో రెండు రోజుల పాటు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవ అందుబాటులో ఉండదని ప్రకటించింది.కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నవంబర్ 5, 23 తేదీలలో అవసరమైన సిస్టమ్ నిర్వహణ పనులు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు అంతరాయం ఉంటుందని వెల్లడించింది.ఈ సేవలు అందుబాటులో ఉండవు» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్ని వినియోగించే హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పేలో ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ని వినియోగించే మర్చంట్ల వద్ద కూడా యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు -
హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
పండుగ సీజన్ నేపథ్యంలో హోచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక రుసుము ఎంత?వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్ వార్షిక రుసుము రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు. -
మామూలు బ్యాంక్ బ్యాలెన్స్పైనా ఎక్కువ వడ్డీ!
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనంపంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ఐడీఎఫ్సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. -
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డ్లకు లాయల్టీ ప్రోగ్రామ్ సవరించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఈ అప్డేట్తో ప్రభావితమైన కస్టమర్లకు బ్యాంక్ ఈమెయిల్ పంపింది.అక్టోబర్ 1 నుండి స్మార్ట్బై ప్లాట్ఫామ్లో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డ్ పాయింట్ల రిడీమ్ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరిమితం చేసింది. అలాగే తనిష్క్ వోచర్లపై రివార్డ్ పాయింట్ల రిడీమ్ను కూడా ఒక క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా , ఇన్ఫినియా మెటల్ కార్డ్లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి: వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్ఫినియా మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం ద్వారా మాత్రమే అందిస్తారు. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఈ కార్డు జాయినింగ్/రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు రూ. 12,500. దీనికి పన్నులు అదనం. ఫీజు రియలైజేషన్, కార్డ్ యాక్టివేషన్ తర్వాత వెల్కమ్, రెన్యూవల్ బెనిఫిట కింద 12,500 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవారికి వచ్చే ఏడాది రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు ఉండదు. -
కూర్చున్న చోటే కుప్పకూలిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి..
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాద ఘటన జరిగింది. గోమతినగర్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగిని ఆఫీసులోనే తన డెస్క్లో కుర్చీలో నుంచి కిందపడి కుప్పకూలి మరణించింది. గోమతి నగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాదఫ్ ఫాతిమా (45) అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూలానే మంగళవారం కూడా ఉద్యోగ నిమిత్తం బ్యాంకుకు వెళ్లింది.ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్టుండి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయింది. గమనించిన తోటి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పని ఒత్తిడి వల్ల టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చని సహోద్యోగులు చెబుతున్నారు.ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టానికి పంపించామని తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.ఇక ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ సంఘటన దేశ ప్రస్తుత ఆర్థిక ఒత్తడిని ప్రతిబింబిస్తోందని, ఇలాంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయని తెలిపారు. దీనికి అడ్డుకట్ట పడాలంటే.. దేశంలోని అన్ని కంపెనీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు. -
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీలు (ఫొటోలు)
-
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
ఐదు లక్షల మంది రైతులకు సాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా చిన్న రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో ఒకటైన ‘పరివర్తన్’ ద్వారా ఈ సాయం అందించనున్నట్లు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డీఎండీ) కైజాద్ ఎం బారుచా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్యాంకు గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. స్థిరమైన వృద్ధిని పెంపొందించడంతోపాటు అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తోంది. 2014లో ప్రారంభమైన ‘పరివర్తన్’ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సీఎస్ఆర్ ప్రోగ్రామ్ల్లో ఒకటి. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తున్నాం. గత పదేళ్ల కాలంలో రూ.5000 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ఈ నిధులు పెంచుతాం. ఇప్పటికే పరివర్తన్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా నిలిచాం. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 25,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. స్మార్ట్ తరగతులు, పాఠశాల ఫర్నిచర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా 25000 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటుకేంద్ర ప్రభుత్వం 2013 తరువాత కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 135లో సీఎస్ఆర్ నిబంధనను చేర్చింది. దాని ప్రకారం కార్పొరేట్ సంస్థల నికర లాభంలో రెండు శాతం సీఎస్ఆర్కు కేటాయించాలి. ఆర్థిక సర్వేలోని వివరాల ప్రకారం గడిచిన ఎనిమిదేళ్లలో అన్ని దేశీయ కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ కింద దాదాపు రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేశాయి. -
రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!
హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా దాదాపు మూడు గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం..బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపేస్తున్నారు. బ్యాంకు వినియోగదారులు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఈ చర్యలు తీసుకుంటుంది.ఇదీ చదవండి: ఏడాదిలో 42 వేల మంది రాజీనామా!హెచ్డీఎఫ్సీ ప్రకటించిన సమయంలో బ్యాంకు కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) హోల్టర్లకు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్పే, ఫోన్పే, వాట్సప్పే, పేటీఎం..వంటి థర్డ్పార్టీ యాప్ల ద్వారా హెచ్డీఎఫ్సీ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదు. -
భారత్లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్ మరింత విలువైన కంపెనీగా మారింది.ఫార్చూన్-గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలువాల్మార్ట్అమెజాన్స్టేట్గ్రిడ్సౌదీ అరమ్కోసినోపెక్ గ్రూప్చైనా నేషనల్ పెట్రోలియంయాపిల్యూనైటెడ్ హెల్త్గ్రూప్బెర్క్షైర్ హాత్వేసివీఎస్ హెల్త్ఇదీ చదవండి: 26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!గ్లోబల్ 500 జాబితాలో చేరిన భారత్లోని టాప్ కంపెనీలురిలయన్స్ ఇండస్ట్రీస్ఎల్ఐసీఇండియన్ ఆయిల్ఎస్బీఐఓఎన్జీసీభారత్ పెట్రోలియంటాటా మోటార్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్రాజేశ్ ఎక్స్పోర్ట్స్ -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే..
జూలై నెల ముగింపునకు వచ్చేసింది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. వచ్చే ఆగస్టు నెలలోనూ పలు నిబంధనలు మారనున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది. రానున్న మార్పుల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపులపై లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉంటుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ ఉంటుంది.రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.50,000 పైబడిన లావాదేవీలకు 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి పీఓఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే చేస్తే 1% ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ బ్యాంక్ సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ స్టోర్లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. అర్హత కలిగిన యూపిఐ చెల్లింపులపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1.5 శాతం, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 శాతం న్యూకాయిన్స్ లభిస్తాయి. -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మరింత రాబడి!
ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల లోపు వివిధ కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూలై 24 నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు తర్వాత, బ్యాంక్ ఎఫ్డీ గరిష్ట రేట్లు సాధారణ పౌరులకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతంగా ఉన్నాయి.పెరిగిన ఎఫ్డీ రేట్లు ఇవే..2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల కాలవ్యవధి డిపాజిట్పై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు అంటే 7.15% నుంచి 7.35% వరకు పెంచింది. అలాగే 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల కాలవ్యవధిపై నా 20 బేసిస్ పాయింట్లు 7.20% నుంచి 7.40% కి పెంచింది. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ రేట్లుటెన్యూర్ సాధారణ పౌరులకు సీనియర్ సిటిజన్లకు 7-14 రోజులు 3.00% 3.50%15-29 రోజులు 3.00% 3.50%30-45 రోజులు 3.50% 4.00%46-60 రోజులు 4.50% 5.00%61 - 89 రోజులు 4.50% 5.00%90 రోజులు < = 6 నెలలు 4.50% 5.00%6 నెలలు 1 రోజు < = 9 నెలలు 5.75% 6.25%9 నెలల 1 రోజు నుంచి < 1 సంవత్సరం వరకు 6.00% 6.50%1 సంవత్సరం నుండి <15 నెలల వరకు 6.60% 7.10%15 నెలల నుండి <18 నెలల వరకు 7.10% 7.60%18 నెలల నుండి <21 నెలల వరకు 7.25% 7.75%21 నెలలు - 2 సంవత్సరాలు 7.00% 7.50%2 సంవత్సరాల 1 రోజు నుండి < 2 ఏళ్ల 11 నెలల వరకు 7.00% 7.50%2 ఏళ్ల 11 నెలలు - 35 నెలలు 7.35% 7.85%2 ఏళ్ల 11 నెలల 1 రోజు < = 3 సంవత్సరాలు 7.00% 7.50%3 ఏళ్ల 1 రోజు నుండి < 4 ఏళ్ల 7 నెలల వరకు 7.00% 7.50%4 ఏళ్ల 7 నెలలు - 55 నెలలు 7.40% 7.90%4 ఏళ్ల 7 నెలలు 1 రోజు < = 5 సంవత్సరాలు 7.00% 7.50%5 ఏళ్ల 1 రోజు - 10 ఏళ్లు 7.00% 7.50% -
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 14 గంటలు అంతరాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు జూలై 13న అంతరాయం కలగనుంది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది కస్టర్లున్న అతిపెద్ద ప్రవేట్ బ్యాంక్ తమ కస్టమర్ బేస్ కోసం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ను కొత్త ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్కు బదిలీ చేస్తోంది. దీంతో 14 గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.పనితీరు వేగాన్ని మెరుగుపరచడం, అధిక ట్రాఫిక్ పరిమాణాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం, రిలియబులిటీ, స్కేలబిలిటీని పెంచడం ఈ మార్పు లక్ష్యం అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా జూలై 13న తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 13.50 గంటల పాటు పలు సర్వీసులు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..నెట్ & మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు జూలై 13న తెల్లవారు జామున 3:00 గంటల నుంచి 3:45 గంటల వరకు, మళ్లీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అందుబాటులో ఉండవు. బిల్లు చెల్లింపులు, డీమ్యాట్, కార్డులు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ఏటీఎం లావాదేవీల్లోనూ అంతరాయం ఉంటుంది. -
హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్)ను కొత్త ఇంజినీరింగ్ ప్లాట్ఫారమ్కు మారుస్తున్న నేపథ్యంలో యూపీఐ సేవలను తాత్కాలికంగా కొన్నిగంటల పాటు నిలిపేస్తామని ప్రకటించింది. దానికోసం జులై 13, 2024 శనివారం ఉదయం 3:00 నుంచి 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యూపీఐ సేవలు పనిచేయవని తెలిపింది.బ్యాంకింగ్ పనితీరు, సామర్థ్యం, విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్ ప్రకటనలో చెప్పింది. కస్టమర్లకు మరింత వేగంగా సేవలందించేందుకు ఈ మైగ్రేషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. బ్యాంక్ సర్వర్లను యాక్సెస్ చేసేపుడు అధిక ట్రాఫిక్ వాల్యూమ్ను నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్శనివారం బ్యాంక్ సెలవు కావడంతో ఈ అప్డేషన్ కోసం జులై 13ను ఎంచుకున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. యూపీఐ వినియోగదారులు మాత్రం శనివారం బ్యాంక్ ప్రకటించిన సమయాన్ని గమనించాలని కోరింది. కస్టమర్లు అంతకు ముందుగానే బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది. -
రేపటి నుంచి ఈ బ్యాంక్ అలర్ట్స్ బంద్.. కానీ ఇలా చేస్తే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ .100 లోపు విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం నిలిపివేయనుంది.జూన్ 25 నుంచి రూ.100 లకు పైబడిన చెల్లింపులు, రూ.500 లకు మించి అందుకున్న లావాదేవీలకు మాత్రమే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఉంటాయని బ్యాంక్ గతంలోనే ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్స్ అందుకునే అవకాశం ఉంది.ఈమెయిల్ ఇన్స్టా అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా..నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే టాప్ బ్యానర్ పై ఉన్న ఇన్ స్టాఅలర్ట్స్ పై క్లిక్ చేసి సూచనలను పాటించండి.మొబైల్ యాప్ ద్వారా అయితే మెనూకు వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. మేనేజ్ అలర్ట్స్ పై క్లిక్ చేయండిఇన్స్టా అలర్ట్స్ డీయాక్టివేట్ చేయాలంటే..» మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్తో నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వండి» పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ఇన్స్టా అలర్ట్స్పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ డీ రిజిస్టర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ ఎంచుకోండి.» అలర్ట్స్ రకాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ సెలెక్ట్ అయ్యాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. -
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు. -
అతిపెద్ద బ్యాంక్ ఆన్లైన్ సేవలు రెండు రోజులు బంద్!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆన్లైన్ సేవలు ఈ నెలలో రెండు వేర్వేరు తేదీల్లో కొన్ని గంటలపాటు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ మరోసారి మెయింటెనెన్స్ షెడ్యూల్ ను ప్రకటించడంతో పలు కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.(అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!)హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో అధికారిక ప్రకటన ప్రకారం.. బ్యాంక్ తన ప్లాట్ఫామ్లను జూన్ నెలలో రెండు వేర్వేరు తేదీలలో అప్గ్రేడ్ చేయనుంది. దటి షెడ్యూల్ మెయింటెనెన్స్ జూన్ 9న తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. రెండో మెయింటెనెన్స్ జూన్ 16న ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు నాలుగు గంటల పాటు ఉంటుంది. ఈ కాలంలో పలు సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..» ఖాతా సంబంధిత సేవలు» డిపాజిట్లు» నిధుల బదిలీలు (ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్)» అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్స్» ఎక్స్టర్నల్/మర్చంట్ చెల్లింపు సేవలు» ఇన్స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్» యూపీఐ చెల్లింపులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత మే 25న కూడా బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో సహా చాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ మెయింటెనెన్స్తో పాటు యూపీఐ లావాదేవీల ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్లోనూ బ్యాంక్ మార్పులు చేసింది. జూన్ 25 నుంచి రూ .100 కంటే తక్కువ విలువ యూపీఐ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్లను బ్యాంక్ కస్టమర్లకు పంపదు. అయితే రూ.100, అంతకంటే ఎక్కువ విలువ యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కొనసాగుతాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్: రేపు ఆన్లైన్ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఈ బ్యాంక్ కస్టమర్లు మే 25వ తేదీ శనివారం తెల్లవారు జామున నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది.బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా మే 25 ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లో అకౌంట్స్, డిపాజిట్లు, నిధుల బదిలీలు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, విత్ ఇన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు), ఆన్లైన్ చెల్లింపు, తదితర లావాదేవీలు అందుబాటులో ఉండవు.మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవల అంతరాయం గురించి కస్టమర్లకు ఎస్ఎంఎస్ కూడా పంపింది. పేర్కొన్న సమయంలో వినియోగదారులు డబ్బును డిపాజిట్ చేయలేరు. నిధులను బదిలీ చేయలేరు. యూపీఐ లావాదేవీలతో సహా ఎటువంటి ఆన్లైన్ చెల్లింపులు చేయలేరు. -
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్లో తెలిపారు.బ్యాంకింగ్లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావడానికి కృషి చేశారు. -
హెచ్డీఎఫ్సీ.. ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన దీపక్ పరేఖ్.. తదుపరి ఎవరంటే..
హెచ్డీఎఫ్సీ లైప్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 వ్యాపార వేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. పరేఖ్ అనంతరం ఎవరు ఈ కంపెనీని ముందుండి నడిపిస్తారనే వాదనలను తెరదించుతూ కొత్త ఛైర్మన్ను కూడా ఏకగ్రీవంగా నియమించారు. కేకి ఎం మిస్త్రీను సంస్థ ఛైర్మన్గా నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. 23 ఏళ్లుగా కంపెనీలో ఉన్న ఆయన ప్రస్తుతం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆయన క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే.. ఏప్రిల్ 24, 2024న వికె విశ్వనాథన్, ప్రసాద్ చంద్రన్ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఇటీవల వెంకట్రామన్ శ్రీనివాసన్ను ఐదేళ్ల కాలానికిగాను నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్గా నియమించినట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది. -
అందాల దీవుల్లో అడుగు పెట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దేశంలోనే అగ్రగామి ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో అడుగుపెట్టింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తొలి బ్రాంచ్ ఏర్పాటు చేసింది. లక్షద్వీప్లో ఇప్పటివరకు ఏర్పాటైన మొదటి ప్రైవేటు బ్యాంకు ఇదే. భారత్కు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో కొలువు దీరిన అందమైన ద్వీపాల సమాహారం.. లక్షద్వీప్. ఇటీవల మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్కు విపరీతమైన ప్రచారం లభించింది. ప్రధాని మోదీ కూడా స్వయంగా లక్షద్వీప్లో అడుగుపెట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తూ పర్యాటకులు ఇక్కడికి రావాలని ప్రకటనలు చేశారు. ఫలితంగా ఈ దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిన లక్షద్వీప్ ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, స్థానికులు, పర్యాటలకు పర్సనల్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తమ బ్రాంచిని ఏర్పాటు చేసినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికి, హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 3,872 నగరాలు, పట్టణాల్లో 8,091 బ్రాంచ్లు, 20,688 ఏటీఎంలు ఉన్నాయి. -
హెడీఎఫ్సీ బ్యాంక్ రుణాలు ఎన్నంటే..?
ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలు రూ.25 లక్షల కోట్లను అధిగమించాయి. 2024 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి ఈ మేరకు రుణాలున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2023 మార్చి 31 నాటికి ఈ రుణాల విలువ రూ.16.14 లక్షల కోట్లు ఉండగా, 55.4 శాతం వృద్ధితో రూ.25.08 లక్షల కోట్లకు చేరినట్లు నియంత్రణ సంస్థలకు బ్యాంక్ రిపోర్ట్ చేసింది. 2023 జులై 1న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల విలీనం తర్వాతి రుణాలు కాబట్టి, గత ఏడాదితో వీటిని పోల్చిచూడొద్దని బ్యాంకు వర్గాలు తెలిపాయి. త్రైమాసిక ప్రాతిపదికన 2023 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే (రూ.24.69 లక్షల కోట్లు) 2024 మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మాత్రమే రుణాలు పెరిగాయి. ఇదీ చదవండి: పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్వెజ్ ఖరీదు దేశీయ రిటైల్ రుణాలు 2023 మార్చి 31తో పోలిస్తే 109 శాతం, డిసెంబరు 31తో పోలిస్తే 3.7 శాతం వృద్ధి చెందాయి. వాణిజ్య-గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు వరుసగా 24.6 శాతం, 4.2 శాతం మేర పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు 2024 మార్చి 31 నాటికి రూ.23.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబరు 31 నాటికి రూ.22.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన రూ.18.83 లక్షల కోట్ల నుంచి 26.4 శాతం పెరిగాయి. -
Fact check: సచివాలయంపై తా‘కట్టు కథ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎల్లో మీడియా చేసిన కుట్ర బట్టబయలయ్యింది. రాష్ట్ర తాత్కాలిక సచివాలయాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారంటూ... ఒక పత్రికలో రాసిన కథనాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖండించింది. ‘సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ ఒక పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్త అవాస్తమని, ఇది ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని, దానిని ఖండిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడానికి ఎల్లో మీడియా ప్రతీ రోజు ఏదో ఒక విష ప్రచారంతో భారీ కుట్రలకు తెరతీస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రతిష్టను మంటకలపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందులో భాగంగానే ‘సచివాలయం తాకట్టు’ అంటూ ఒక విష కథనాన్ని పకడ్బందీగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ‘తాకట్టులో సచివాలయం’ అంటూ ఎల్లో పత్రిక ఒక వార్తను ప్రచురించడం... దాన్ని తమ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం.. దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి జిల్లా స్థాయి నేతల వరకు మాట్లాడటం... తిరిగి ఆ వార్తను అన్ని పత్రికల్లో ప్రచురింపజేస్తూ... ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలు నిజం అని నమ్మే విధంగా చేయడానికి ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేసింది. కానీ ఆ వార్తను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖండించడంతో తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారం మరోసారి బట్టబయలయ్యింది. -
హోమ్లోన్పై గుడ్న్యూస్.. త్వరలో కొత్త రుణాలు
HDFC Bank Home Loans : దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్ లోన్పై గుడ్న్యూస్ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్’ పేరిట ఓ లోన్ను ఏప్రిల్లో, హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. హోమ్ సేవర్ ప్రొడక్ట్ అనేది ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్బీఐ అందిస్తున్న మ్యాక్స్గెయిన్ హోమ్ లోన్ స్కీమ్కి పోటీగా దీన్ని భావించవచ్చు. ఇక హోమ్ రీఫర్బిష్మెంట్ లోన్ విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ లోన్ను అందించేది. ఇప్పుడు ఈ లోన్ను త్వరలో పునఃప్రారంభిస్తున్నారు. ఈ రెండు లోన్లు ఇప్పటికే ఉన్న కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు అందించనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్టగేజ్ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే బ్యాంకు గృహ రుణాలపై వసూలు చేసే రేటు కంటే హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటుతో లింక్ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా ఇప్పటివరకూ ఉన్న హెచ్డీఎఫ్సీ సర్వీస్ సెంటర్లను దశలవారీగా బ్యాంక్ బ్రాంచ్లుగా మార్చబోతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. -
దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
భారత్లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొదటిస్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంక్కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదిక తయారుచేశాయి. గతేడాది అక్టోబరు వరకు ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. అందులోని కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. టాప్ 3 కంపెనీలు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని టాప్-500 కంపెనీల (రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్) మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ. దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు. కంపెనీ స్థాపించి 10 ఏళ్లు కూడా పూర్తవని సంస్థలు 52 ఉన్నాయి. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా 500 కంపెనీల జాబితాలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాబితాలో 28వ స్థానం సాధించింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్లు 2023 ఎడిషన్లో మరోసారి టాప్-10 జాబితాలోకి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. హైదరాబాద్ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది. టాప్ కంపెనీలు(మార్కెట్ విలువ) ఇవే.. దివీస్ ల్యాబ్స్: రూ.90,350 కోట్లు డాక్డర్ రెడ్డీస్: రూ.89,152 కోట్లు మేఘా ఇంజినీరింగ్: రూ.67,500 కోట్లు అరబిందో ఫార్మా: రూ.50,470 కోట్లు హెటెరో డ్రగ్స్: రూ.24,100 కోట్లు లారస్ ల్యాబ్స్: రూ.19,464 కోట్లు సైయెంట్: రూ.17,600 కోట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్: రూ.17,500 కోట్లు డెక్కన్ కెమికల్స్: రూ.15,400 కోట్లు కిమ్స్: రూ.15,190 కోట్లు ఇదీ చదవండి: రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్.. ఈ జాబితాలో సువెన్ఫార్మా, నాట్కోఫార్మా, తాన్లా ప్లాట్ఫామ్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఆరజెన్ లైఫ్సైన్సెస్, అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, యశోదా హాస్పిటల్స్, మెడ్ప్లస్, ఒలెక్ట్రాగ్రీన్టెక్, ఎన్సీసీ, సీసీఎల్ ప్రొడక్ట్స్, హెచ్బీఎల్ పవర్, గ్రాన్యూల్స్, మేధా సర్వో డ్రైవ్స్, కేఫిన్ టెక్, ఎంటార్ కంపెనీలు ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ ఒకే - పరిమితుల పెంపునకు అనుమతి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, యాక్సిస్ మొదలైన 6 సంస్థల్లో అధిక వాటాల కొనుగోలుకి ఆర్బీఐ అనుమతించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వీటితో పాటు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లలో గ్రూప్ స్థాయిలో 9.5 శాతం వాటా వరకూ సొంతం చేసుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ కింద హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితర సంస్థలున్నాయి. పెట్టుబడి పరిమితుల పెంపు కోసం వీటి తరఫున ప్రమోటర్/గ్రూప్ స్పాన్సర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023 డిసెంబర్ 18న ఆర్బీఐకు దరఖాస్తు చేయగా.. ఈ నెల(ఫిబ్రవరి) 5న ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. వెరసి 2025 ఫిబ్రవరి 4వరకూ అంటే ఏడాదిపాటు ఆర్బీఐ అనుమతులు అమలుకానున్నాయి. ఆయా బ్యాంకుల్లో మరింత ఇన్వెస్ట్ చేసే యోచనేమీ లేనప్పటికీ, వాటిల్లో తమ గ్రూపు సంస్థల మొత్తం వాటాలు నిర్దేశిత 5 శాతం పరిమితిని దాటే అవకాశం ఉండటంతోనే పెట్టుబడి పరిమితిని పెంచాలని ఆర్బీఐని కోరినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. -
క్రెడిట్ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ రికార్డు!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. వినియోగంలో ఉన్న రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మైలురాయిని సాధించిన తొలి బ్యాంక్గా నిలిచింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. అన్ని బ్యాంకులు మొత్తంగా జారీ చేసిన 9.6 కోట్ల క్రెడిట్ కార్డులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దాదాపు 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక కార్డు వ్యయాల్లో 2023 మార్చి 31 నాటికి తమ వాటా 28.6 శాతం ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. లేటుగా ప్రారంభించినా.. క్రెడిట్ కార్డ్లను ప్రారంభించిన ప్రధాన బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చివరిది కావడం గమనార్హం. ఎస్బీఐ తన కార్డ్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించగా ఐసీఐసీఐ బ్యాంక్ 2000లో క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2001లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇతర బ్యాంకులు మందగించినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఓ వైపు కస్టమర్లతోపాటు మరోవైపు వ్యాపారులపైనా దృష్టి పెడుతూ స్థిరంగా దాని పోర్ట్ఫోలియోను అభివృద్ధి చేసుకోగలిగింది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 90లలో సిటీ బ్యాంక్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత దేశీయ ప్రైవేట్ బ్యాంకులు విస్తరించడంతో విదేశీ బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోయాయి. -
లిఫ్ట్లో ఇరుక్కుపోయి విలవిలలాడిన సెక్యూరిటీ గార్డు
నిజామాబాద్: కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లో దారుణం చోటుచేసుకుంది.. కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోవడంతో గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ రెండు కాళ్ళు బయట..బాడీ లిఫ్ట్ లో ఇరుక్కుపోడంతో కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరి ఉండడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 39% జంప్
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2023–24, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 12,735 కోట్లతో పోలిస్తే 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలు ఇలా... బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) క్యూ3లో స్వల్పంగా పెరిగాయి. 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికర ఎన్పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది. -
ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
2024లోనే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 'ఫిక్స్డ్ డిపాజిట్' వడ్డీ రేట్లను పెంచనున్నట్లు పెంచుతున్నట్లు ప్రకటించి శుభవార్త చెప్పింది. ఈ కథనంలో ఏ బ్యాంకు ఎంత మేర వడ్డీ పెంచింది, దాని వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ఈ వడ్డీ రేట్లు గతంలో ఉన్న వడ్డీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్లంటూ 0.50 శాతం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 రోజుల నుంచి 45 రోజులకు సాధారణ వడ్డీ 3.50 శాతం అనుకుంటే సీనియర్ సిటిజన్లను 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI) భారతదేశంలో రెండవ అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కూడా వడ్డీ రేట్లను 6.7 సంత నుంచి 7.25 శాతానికి పెంచింది. 61 రోజుల నుంచి 90 రోజులకు 6 శాతం, 91 రోజుల నుండి 184 రోజులకు 6.5 శాతం, 185 రోజుల నుంచి 270 రోజులకు 6.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు 7.25 శాతం వడ్డీ అందించనుంది. జనవరి 3 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC) 2023 అక్టోబరు నుంచి HDFC బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల కాలనీ వడ్డీ 6.6 శాతం, 15 నెలల నుంచి 18 నెలల వరకు వడ్డీ 7.10 శాతం, 18 నెలల నుంచి 21 నెలలకు వడ్డీ 7 శాతం, 21 నెలల నుంచి 2 సంవత్సరాల కాలనీ 7 శాతం వడ్డీ అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2023 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 6.85 శాతం వడ్డీ, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వ్యవధికి 7.25 శాతం వడ్డీ, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి వడ్డీ 6.5 శాతం అందిస్తోంది. వీటితో పాటు బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ అని పిలువబడే 399 రోజుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ పొందవచ్చు. ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 2023 డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.7 శాతం ఆఫర్ చేస్తోంది . 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతం అందిస్తుంది. డీసీబీ బ్యాంక్ (DCB Bank) 2023 డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం వినియోగదారుని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సంవత్సరానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు 7.15 శాతం వడ్డీని, 25 నెలల లేదా 26 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు 8 శాతం అందించడం జరుగుతుంది. -
ఆర్బీఐ కంటే ముందే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని కాలపరిమితుల రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా 0.05 శాతం (ఐదు బేసిస్ పాయింట్లు) పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడచిన ఐదు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లోనూ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5%) పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, హెచ్డీఎఫ్సీ తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి ఎగసింది. కాగా, సాధారణంగా అధిక రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది రుణ రేటు మాత్రం 9.20 శాతం వద్ద స్థిరంగా ఉంది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు షాకిచ్చింది. తాజా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక వడ్డరీట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బెంచ్మార్క్ లెండింగ్ రేట్లను సైలెంట్గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) గరిష్టంగా 10 పాయింట్ల బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 bps 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానిచేరింది మూడు నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్ఆర్ 9.25 శాతంగా ఉంటుంది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ సీఈవోకు డెలాయిట్లో కీలక పదవి
ప్రముఖ బ్యాంకర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పూరి (Aditya Puri)కి ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ డెలాయిట్ (Deloitte) కీలక పదవి ఇచ్చింది. కంపెనీ సీనియర్ సలహాదారుగా నియమించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి బిజినెస్ లీడర్లలో ఒకరిగా పేరుపొందిన ఆదిత్య పూరి 1994లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థలో 26 సంవత్సరాలపాలు సేవలందించారు. 2020లో పదవీ విరమణ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయిన డెలాయిట్లో చేరినందుకు సంతోషిస్తున్నానని ఆదిత్య పూరి పేర్కొన్నారు. విశేష అనుభవం, దూరదృష్టి గల ఆదిత్యపూరి నియామకంపై డెలాయిట్ సౌత్ ఏషియా సీఈఓ రోమల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జూన్లో భారతి ఎయిర్టెల్, సాఫ్ట్బ్యాంక్ ఇండియా మాజీ సీఈవో మనోజ్ కోహ్లీని సీనియర్ సలహాదారుగా డెలాయిట్ నియమించుకుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డు.. అదిరిపోయే ట్రావెల్ బెనిఫిట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారియట్ బాన్వాయ్ కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనికి రూ. 3,000 వార్షిక ఫీజు ఉంటుంది. ఎయిర్పోర్ట్ లాంజ్లకు యాక్సెస్, గోల్ఫ్ సెషన్లు, హోటళ్లలో కాంప్లిమెంటరీ బస తదితర ప్రయోజనాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చని సంస్థలు తెలిపాయి. ఏటా 25–30 శాతం కొత్త కార్డులను జారీ చేస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ బిజినెస్ హెడ్ పరాగ్ రావు తెలిపారు. ఇతర పోటీ ఆర్థిక సంస్థలు మొండి బాకీల సమస్యలు ఎదుర్కొంటున్నా తమ అసెట్స్ నాణ్యత మాత్రం మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 జూన్ ఆఖరు నాటికి మార్కెట్లో 1.83 కోట్ల పైచిలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు ఉన్నాయి. -
ఇక ముందూ ఇళ్లకు డిమాండ్.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి
కోల్కతా: ఇళ్ల కోసం డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్ చాలా తక్కువని చెప్పారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు. గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్డీఎఫ్సీ ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్పీఏలతో భారత బ్యాంకింగ్ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు. వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్కు తోడు ఈఎస్జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వృద్ధి అంచనాలను మించింది. భారత్ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్గా భారత్ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు. -
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్! షాకిచ్చిన టాప్ ప్రైవేట్ బ్యాంక్
HDFC Bank hikes loans interest rates: విలీనం తర్వాత అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్గా అవతరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ రుణ రేట్ల పెంపు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా ఉంది.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎగిసి 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. మూడు నెలలకుగానూ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.6 శాతం నుంచి 8.7 శాతాన్ని తాకింది. ఇక ఆరు నెలలకయితే 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9 శాతం నుంచి 8.95 శాతానికి ఎగసింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రేట్ను 9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ అంటే.. ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
హెచ్డీఎఫ్సీ సీఈవో శశిధర్ వార్షిక వేతనం ఎంతో తెలుసా?
HDFC Bank CEO Sashidhar Jagdishan Salary: మెగా మెర్జర్ తరువాత ప్రైవేటు బ్యాంకింగ్దిగ్గజం హెచ్డీఎఫ్సీ ప్రపంచ బ్యాంకింగ్లో 7వ ర్యాంక్ను సాధించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మార్కెట్ అంచనాలను మించి తొలి త్రైమాసిక లాభంలో 30 శాతం పెరిగింది. ఈ సందర్బంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీషన్ వార్షిక వేతనం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవో వార్షిక వేతనంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లతో పోలిస్తే, ఎఫ్వై23లో జగదీషన్ మొత్తం ఆదాయం రూ.10.55 కోట్లుగా ఉంది. రెమ్యునరేషన్ ప్యాకేజీలో రూ. 2.82 కోట్ల బేసిక్ జీతం, రూ. 3.31 కోట్ల అలవెన్సులు , పెర్క్విసైట్లు ఉండగా, రూ. 3.63 కోట్ల పనితీరు బోనస్ ఉన్నాయి.2021-2022కి, జగదీషన్కు మొత్తం రూ. 5.16 కోట్ల నగదు వేరియబుల్ పేను ఆర్బిఐ ఆమోదించింది, అందులో అతను రూ. 2.58 కోట్లు అందుకున్నారు. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) 2020-2021లో క్యాష్ వేరియబుల్ పేలో భాగంగా రూ. 1.05 కోట్లు అందుకున్నారు. అదే సమయంలో, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భారుచా మార్చి 31, 2023తో ముగిసే సంవత్సరానికి రూ. 10.03 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. ఇది మునుపటి వార్షిక వేతనం రూ. 10.64 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. (Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత) హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పుడు సాంకేతిక పరివర్తన సాధనలో ఉందని, భవిష్యత్తులో బ్యాంకును నిర్మించడంతోపాటు, సమర్ధవంతంగా నడపడంపై దృష్టి సారిస్తుందని షేర్హోల్డర్లను ఉద్దేశించి జగదీషన్ పేర్కొన్నారు. 2022-23లో, బ్యాంక్ రికార్డు స్థాయిలో 1,479 శాఖలను జోడించిందని, వీటిలో ఎక్కువ భాగం సెమీ అర్బన్, రూరల్ (ఎస్యుఆర్యు) లో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం మరో 675ని జోడించాలని యోచిస్తోందని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 5,000కి చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం మీద, ఏడాదిలో 1,500 నుండి 2,000 అదనపు శాఖలను జోడించాలని బ్యాంక్ యోచిస్తోందని శశిధర్ చెప్పారు. కాగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1లో నికర లాభం 29 శాతం జంప్చేసి రూ. 12,370 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. అలాగే మెగా విలీనం తరువాత బ్యాంకు షేర్లు బాగా లాభపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. అలాగే డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసి ఏడో స్థానాన్ని ఆక్రమించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ1 భేష్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 29 శాతం జంప్చేసి రూ. 12,370 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 9,579 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది (2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్జించిన రూ. 12,594 కోట్లతో పోలిస్తే తాజా లాభం స్వల్పంగా తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ. 44,202 కోట్ల నుంచి రూ. 61,021 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ వ్యయాలు 34 శాతం పెరిగి రూ. 15,177 కోట్లకు చేరాయి. ఈ జూలై 1 నుంచి బ్యాంక్ మాతృ సంస్థ, మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ ఆదాయం అప్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం నుంచి 1.17 శాతానికి నామమాత్రంగా పెరిగాయి. గతేడాది క్యూ4లో నమోదైన 1.28 శాతం నుంచి చూస్తే నీరసించాయి. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం ఎగసి రూ. 11,952 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం బలపడి రూ. 23,599 కోట్లకు చేరింది. ఇందుకు అడ్వాన్సుల(రుణాలు)లో నమోదైన 15.8 శాతం వృద్ధి, 4.1 శాతానికి బలపడిన నికర వడ్డీ మార్జిన్లు దోహదం చేశాయి. ఈ కాలంలో రూ. 9,230 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించింది. ఇందుకు రూ. 552 కోట్లమేర ట్రేడింగ్ లాభాలు సహకరించాయి. గతేడాది క్యూ1లో ఈ పద్దుకింద రూ. 1,077 కోట్ల నష్టం ప్రకటించింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,122 కోట్ల నుంచి రూ. 2,860 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతాన్ని తాకింది. ఇతర విశేషాలు... ► జూన్కల్లా బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,81,725కు చేరింది. ► అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు జంప్ చేసింది. ► హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లాభం దాదాపు యథాతథంగా రూ. 189 కోట్లుగా నమోదైంది. ► బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య 7,860కు చేరింది. వీటిలో 52 శాతం సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. ► గతేడాది 1,400 బ్రాంచీలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది సైతం ఈ బాటలో సాగనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. మార్కెట్ క్యాప్ రికార్డ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,679 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి మార్కెట్ విలువరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 18.91 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 12.77 లక్షల కోట్లు) తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది. అంతేకాకుండా డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసింది. ప్రపంచ బ్యాంకింగ్లో 7వ ర్యాంక్ ర్యాంక్ బ్యాంక్ పేరు మార్కెట్ క్యాప్ 1. జేపీ మోర్గాన్ 438 2. బ్యాంక్ ఆఫ్ అమెరికా 232 3. ఐసీబీసీ(చైనా) 224 4. అగ్రికల్చరల్ బ్యాంక్(చైనా) 171 5. వెల్స్ ఫార్గో 163 6. హెచ్ఎస్బీసీ 160 7. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 154 (విలువ బిలియన్ డాలర్లలో– విదేశీ బ్యాంకులు శుక్రవారం(14న) ధరల్లో) -
రికార్డు స్థాయిలో ‘క్రెడిట్ కార్డ్’ వినియోగం
ముంబై: క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డులపై రూ.1.4 లక్షల కోట్లు వ్యయం చేయడమే ఇందుకు నిదర్శనం. క్రెడిట్ కార్డులపై బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండగా, ఈ ఏడాది ప్రతీ నెలా 5 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నట్టు ఆర్బీఐ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి క్రెడిట్ కార్డుల సంఖ్య 50 లక్షలకు పైగా పెరిగింది. మే చివరికి మొత్తం 8.74 కోట్లకు కార్డుల సంఖ్య చేరింది. కొత్తగా జారీ అయిన క్రెడిట్ కార్డుల్లో 20 లక్షల యూజర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే గణనీయంగా వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో యాక్టివ్ (వినియోగంలో ఉన్నవి) క్రెడిట్ కార్డుల సంఖ్య 8.24 కోట్లు కాగా, ఫిబ్రవరిలో 8.33 కోట్లు, మార్చి చివరికి 8.53 కోట్లు, ఏప్రిల్ చివరికి 8.65 కోట్లు చొప్పున పెరుగుతూ వచి్చంది. 2022–23లో ఏడాది అంతటా క్రెడిట్ కార్డులపై వినియోగం ప్రతి నెలా సగటున రూ.1.1–1.2 లక్షల కోట్లుగా ఉంటూ వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలకు వచ్చే సరికి రూ.1.4 లక్షల కోట్లకు పెరిగింది. ఒక్కో కార్డుపై సగటు వ్యయం రూ.16,144గా ఉంది. మొదటి స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మే చివరి నాటికి 1.81 కోట్ల కార్డులతో (వినియోగంలో ఉన్న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ లీడర్గా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డు రుణాల పరంగానూ 28.5 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.73 కోట్ల కార్డులతో ఎస్బీఐ కార్డ్ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.46 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1.24 కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిటీ బ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో, 1,62,150 లక్షల కొత్త కార్డులు యాక్సిస్ బ్యాంక్ పోర్ట్ఫోలియోకు తోడయ్యాయి. మరోవైపు క్రెడిట్ కార్డు రుణాలు గణనీయంగా వృద్ధి చెందుతుండడంతో, ఈ విభాగంలో నిరర్థక ఆస్తులు (వసూలు కాని బకాయిలు/ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి 2.94 శాతానికి చేరినట్టు ఇటీవలే ట్రాన్స్యూనియన్ సిబిల్ ఓ నివేదిక రూపంలో వెల్లడించడం గమనార్హం. -
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్
మెగా మెర్జర్ తరువాత ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాల్లో నిలిచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ఎంసిఎల్ఆర్ను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అవకాశం ఉంది. సవరించిన వడ్డీరేట్లు శుక్రవారం ( జూలై 7 ) నుంచే అమలులోకి వచ్చాయి. బెంచ్మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దీంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఆటో లోన్ సహా అన్ని రకాల రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది. (డైనమిక్ లేడీ నదియా వ్యాపారం, ఆమె కిల్లర్ మూవ్ గురించి తెలుసా?) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 8.1 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు పెంపుతో ఇది 8.2 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది. మూడు నెలలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.5 శాతం నుంచి 8.6 శాతంగానూ,5 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.9 శాతంగా ఉండనుంది. అయితే ఏడాది ఆపైన వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం వద్ద యథాతథంగా ఉంటుంది. (మెక్డొనాల్డ్స్కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?) -
హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ డిమాండ్ క్షీణత
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ వితరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 బేసిస్ పాయింట్ల వరకు (3 శాతం) తగ్గి 13–13.5 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 15.4 శాతంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జూన్ 16 నాటికి ముగిసిన పక్షం రోజుల్లో రుణ వితరణ 15.4 శాతం పెరిగి ఈ ఏడాది రూ.140.2 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు ఈ డిమాండ్ను నడిపించినట్టు చెప్పింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13.2 శాతం వృద్ధి కంటే ఎక్కువ నమోదైంది. డిపాజిట్లు కూడా జూన్ 16తో ముగిసిన పక్షం రోజుల్లో 12.1 శాతం పెరిగాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం 337 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఇక గడిచిన 12 నెలల్లో డిపాజిట్లు రూ.20 లక్షల కోట్లకు విస్తరించగా, రుణాలు రూ.18.7 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో టాప్
న్యూఢిల్లీ: మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను విలీనం చేసుకున్న ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల రీత్యా టాప్ ర్యాంకుకు చేరింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)లో రూ. 60,000 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) రూ. 50,232 కోట్ల నికర లాభంతో ద్వితీయ ర్యాంకులో నిలిచింది. అయితే మొత్తం బిజినెస్(డిపాజిట్లు, అడ్వాన్సులు)లో ఎస్బీఐ 70.3 లక్షల కోట్లతో అగ్రపథాన నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 41 లక్షల కోట్లు మాత్రమే. కాగా.. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా ప్రపంచ రుణదాత సంస్థలలో నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది. నెట్వర్త్ రూ. 4.14 లక్షల కోట్లను తాకింది. విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ 25 షేర్లకుగాను 42 బ్యాంకు షేర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులో హెచ్డీఎఫ్సీ వాటా 41 శాతానికి చేరనుండగా.. పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతంగా నమోదుకానుంది. బ్యాంకు షేర్ల జారీకి ఈ నెల 13 రికార్డ్ డేట్గా నిర్ణయించింది. షేర్ల మారి్పడి ద్వారా విలీనానికి తెరతీయగా.. లావాదేవీ విలువ 40 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్కాగా.. 4,000 మంది హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు బ్యాంకుకు బదిలీకానున్నారు. -
కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం!
HDFC Merger: భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో ఈ రోజు (జులై 01) విలీనం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతంలోనే వెల్లడైంది, కానీ ఈ రోజు ఇరు కంపెనీల బోర్డుల ఆమోదంతో మర్జర్కు లైన్ క్లియర్ అవుతుంది. దేశంలోనే తొలి హోమ్ ఫైనాన్స్ సంస్థగా పేరు పొందిన హెచ్డీఎఫ్సీ ఇక కనిపించదు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన విషయం తెలసిందే. కావున రికార్డ్ డేట్ తరువాత హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - వివో వై36 నుంచి వన్ప్లస్ నార్డ్ వరకు..) సంబంధిత అధికారులు నాన్ కన్వర్టెబుల్ డిబెంచర్స్ బదిలీకి జులై 12, హెచ్డీఎఫ్సీ కమర్షియల్ పేపర్స్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్ను ఫిక్స్ చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి హెచ్డీఎఫ్సీ తన పేరెంట్ కంపెనీ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కలవడానికి సుముఖత చూపింది. కాగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) నివేదికల ప్రకారం.. మార్చి 2023 నాటికి, హెచ్డీఎఫ్సీ & హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార విలువ రూ. 41 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో లాభాలు రూ. 60 వేల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక త్వరలో హెచ్డీఎఫ్సీలోని ఉద్యోగులందరు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా మారిపోతారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం
దేశీయ హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. ప్రైవేట్ బ్యాంక్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో విలీనం కానుంది. విలీనం ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీప్క్ పరేక్ తెలిపారు. విలీనానికి ఆమోదం తెలిపేందుకు హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంక్ బోర్డులు జూన్ 30న సమావేశం కానున్నట్లు పరేఖ్ వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ వైస్ ఛైర్మన్ , సీఈవో కేకే మిస్త్రీ మాట్లాడుతూ.. కార్పొరేషన్ స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా పేర్కొందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఏడాది ఏప్రిల్ 4న హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్డీఎఫ్సీని స్వాధీనం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 40 బిలియన్ల డాలర్లు. విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీకి 41 శాతం వాటా ఉంటుంది. హెచ్డీఎఫ్సీకి చెందిన ప్రతి 25 షేర్లకు గానూ హెచ్డీఎఫ్సీ షేర్ హోల్డర్లకు 42 షేర్లు చొప్పున లభిస్తాయి. విలీన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్గా కొనసాగుతుంది. -
దేశంలో విలువైన కంపెనీ రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మరోసారి గుర్తింపు సొంతం చేసుకుంది. ‘2022 బుర్గుండీ ప్రైవేటు హరూన్ ఇండియా 500’ జాబితా మంగళవారం విడుదలైంది. 16.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంటే, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. రూ.9.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం అనంతరం రిలయన్స్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరికొన్ని ప్రత్యేకతలు కూడా సొంతం చేసుకుంది. 2022–23 సంవత్సరానికి రూ.67,845 కోట్ల లాభంతో అత్యంత లాభదాయక సంస్థగానూ ఉంది. అలాగే, అత్యధికంగా రూ.16,297 కోట్ల పన్నును చెల్లించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ అన్లిస్టెట్ కంపెనీల్లో అత్యంత విలువైన సంస్థగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.1.97 లక్షల కోట్లుగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ రూ.1.65 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. రూ.69,100 కోట్లతో బైజూస్ మూడో అత్యంత విలువైన అన్లిస్టెడ్ సంస్థగా ఉంది. 2022 అక్టోబర్ 30 నుంచి 2023 ఏప్రిల్ 30 మధ్య ఆరు నెలల కాలంలో దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువల వ్యత్యాసాన్ని బర్గుండీ ప్రైవేటు, హరూన్ ఇండియా ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించాయి. మార్కెట్ విలువ ఆధారంగానే వాటికి ర్యాంకులను కేటాయిస్తుంటాయి. దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువ 2022 అక్టోబర్ 30 నాటికి రూ.227 లక్షల కోట్లుగా ఉండగా, 2023 ఏప్రిల్ 30 నాటికి 6.4 శాతం క్షీణించి రూ.212 లక్షల కోట్లకు పరిమితమైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.71.5 లక్షల కోట్లుగా ఉంది. దేశ జీడీపీలో ఇది 37 శాతానికి సమానం. అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువను పెంచుకున్నాయి. అదానీ గ్రూపులో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ 52 శాతం క్షీణించింది. -
సిబ్బందిని బండబూతులు తిట్టిన బ్యాంక్ ఉన్నతోద్యోగి.. వీడియో వైరల్
వ్యాపారానికి సంబంధించి ఉద్యోగులకు టార్గెట్లు అన్ని ప్రైవేటు కంపెనీల్లోనూ సాధారణంగా ఉండేవే. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పైత్యం మరీ ఎక్కువగా ఉంటుంది. రిటైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా బ్యాంకులు చేస్తుంటాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించేందుకు ఉద్యోగులకు టార్గెట్లు పెడుతుంటాయి. ఇలా టార్గెట్లను సాధించే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నతోద్యోగి కింది స్థాయి ఉద్యోగులపై నోరు పారేసుకున్నారు. బండబూతులు తిట్టారు. ఆన్లైన్లో జరిగిన మీటింగ్లో ఉన్నతోద్యోగి సిబ్బందిని దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేయగా వైరల్గా మారింది. సదరు బ్యాంక్ ఉన్నతోద్యోగి రోజుకు 75 ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించాలని టార్గెట్ ఇచ్చాడని, అది సాధించడంలో విఫలమైన ఉద్యోగిని బెంగాలీ భాషలో తిట్టాడని మరో యూజర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఈ వైరల్ వీడియోపై స్పందించిన బ్యాంక్ యాజమాన్యం సదరు ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ట్విటర్ పెట్టిన వీడియోపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీస్ మేనేజర్ అజయ్ స్పందిస్తూ ఆ ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేశామని, బ్యాంకు నిబంధనల మేరకు పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #HDFC bank’s Manager Mr. Pushpal Roy. Employees were treated in an unprofessional way. I would have given back right there. Not sure why & how employees are tolerating. He is completely demoralised and done blatant attacked on employees. Should be fired ! #toxicworkenvironment pic.twitter.com/m0IrfqXl6b — Sara (@srchetlur) June 5, 2023 -
కష్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్
-
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రైవేట్ రంగంలో అతి పెద్దగా బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) ఇప్పుడు కస్టమర్లకు మరింత చెరువుగా ఉండటానికి మరిన్ని కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే దేశంలోనో అనేక ప్రధాన నగరాల్లో విస్తరించి కస్టమర్లకు సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పట్టణ వాసులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి కూడా చేరువవ్వాలని మరో 675 కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం వల్ల 'హెచ్డీఎఫ్సీ'లో అకౌంట్ ఉన్న వారు దూరంగా ఉన్న బ్రాంచిలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకు తన ఉనికిని మరింత విస్తరించడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశ వ్యాప్తంగా 675 బ్రాంచిలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ ముందుకు సాగుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న కారణంగా HDFC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరిన్ని శాఖలతో విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఊరట..
ముంబై: మాతృసంస్థ హెచ్డీఎఫ్సీతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు కొంత ఊరట లభించింది. కొన్ని అంశాల్లో ఆర్బీఐ స్వేచ్ఛను కల్పించగా, కొన్నింటి విషయంలో ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. రెండు సంస్థల విలీనం జూలై నాటికి పూర్తవుతుందని అంచనా. తాము దరఖాస్తు చేసిన కొన్ని అంశాల్లో ఆర్బీఐ నుంచి సమాచారం వచ్చిందని, మరికొన్ని అంశాలు పరిష్కృతం కావాల్సి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) విషయంలో వెసులుబాట్లకు ఆర్బీఐ తిరస్కరించింది. ప్రాధాన్య రంగాలకు రుణాలు (పీఎస్ఎల్), పెట్టుబడుల విషయంలో మాత్రం ఉపశమనం కల్పించింది. విలీనం తేదీ నుంచి సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్సీఆర్ను నిబంధనలకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితర సంస్థలు ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలు (సబ్సిడరీలు)గా ఉండగా.. విలీనం తర్వాత ఇవి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సబ్సిడరీలుగా కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతించింది. విలీనానికి ముందే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్లో వాటాని హెచ్డీఎఫ్సీ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 50 శాతానికి పైగా పెంచుకోవచ్చు. ఉన్నత విద్యకు రుణాలు అందించే హెచ్డీఎఫ్సీ క్రెడాలియా ఫైనాన్షియల్ సర్వీసెస్లో నూరు శాతం వాటా హెచ్డీఎఫ్సీకి ఉంది. రెండేళ్లలో ఈ వాటాని 10 శాతానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు తగ్గించుకోవాలి. కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
HDFC Bank Q4 Results: లాభాలతో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 12,595 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం ఇదే స్థాయిలో బలపడి రూ. 45,997 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండు ప్రకటించింది. మొత్తం బ్రాంచీల సంఖ్య 7,821కు చేరింది. క్యూ4లో 6,000 మందికి ఉపాధి కల్పించింది. మొత్తం సిబ్బంది సంఖ్య 1,73,222ను తాకింది. స్టాండెలోన్ సైతం క్యూ4లో స్టాండెలోన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం పుంజుకుని రూ. 12,048 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 24 శాతం జంప్చేసి రూ. 23,352 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదుకాగా.. 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం రూ. 7,637 కోట్ల నుంచి రూ. 8,731 కోట్లకు పెరిగింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,312 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 0.4 శాతం బలపడి 19.3 శాతాన్ని తాకింది. అనుబంధ సంస్థలలో బ్రోకింగ్ విభాగం లాభం రూ. 236 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు నీరసించగా.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం 28 శాతం ఎగసి రూ. 545 కోట్లను దాటింది. -
హెచ్డీఎఫ్సీ రుణాల్లో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మార్చి చివరినాటికి రుణాల్లో 16.9 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ‘2022 మార్చి 31 నాటికి మొత్తం రుణాలు రూ.13.6 లక్షల కోట్లు. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో వాణిజ్య రుణాలు 30 శాతం, గ్రామీణ ప్రాంత రుణాలు 9.5 శాతం వృద్ధి సాధించాయి. దేశీయ రిటైల్ రుణాలు దాదాపు 21 శాతం, కార్పొరేట్, టోకు రుణాలు 12.5 శాతం దూసుకెళ్లాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి 31 నాటికి డిపాజిట్లు 20.8 శాతం ఎగసి రూ.18.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్తో హోమ్ లోన్ ఏర్పాటు కింద డైరెక్ట్ అసైన్మెంట్ రూట్ ద్వారా బ్యాంక్ రూ.9,340 కోట్ల రుణాలను మార్చి త్రైమాసికంలో కొనుగోలు చేసింది. హెచ్డీఎఫ్సీని 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు 2022 ఏప్రిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంగీకరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరం రెండవ, లేదా మూడవ త్రైమాసికంలో విలీనం పూర్తి అయ్యే అవకాశం ఉంది. -
హెచ్డీఎఫ్సీ గోల్డెన్ కార్డ్: ప్రీమియం కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ పేరుతో ఓ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ను విడుదల చేసింది. ప్రయాణ, లైఫ్స్టయిల్ ప్రయోజనాలు ఈ కార్డుతో పొందొచ్చని బ్యాంక్ ప్రకటించింది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ను ఉచితంగా అందిస్తోంది. ప్రీమియం మైల్ స్టోన్ ప్రయోజనాలు కూడా కార్డులో భాగం. ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం! ఇది అందరికీ కాకుండా అధిక ఆదాయం ఉన్న వారికే బ్యాంక్ జారీ చేయనుంది. అంతర్జాతీయ ప్రయాణాలు, హోటళ్ల బుకింగ్లు, లైఫ్ స్టయిల్ కోసం ఖర్చు, కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా ఈ కార్డును తీసుకొచ్చింది. రిలయన్స్ డిజిటల్, మింత్రా, నైకాలో కొనుగోళ్లపై 5 రెట్ల రివార్డులు వస్తాయి. ప్రతి రూ.150 రిటైల్ వ్యయంపై 4 రివార్డు పాయింట్లు లభిస్తాయి. వార్షిక వ్యయం లక్ష్యాలను చేరుకున్న కస్టమర్లకు రెండు ఫ్లయిట్ టికెట్ వోచర్లు అందిస్తుంది. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్డీఎఫ్సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్లో 41 శాతం వాటా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్డీఎఫ్సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
హెచ్డీఎఫ్సీ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ క్రెడిట్ కార్డ్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్ హోల్సేల్ కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ను విడుదల చేశాయి. ఫ్లిప్కార్ట్ హోల్సేల్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డ్ను తీసుకొచ్చాయి. డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్పై ఈ కార్డు పనిచేస్తుంది. 200కు పైగా దేశాల్లో ఈ కార్డ్ పనిచేస్తుందని ఇరు సంస్థలు తెలిపాయి. ఫ్లిప్ కార్ట్ హోల్సేల్ సభ్యులు (కిరాణా వర్తకులు).. ఈ క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్తో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ప్లాట్ఫామ్పై చేసే వ్యయంలో 5 శాతం క్యాష్ బ్యాంక్గా పొందొచ్చు. యాక్టివేషన్ క్యాష్ బ్యాక్ కింద రూ.1,500ను ఆఫర్ చేస్తున్నాయి. జాయినింగ్ ఫీజు లేదు. యుటిలిటీ బిల్లులు, ఇతర వ్యయాలపై అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇవీ చదవండి: ఫ్లిప్కార్ట్ సేల్లో బంపర్ ఆఫర్: నథింగ్(1) ఫోన్పై రూ. 30వేలు తగ్గింపు ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్!
తరచూ రైలు ప్రయాణాలు చేసే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఆర్సీటీసీ) ప్రత్యేకంగా మరో ట్రావెల్ క్రెడిట్ కార్డును తీసుకొస్తోంది. ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కలిసి కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ను ప్రారంభించాయి. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్పీసీఐ రూపే నెట్వర్క్లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్లలో ఈ కార్డును ఉపయోగించి బుక్ చేసే రైలు టిక్కెట్లపై ప్రత్యేకమైన ప్రయోజనాలతోపాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ కో-బ్రాండెడ్ కార్డ్ మెరుగైన ఆన్లైన్ లావాదేవీలు, అత్యుత్తమ ప్రయోజనాలతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక లాంజ్లకు ప్రత్యేక యాక్సెస్ను అందిస్తుందని ఐఆర్సీటీసీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ సహిజ పేర్కొన్నారు. ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం పొందిన మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకు తమదేనని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావ్ తెలిపారు. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులతో కూడా ఐఆర్సీటీసీ ఇలాంటి భాగస్వామ్యాలు చేసుకుంది. ట్రావెల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు: ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ప్రత్యేకంగా ఎన్పీసీఐ రూపే నెట్వర్క్లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ టికెటింగ్ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్ ద్వారా బుక్ చేసిన టిక్కెట్లపై గరిష్ట తగ్గింపు. ఆకర్షణీయమైన జాయినింగ్ బోనస్, బుకింగ్లపై తగ్గింపులు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని ఎగ్జిక్యూటివ్ లాంజ్లకు యాక్సెస్. (ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో...) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్–లులు భాగస్వామ్యం
తిరువనంతపురం: ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూఏఈకి చెందిన లులు ఎక్సే్చంజ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు భారత్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) ప్రాంతంలో సీమాంతర చెల్లింపులను బలోపేతం చేస్తాయి. తొలి దశలో రెమిట్నౌ2ఇండియా సేవలను హెచ్డీఎఫ్సీ అందుబాటులోకి తేనుంది. యూఏఈ నుంచి కస్టమర్లు భారత్లోని ఏదేని బ్యాంక్ ఖాతాకు ఐఎంపీఎస్, నెఫ్ట్ విధానంలో హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ వేదికల ద్వారా నగదు పంపవచ్చు. భారత్లో లులు ఫారెక్స్, లులు ఫిన్సర్వ్ కంపెనీల బలోపేతానికి సైతం ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బ్యాంక్ తెలిపింది. -
యూపీఐకి క్రెడిట్ కార్డుల అనుసంధానం.. ఫస్ట్ టైమ్!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు వరకు యూపీఐకి కేవలం బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలను లింక్ చేసుకుని చెల్లింపులు చేసుకోవాల్సి వచ్చేది. ఆర్బీఐ క్రెడిట్ కార్డుల లింకింగ్ కూడా అనుమతించడంతో పరిశ్రమలో ఈ మేరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘‘ఇక నుంచి హెచ్డీఎఫ్సీ బ్యంక్ రూపే క్రెడిట్ కార్డులను ప్రముఖ యూపీఐ ప్లాట్ఫామ్లపై అనుసంధానించుకుని, వినియోగించుకోవచ్చు’’ అని హెచ్డీఎఫ్సీ బ్యంక్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కస్టమర్లకు డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా మారతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్రావు తెలిపారు. యూపీఐపై రూపే క్రెడిట్ కార్డ్ అనుసంధానం నిజంగా పరిశ్రమ రూపురేఖలను మారుస్తుందని భావిస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సీవోవో ప్రవీణ్ రాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ3 గుడ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్చేసి రూ. 12,698 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 19 శాతం బలపడి రూ. 12,260 కోట్లయ్యింది. ఈ కాలంలో 20 శాతం రుణ వృద్ధి కారణంగా నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 22,988 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం రూ. 300 కోట్లు పెరిగి రూ. 8,540 కోట్లకు చేరింది. రుణ నాణ్యత అప్: క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) నిలకడను చూపుతూ 1.23%గా నమోదైంది. నిర్వహణ వ్యయాలు 27 శాతం పెరిగి రూ. 12,464 కోట్లకు చేరగా.. 4,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,66,890ను తాకింది. . కాగా.. అనుబంధ సంస్థలలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నికర లాభం రూ. 258 కోట్ల నుంచి రూ. 203 కోట్లకు తగ్గింది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ. 304 కోట్ల నుంచి రూ. 501 కోట్లకు జంప్చేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% బలహీనపడి రూ. 1,586 వద్ద ముగిసింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ!
ముంబై: గృహ రుణాలకు సంబంధించి దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ రేటు భారీగా 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 8.65 శాతానికి ఎగసింది. పెరిగిన రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. మే నెల నుంచి హెచ్డీఎఫ్సీ రుణ రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. కాగా, 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే 8.65 శాతం కొత్త రేటు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యల్ప రేటు అని కూడా వివరించింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్
-
హెచ్డీఎఫ్సీ విలీనానికి 10 నెలలు
ముంబై: మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీని విలీనం చేసుకునేందుకు మరో 8–10 నెలల సమయం పడుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. విలీనం వల్ల హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 0.20–0.30 శాతం మేర పెరుగుతుందని తెలిపారు. ఈ రెండు సంస్థలు విలీనంపై ఆమోదం కోసం శుక్రవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాయి. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద విలీనం కానుంది. అయితే, విలీనం వల్ల బ్యాలన్స్ షీటు పెద్దగా మారనుంది. దీంతో ఆర్బీఐ నియంత్రణలకు అనుగుణంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన నగదు నిల్వలు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అవసరాలను వాటాదారులు ప్రస్తావించారు. ఈ విషయంలో ఆర్బీఐ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని అనుకున్నారు. దీనిపై హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ.. ఈ విషయంలో వాటాదారులు ఆందోళన చెందవద్దంటూ, ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ నుంచి ఏదైనా మినహాయింపు రాకపోయినా, విలీన సంస్థ వద్ద తగినంత లిక్విడిటీ ఉంటుందని.. తప్పనిసరి నిధుల అవసరాలను చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నట్టు తెలిపారు. కొన్నింటిని విక్రయిస్తాం.. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలన్నీ కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ కంపెనీలుగా మారతాయని.. బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి తెలిపారు. అదే సమయంలో బ్యాంకు కిందకు రాని కొన్ని వ్యాపారాలను (నిబంధనల మేరకు) విక్రయిస్తామని చెప్పారు. సబ్సిడరీల విలీనానికి ఆర్బీఐ, ఐఆర్డీఏఐ అనుమతి కోరతామన్నారు. వయసు రీత్యా తాను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరబోనని, చక్రవర్తి చైర్మన్గా సేవలు అందిస్తారని దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ డిపాజిట్లు అన్నీ బ్యాంక్ కిందకు వస్తాయని, వాటికి వడ్డీ చెల్లింపులు ఎప్పటి మాదిరే చేస్తామని జగదీశన్ తెలిపారు. -
మెరుగైన రాబడుల కోసం.. హెచ్డీఎఫ్సీ బిజినెస్ సైకిల్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా బిజినెస్ సైకిల్ ఫండ్ పేరిట కొత్త ఫండ్ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో నవంబర్ 25తో ముగుస్తుంది. సానుకూల పరిస్థితుల్లోకి మళ్లుతున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందించేందుకు ఈ ఫండ్ కృషి చేస్తుంది. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఇటు కంపెనీల ఆదాయ వృద్ధిపరంగాను, అటు వేల్యుయేషన్ల వృద్ధిపరంగాను ఒనగూరే ప్రయోజనాలను అందుకోవచ్చని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ నవ్నీత్ మునోత్ తెలిపారు. మూడేళ్లు అంతకు పైబడిన వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారికి ఇది అనువైనదిగా ఉండనుంది. చదవండి: ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి! -
వారెవ్వా.. ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఇది రెండో సారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు కాలవ్యవధి ఎఫ్డీలు 6.40% వడ్డీని పొందుతారు. 18 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై 6.50% వడ్డీని పొందనున్నారు. సీనియర్ సిటిజన్స్ హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు ఎఫ్డీల వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసింతే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం పెంచిన వడ్డీ రేటుపై మరో 0.50 శాతం అదనపు రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే సారి రెండు శుభవార్తలను అందించింది. బ్యాంక్లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీటితో పాటు రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి ఇప్పుడు 6.90% వడ్డీని అందిస్తోంది. చదవండి: ఆ ఐఫోన్ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై..
ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ సంస్థలు తన కస్టమర్లకు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ప్రతి రోజు లక్షలాది బ్యాంక్ ఖాతాదారులు అటు ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే వీటిలో పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం సేవలు అందిస్తున్న పలు బ్యాంకులు ఇటీవల ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్ చార్జీల బాదుడిని మొదలెట్టాయి. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో తెలుసుకుందాం! ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం పై ప్రతి ప్రాంతంలో ఉచితంగా 5 లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంక్ ఏటీఎం( ATM)లలో ఈ సంఖ్య మూడుకి తగ్గించింది. అవి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్. ఒకవేళ ఈ పరిమితి దాటి విత్డ్రా చేస్తే.. ఎస్బీఐ ఏటీఎంల్లో 5 లావాదేవీలు దాటాక ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి దాటి జరిపే వాటిపై రూ.20 వసూలు చేస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ HDFC బ్యాంక్ తన ఏటీఎం (ATM) నుంచి నెలకు 5 చొప్పున ఉచిత లావాదేవీలను అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మూడు కాగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు. ఆ తర్వాత, విత్డ్రా చేస్తే రూ. 21 కాగా, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 ఛార్జ్ చేస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ ICICI బ్యాంక్ కూడా 5, 3 రూల్స్ని పాటిస్తుంది. అనగా ఆరు మెట్రో స్థానాల్లో(ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్) ఐసీఐసీఐ ఏటీఎం ( ATM) నుంచి 5 విత్డ్రాలు, ఇతర బ్యాంక్ ATMల నుంచి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితం. దీని తర్వాత, బ్యాంకు ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో 5 ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకవేళ ఈ పరిమితి దాటిన ప్రతి నగదు లావాదేవీలపై రూ.21, ఆర్థికేతర లావాదీవీలపైన రూ.10 వసూలు చేస్తుంది. పీఎన్బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్ సిటీల పరిధిలో తమ ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు మాత్రమే ఉచితం. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, ఆర్థికేతర లావాదీవీల మీద రూ. 9 చార్జ్ చేస్తోంది. చదవండి: ట్విటర్లో ఉద్యోగాల కోతలు షురూ -
భారీ పెంపు: పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పెంచింది. పీఎన్బీ రూ.2 కోట్ల వరకు ఎఫ్డీలపై రేట్లను సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం రెండో సారి. ఈ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం ఎఫ్డీలపై రేట్లను పెంచడం ఒక నెలలో ఇది రెండో పర్యాయం. వివిధ కాల పరిమితులపై రూ.2 కోట్ల వరకు చేసే ఎఫ్డీలపై 0.50 శాతం వరకు పెంచింది. రికరింగ్ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 26 నుంచే అమల్లోకి వచ్చాయి. -
దివాళీ బొనాంజా: బ్యాంకులు బంపరాఫర్లు.. కస్టమర్లకు పండగే!
కస్టమర్లకు బంపరాఫర్. దీపావళి సందర్భంగా కొత్త ఇల్లు, కారు కొనాలని అనుకుంటున్నారా? లేదా ఇల్లు రెనోవేట్ చేయాలని అనుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీరేట్ల నుంచి ఉపశమనం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ,ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు పరిమిత కాలానికి లోన్ ఆఫర్లను ప్రకటించాయి. ఎస్బీఐ గృహ రుణాలను సంవత్సరానికి 8.4 శాతం నుండి టాప్-అప్ రుణాలను 8.8 శాతం నుండి అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరానికి 8.45 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. 8.45 శాతం నుండి కార్ లోన్లను అందిస్తుంది. కారు రుణాలపై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంవత్సరానికి 7.9 శాతం చొప్పున కారు లోన్లను అందిస్తోంది. 50 శాతం పూర్తయిన తర్వాత (కనీసం 24 నెలలు) ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. బంగారం రుణాలపై, ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం మాఫీ చేసింది. ఐసీఐసీ బ్యాంక్ ప్రస్తుతం కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను అందిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను చెక్ చేసిన తర్వాత, ప్రీ-అప్రూవ్డ్ లోన్లను మంజూరు చేస్తుంది. కారు రుణాలపై, ప్రాసెసింగ్ రుసుము రూ. 1,999, కొత్త కారు రుణాలపై ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ మొత్తాలను అందిస్తుంది. కార్ లోన్లపై ఫోర్క్లోజర్, ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు. వ్యక్తిగత రుణాలపై 12 ఈఎంఐల తర్వాత ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు (12ఈఎంఐల కంటే ముందు ఫోర్క్లోజర్ చేస్తే 3 శాతం వసూలు చేస్తాయి). పంజాబ్ నేషనల్ బ్యాంకు పండుగ సీజన్లో పీఎన్బీ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 అనే పేరుతో గృహ రుణాలు, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.50 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. తిరిగి చెల్లించే వ్యవధి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కార్ లోన్లను అందిస్తుంది. ఇది సంవత్సరానికి వడ్డీ 7.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులు లేవు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పండుగ సీజన్లో గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 8.30 శాతం నుండి, కారు రుణాలను 8.70 శాతం నుండి అందిస్తోంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏడేళ్ల వరకు కార్ లోన్లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేసేలా 100 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తోంది. సాధారణంగా, బ్యాంకులు కారు రుణం 80-85 శాతం వరకు ఫైనాన్సింగ్ను అందిస్తాయి. ఇది 72 నెలల వరకు రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇతర ప్రముఖ బ్యాంకులతో పోలిస్తే, బ్యాంక్ ఎక్కువ కాలం పాటు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. గరిష్ట రుణ మొత్తం ఎక్కువగా ఉంటుంది. గృహ రుణాల కోసం 30ఏళ్ల వరకు సుదీర్ఘ కాల వ్యవధిని అందిస్తోంది. -
నిఫ్టీ సూచీ నుంచి హెచ్డీఎఫ్సీ తొలగింపు!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. విలీనానికి రికార్డ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే జనవరిలో ఇది ఉండొచ్చు. ఈ రికార్డ్ తేదీకి ముందే నిఫ్టీ–50 సూచీ నుంచి హెచ్డీఎఫ్సీని ఎన్ఎస్ఈ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ విలీనం దేశంలోనే పెద్దదిగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనానికి దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఇంకా కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంది. వాటాదారుల సమావేశం నవంబర్ 25న నిర్వహించనున్నారు. అలాగే, ఆర్బీఐ నుంచి తుది ఆమోదం కూడా రావాల్సి ఉంది. హెచ్డీఎఫ్సీకి నిఫ్టీ ఇండెక్స్లో 5.5 శాతం వెయిటేజీ ఉంది. దీంతో 1.3–1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు హెచ్డీఎఫ్సీ నుంచి వెళ్లిపోవచ్చని అంచనా. దీంతో నిఫ్టీ సూచీలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు నిఫ్టీ ఇండెక్స్లో 13 శాతం వెయిటేజీ రానుంది. ఇది పెద్ద మొత్తం కావడంతో ఇండెక్స్పై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఎస్ఈ దీనిపై ఓ చర్చా పత్రం విడుదల చేసింది. దీనిపై నవంబర్ 2 నాటికి అభిప్రాయాలు తెలియజేయాలని మార్కెట్ భాగస్వాములను కోరింది. విలీనం నేపథ్యంలో స్టాక్ ధరలు తీవ్ర అస్థిరతలకు గురి కాకుండా చూడడమే ఎన్ఎస్ఈ ఉద్దేశ్యం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22%ఎగసి రూ. 11,125 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 20 శాతం పుంజుకుని రూ. 10,606 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 8,834 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం బలపడి రూ. 21,201 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ 4.1 శాతంగా నమోదయ్యాయి. ఎన్పీఏలు మెరుగు ప్రస్తుత క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.35 శాతం నుంచి 1.23 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీల కేటాయింపులు రూ. 3,925 కోట్ల నుంచి తగ్గి రూ. 3,240 కోట్లకు పరిమితమయ్యాయి. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంపై వాటాదారుల సమావేశ నిర్వహణకు ఎన్సీఎల్టీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 40 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్కు 2022 ఏప్రిల్ 4న తెరలేచిన విషయం విదితమే. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
తెలుగు రాష్ట్రాల్లో 179 కొత్త శాఖలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 6–9 నెలల్లో కొత్తగా 179 శాఖలు ఏర్పాటు చేయనుంది. వీటిలో 90 తెలంగాణలో, 89 ఆంధ్రప్రదేశ్లో ఉండనున్నాయి. ఇందుకోసం 5,000 మంది సిబ్బందిని బ్యాంక్ తీసుకోనుంది. వ్యాపారవర్గాల కోసం రూపొందించిన స్మార్ట్హబ్ వ్యాపార్ యాప్ను ఆవిష్కరించిన సందర్భంగా బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ (దక్షిణాది) తరుణ్ చౌదరి గురువారం ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 588 శాఖలు ఉన్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో 10,000 రకాల పైచిలుకు ఆఫర్లు కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, స్మార్ట్హబ్ యాప్తో చెల్లింపులు, బ్యాంకింగ్ సర్వీసులు పొందడం వ్యాపార వర్గాలకు సులభతరం అవుతుందన్నారు. గతేడాది జూలైలో ప్రయోగాత్మకంగా యాప్ను ప్రవేశపెట్టామని, ఈ నెలాఖరు నాటికి యూజర్ల సంఖ్య 10 లక్షలకు చేరుకోనుందని చౌదరి తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీనానికి ఎన్హెచ్బీ ఆమోదం!
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమయ్యేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) నుంచి తమకు ఆమోదముద్ర లభించిందని గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. అలాగే రెండు అనుబంధ సంస్థలు.. హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ విలీనానికి కూడా అనుమతి దక్కిందని పేర్కొంది. ఆగస్టు 8న ఎన్హెచ్బీ ఈ మేరకు నిరభ్యంతర పత్రం జారీ చేసినట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల విలీన ప్రతిపాదనకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు స్టాక్ ఎక్ఛేంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. విలీన సంస్థకు దాదాపు రూ. 18 లక్షల కోట్ల మేర అసెట్లు ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ఇది పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో పబ్లిక్ షేర్హోల్డింగ్ 100 శాతానికి చేరుతుంది. హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్ల వాటా 41 శాతంగా ఉంటుంది. చదవండి👉 వాడకం మామూలుగా లేదుగా! పెరిగిపోతున్న క్రెడిట్ కార్డ్ల వినియోగం..ఎంతలా అంటే? -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.9,579 కోట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 21 శాతం పెరిగి రూ.9,579 కోట్లుగా నమోదైంది. కానీ, మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.10,055 కోట్లతో పోల్చినప్పుడు (సీక్వెన్షియల్గా) కొంత తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం వృద్ధితో రూ.19,481 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 4 శాతంగా ఉంది. ఇతర ఆదాయం సైతం 35 శాతం వృద్ధిని చూపించి రూ.7,700 కోట్లకు దూసుకుపోయింది. ఆస్తుల నాణ్యత స్థూల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు/ఎన్పీఏలు) జూన్ చివరికి 1.28 శాతానికి మెరుగుపడ్డాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 1.47 శాతంగా ఉన్నాయి. రుణాల్లో వృద్ధి కార్పొరేట్, హోల్సేల్ రుణాల్లో వృద్ధి 15.7 శాతానికి పరిమితం కాగా, రిటైల్ రుణాల్లో 21.7% వృద్ధి నమోదైంది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా రుణాల్లో 28.9 శాతం వృద్ధి సాధ్యమైంది. చదవండి: Google Play Store: 8 యాప్లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
’కరెంటు అకౌంట్’ నిబంధనల మార్పు,ప్రైవేట్ బ్యాంకులకు ఊతం!
ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్) విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 2020లో దేశీయంగా సీఎంఎస్లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్ నివేదిక వివరించింది. 2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్ బ్యాంకింగ్ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్ బ్యాంకింగ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్ క్యాపిటల్ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణాల్లో 21.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణాల్లో మంచి వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో రుణ పుస్తకం 21.5 శాతం వృద్ధితో రూ.13,95,000 కోట్లకు చేరినట్టు బ్యాంకు ప్రకటించింది. అంతక్రితం ఏడాది జూన్ చివరికి రుణ పుస్తకం రూ.11,47,700 కోట్లుగా ఉంది. డిపాజిట్లు రూ.16,05,000 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది జూన్ నాటికి డిపాజిట్లు రూ.13,45,800 కోట్లతో పోలిస్తే 19.3 శాతం వృద్ధి నమోదైంది. మాతృసంస్థ హెచ్డీఎఫ్సీతో గృహ రుణ ఒప్పందం కింద జూన్ త్రైమాసికంలో రూ.9,553 కోట్ల రుణాలను కొనుగోలు చేసినట్టు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ విలీనం కానుండడం తెలిసిందే. విలీనం అనంతరం ఏర్పడే హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.18 లక్షల కోట్ల రుణ ఆస్తులతో ఉండనుంది. విలీనం మరో ఏడాదికి పైగా పట్టే అవకాశాలున్నాయి. -
హెచ్డీఎఫ్సీ శాఖలు రెట్టింపు!
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ వృద్ధి ప్రణాళికలతో ఉంది. ఏటా 1,500 నుంచి 2,000 శాఖలను వచ్చే ఐదేళ్ల పాటు పెంచుకోనున్నట్టు చెప్పారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో బ్యాంకు శాఖలను రెట్టింపు చేసుకోనున్నట్టు బ్యాంకు ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ ప్రకటించారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 6,000కు పైగా శాఖలు ఉన్నాయి. 2021–22 వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి జగదీశన్ ఈ విషయాలను తెలిపారు. హెచ్డీఎఫ్సీ విలీనాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల భవిష్యత్తు పూర్తి భిన్నంగా ఉంటుందని ప్రకటించారు. ‘‘ఓఈసీడీ దేశాలతో పోలిస్తే జనాభా పరంగా బ్యాంకు శాఖలు భారత్లో తక్కువే ఉన్నాయి. అందుకే వచ్చే ఐదేళ్లలో మా శాఖల నెట్వర్క్ను రెట్టింపు చేసుకోవాలని నిర్ణయించాం’’అని జగదీశన్ వివరించారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి అనుకూలంగా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ ప్రక్రియ 15–18 నెలల్లో పూర్తవుతుందని అంచనా. హెచ్డీఎఫ్సీకి ఉన్న గొప్ప నైపుణ్యాలు, ఉత్పత్తుల పట్ల అవగాహన, అనుభవం, సిస్టమ్ తమకు బలంగా మారుతుందని జగదీశన్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఈ అవకాశాన్ని కోల్పోదన్నారు. గృహ రుణాలకు వాతావరణం పూర్తి సానుకూలంగా మారిపోయినట్టు చెప్పారు. రెరా రావడంతో ఈ రంగంలో ప్రక్రియల్లో పారదర్శకత వచ్చినట్టు అభిప్రాయపడ్డారు. ప్రాపర్టీ మార్కెట్లో ధరలు దిద్దుబాటుకు గురికాడాన్ని, పెరుగుతున్న ఆదాయాలను ప్రస్తావించారు. ఇవన్నీ తమకు అనుకూలమని చెప్పారు. -
మరీ ఇంత దారుణమా! ఈ బ్యాంకు అధికారులకు బుద్ది లేదా ?
విజయ్మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్మోదీలను బ్యాంకులను మోసం చేశారు. దేశానికి ద్రోహం చేశారనే భావన ఇప్పటి వరకు చాలా మందిలో పేరుకు పోయింది. కానీ ఇప్పుడు చెప్పబోయే వివరాలు తెలిస్తే అవాక్కవడం ఖాయం. బ్యాంకులను డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లే ఎంతో నయం అనిపిస్తారు. ఎందుకంటే మన బ్యాంకులు అలా తయారయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్తను మీరు చూడండి. కంపెనీ పేరు గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ దీన్ని ప్రమోట్ చేసిన వ్యక్తులు అనుమోద్ శర్మ, విరాఫ్ సర్కారీ, సంజయ్ చౌధరీలు. ఈ కంపెనీ చేసే వ్యాపారం విస్తరణ కోసం ఐడీబీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంకు ఆఫ్ బరోడాల నుంచి భారీ ఎత్తున రుణం తీసుకుంది. గ్యారెంటీగా గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ పలు ఆస్తులను చూపించింది. ఇంతకీ ఈ ఆస్తులు కలిగి ఉన్న కంపెనీ పేరు గ్రేట్ ఇండియన్ తమాషా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. రూ. 147 కోట్లు గ్రేట్ ఇండియన్ తమాషా కంపెనీ ఆస్తులను గ్యారెంటీగా ఉంచుకుని బ్యాంకు ఆఫ్ బరోడా 2015 ఫిబ్రవరి 13న ఏకంగా రూ.49.23 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు అదే ఏడాది డిసెంబరు 11న రూ 6.26 కోట్ల రుణం ఇచ్చింది. ఈ రెండు బ్యాంకులకు అసలు, వడ్డీ చెల్లించలేదు ది గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ. దీంతో ఈసారి అప్పు కోసం ఐడీబీఐ బ్యాంకును సంప్రదించాయి. గ్రేట్ ఇండియన్ తమాషానే గ్యారెంటీగా చూపుతూ 2021 నవంబరు 25న ఏకంగా రూ.86.48 కోట్ల రుణం పొందింది. ఆస్తుల వేలం తమాషా కంపెనీ తమకు రుణం చెల్లించడం లేదంటూ హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఆలస్యంగా గుర్తించగా పెద్ద మొత్తంలో లోను ఇచ్చిన ఐడీబీఐ ఆలస్యంగా గమనించింది. చివరకు తమాషా కంపెనీకి కర్నాటకలో ఉన్న ఆస్తులు వేలం వేస్తామంటూ 2022 మేలో పేపర్ ప్రకటన ఇచ్చింది. కర్నాటకలో తమాషా కంపెనీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న 107 ఎకరాలు, ఇతర స్థిర ఆస్తులను వేలం వేసి నష్టాలను పూడ్చుకుంటామంటూ ప్రకటన ఇచ్చాయి. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంకు నుంచి ప్రకటన జారీ అయ్యింది. ఇదే ట్వీట్ను హర్షద్ మెహతా స్కామ్ను వెలికి తీసిన సుచేతా దలాల్ రీట్వీట్ చేయడంతో ఈ విషయం వైరల్ అవుతోంది. మోసగాళ్ల వల్లే కంపెనీ పేర్లు ‘ది గ్రేట్ ఇండియన్ నోటంకి’ అని గ్యారెంటీగా చూపించిన ఆస్తులు ‘ది గ్రేట్ తమాషా కంపెనీ’ అని నేరుగా కనిపించినా అధికారులు కనీసం బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఎలా మంజూరు చేశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నోటంకి, తమాషా లాంటి పదాలు నేరుగా కనిపించినా కళ్లు మూసుకుని రుణాలు ఇచ్చారంటే వీళ్లకు అసలు బుద్ధి ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బ్యాంకు అధికారులు, మోసగాళ్లతో కుమ్మక్కయిన కారణంగానే ఈ తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు మరికొందరు. మాఫీ చేస్తారు మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి రెండువేల కోట్ల రూపాయలు ఎగనామ పెట్టాడు. విజయ్మాల్యా ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులకు పది వేల కోట్ల రూపాయలకు పైగా బాకీ పడ్డాడు.. ఈ జాబితాలో తమాషా లాంటి కంపెనీలు మరెన్నో ఉన్నాయి. ఇలా పేరుకుపోయిన అప్పులను అప్పుడప్పుడు బ్యాంకులు మాఫీ చేస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహాలో మాఫీ చేసిన అప్పుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలకుపై మాటే. My god... this is not a joke!! https://t.co/uXtVTW4Cgr — Sucheta Dalal (@suchetadalal) June 20, 2022 చదవండి: రూ.3లకు కక్కుర్తి పడితే.. చివరకు ఏం జరిగిందంటే? -
హెచ్డీఎఫ్సీ రెండో ‘వడ్డింపు’: వినియోగదారులకు షాక్!
ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు నెలల వ్యవధిలో రెండో సారి రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. రుణ రేటును 0.35 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటన ఒకటి పేర్కొంది. దీనితో రెండు నెలల్లో పెరిగిన రేటు మొత్తం 0.60 శాతంగా ఉంది. తాజాగా పెంచిన నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ♦ రుణాలకు ప్రధానంగా ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది. ♦ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 7.15 శాతం నుంచి 7.50 శాతానికి ఎగసింది. ♦ మూడళ్ల రేటు 7.70 నుంచి 8.05కు చేరింది. ఆర్బీఐ కీలక నిర్ణయాలు ఇదిలావుండగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండవ ద్వైమాసిక సమావేశం కీలక నిర్ణయాలను వెలువరించింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 4.4 శాతం) మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్లో తొలి ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ఎంపీసీ, మే తొలి వారంలో అనూహ్య రీతిలో సమావేశమై రెపో రేటును 2018 ఆగస్టు తర్వాత మొట్టమొదటిసారి 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. -
వికారాబాద్ జిల్లాలో HDFC ఖాతాలోకి భారీగా డబ్బు జమ
-
జాక్పాట్: అకౌంట్లో పడిన 18 కోట్లు.. ఖాతాదారుడు ఏం చేశాడంటే?
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా రూ. 18కోట్లు జమయ్యాయి. బ్యాంక్ ఖాతా చెక్ చేసి షాకైన సదరు బ్యాంక్ ఖతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం.. వికారాబాద్కు చెందిన వ్యాపారి వెంకట్రెడ్డికి జాక్పాట్ తగిలింది. అతడి HDFC బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 18.52 కోట్లు జమయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డి.. బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. నిన్న(ఆదివారం) కూడా తమిళనాడులో HDFC బ్యాంకుకు చెందని పలువురి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో సంబంధిత బ్యాంకు అధికారులు అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: కేజీఎఫ్ కోటలో కలకలం -
ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను మరోసారి సవరించింది. కొద్ది రోజుల క్రితమే ఆయా టెన్యూర్స్కు సంబంధించి వడ్డీరేట్లను మార్చగా..ఇప్పుడు మరోకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్లను సవరిస్తూ హెచ్డీఎఫ్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీరేట్లు బుధవారం (ఏప్రిల్ 20) నుంచి అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారిక వెబ్సైట్లో...“ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని పేర్కొంది. సవరించిన వడ్డీరేట్ల జాబితా ప్రకారం...హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ పౌరులకు 7-29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 2.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక 30 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.91 రోజులు- 6 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయినట్లయితే, బ్యాంక్ సాధారణ పౌరులకు 3.5 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డిలపై సాధారణ పౌరులకు 5.1 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 5.6 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. సాధారణ పౌరులకు 2 సంవత్సరాల వ్యవధితో 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై వడ్డీ రేట్లు వరుసగా 5.2 శాతం, 5.45 శాతం, 5.6 శాతం. సీనియర్ సిటిజన్ల విషయంలో, ఈ రేట్లు వరుసగా 5.7 శాతం, 5.95 శాతం, 6.35 శాతంగా ఉన్నాయి. చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..? -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 23% అప్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 23 శాతం ఎగసి రూ. 10,055 కోట్లను అధిగమించింది. ఇందుకు అన్ని విభాగాల్లోనూ రుణాలకు డిమాండ్ బలపడటం, మొండిరుణాలకు కేటాయింపులు తగ్గడం సహకరించింది. మొత్తం ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 41,086 కోట్లకు చేరింది. రుణాలు 20.8 శాతం పెరిగి రూ. 13,68,821 కోట్లను తాకాయి. రుణాలలో రిటైల్ 15.2 శాతం, గ్రామీణ బ్యాంకింగ్ విభాగం 30.4 శాతం, హోల్సేల్ విభాగం 17.4 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. నికర వడ్డీ ఆదాయం 10.2 శాతం బలపడి రూ. 18,873 కోట్లకు చేరింది. బ్రాంచీలు ప్లస్... క్యూ4లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 563 బ్రాంచీలు తెరవగా 7,167 మంది ఉద్యోగులను జత చేసుకుంది. పూర్తి ఏడాదిలో 734 బ్రాంచీలు ఏర్పాటు చేయగా.. అదనంగా 21,486 మంది ఉద్యోగులు చేరారు. కాగా.. సమీక్షా కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.17 శాతానికి, నికర ఎన్పీఏలు 0.4 శాతం నుంచి 0.32 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 4,694 కోట్ల నుంచి రూ. 3,312 కోట్లకు దిగివచ్చాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో బ్యాంక్ నికర లాభం 23.8 శాతం ఎగసి రూ. 10,443 కోట్లయ్యింది. పూర్తి ఏడాదికి 19.5 శాతం వృద్ధితో రూ. 38,053 కోట్లను తాకింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి (సీఏఆర్) 18.9 శాతంగా నమోదైంది. 2021–22లో స్టాండెలోన్ నికర లాభం 19 శాతం అధికమై రూ. 36,961 కోట్లను అధిగమించగా.. మొత్తం ఆదాయం రూ. 1,57,263 కోట్లకు చేరింది. ఇది 7.7 శాతం వృద్ధి. ఈ నెల 23న సమావేశంకానున్న బోర్డు డివిడెండును ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బాండ్ల ద్వారా రూ.50,000 కోట్ల సమీకరణ! బాండ్ల జారీ ద్వారా రూ. 50,000 కోట్ల వరకూ సమీకరించాలని బోర్డు నిర్ణయించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. నిధులను ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుబాటు ధరల గృహాలకు రుణాలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. రానున్న 12 నెలల్లోగా బాండ్ల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది(2022) సెప్టెంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చే విధంగా రేణు కర్నాడ్ను తిరిగి నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంకానున్న నేపథ్యంలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలియజేసింది. -
అంచనాలకు మించి..! దుమ్మురేపిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్...! ఏకంగా...
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదరగొట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 22.8 శాతం మేర నికర లాభాలను రికార్డు చేసింది.ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి-మార్చ్ మధ్యకాలానికి 10,055.2 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే నికర లాభాలు మెరుగుపడ్డాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ 8,186.5 కోట్లను నమోదు చేసింది. ఈ ఏడాదిలో నాలుగో త్రైమాసికంలో రూ. 10,055.2 కోట్ల లాభాలనుపొందింది. గత ఆర్థిక సంవత్సరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర ఆదాయం 36,961.3 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. 18.8 శాతం అధికంగా లాభాలను పొందింది.. చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపించింది. ఇక చివరి త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 563 బ్రాంచీలతో..7,167 మందికి ఉద్యోగావకాశాలను అందించింది. -
హెచ్డీఎఫ్సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్డీఎఫ్సీ’ చీఫ్ల భేటీ
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. బ్యాంకింగ్ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో మాతృసంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ అతను చక్రవర్తితో కలిసి ఆర్థికమంత్రితో సమావేశమయినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. రెండు ఆర్థిక దిగ్గజ సంస్థల 40 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం పలు రంగాలకు రుణ లభ్యత సౌలభ్యతను మెరుగుపరుస్తుందని, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పరేఖ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్బీఐ నిబంధనల వల్ల నాన్ బ్యాంకింగ్ కంపెనీలు తగిన ప్రయోజనాలు పొందలేకపోతున్నాయని, ఈ కారణంగానే విలీన ప్రతిపాదన ముందుకు వచ్చిందని పరేఖ్ వ్యాఖ్యానించారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బడా బ్యాంకింగ్ యేతర సంస్థలు మారుతున్న నిబంధనలను అనుగుణంగా నడుచుకోవడమో లేక తమకుతాము పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. చదవండి: బాబా రామ్దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు గుడ్న్యూస్..!
గత నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఎంపిక చేయబడిన పీరియడ్పై మాత్రమే వర్తిస్తాయి. ఏప్రిల్ 6, 2022 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు వర్తించనున్నాయి. ఒక ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లను హెచ్డీఎఫ్సీ పెంచింది. దీంతో వడ్డీరేట్లు 5 శాతం నుంచి 5.10 శాతానికి పెరిగింది. రెండు సంవత్సరాల ఎఫ్డీలపై 5 శాతం నుంచి 5.10 శాతానికి 10 బేసిస్ పాయింట్లను పెంచుతూ హెచ్డీఎఫ్సీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా....రూ. 5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటజన్లకు ఐదేళ్ల కాల వ్యవధిలో 25 బేసిస్ పాయింట్ల ప్రీమియంను బ్యాంక్ చెల్లిస్తూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ సాధారణ 50 బేసిస్ పాయింట్ల ప్రీమియంతో అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..! చదవండి: ఒప్పో సంచలన నిర్ణయం..! -
హెచ్డీఎఫ్సీ మెగా విలీనం!
సుమారు ఎనిమిదేళ్లుగా ఊహిస్తున్న అతిపెద్ద కార్పొరేట్ విలీనానికి తాజాగా అడుగు పడింది. ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ట్విన్స్ ఒక్కటికానున్నాయి. రెరా అమలు తదుపరి ఇటీవల స్పీడందుకున్న గృహ రుణ రంగంలోని అవకాశాలను మరింత సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు రెండు సంస్థలు విలీనానికి తెరతీశాయి. వెరసి హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) విలీనంకానుంది. సంయుక్త సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ. 18 లక్షల కోట్లుకాగా.. డీల్ విలువ 40 బిలియన్ డాలర్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగంలో నంబర్ వన్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో దేశీయంగా అతిపెద్ద గృహ రుణ కంపెనీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంకానుంది. ఇది దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనంకాగా.. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరింత భారీ రూపాన్ని సంతరించుకోనుంది. 42:25 నిష్పత్తిలో విలీనాన్ని చేపట్టనున్నట్లు రెండు సంస్థలూ వెల్లడించాయి. అంటే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారుల వద్దగల ప్రతీ 25 షేర్ల స్థానే 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు జారీ కానున్నాయి. రెండు సంస్థలు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డీల్ పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పబ్లిక్ వాటాదారుల వాటా 100 శాతానికి చేరనుంది. దీనిలో ప్రస్తుత హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు 41 శాతం వాటా లభించనుంది. విలీనానికి ఆర్బీఐ తదితర నియంత్రణ సంస్థలనుంచి అనుమతులు లభించవలసి ఉంది. అనుబంధ సంస్థలు హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్, హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్ సైతం విలీనంలో భాగంకానున్నాయి. విలీనం తదుపరి హెచ్డీఎఫ్సీ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా గృహ రుణ పోర్ట్ఫోలియోను నిర్మించుకోనుంది. కస్టమర్ల సంఖ్యను సైతం భారీగా పెంచుకోనుంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ మొత్తం రూ. 6.23 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆస్తులు రూ. 19.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 6.8 కోట్ల కస్టమర్ బేస్ను కలిగి ఉంది. దీర్ఘకాలిక రుణాలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన విభిన్న చౌక వ్యయాలతోకూడిన మూలధన అవకాశాలను కలిగి ఉంది. ఈ విలీనంతో బ్యాంకుకు మరింత విలువ చేకూరనున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. భారీ బ్యాలన్స్షీట్, నెట్వర్త్ ద్వారా బ్యాంక్ లబ్ది పొందనున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం తదితర అతిభారీ రుణాల అండర్రైటింగ్కు వీలు చిక్కడం తోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థలోకి అత్యధికంగా రుణాలు విడుదలయ్యేందుకు దారి ఏర్పడనున్నట్లు అభిప్రాయపడింది. గృహ రుణ విడుదల సులభతరం కానున్నదని, ఇందుకు బ్యాంకుకున్న 6.8 కో ట్ల కస్టమర్ల బేస్ దన్నునివ్వనున్నదని వివరించింది. పలు బ్రాంచీలు మధ్య, అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు మంజూరు చేయడంలో హెచ్డీఎఫ్సీ ఎంతో ముందుంది. అందుబాటు ధరల గృహాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కంపెనీ పలు రుణాలు విడుదల చేసింది. 6,342 బ్రాంచీల ద్వారా దేశవ్యాప్తంగా 3,000 నగరాలు, పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. విలీనం ద్వారా ఈ పంపిణీ వ్యవస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భాగం కానుండటంతో గృహ రుణ మంజూరీ మరింత విస్తరించనుంది. మార్టిగేజ్ పోర్ట్ఫోలియోతోపాటు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పంపిణీ వ్యవస్థ చేజిక్కనుండటంతో బ్యాంక్ భారీగా బలపడనుంది. వెరసి రెండు సంస్థల మధ్య విలీ నం పలు విధాల లబ్ది చేకూర్చనుంది. రూ. 18 లక్షల కోట్లు సంయుక్త సంస్థ బ్యాలన్స్షీట్ రూ. 17.87 లక్షల కోట్లకు చేరనున్నట్లు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. నెట్వర్త్ రూ. 3.3 లక్షల కోట్లను తాకనున్నట్లు తెలియజేశారు. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల మధ్య నిబంధనలు క్రమబద్ధీకరించడంతో నియంత్రణ సంస్థల మధ్యవర్తిత్వ అవసరాన్ని తగ్గించినట్లు వివరించారు. ఇది రెండు సంస్థల విలీన నిర్ణయంలో ఒక కీలకాంశంగా నిలిచినట్లు వెల్లడించారు. గత మూడు వారాలుగా విలీన చర్చలు జరుగుతున్నాయని, నిబంధనలకు అనుగుణంగా మొండిబకాయిల గుర్తింపు తదితర పలు అంశాలను సరైన విలువలో మదింపు చేయవలసి వచ్చిందని తెలియజేశారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ప్రాధాన్యతా రంగ రుణ విడుదల తప్పనిసరికాకపోగా.. లయబిలిటీల కోసం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) లేదా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని నిర్వహించవలసిన అవసరంకూడా లేదని పేర్కొన్నారు. దీంతో ఆస్తి, అప్పుల సమన్వయానికి ఆర్బీఐ నుంచి గడువును కోరవలసి వచ్చినట్లు వెల్లడించారు. విలీనానికి నియంత్రణ సంస్థలు అనుమతిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావమూ ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్బీఐ నోటిఫికేషన్తో.. ఎనిమిదేళ్ల క్రితమే బీజం ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్తో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మధ్య విలీనానికి దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే బీజం పడినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, చౌక ధరల గృహాలకు రుణాలు సమకూర్చేందుకు వీలుగా దీర్ఘకాలిక బాండ్ల జారీకి బ్యాంకులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ 2014 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా ఈ మార్గంలో సమీకరించిన నిధులకు బ్యాంకులు ఎస్ఎల్ఆర్ లేదా సీఆర్ఆర్ను నిర్వహించవలసిన అవసరంలేదంటూ పేర్కొంది. అంతేకాకుండా ఈ నిధులను ప్రాధాన్యతా రంగ రు ణ లక్ష్యాలకు తప్పనిసరిగా కేటాయించవలసిన అవస రంలేదని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య విలీన అంశం చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని రెండు సంస్థల కీలక అధికారులు తోసిపుచ్చారు! అయితే ఎనిమిదేళ్ల అనంతరం ఇది కార్యరూపం దాల్చడం ప్రస్తావించదగ్గ విషయం! 1994 నుంచీ..: హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1994 నుంచీ విడిగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆదిత్య పురీ నేతృత్వంలో బ్యాంక్ కార్యకలాపాలు 1994లో ప్రారంభమయ్యాయి. దీపక్ పరేఖ్ కోరికమేరకు విదేశీ బ్యాంకింగ్ దిగ్గజం సిటీని వీడిన పురీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు పగ్గాలు చేపట్టారు. బ్యాంకులో మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీకి 21% వాటా ఉంది. 2020 అక్టోబర్లో శశిధర్ జగదీశన్ బ్యాంక్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బ్యాంక్ నంబర్ టూ ఎస్బీఐ తదుపరి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మదింపు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీని విలీనం చేసుకోనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశీయంగా అతిపెద్ద బ్యాంకుల్లో రెండో ర్యాంకులో నిలవనున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. తొలి స్థానంలో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) కొనసాగనున్నట్లు తెలియజేసింది. అయితే విలీన సంస్థ మరో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ పరిమాణంకంటే రెట్టింపు స్థాయికి చేరనున్నట్లు వివరించింది. విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. 15 శాతం మార్కెట్ వాటాతోపాటు, డైవర్సిఫైడ్ ఆదాయాన్ని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ వాటా 11 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పోర్ట్ఫోలియోలో మార్టిగేజ్ రుణాల వాటా ప్రస్తుత 11 శాతం నుంచి మూడోవంతుకు చేరనున్నట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీకి భారీ సంఖ్యలోగల కస్టమర్ల ద్వారా లబ్ది పొందనున్నట్లు పేర్కొంది. చౌకలో నిధుల సమీకరణకు వీలు చిక్కుతుందని తెలియజేసింది. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న రెండో రివర్స్ మెర్జర్ ఇది. ఇంతక్రితం ఐసీఐసీఐ లిమిటెడ్ సైతం ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది. 2001 అక్టోబర్లో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకులో మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ కలిసింది. దిగ్గజాల మధ్య... ఇది రెండు సమాన దిగ్గజాల మధ్య జరుగుతున్న విలీనం. హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. రెరా అమలు, గృహ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా, చౌక ధరల గృహాలకు ప్రభుత్వ తోడ్పాటు దీనికి దోహదం చేస్తున్నాయి. –దీపక్ పరేఖ్, చైర్మన్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గ్లోబల్ స్థాయికి... తాజా విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంతర్జాతీయ ప్రమాణాలతో చూసినా భారీ సంస్థగా ఆవిర్భవించనుంది. తద్వారా బ్యాంకులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులకు మరింత వీలు చిక్కనుంది. రెండు సంస్థల మధ్య విలీనం 12–18 నెలల్లో పూర్తికావచ్చు. –కేకి మిస్త్రీ, వైస్చైర్మన్, సీఈవో, హెచ్డీఎఫ్సీ షేర్ల దూకుడు రెండు సంస్థల మధ్య విలీన వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఊపందుకుంది. ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 9% ఎగసి రూ. 2,676 వద్ద నిలిచింది. ఒక దశలో గరిష్టంగా 19% దూసుకెళ్లి రూ. 2,934ను తాకింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10% జంప్చేసి రూ. 1,654 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,722 వరకూ ఎగసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 9,18,591 లక్షలను కోట్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువ రూ. 4,85,691 కోట్లను అధిగమించింది. సంయుక్తంగా చూస్తే రూ. 14 లక్షల కోట్లను దాటడం ద్వారా ఆర్ఐఎల్, టీసీఎస్ సరసన చేరింది! -
టీసీఎస్కు గట్టి షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ నిర్ణయం..!
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మార్ట్గేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కంపెనీ షేర్లు భారీ లాభాలను గడించాయి. కాగా ఈ సంస్థల విలీన నిర్ణయం దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు గట్టి షాక్ను ఇచ్చింది. టీసీఎస్ స్థానం గల్లంతు..! ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ టాటా గ్రూప్కు చెందిన ఐటీ సంస్థ టీసీఎస్ను అధిగమించి భారత్లో రెండో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కల్గిన కంపెనీగా అవతరించనుంది. ఏప్రిల్ 4న ఉదయం 11:15 గంటల నాటికి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కలిసి రూ. 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండగా, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 13.95 లక్షల కోట్లుగా ఉంది. 18 నెలలు పట్టే అవకాశం..! ఇరు సంస్థల విలీన ప్రక్రియకు రెగ్యులేటరీ నుంచి అనుమతులు రావడానికి సుమారు 18 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలీన ప్రక్రియ 2023–24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీనం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీకి 41 శాతం వాటా లభించనుంది. ప్రతి 25 హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్ షేర్లు లభించనున్నాయి. చదవండి: హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం.. దూసుకుపోతున్న షేర్ల ధరలు -
హెచ్డీఎఫ్సీ సంచలన నిర్ణయం.. ఆ బ్యాంకులో విలీనం!
HDFC Merge With HDFC Bank: హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) సంంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ విలువ పెంచేలా ఇన్వెస్టర్లకు మరింత లాభాలు అందించే చర్యల్లో భాగంగా హెచ్డీఎఫ్సీని పూర్తిగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం చేస్తున్నట్టు సోమవారం సెబీకి తెలిపింది. ఈ విలీనం పూర్తైన తర్వాత హెచ్డీఎఫ్సీలో ప్రతీ 25 షేర్లకు బదులుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకువి 45 షేర్లు బదలాయిస్తారు. ఈ విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్ సంస్థలు హెచ్డీఎఫ్సీలో విలీనం కానున్నాయి. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీకి 41 శాతం వాటా దఖలు పడనుంది. హెచ్డీఎఫ్సీ సంస్థల నుంచి విలీన ప్రకటన రావడంతో దేశంలో మూడో అతి పెద్ద బ్యాంకుగా హెచ్డీఎఫ్సీ అవతరించనుంది. ఈ విలీన ప్రకటన తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటల్ 12 లక్షల కోట్లకుపైకి చేరుకుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా హెచ్డీఎఫ్సీ మారనుంది. విలీన ప్రకటన వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్లో హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 9.43 శాతం లాభపడి 2,683 దగ్గర ట్రేడవుతోంది. ఇవాల ఒక్కరోజే రూ.231 లాభపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 8.43 శాతం లాభంతో రూ. 1633 దగ్గర ట్రేడవుతోంది. చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా..! -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ గుడ్న్యూస్.. సీబిల్ స్కోర్ లేకున్నా రుణాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనేవారికి శుభవార్త తెలిపింది. సీబిల్ స్కోర్ లేకున్నా వారికి రుణాలను మంజూరు చేసేందుకు ప్రముఖ 2 బ్యాంకులతో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఏథర్ ఎనర్జీ తన ఈ-స్కూటర్ల కొనుగోలు చేసేవారికి రిటైల్ ఫైనాన్స్ను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా ఈ-స్కూటర్ వినియోగదారులకు తక్షణ రుణ సదుపాయాన్ని అందించగలమని ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులకు గరిష్ట రుణాలను అందించనున్నాయి. తమ కస్టమర్లు కొనుగోలు సమయంలో వాహనం విలువలో 95 శాతం వరకు రుణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని, 2-3 సంవత్సరాల పాటు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫైనాన్సింగ్ సదుపాయం అందుబాటులో ఉండడం వల్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం సులభతరం అవుతుందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ రంగంలో గత ఏడాది 20 శాతం వృద్ది రేటును నమోదు చేసిందని కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు కొనుగోలును సులభతరం చేయడమే లక్ష్యంగా సంస్థ పెట్టుకున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు కొత్త ఖాతాదారులకు(క్రెడిట్ హిస్టరీ లేనివారికి) రుణాలను అందిస్తున్నాయి, వీరి వాటా మొత్తం సంఖ్యలో 20-25 శాతం వాటాను కలిగి ఉంది. క్రెడిట్ హిస్టరీ లేనివారికి రుణాలు కాగా, టైర్-2, టైర్-3 నగరాల్లో విస్తరణ దృష్ట్యా ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు వాహన రుణాలు అందించడం చాలా ముఖ్యమని ఏథర్ ఎనర్జీ పేర్కొంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో వినియోగదారులకు రుణ సదుపాయం సులభతరం అవుతుంది. భారతదేశంలో విక్రయించే 10 వాహనాల్లో 8 ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్ రూపంలో తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో ద్విచక్ర వాహన రంగంలో ఫైనాన్స్ రుణాలు 50 శాతానికి దగ్గరగా ఉందని అథర్ ఎనర్జీ తెలిపింది. 2025 నాటికి దేశీయ ద్విచక్ర వాహన లోన్ మార్కెట్ విలువ 12.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తాజా నివేదిక తెలిపింది. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం..! ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు భిన్నంగా
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల మాదిరిగా కాకుండా..ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విత్డ్రా చేయలేని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లకు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈలకు వర్తిస్తాయి.కాగా రూ.5 కోట్ల కంటే ఎక్కువ లేదా సమానమైన విత్డ్రా చేయలేని ఎఫ్డీలకు మాత్రమే ఈ వడ్డీరేట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త రేట్లు మార్చి 01, 2022 నుంచి అమలులోకి వచ్చాయని హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించాయి. ఇక విత్డ్రా చేయలేని ఎఫ్డీలు సాధారణ డిపాజిట్ల కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి ఎటువంటి అకాల ఉపసంహరణ సదుపాయాన్ని కలిగి లేని ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే గడువు ముగిసేలోపు డిపాజిటర్ ఫిక్స్డ్ డిపాజిట్లను మూసివేయలేరు. అసాధారణమైన పరిస్థితులలో ఈ డిపాజిట్లను అకాల ఉపసంహరణను బ్యాంక్ అనుమతిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..! ► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 5 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక ఎఫ్డీ వడ్డీరేటు 4.7 శాతం. ► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.6 శాతం వడ్డీ రేటు. ► 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4.55శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ► 9 నెలల కంటే ఎక్కువ కాలం నుంచి ఒక ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4.15 శాతం వడ్డీరేటు ► 6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై 4 శాతం వడ్డీరేటు ఇవ్వబడుతుంది. ► 91 రోజుల నుంచి 6 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీలపై అత్పల్ప వడ్డీ రేటు 3.75 శాతం. చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు భారీ ఊరటనిచ్చిన ఆర్బీఐ..!
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ ఊరటనిచ్చింది.డిజిటల్ 2.0 ప్రోగ్రామ్ కింద ప్లాన్ చేసిన వ్యాపార కార్యకలాపాలపై విధించిన ఆంక్షలను మార్చి 11న ఆర్బీఐ ఎత్తివేసింది. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన డిజిటల్ 2.0కు సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో తరచుగా అవాంతరాలు తల్లెత్తాయి. దీనిని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ డిజిటల్ 2.0 కార్యక్రమం కింద తలపెట్టిన లావాదేవీలపై ఆంక్షలు విధించింది.దాంతో పాటుడా కొత్తగా క్రెడిట్ కార్డులను ఎవరికీ జారీ చేయకుండా నిషేధం విధించింది. గతేడాది ఆగస్టులో కాస్త ఊరటనిస్తూ క్రెడిట్ కార్డుల జారీకి అనుమతిచ్చింది. ఆర్బీఐ సిఫార్సులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి స్వల్ప, మధ్యస్థ,దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి ఈ ఆంక్షల సమయం ఉపయోగపడిందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది.సులభమైన, అత్యున్నత సర్సీసులను తమ ఖాతాదారులకు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. చదవండి: హాట్కేకుల్లా బుక్కైన కియా నయా కార్..! ఏకంగా 50 వేలకు పైగా..కేవలం.. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త...!
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ దారిలోనే హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీరేట్ల పెంపు వుంటుందని బ్యాంకు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫిబ్రవరి 14 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఈ వడ్డీరేట్ల పెంపు కేవలం రూ.2 కోట్లలోపున్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించనునాయి. ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.45 శాతానికి చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం 6 నెలలకు గాను 1 రోజుల నుంచి 9 నెలల టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం 9 నెలల గాను 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ఒక ఏడాది పాటు: జనరల్ పబ్లిక్ కోసం - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.50 శాతం 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.35 శాతం -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
తన ఖాతాదారులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచింది. ఖాతాదారుడి ఖాతాలో నిర్వహించే రోజువారీ బ్యాలెన్స్ మీద వడ్డీ లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఈ వడ్డీలను త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచిన కొత్త వడ్డీలు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 3 శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఖాతాలో రూ. 50 లక్షల నుంచి రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మీద బ్యాంక్ 3.50 శాతం వడ్డీని ఇస్తుంది. అదే సమయంలో, రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మొత్తం మీద వడ్డీ రేటు 4.50 శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. సవరించిన రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ పొదుపు ఖాతాలకు వర్తిస్తాయని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై విధించే వడ్డీరేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోవైపు ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీయ, ఎన్ఆర్ఐ పొదుపు ఖాతాలపై ఇచ్చే వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంతకు ముందు, రూ.10 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ గల ఖాతాలకు 2.80 శాతం వడ్డీరేటును ఇస్తే, ఈప్పుడు అది 2.75 శాతానికి తగ్గింది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్ల మీద ఇచ్చే వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఫండ్ రూ.500 కోట్లు కంటే ఎక్కువ ఖాతా బ్యాలెన్స్పై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి రానున్నాయి పంజాబ్ & సిండ్ బ్యాంక్ పంజాబ్ & సిండ్ బ్యాంక్ కూడా ఫిబ్రవరి 1 నుంచి పొదుపు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రభుత్వ రంగ రుణదాత ఇప్పుడు రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా నిల్వలపై 3 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా, రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.20 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రేట్లు దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, అలాగే ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వర్తిస్తాయి. (చదవండి: కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం పెరిగి రూ. 10,342 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ3లో కే. 8,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,523 కోట్ల నుంచి రూ. 40,652 కోట్లకు బలపడింది. వడ్డీయేతర ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 8,184 కోట్లను తాకింది. ఇక నికర వడ్డీ ఆదాయం 13 శాతం ఎగసి రూ. 18,443 కోట్లను దాటింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 21 శాతం జంప్చేసి రూ. 10,591 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 39,839 కోట్ల నుంచి రూ. 43,365 కోట్లకు పురోగమించింది. డిపాజిట్లు జూమ్ క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.81 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 0.09 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,414 కోట్ల నుంచి రూ. 2,994 కోట్లకు తగ్గాయి. డిపాజిట్లు దాదాపు 14 శాతం ఎగసి రూ. 14,45,918 కోట్లకు చేరగా.. అడ్వాన్సులు(రుణాలు) 16.5 శాతం వృద్ధితో 12,60,863 కోట్లను తాకాయి. గత 12 నెలల్లో 294 బ్రాంచీలతోపాటు 16,852 మంది ఉద్యోగులను జత చేసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు 15 శాతం అధికమై 9,851 కోట్లకు చేరాయి. -
బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా..! అయితే మీకో గుడ్న్యూస్!
బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంట్రస్ట్ రేట్లు పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతా దారులు వడ్డీరేట్ల పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన ఆ ఇంటస్ట్ర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం? దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు తర్వాత వడ్డీ రేటు 5.6 శాతంగా ఉంటుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా..,రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి.ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీ పొందేందుకు కనీస వ్యవధి 7 రోజులు. వడ్డీ ఒక సంవత్సరంలోని రోజుల సంఖ్య ఆధారంగా లెక్కించబడుతుంది. లీపు సంవత్సరంలో వడ్డీ 366 రోజులకు లెక్కించబడుతుంది, సాధారణ సంవత్సరంలో వడ్డీ 365 రోజులకు లెక్కించబడుతుంది. కాగా, పెరిగిన వడ్డీ రేట్లపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ దగ్గర్లోని బ్యాంక్ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. గతేడాది ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై విధిస్తున్న ఛార్జీలను సవరించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి సవరించిన ఛార్జీలను అమల్లోకి తీసుకొని రానుంది. ►క్రెడిట్ కార్డ్ హోల్డర్లు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్(క్రెడిట్ కార్డ్ని ఉపయోగించినందుకు బ్యాంక్ విధించే ఛార్జ్)లను సవరించింది. వాస్తవానికి అన్నీబ్యాంకులు క్రెడిట్కార్డులపై జరిపే లావాదేవీలపై 2.50 శాతం మొత్తాన్ని వసూలు చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ ఛార్జీలను సవరించి 2శాతం మాత్రమే వసూలు చేయనున్నాయి. బ్యాంక్ ఇప్పుడు కనిష్టంగా రూ. 500 నుంచి క్రెడిట్ కార్డులపై 2శాతం ఛార్జీలను వసూలు చేయనున్నాయి. ►ఐసీఐసీ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని క్రెడిట్ కార్డ్లకు ఆలస్య చెల్లింపు ఛార్జీలను బ్యాంక్ సవరించనున్నాయి. కెడ్రిట్ కార్డ్లపై చెల్లించాల్సిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.100 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు అదనపు ఛార్జీలు విధించలేవు.మీరు చెల్లించాల్సిన మొత్తం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు గరిష్టంగా రూ.1200 వసూలు చేస్తాయి. ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్లు రూ. 50,000 కంటే ఎక్కువ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే వరుసగా రూ.1300, రూ.1300,రూ.1000 వరకు వసూలు చేస్తున్నాయి. ► కాగా నవంబర్ నెల ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం..అక్టోబర్ 2021తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ల సంఖ్య 1.84 శాతం పెరిగింది.గతేడాది అక్టోబర్ 2 శాతం,సెప్టెంబర్లో 1.7 శాతం పెరిగింది. చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! వచ్చే ఏడాది నుంచి మారనున్న రూల్స్..! -
ఎకానమీ స్పీడ్ 5 శాతం దాటకపోవచ్చు
ముంబై: ఎకానమీపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మూడవ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనందున, ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది. ► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. ► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం. ► ఇటీవలి కోవిడ్–19 కేసుల పెరుగుదల, అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది. -
వృద్ధి రేటులో 0.3 శాతం ‘ఒమిక్రాన్’పాలు!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పతి (జీడీపీ) విలువలో కొంత మొత్తం ఒమిక్రాన్ వల్ల హరించుకుపోనుందని విశ్లేషించింది. వృద్ధి రేటులో 0.2– 0.3 శాతం శ్రేణి మేర కోతపడే అవకాశం ఉందని పేర్కొంది. క్యూ4లో 6.1 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది తమ తొలి అంచనాకాగా, ఇది 5.9–5.8 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వెల్లడైన గణాంకాల ప్రకారం క్యూ1, క్యూ2ల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయ్యాయి. తాజా నివేదికలో బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని... ► రాష్ట్రాలు కోవిడ్–సంబంధిత ఆంక్షలు విధించడంతో (ప్రజల రాకపోకలపై రాత్రిపూట కర్ఫ్యూ, 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు పనిచేయడం) 2021–22 క్యూ4లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ► ప్రస్తుత తరుణంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికితోడు గ్లోబల్ రికవరీ మందగించడం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే వీలుంది. ► కోవిడ్ మహమ్మారికి సంబంధించి మునుపటి వేవ్ల అనుభవాలను బట్టిచూస్తే, కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ కదలికలపై (మొబిలిటీ) పరిమితులు మొదలవుతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. ► భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 60 శాతం కొత్త వేరియంట్కు సంబంధించినవిగా ఉంటున్నాయి. ► నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారంనాటికి (3వ తేదీ) 1,700గా ఉంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ను తనిఖీ చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ పరీక్షా సౌకర్యాలు ఉన్నందున ఒమిక్రాన్ కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మీడియా నివేదికలు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులను 18,000గా అంచనా వేస్తుండడం గమనార్హం. ► ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నప్పటికీ, డాలర్ మారకంలో రూపాయి విలువ 74–76 శ్రేణిలో ఉండే వీలుంది. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకునే వీలుంది. ► తాజా వేరియంట్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడం వల్ల ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరికొంత కాలం సరళతరం రీతిలోనే కొనసాగించే వీలుంది. అలాగే బ్యాంకుల్లో అదనపు దవ్య లభ్యతను వెనక్కు తీసుకునే చర్యలనూ తక్షణం తీసుకోకపోవచ్చు. దీనిప్రకారం ఫిబ్రవరిలో ఆశించిన రివర్స్ రెపో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంపు ఉండకపోవచ్చు. తగిన ద్రవ్య లభ్యత, ఈల్డ్స్ కట్టడి వంటి అంశాలపై ఆర్బీఐ దృష్టి సారించే వీలుంది. ద్రవ్యల్బణం కట్టడి, వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును 4శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!
New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది. పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనుంది. ఇప్పుడు యాక్సిక్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! -
Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన
సాక్షి, బెంగళూరు: మండ్య ఎంపీ సుమలతా సోదరి రేణుక.. తనను హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ విశాలాక్షీ భట్ డబ్బు మోసగించారని కోణణకుంటె పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. ఎక్కువ లాభాలు వస్తాయని రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టించిన విశాలక్ష్మీ భట్ మోసం చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. పైగా తన ఇంటికే వచ్చి ఖాళీ పేపర్లపై సంతకం చేయాలని బెదిరించిందని తెలిపారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) -
పట్టపగలే సినీఫక్కీలో భారీ చోరీ..
సాక్షి, వరంగల్: అత్యంత రద్దీగా ఉండే నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో పట్టపగలే సినీఫక్కీలో చోరీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందు నిలిపి ఉంచిన కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 25లక్షల నగదును దుండగులు అపహరించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ ఎ.రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశ్రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లాడు. చిన్నకుమారుడు కృష్ణవంశీ తన అకౌంట్నుంచి రూ.5లక్షలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లిపోయాడు. అనంతరం పెద్దకుమారుడితో కలిసి నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు వెళ్లిన తిరుపతి తన అకౌంట్లో ఉన్న రూ.10లక్షలు, భార్య భాగ్యలక్ష్మి పేరుమీద ఉన్న రూ.5 లక్షలు, పెద్ద కుమారుడు సాయితేజ అకౌంట్లో ఉన్న రూ.5లక్షలు డ్రా చేశాడు. మొత్తం డబ్బులను బ్యాగులో సర్దగా, పెద్దకుమారుడు తీసుకెళ్లి బ్యాంకు ముందు పార్క్ చేసిన కారులో పెట్టాడు. ఆ సమయంలో బ్యాంకునుంచి సంతకం కోసం ఫోన్ రావడంతో కారును లాక్ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చాడు. అప్పటికే కారు అద్దాలు పగిలి ఉన్నాయి. పరిశీలించగా కారులో పెట్టిన డబ్బుల బ్యాగు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భూమి కొనుగోలు కోసం బ్యాంకులో ఉన్న డబ్బులను తీసినట్లు తిరుపతి కన్నీటిపర్యంతమయ్యాడు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన డీసీపీ సంఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి పరిశీలించారు. బాధితుడినుంచి వివరాలు సేకరించారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు నిందితులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఒకరు చోరీ చేసి బ్యాగ్తో ముందుకువెళ్లగా, మరో నిందితుడు ద్విచక్ర వాహనంపై వచ్చి తీసుకెళ్లినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీసీపీవెంట కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రాఘవేందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, టాస్క్ఫోర్స్ బృందాలు ఉన్నాయి. -
అదృష్టం అంటే వీళ్లదే..! రూ.లక్ష పెట్టుబడితో రూ.కోటి సంపాదించారు..!
మల్టీ బ్యాగర్ స్టాక్స్. స్టాక్ మార్కెట్లో మనం తరుచూ వినే పదం. ఈ స్టాక్స్లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాల్ని గడించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షాది కారులు కాస్తా కోటీశ్వరులు కావొచ్చు. మంచి కంపెనీ. పెద్దగా పబ్లిసిటీ ఉండదు. కానీ ఇలాంటి కంపెనీలు రోజులు గడిచే కొద్ది ఇన్వెస్టర్లకు లాభాల పంట పడిస్తాయి. అయితే ఇందుకోసం స్టాక్మార్కెట్పై ఖచ్చితమైన అవగాహన, ఓపిక చాలా అవసరం. అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే భారీగా నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. హెచ్డీఎఫ్సీ స్టాక్స్ ఇక మల్టీ బ్యాగర్ స్టాక్స్లో ఒకటిగా ఉన్న హెచ్ డీఎఫ్సీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ముదుపర్లు భారీ లాభాల్ని మూటగట్టుకున్నారు. ఈ షేరు భారీ లాభాన్ని అర్జించిందిగత ఆరు నెలల కాలంలో 20 శాతం పెరుగుదలతో షేరు ధర రూ.1412 నుంచి రూ.1680 స్థాయికి చేరింది. ముఖ్యంగా మార్కెట్ లో హెచ్డీఎఫ్సీ షేర్ ధర సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టిన ముదుపర్లు ఇప్పుడు కోట్లు గడిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ వ్యాల్యూ ►నెలల వ్యవధిలో హెచ్డీఎఫ్సీ షేర్ వ్యాల్యూ పెరగడం పెట్టుబడిదారులకు వరంగా మారింది. నెల ముందు ఈ షేర్ రూ.1559 ఉండగా అనుహ్యంగా 8శాతం రిటర్న్తో రూ.1680 పెరిగింది. ►ఇక ఆరు నెలల క్రితం ఇదే షేర్ వ్యాల్యూ రూ.1412 నుంచి 20శాతం పెరిగి రూ.1680కి చేరింది. ►సంవత్సరం క్రితం రూ.1200 ఉండగా 40శాతం పెరిగి రూ.1680కి చేరింది. ► అదే గత 5 ఏళ్ల క్రితం బ్యాంక్ షేర్ రూ.635 ఉండగా 165శాతం పెరిగి రూ.1680కి చేరింది. ► 22ఏళ్ల క్రితం అంటే అక్టోబర్ 15,1999లో షేర్ ప్రైస్ రూ.9.82 ఉండగా ఈ వారానికి ఆ ధర రూ.1680కి చేరింది. ఏ సంవత్సరం లో ఎంత పెట్టుబడి పెడితే ఉదాహరణకు మల్టీ బ్యాగర్స్ స్టాక్స్గా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే .. ఇప్పుడు ఆ లక్ష కాస్త రూ.2.65 లక్షల లాభాల్ని అర్జించింది.ఇక పెట్టుబడులు పెట్టి చేతులు దులిపేసుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు అలాగే నిరీక్షించిన ఇన్వెస్టర్లు ఎంత లాభమో ఈ షేర్ వ్యాల్యూని చూస్తే అర్ధం అవుతుంది. సరిగ్గా ఇదే అక్టోబర్ నెలలో 22ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడితో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక్క షేర్ వ్యాల్యూ రూ.9.82ఉన్నప్పుడు కొనుగోలు చేసి అలాగే ఉంచినట్లైతే.. ఈ వారంలో ఆ షేర్ వ్యాల్యూ ధర ఎంతంటే అక్షరాల రూ.కోటీ 70 లక్షలు. 22ఏళ్ల క్రితం లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ.1 కోటీ 70లక్షలకు చేరింది. చదవండి: ఇవి షేర్లా.. బుల్లెట్ రైళ్లా... లాభాలతో ఇన్వెస్టర్ల ఉక్కిరి బిక్కిరి -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భేష్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 9,096 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,703 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,438 కోట్ల నుంచి రూ. 41,436 కోట్లకు పుంజుకుంది. రుణాల విడుదల(అడ్వాన్స్లు) 14.7 శాతం పెరిగి రూ. 12,49,331 కోట్లకు చేరింది. స్టాండెలోన్ పద్ధతిలో నికర లాభం 17.6 శాతం మెరుగై రూ. 8,834 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా బలపడి రూ. 17,684 కోట్లయ్యింది. కేటాయింపులు ఇలా క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.08 శాతం నుంచి 1.35 శాతానికి పెరిగాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.17 శాతం నుంచి 0.40 శాతానికి పెరిగాయి. మొండిరుణాలు, కంటింజెన్సీలకు రూ. 200 కోట్లు అధికంగా రూ. 3,925 కోట్లను కేటాయించింది. కరోనా మహమ్మారి భయాలకుతోడు.. సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా.. క్యూ2లో కనీస మూలధన నిష్పత్తి 19.1 శాతం నుంచి 20 శాతానికి మెరుగుపడింది. ఈ కాలంలో బాసెల్–3 ప్రమాణ అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా బిలియన్ డాలర్లు(రూ. 7,424 కోట్లు) సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. టర్న్అరౌండ్.. డిపాజిట్లు స్వీకరించని అనుబంధ ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ క్యూ2లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ. 85 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. తాజా సమీక్షా కాలంలో దాదాపు రూ. 192 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించింది. బ్రోకింగ్ అనుబంధ కంపెనీ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సైతం 44 శాతం వృద్ధితో రూ. 240 కోట్ల నికర లాభం ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 17% ఎగసి రూ. 16,564 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 70,523 కోట్ల నుంచి రూ. 75,526 కోట్లకు పురోగమించింది. -
నిరుద్యోగులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీపికబురు
ముంబై: నిరుద్యోగులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీపికబురు అందించింది. బ్రాంచీ నెట్ వర్క్, బిజినెస్ కరస్పాండెంట్లు, బిజినెస్ ఫెసిలిటేటర్లు, డిజిటల్ అవుట్ రీచ్ ప్లాట్ ఫారమ్ వంటి మొదలైన వారి కలయికతో రాబోయే 18-24 నెలల్లో 2,00,000 గ్రామాలకు తమ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రైవేట్ రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లో 2500 మందిని నియమించుకొనున్నట్లు కూడా పేర్కొంది. దేశంలోని మొత్తం గ్రామాలలో మూడింట ఒక వంతు మందికి కొత్తగా బ్యాంక్ సేవలు అందే అవకాశం ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది.(చదవండి: అమ్మాయిలకు అద్దె ఇళ్ల కష్టాలు.. బౌన్సర్లతో బెదిరింపులు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం 550కి పైగా జిల్లాల్లోని సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థలకు(ఎంఎస్ఎంఈలు) సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,00,000 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామాల్లో కోతకు ముందు - కోత అనంతర పంట రుణాలు, ద్విచక్ర వాహనాలు రుణాలు, ఆటో రుణాలు, బంగారంపై రుణాలు అందిస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. వేగంగా మారుతున్న గ్రామీణ పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త మార్పులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. "భారత ప్రభుత్వం, వివిధ పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మారుస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బాధ్యతాయుతమైన నాయకుడిగా, సమాజంలోని అన్ని వర్గాలకు అత్యుత్తమ శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు & సేవలను అందించాలని మేము విశ్వసిస్తున్నాము" అని శుక్లా తెలిపారు. -
కొత్త ఇల్లుకొనేవారికి హెచ్డీఎఫ్సీ ఫెస్టివల్ బొనాంజా!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) పండుగ ఆఫర్లలో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 6.70 శాతానికి గృహ రుణాలను అందించనున్నట్లు తెలిపింది. అయితే, క్రెడిట్ స్కోర్ 800కి పైగా ఉండాలని షరతు విధించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద, కస్టమర్లు 20 సెప్టెంబర్ 2021 నుంచి 6.70 శాతానికి హెచ్డీఎఫ్సీ అందించే గృహ రుణాలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తం లేదా ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కేవలం 31 అక్టోబర్ 2021 వరకు అందుబాటులో ఉండనున్నట్లు రుణదాత తెలిపింది. గతంలో ఉద్యోగులు రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి 7.30 శాతం వడ్డీ వర్తించేంది. తాజా ఆఫర్ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా సైతం పండగ సీజన్ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేసింది.(చదవండి: అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్!) -
పేటీఎం యూజర్లకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు !
నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు రెండు పెద్ద ఆర్థిక సంస్థలు సిద్ధమయ్యాయి. దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్డీఎఫ్సీ , పేటీఎంలు సంయుక్తంగా క్రెడిట్కార్డులు అందించేందుకు రెడీ అవుతున్నాయి.పండగ సీజన్ సందర్భంగా భారీ ఎత్తున క్రెడిట్ కార్డులు జారీ చేసి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలనుకుంటున్నట్టు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. ఈ మేరకు పేటీఎం సంస్థతో కలిసి పని చేస్తామని తెలిపింది. చదవండి: Paytm : మొబైల్ బిల్స్ పేమెంట్స్పై పేటీఎమ్ బంపర్ ఆఫర్...! యూత్పై పట్టుపెంచుకునే దిశలో.. ఆన్లైన్స్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ అందించే స్టార్టప్గా మార్కెట్లోకి వచ్చిన పేటీఎం అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం పేటీఎంకే 30 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో 21 కోట్ల మంది వ్యాపారులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరిలో చాలా మందికి క్రెడిట్ కార్డులు లేవు. హెచ్డీఎఫ్సీకి దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది క్రెడిట్కార్డు వినియోగదారులు ఉన్నారు. ఇందులో 3 కోట్ల మంది వ్యాపారులే ఉన్నారు. అయితే హెచ్డీఎఫ్సీ కస్టమర్ బేస్లో మిలీనియల్స్, యువకులు తక్కువగా ఉన్నారు. దీంతో యూత్లో పట్టు పెంచుకోవాలనేది హెచ్డీఎఫ్సీ మార్కెటింగ్ వ్యూహంగా ఉంది. దీంతో పేటీఎంతో జట్టు కట్టింది. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని.. పేటీఎం ఖాతాదారుల్లో అర్హులైన వారిని క్రెడిట్ కార్డు పరిధిలోకి తేవాలని హెచ్డీఎఫ్సీ యోచిస్తోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. నెలకు కొత్తగా 5 లక్షల వంతున క్రెడిట్కార్డులను అందివ్వాలని హెచ్డీఎఫ్సీ లక్ష్యంగా పెట్టుకుంది. దసరా, దీపావళి వంటి పండగ సీజన్లో ప్రజలకు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో క్రెడిట్ కార్డులు జారీ చేయడం ద్వారా మార్కెట్లోకి త్వరగా దూసుకుపోవచ్చన్నది హెచ్డీఎఫ్సీ ప్రణాళికగా ఉంది. పేటీఎం సంస్థ గతంలో సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది .అయితే ఇటీవల ఇండియాలో రిటైల్ బ్యాంకింగ్ సర్వీస్ నుంచి తప్పుకోవాలని సిటీ బ్యాంకు నిర్ణయించింది. అదే సమయంలో హెచ్డీఎఫ్సీ సంస్థ పేటీఎంతో జత కట్టింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా క్రెడిట్ కార్డులు అందివ్వనున్నాయి. చదవండి: Paytm: పార్కింగ్లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం -
నెలకు 3 లక్షల కార్డులు క్రెడిట్ కార్డ్స్: హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ముంబై: క్రెడిట్ కార్డ్స్ మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీకి ఆర్బీఐ నుంచి గత వారం గ్రీన్సిగ్నల్ పొందిన నేపథ్యంలో భారీ లక్ష్యాన్ని బ్యాంక్ నిర్ధేశించుకుంది. తొలుత నెలకు 3 లక్షల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు బ్యాంక్ పేమెంట్స్, కంజ్యూమర్ ఫైనాన్స్ గ్రూప్ డైరెక్టర్ పరాగ్ రావ్ వెల్లడించారు. ‘మూడు నెలల్లో ఈ సంఖ్యను చేరుకుంటాం. ఆ తర్వాత ఆరు నెలలకు ఈ సంఖ్యను 5 లక్షలకు చేరుస్తాం. 9–12 నెలల్లో కార్డుల సంఖ్య పరంగా మా వాటాను తిరిగి చేజిక్కించుకుంటాం’ అని వివరించారు. కార్డుల సంఖ్య పరంగా హెచ్డీఎఫ్సీ వాటా 2 శాతం తగ్గి 25లోపుకు వచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయరాదంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను 2020 నవంబరులో ఆర్బీఐ ఆదేశించింది. -
గ్లోబల్ ర్యాంకింగ్స్లో దేశీ దిగ్గజాలు డీలా..రిలయన్స్తో పాటు
ముంబై: ప్రయివేట్ రంగంలోని టాప్–500 గ్లోబల్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు వెనకడుగు వేశాయి. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ర్యాంకులు నీరసించాయి. జూలై 15 కటాఫ్గా పరిగణిస్తూ హురున్ గ్లోబల్ రూపొందించిన టాప్–500 తాజా జాబితాలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్సహా.. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్, ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం, టెలికం బ్లూచిప్ భారతీ ఎయిర్టెల్ డీలా పడ్డాయి.అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా రూపొందించే ఈ జాబితాలో గతేడాది 11 దేశీ కంపెనీలకు మాత్రమే జాబితాలో చోటు లభించగా తాజాగా 12కు చేరింది. వివరాలు ఇవీ.. విలువ పెరిగినా..: ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 11 శాతం బలపడి 188 బిలియన్ డాలర్లను తాకినప్పటికీ కంపెనీ ర్యాంకు మూడంచెలు తగ్గి 57కు చేరింది. ఈ బాటలో 164 బిలియన్ డాలర్ల విలువతో టీసీఎస్ 75 నుంచి 74వ ర్యాంకుకు నీరసించగా.. 113 బిలియన్ డాలర్ల విలువ గల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 19 పొజిషన్లు క్షీణించి 124వ స్థానానికి చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ 52 అంచెలు జారి 301వ ర్యాంకును తాకింది. అయితే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ విలువ 1 శాతం పుంజుకుని 56.7 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ 8% తగ్గి 46.6 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. 96 ప్లేస్లు క్షీణించి 380వ ర్యాంకుకు చేరింది. కాగా.. బ్యాంకింగ్ బ్లూచిప్ ఐసీఐసీఐ విలువ 36 శాతం జంప్చేసి 62 బిలియన్ డాలర్లను అందుకోవడంతో 48 స్థానాలు మెరుగుపడి 268వ ర్యాంకుకు ఎగసింది. కొత్తగా 3 కంపెనీలు గ్లోబల్ టాప్–500 జాబితాలో కొత్తగా దేశీ దిగ్గజాలు విప్రో(457వ ర్యాంకు), ఏషియన్ పెయింట్స్(477), హెచ్సీఎల్ టెక్నాలజీస్(498)కు చోటు లభించింది. దేశీయంగా స్టార్టప్ల జోరు కొనసాగుతుండటంతో ఇకపై జాబితాలోకి మరిన్ని కంపెనీలు చేరే వీలున్నట్లు హురున్ నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ మార్కెట్ విలువ 15 శాతం పురోగమించి 2.4 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్) తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. జాబితాలో 243 కంపెనీలతో యూఎస్ టాప్ ర్యాంకును కైవసం చేసుకోగా.. చైనా(47), జపాన్(30), యూకే(24) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఆర్బీఐ ఊరట
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలిపిన ఒక ప్రకటనలో రిజర్వ్ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డుల జారీపై విధించిన నిషేదాన్ని సడలించినట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది. ఆంక్షలు తొలిగిపోవడంతో దూకుడుగా తిరిగి మార్కెట్లోకి వస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. "ఇంతకు ముందు చెప్పినట్లుగా క్రెడిట్ కార్డుల జారీ విషయంలో మేము దూకుడుగా తిరిగి వచ్చేందుకు అన్ని సన్నాహాలు, వ్యూహాలు రాబోయే కాలంలో అమలు చేయనున్నట్లు" హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ముందున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్బీఐ గత ఏడాది నిషేధం విధించింది. అయితే, దీనివల్ల బ్యాంకు ఖాతాదారులపై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. డిజిటల్ బిజినెస్ జనరేటింగ్ యాక్టివిటీస్ సంబంధించి ఆర్బీఐ తదుపరి సమీక్ష వరకు ఆంక్షలు కొనసాగుతాయని బ్యాంకు పేర్కొంది. ఆర్బీఐ కొత్త కార్డ్స్ జారీపై నిషేధం విధించడంతో బ్యాంకుపై భారీగానే దెబ్బపడింది. దాని కార్డ్ బేస్ గత ఏడాది డిసెంబర్ నెలలో 15.38 మిలియన్ల నుంచి జూన్ నాటికి 14.82 మిలియన్లకు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీ చేసే బ్యాంకుగా నిలిచింది. Media Statement by @HDFC_Bank.@RBI @FinMinIndia pic.twitter.com/joWEyZwqwv — HDFC Bank News (@HDFCBankNews) August 18, 2021 -
డెబిట్కార్డు లేకుండా డబ్బులను ఇలా విత్ డ్రా చేయండి..!
సాధారణంగా ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సిందే. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేకుండానే నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా తన ఖాతాదారులకు ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులు సురక్షితంగా డెబిట్ కార్డు లేకుండానే ఎటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చును. తన ఖాతాదారులకు కార్డ్లెస్ క్యాష్ను అన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి 24/7 సేవలను అందిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్వీటర్లో పేర్కొంది. ఏటీఎమ్లో కార్డ్లెస్ క్యాష్ను ఇలా విత్ డ్రా చేయండి..! మీకు దగ్గరలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎమ్ దగ్గరకు వెళ్లండి. మీకు ఏటీఎమ్ మిషన్పై చూపిస్తోన్న కార్డ్లెస్ క్యాష్ ఆప్షన్ను సెలక్ట్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. మీ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. మీ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ పంపినట్లు మెసేజ్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. మీకు తొమ్మిది అంకెల ఆర్డర్ ఐడీ వస్తుంది. తరువాత ట్రాన్సక్షన్ అమౌంట్ను ఎంటర్చేయాలి. వివరాలను ధృవీకరించిన తర్వాత ఏటీఎమ్ నుంచి నగదు చెల్లించబడుతుంది. Forgot your ATM Card? Don’t worry, HDFC Bank Cardless Cash is #DigitallyYours with 24X7 service to withdraw cash at all HDFC Bank ATMs. Enjoy instant and secure mode of cash withdrawals without ATM / Debit Card. To know more, visit: https://t.co/foq6Uq144f pic.twitter.com/xIJK6YI7do — HDFC Bank (@HDFC_Bank) July 29, 2021 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదిత్య పురికి రూ. 13.82 కోట్ల ప్యాకేజీ
ముంబై: ప్రైవేట్ రంగంలోని టాప్ 3 ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఆదిత్య పురి అత్యధిక వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఆయన రిటైర్ అయిన గత ఆర్థిక సంవత్సరంలో(2020–21) రూ. 13.82 కోట్లు జీతభత్యాల రూపంలో పొందారు. ఇందులో రూ. 3.5 కోట్ల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పురి రిటైర్మెంట్ తర్వాత సీఈవో, ఎండీగా నియమితులైన శశిధర్ జగదీశన్ రూ. 4.77 కోట్లు వేతనం అందుకున్నారు. మరోవైపు, కోవిడ్–19పరమైన పరిస్థితుల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి స్వచ్ఛందంగా తన జీత భత్యాల్లో ఫిక్స్డ్ భాగాన్ని, కొన్ని అలవెన్సులను వదులుకున్నారు. రూ. 38.38 లక్షల అలవెన్సులు అందుకోగా .. 2017, 2018 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ. 63.60 లక్షలు పనితీరు ఆధారిత బోనస్ పొందారు. అటు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి రూ. 6.52 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు బాగున్నాయ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో స్టాండెలోన్ నికర లాభం రూ. 7,730 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 6,659 కోట్లు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం 14 శాతం బలపడి రూ. 7,922 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 8.6 శాతం పుంజుకుని రూ. 17,009 కోట్లయ్యింది. అడ్వాన్సులు 14 శాతంపైగా వృద్ధి చూపగా.. నికర వడ్డీ ఆదాయం 4.1 శాతంగా నమోదైంది. ఇతర ఆదాయం 54 శాతం ఎగసి రూ. 4,075 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించగా.. తాజా సమీక్షా కాలంలోనూ స్థానిక లాక్డౌన్లు అమలైనట్లు బ్యాంక్ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో కొంతమేర కార్యకలాపాలు ప్రభావితమైనట్లు తెలియజేసింది. ఎంపిక చేసిన రుణ నష్టాలకు ప్రొవిజన్లు 54 శాతం పెరిగి రూ. 4,219 కోట్లకు చేరాయి. పక్కనపెట్టిన రూ. 600 కోట్ల కంటింజెన్సీలతో కలిపి మొత్తం ప్రొవిజన్లు రూ. 4,831 కోట్లను తాకాయి. 1,23,473కు సిబ్బంది జూన్ చివరికల్లా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) గత క్యూ1తో పోలిస్తే 1.36 శాతం నుంచి 1.47 శాతానికి పెరిగాయి. రిటైల్ రుణాలు 9.3 శాతం, వాణిజ్య రుణాలు 25.1 శాతం, టోకు రుణాలు 10.2 శాతం చొప్పున ఎగశాయి. డిపాజిట్లు 13.2 శాతం వృద్ధి చూపాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.1 శాతం, టైర్–1 క్యాపిటల్ 17.9 శాతంగా నమోదయ్యాయి. ఉద్యోగుల సంఖ్య గత జూన్లో 1,15,822కాగా.. తాజాగా 1,23,473కు చేరినట్లు బ్యాంక్ తెలియజేసింది. 5,653 బ్రాంచీలు, 16,291 ఏటీఎంలతో నెట్వర్క్ విస్తరించినట్లు వెల్లడించింది. అనుబంధ సంస్థలలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 233 కోట్ల నుంచి రూ. 131 కోట్లకు క్షీణించింది. ఆర్బీఐ తుది నిర్ణయం ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా టెక్నాలజీని 85 శాతం మెరుగుపరచినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధరజగదీశన్ పేర్కొన్నారు. దీంతో కొత్త క్రెడిట్ కార్డుల జారీపై విధించిన నిషేధానికి సంబంధించి ఆర్బీఐ నిర్ణయం తీసుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. టెక్నాలజీ ఆడిట్సైతం పూర్తయినట్లు వెల్లడించారు. సాంకేతిక సమస్యల నేపథ్యంలో 2020 డిసెంబర్లో ఆర్బీఐ కొత్త కార్డుల జారీని నిలుపుదల చేయమంటూ ఆదేశించిన విషయం విదితమే. కాగా.. అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యూ1లో 67 శాతం అధికంగా రూ. 458 కోట్ల ఆదాయం సాధించినట్లు జగదీశన్ వెల్లడించారు. నికర లాభం 95 శాతం జంప్చేసి రూ. 261 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. డిస్కౌంట్ బ్రోకింగ్ బిజినెస్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లు చేపట్టే లావాదేవీలపై నామమాత్ర కమిషన్లు, ఫీజును తీసుకోవడం ద్వారా డిస్కౌంట్ బ్రోకరజీ బిజినెస్లు విస్తరిస్తున్నట్లు వివరించారు. దీంతో పలు సంస్థలు ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నట్లు తెలియజేశారు. -
బ్యాంకులకు ‘మాస్టర్’ షాక్..
న్యూఢిల్లీ: స్థానిక డేటా స్టోరేజీ నిబంధనలు పాటించనందుకు గాను పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థ మాస్టర్కార్డుపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించడం.. ఇతర బ్యాంకులకు సంకటంగా మారింది. మాస్టర్కార్డ్తో ఒప్పందం ఉన్న 5 ప్రైవేట్ బ్యాంకులు కొత్తగా కార్డులు జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకులు సమస్యలు ఎదుర్కోనున్నాయి. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంకుపైనా దీని ప్రభావం పడనుంది. తరచూ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నందున కొత్త కార్డులు (డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్) జారీ చేయకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటోంది. మరోవైపు, బ్యాంకులతో పాటు బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ కార్డు వంటి సంస్థలు కూడా సమస్యలు ఎదుర్కోనున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా నివేదిక ప్రకారం .. మాస్టర్కార్డ్పై ఎక్కువగా ఆధారపడిన ఏడు సంస్థలు కొత్త కార్డులను జారీ చేయలేకపోవచ్చు. ఇతర పేమెంట్ గేట్వేలతో ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త కార్డులు జారీ చేయడానికి కనీసం 2–3 నెలలు పట్టేస్తుందని అంచనా. టెక్నాలజీని అనుసంధానం చేసుకోవాల్సి రానుండటం తదితర అంశాలు ఇందుకు కారణం. మూడింటిపై ఎక్కువ ప్రభావం.. ఆర్బీఎల్ బ్యాంక్, యస్ బ్యాంక్ బజాజ్ ఫిన్సర్వ్ ప్రధానంగా కార్డుల జారీ కోసం మాస్టర్కార్డ్పైనే ఆధారపడటం వల్ల వాటిపై మరింత తీవ్ర ప్రభావం పడనుంది. ‘కో–బ్రాండ్ భాగస్వాములు సహా క్రెడిట్ కార్డుల సంస్థల్లో ఆర్బీఎల్ బ్యాంకు, యస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్పై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎందుకంటే వీటి కార్డ్ స్కీములన్నీ కూడా మాస్టర్కార్డ్తోనే ముడిపడి ఉన్నాయి‘ అని నొమురా నివేదికలో తెలిపింది. దీని ప్రకారం ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు జారీ చేసే కార్డుల్లో 35–40 శాతం మాస్టర్కార్డ్వి ఉంటున్నాయి. అటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో భాగమైన క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్బీఐ కార్డ్ జారీ చేసేవాటిల్లో 10 శాతం మాస్టర్కార్డ్వి ఉంటున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు పూర్తిగా వీసాకి అనుసంధానమైనది కావడంతో దానిపై ప్రభావమేమీ ఉండదు. వీసాతో ఆర్బీఎల్ ఒప్పందం.. తాజా పరిణామాల నేపథ్యంలో వీసా ప్లాట్ఫాంపై క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు వీసా వరల్డ్వైడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు 8–10 వారాలు పట్టొచ్చని, తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్లకు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లతో కో–బ్రాండెడ్ కార్డుల స్కీములు కూడా ఉన్నాయి. -
వాహన రుణగ్రహీతలకు ‘జీపీఎస్’ కమీషన్ వెనక్కి
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద వాహనరుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలను సైతం కొనుగోలు చేసిన కస్టమర్లకు ‘కమీషన్ల’ను త్వరలో తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. 2013–14 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య వాహన రుణాలు తీసుకున్న కస్టమర్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీపీఎస్ పరికరాలను కూడా కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయం రూపంలో కమీషన్లను సంపాదించుకుంది. వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్టు గతేడాది బ్యాంకు చీఫ్గా ఉన్న ఆదిత్యపురి సైతం అంగీకరించారు. దీనిపై ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2013–14 నుంచి 2019–20 మధ్య వాహన రుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలనూ కొనుగోలు చేసిన వారికి కమీషన్లను తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. బ్యాంకు వద్ద నమోదై ఉన్న కస్టమర్ల ఖాతాలకు వచ్చే 30 రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు తెలిపింది. దీనిపై కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించొచ్చని సూచించింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్ పరికరాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొనుగోలు చేయించిందన్నది ఆరోపణ. నిబంధనల ప్రకారం బ్యాంకు లు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు. సేవల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం అదే పనిగా డిజిటల్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండడంతో.. నూతన క్రెడిట్ కార్డులు మంజూరు చేయకుండా ఆర్బీఐ విధించిన నిషేధం నుంచి బయటపడేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమేష్ లక్ష్మీనారాయణ తెలిపారు. నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సేవల్లో అంతరాయాలు ప్రస్తుత పాత వ్యవస్థ కారణంగానే చోటుచేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తరచూ సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతుండడంతో కొత్తగా క్రెడిట్ కార్డులు, నూతన డిజిటల్ సేవలు ప్రారంభించకుండా 2020 డిసెంబర్లో ఆర్బీఐ నిషేధం విధించడం గమనార్హం. -
కూకట్పల్లి ఏటీఎం: కాల్పులకు తెగబడ్డది ఆ ముఠానే!
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి వలస కూలీలుగా వచ్చారు.. ఇక్కడ దోపిడీ దొంగల అవతారం ఎత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరబాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడింది బిహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి విజయ్నగర్ కాలనీలోని ఏటీ ఎం కేంద్రం వద్ద దుండగులు గురువారం ఓ సెక్యూరిటీ గార్డ్ను చంపి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. మరో నిందితుడు ఆయుధం, డబ్బు తో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బిహార్కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల–చందానగర్ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పనిచేశారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు. గతంలోనూ నాటు తుపాకీతో బెదిరించి.. నిందితులు కొన్నాళ్ల క్రితం తమ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్ ఖరీదు చేసుకుని వచ్చారు. జీడిమెట్ల అయోధ్యనగర్ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ సంస్థను టార్గెట్ చేశారు. గత నెల 16న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్ రూ.1.95 లక్షలను తన బ్యాగ్లో పెట్టుకున్నారు. అదే సమయంలో హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు దుండ గులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన వద్ద నగదు ఉన్న బ్యాగ్తోపాటు సెల్ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఏటీఎం కేంద్రాలు ధ్వంసం చేయలేమనే.. ఆపై కూకట్పల్లి ప్రాంతంలోని ఏటీఎం కేంద్రాలపై గురిపెట్టారు. వాటిని ధ్వంసం చేసి డబ్బు దోచుకోవడం సాధ్యం కాదని భావించి, డబ్బు నింపడానికి వచ్చే వాహనాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వాహనాలు వచ్చే సమయాలు, రూట్లతోపాటు నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు వీలున్న ప్రాంతాలను రెక్కీ ద్వారా విజయ్నగర్ కాలనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. జీడిమెట్లలో నేరం చేయడానికి తమకు పరిచయస్తుడైన వ్యక్తి నుంచి యాక్టివా వాహనం తీసుకున్నారు. కానీ, విజయ్నగర్కాలనీలో నేరం కోసం మాత్రం బైక్ ఉండాలని భావించారు. బాలానగర్ జోన్ పరిధి నుంచి ఓ పల్సర్ వాహనాన్ని చోరీ చేసి దాని నంబర్ ప్లేట్ తీసేసి వినియోగించారు. విజయ్నగర్ కాలనీలో చోరీ చేసి కేపీహెచ్బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. గ్లాస్డోర్పై వేలిముద్రల సహాయంతో... ఇద్దరిలో ఓ నిందితుడు వాహనాన్ని తీసుకుని లిం గంపల్లి వరకు వెళ్లాడు. అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి డబ్బు, తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. ఏటీఎం కేంద్రంలోని గ్లాస్ డోర్పై నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్లో సేకరించిన వేలిముద్రలతో సరిపోలాయి. అలా అనుమానితులను గుర్తించి సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు బాలానగర్లోని ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన నేరంలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కస్టోడియన్ శ్రీనివాస్ను చికిత్స అనంతరం వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును నేరుగా కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ఈటల కథ క్లైమాక్స్కు.. ఏం జరగబోతోంది..? హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆటోలో వదిలేశారా? -
హైదరాబాద్: కూకట్పల్లిలో కాల్పుల కలకలం
-
కూకట్పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు
సాక్షి, హైదరాబాద్/భాగ్యనగర్కాలనీ: అది కూకట్ పల్లిలోని విజయ్నగర్ కాలనీ... గురువారం మిట్ట మధ్యాహ్నం... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఏటీ ఎం మిషన్లలో నగదు నింపే రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు టార్గె ట్గా ఈ ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీగార్డు అక్కడికక్కడే చనిపోగా.. మరో కస్టోడియన్కు తీవ్ర గాయాల య్యాయి. రూ.11 లక్షలు దోచుకోవడానికి ప్రయత్నించిన దుండగుల చేతికి రూ.5 లక్షలు చిక్కాయి. నిందితులు రెక్కీ చేసిన తర్వాతే ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. రైటర్ సేఫ్గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. హైదరా బాద్లో ఆయా ఏటీఎం కేంద్రాలు ఉన్న మార్గాలను రూట్లుగా విభజించి రోజూ కస్టోడియన్లతో డబ్బు పంపిస్తుంది. ప్రతి వ్యాన్కు ఇద్దరు కస్టోడియన్లు, ఓ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. వీటిలో ఓ బృందం రోజూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన ఏటీఎం మిషన్లలో నగదు నింపుతూ ఉంటుంది. ఆ సంస్థకు చెందిన వ్యాన్(ఏపీ36వై9150)లో డ్రైవర్ కృష్ణ, పటాన్చెరుకు చెందిన కస్టోడి యన్లు చింతల శ్రీనివాస్(33), ఎ.నవీన్ లతోపాటు సెక్యూరిటీగా విధులు నిర్వర్తి స్తున్న బోరబండ వాసి అయిన సీఆర్ పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ మీర్జా సుభాన్ అలీ బేగ్ (74) నగదుతో బయలుదేరారు. ఆ సమయంలో సదరు వ్యాన్లో మొత్తం రూ.2.7 కోట్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరిన ఈ టీమ్ కూకట్పల్లిలోని ఏటీఎం మిషన్లలో రూ.12 లక్షలు నింపింది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో కూకట్పల్లిలోని విజయ్నగర్కాలనీకి చేరుకుంది. అక్కడ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో రూ.11 లక్షలు నింపేందుకు వచ్చారు. డ్రైవర్ కృష్ణ వాహనంలోనే ఉండగా, ఇద్దరు కస్టోడియన్లు, సెక్యూరిటీ గార్డు నగదు తీసుకుని ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లారు. మిగిలిన మొత్తం వ్యాన్లోనే ఉంది. సెక్యూరిటీ గార్డు అలీబేగ్ తన తుపాకీతో బయటే వేచి ఉండగా, మిగిలిన ఇద్దరూ లోపలకు వెళ్లి నగదు నింపడానికి ఉపక్రమించారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు నల్ల రంగు పల్సర్ వాహనంపై జగద్గిరిగుట్ట వైపు నుంచి దూసుకువచ్చారు. వీరి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఏటీఎం కేంద్రం వద్ద ద్విచక్ర వాహనం ఆగడంతోనే వెనుక కూర్చున్న వ్యక్తి కిందికి దిగి మీర్జాపై నాటు పిస్టల్తో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. తూటా ఎడమ వైపు గుండె కింది భాగంలో కడుపులోకి దూసుకుపోవడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయారు. లోపలకు వెళ్లిన దుండగులు మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వీటిలో ఒక తూటా శ్రీనివాస్ మోకాలులోంచి దూసుకుపోగా, మరోటి అక్కడే ఉన్న అద్దానికి తగిలింది. అదే సమయంలో అక్కడ ఉన్న రూ.5 లక్షలను చేజిక్కించుకున్న ఇరువురూ క్షణాల్లో ఉడాయించారు. వీరిని పట్టుకునేందుకు నవీన్, కృష్ణ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు అప్రమత్తమై దుండగులపై రాళ్లు విసిరినా తప్పించుకుని కేపీహెచ్బీ కాలనీ వైపు పారిపోయారు. వారి తుపాకీకి సంబంధించిన మ్యాగజీన్ అక్కడే పడిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు తూటాలకు సంబంధించిన ఖాళీ క్యాట్రిడ్జ్లు, నిందితులు వదిలి వెళ్లిన హెల్మెట్ను స్వాధీనం చేసుకున్నారు. మూడో తూటాకు సంబంధించినది అక్కడ లభించలేదు. పక్క ప్లాన్ ప్రకారమే... క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్లు ఘటనాస్థలానికి చేరుకొని, నిందితులకు చెందినవిగా అనుమానిస్తున్న వేలిముద్రలను సేకరించాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించి అనుమానితుల ఫొటోలు సేకరించారు. ఘటనాస్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఈ నిందితులు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఈ వాహనం కదలికలపై రెక్కీ చేసిన తర్వాతే, గురువారం దాన్ని వెంబడిస్తూ వచ్చి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బేగంపేట నుంచి ఘటనాస్థలి వరకు ఉన్న సీసీ కెమెరాల్లో గత 15 రోజులుగా రికార్డు అయిన ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఫోన్ లొకేషన్స్ను సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. బీహార్ లేదా రాజస్థాన్ ముఠాలపై అనుమానం... ఇది బీహార్ లేదా రాజస్థాన్కు చెందిన ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీరిద్దరితోపాటు ఈ ముఠాకు చెందినవారు మరికొందరు ఉండి ఉంటారని, నేరం చేసిన తర్వాత వాళ్లు పరారై ఉంటారని భావిస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ వైపు వెళ్లిన దుండగులు మళ్లీ కూకట్పల్లి ప్రధాన రహదారి ఎక్కలేదని అధికారులు అనుమానిస్తున్నారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించినా వారి కదలికలు కనిపించపోవడం గమనార్హం. అయితే దుండగులు తమ వాహనం వదిలేసిగానీ, దుస్తులు మార్చుకుని గానీ ఉంటారనే అంశాన్నీ కొట్టి పారేయలేమని చెప్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన అనుమానితుల ఫొటోలను బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసులకు పంపారు. రంగంలోకి దిగిన పది ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. చదవండి: ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా.. నిజమెంత? వాడిని చంపేయండి.. వదలొద్దు! -
కరోనా టెర్రర్: హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం
ముంబై: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్ల సౌకర్యార్థం ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ను (ఏటీఎం) రంగంలోకి దింపింది. హైదరాబాద్సహా 19 నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో మొబైల్ ఏటీఎం ప్రతిరోజు మూడు నాలుగు ప్రాంతాలను కవర్ చేస్తుంది. వీటి ద్వారా 15 రకాల లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. వినియోగదార్లు నగదు స్వీకరణకు తమ ప్రాంతం దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం కల్పించినట్టు బ్యాంకు తెలిపింది. ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం సామాజిక దూరం, శానిటైజేషన్ ఏర్పాట్లు ఉన్నాయని వివ రించింది. గతేడాది లాక్డౌన్ సమయంలో 50 నగరాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన మొబైల్ ఏటీఎంలను లక్షలాది మంది వినియోగించుకున్నారు -
డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ శుభవార్త
సాక్షి, ముంబై: భారతదేశంలో ప్రముఖ గృహ రుణ సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ వివిధ కాలపరిమితుల స్థిర డిపాజిట్ పథకాలపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ వడ్డీరేటు పెంచింది. మార్చి 30వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. పలు బ్యాంకులు తమ స్థిర డిపాజిట్లపై వడ్డీని తగ్గిస్తున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ వెబ్సైట్ తెలుపుతున్న సమాచారం ప్రకారం, ప్రత్యేక స్థిర డిపాజిట్ విషయానికి వస్తే, రూ. 2 కోట్ల వరకూ 33 నెలల పాటు డిపాజిట్ చేస్తే 6.20 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. 66 నెలల మెచ్యూరిటీ విషయంలో 6.60% వడ్డీ అమలవుతుంది. 99 నెలల స్థిర డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీ అందుతుంది. -
హెచ్డీఎఫ్సీకి సెబీ షాక్ : నష్టాల్లో షేర్లు
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సెబీభారీ జరిమానా విధించింది. రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కోటి రూపాయల పెనాల్టీ విధించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో హెచ్డీఎఫ్సీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇవాళ ఈ షేర్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. 2.24 శాతం నష్టంతో 1443 వద్ద కొనసాగుతోంది. సెబీ చట్టంలోని సెక్షన్ 15హెచ్బీ, ప్రకారం స్టాక్ బ్రోకింగ్ సంస్థ బిఆర్హెచ్ వెల్త్ క్రియేటర్స్ లిమిటెడ్ విషయంలో హెచ్డీఎఫ్సీ నిబంధనలు ఉల్లంఘించినట్టు సెబీ ఆరోపించింది. 2019 అక్టోబర్ 14న డబ్బులు చెల్లించాలని తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పాటించనందుకు కోటి జరిమానా విధించినట్టు సెబీ వెల్లడించింది. అక్టోబర్ 14, 2019 నుంచి ఇప్పటి వరకు వడ్డీతో పాటు రూ.158.68 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదుర్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం ఎగసి రూ. 8,760 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం నికర లాభం 18 శాతం పెరిగి రూ. 8,758 కోట్లను అధిగమించింది. ఇందుకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 16,317 కోట్లకు చేరింది. డిపాజిట్లు 19 శాతం పురోగమించగా.. కాసా డిపాజిట్లు 43 శాతం ఎగశాయి. తొలి బ్యాంకు ఈ ఏడాది క్యూ3 ఫలితాలు ప్రకటించిన తొలి ఫైనాన్షియల్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకాగా.. కొత్త సీఈవో, ఎండీ శశిధర్ జగదీశన్ అధ్యక్షతన తొలిసారి త్రైమాసిక పనితీరును వెల్లడించింది. బ్యాంకుకు 25 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలందించడం ద్వారా ప్రయివేట్ రంగంలో టాప్ ర్యాంకులో నిలిపిన ఆదిత్య పురీ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం విదితమే. కాగా.. క్యూ3లో రుణ వృద్ధి 15.6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 11 శాతం బలపడి రూ. 7,443 కోట్లకు చేరింది. ఇందుకు పెట్టుబడుల విలువ 67 శాతం ఎగసి రూ. 1,109 కోట్లను తాకడం దోహదపడింది. రుణ నాణ్యత క్యూ3లో బ్యాంకు స్థూల మొండి బకాయిలు(జీఎన్పీఏ) 1.42 శాతం నుంచి 0.81 శాతానికి వెనకడుగు వేశాయి. త్రైమాసిక ప్రాతిపదికన చూసినా 1.08 శాతం నుంచి 0.81 శాతానికి తగ్గాయి. అయితే మారటోరియం సమయంలో నమోదైన రుణ ఒత్తిడులను మొండిబకాయిలుగా పరిగణించవద్దంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్రభావం చూపాయి. వీటిని పరిగణించినప్పటికీ జీఎన్పీఏలు 1.38 శాతంగా నమోదయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రిటైల్ వాటా.. కోవిడ్–19 నేపథ్యంలోనూ రికవరీ చాటుతూ ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,043 కోట్ల నుంచి రూ. 3,414 కోట్లకు మాత్రమే పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతంగా నమోదైంది. వీటిలో టైర్–1 క్యాపిటల్ 17.1 శాతానికి చేరింది. రుణాలలో 48 శాతం రిటైల్ వాటాకాగా.. కార్పొరేట్ విభాగం 52 శాతం ఆక్రమిస్తోంది. కాగా.. కంపెనీ వారాంతాన ఫలితాలను ప్రకటించడంతో సోమవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరుపై ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,467 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,472–1,445 మధ్య ఊగిసలాడింది. -
స్ట్రైడ్స్కు సలహాదారుగా ఆదిత్య పురీ
న్యూఢిల్లీ, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు విశేష సేవలందించిన ఆదిత్య పురీ తాజాగా ఫార్మా కంపెనీ స్డ్రైడ్స్ గ్రూప్లో చేరారు. తద్వారా స్ట్రైడ్స్ గ్రూప్నకు సలహాదారుగా సేవలిందించనున్నారు. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్ బయోఫార్మా బోర్డులో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రూప్నకు సలహదాదారుగా సేవలందించేందుకు సుప్రసిద్ధ కార్పొరేట్ దిగ్గజం ఆదిత్య పురీ సంస్థలో చేరినట్లు స్ట్రైడ్స్ నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. అంతేకాకుండా సహచర కంపెనీ స్టెలిస్ బయోఫార్మాలో డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించింది. (పురీ వేవ్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికార్డ్స్) ట్రాన్సిషన్ దశలో కంపెనీ ప్రాథమిక దశ నుంచి కన్సాలిడేషన్, వృద్ధి దశకు చేరుకుంటున్న సందర్భంలో పురీ చేరిక గ్రూప్నకు మరింత ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ పేర్కొంది. అంతర్జాతీయ కంపెనీలు అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి చికిత్సలను అందించడంలో భాగస్వామిగా సేవలందించే దిశలో కంపెనీ సాగుతున్నట్లు తెలియజేసింది. తద్వారా వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో విస్తరించనున్నట్లు వివరించింది. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో పట్టుసాధించిన స్ట్రైడ్స్ గ్రూప్తోపాటు, స్టెలిస్ బయోఫార్మా మరింత వృద్ధి సాధించేందుకు వీలుగా సేవలందించనున్నట్లు పురీ పేర్కొన్నారు. గ్రూప్ సలహాదారుగా, స్టెలిస్ బోర్డు డైరెక్టర్గా సేవలందించనున్న ఆదిత్య పురీకి స్వాగతం పలుకుతున్నట్లు స్ట్రైడ్స్ వ్యవస్థాపక చైర్మన్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పురీ రాకతో గ్రూప్పట్ల నమ్మకం మరింత బలపడనున్నట్లు చెప్పారు. పురీ అనుభవం గ్రూప్నకు ఎన్నో విధాల ఉపయోగపడనున్నట్లు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ప్రారంభం నుంచీ ఆదిత్య పురీ 25 ఏళ్లపాటు సేవలందించిన విషయం విదితమే. పురీ హయాంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రయివేట్ రంగంలో టాప్ ర్యాంకుకు చేరుకుంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు కొత్త చైర్మన్!) షేరు రికార్డ్ ఆదిత్య పురీ బోర్డులో చేరుతున్న వార్తలతో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కౌంటర్కు డిమాండ్ ఏర్పడింది. ఎన్ఎస్ఈలో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ షేరు తొలుత 2.6 శాతం ఎగసి రూ. 999ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరిలాభాల స్వీకరణతో వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 945 దిగువన ట్రేడవుతోంది. 2020 మార్చి 20న ఈ షేరు రూ. 268 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 130 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు కొత్త చైర్మన్!
ముంబై, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త ఏడాదిలో కొత్త చైర్మన్ను ఎంపిక చేసుకోనుంది. ప్రస్తుతం పార్ట్టైమ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్యామలా గోపీనాధ్ పదవీకాలం 2021 జనవరి 1తో ముగియనుంది. దీంతో సోమవారం సమావేశమైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు బోర్డు ఇందుకు అర్హులైనవారి పేరును రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదించినట్లు తెలియజేసింది. అయితే పేరును వెల్లడించలేదు. ఆర్బీఐ అనుమతించిన వెంటనే బ్యాంక్ బోర్డు కొత్త చైర్మన్ను ఎంపిక చేసుకోనున్నట్లు పేర్కొంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. శశిధర్ ఎంపిక వెనుక!) 2015 నుంచీ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాధ్ 2015 జనవరి 2 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్టైమ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్త చైర్మన్ను ఎంపిక చేసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమాచారమిచ్చింది. కాగా.. కొత్త అభ్యర్థికి బాధ్యతలు అప్పగించేటంత వరకూ తాత్కాలిక చైర్మన్గా విధులు నిర్వహించేందుకు బోర్డు నుంచి స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరిని ఎంపిక చేసుకోనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలియజేశాయి. ఈ ఏడాది అక్టోబర్లో కొత్త సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. 25 ఏళ్లుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకును ముందుండి నడిపించిన ఆదిత్య పురీ స్థానే శశిధర్ ఎంపికయ్యారు. పురీ సెప్టెంబర్లో పదవీ విరమణ చేశారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ/ముంబై: గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా, కొత్త డిజిటల్ కార్యకలాపాలేమీ ప్రకటించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గురువారం అసాధారణ ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక సమస్యలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై బ్యాంకు బోర్డు దృష్టి పెట్టాలని సూచించింది. ‘డిజిటల్ 2.0 (ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది) కింద కొత్త డిజిటల్ వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా ఐటీ యాప్ల ద్వారా ప్రతిపాదిత లావాదేవీలు, కొత్త క్రెడిట్ కార్డుల జారీ వంటివన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. బ్యాంక్ నూతన సీఈవోగా ఇటీవలే (అక్టోబర్ చివర్లో) పగ్గాలు చేపట్టిన శశిధర్ జగదీశన్కు ఈ పరిస్థితిని చక్కదిద్దడం తొలి సవాలు కానుంది. దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అతి పెద్ద సంస్థ. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం 1.49 కోట్ల మంది క్రెడిట్ కార్డు యూజర్లు, 3.38 కోట్ల డెబిట్ కార్డు యూజర్లు ఉన్నారు. ప్రస్తుత యూజర్లకు యథాప్రకారం సర్వీసులు కొనసాగుతాయని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఆదేశాలు ఎప్పటివరకూ అమల్లో ఉంటాయన్న వివరాలు వెల్లడి కాలేదు. సాధారణంగా బ్యాంకుల సేవా లోపాలకు సంబంధించి జరిమానాల వంటి వాటితో సరిపెట్టే ఆర్బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం అసాధారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం.. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ కొత్త సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ను మెరుగుపర్చుకునేందుకు బయట నిపుణుల సహా యం కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో కొత్తగా మరిన్ని మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టడంలో జాప్యం జరగవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల నుంచీ .. 2018 డిసెంబర్లో బ్యాంక్ కొత్తగా ఆవిష్కరించిన మొబైల్ యాప్ కొద్ది గంటల్లోనే క్రాష్ అయ్యింది. భారీ ట్రాఫిక్ను సర్వర్లు హ్యాండిల్ చేయలేకపోవడం ఇందుకు కారణం. ఏడాది తర్వాత సరిగ్గా జీతాల సమయంలో ఆన్లైన్ సేవలన్నింటిలోనూ అంతరాయం కలిగింది. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇక తాజాగా నవంబర్ 21న మరోసారి ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తమ ప్రాథమిక డేటా సెంటర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలే ఇందుకు కారణమంటూ సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ.. బ్యాంక్పై కస్టమర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా చర్యలు ప్రకటించింది. కొన్నాళ్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆన్లైన్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదుర్కొంటున్నాయి. దీనితో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,377 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 16,056 కోట్లు కరిగిపోయి రూ. 7,58,287 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో 7.36 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.89 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎస్బీఐ యోనో యాప్ డౌన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ సర్వీసుల్లో కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరహాలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టమ్ వైఫల్యం కారణంగా తమ యోనో మొబైల్ యాప్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్లు ఎస్బీఐ గురువారం వెల్లడించింది. సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈలోగా లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్ను వినియోగించాలని కస్టమర్లను కోరింది. అటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిజిటల్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడింది. ఇటీవల విలీనం చేసుకున్న బ్యాంకుల ఐటీ ఇన్ఫ్రాను అనుసంధానం చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
ముంబై, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు తాజాగా రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్ సర్వీసులలో అంతరాయాల నేపథ్యంలో డిజిటల్, క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆదేశించింది. గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సమస్యకు తొలుత పరిష్కారాన్ని వెదకమంటూ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. డిజిటల్-2లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న అన్ని డిజిటల్ సంబంధ కార్యక్రమాలనూ తాత్కాలికంగా నిలిపివేయవలసిందిగా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. వీటిలో భాగంగా కొత్తగా క్రెడిట్ కార్డుల జారీని సైతం నిలిపివేయవలసి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. సర్వీసులకు ఇబ్బంది లేదు నిబంధనలకు అనుగుణంగా లోపాలను సవరించిన వెంటనే ఆర్బీఐ విధించిన తాజా ఆంక్షలను ఎత్తి వేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ చూపవని తెలియజేసింది. ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలూ యథావిధిగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ ప్రసారంలో వైఫల్యాలు సర్వీసులలో అంతరాయాలకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 21న.. ఇటీవల గత నెల 21న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్, ఆన్లైన్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడటంతో ఆర్బీఐ వివరాలు దాఖలు చేయమంటూ ఆదేశించింది. గతేడాది డిసెంబర్లో తలెత్తిన అంతరాయం కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లు తొలిసారి రెండు రోజులపాటు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేకపోయారు. గత రెండేళ్లుగా ఐటీ వ్యవస్థల పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలియజేసింది. కాగా..ప్రస్తుత క్రెడిట్ కార్డుల వినియోగదారుల సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ తదితర సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివరించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 15,292 ఏటీఎంలున్నాయి. 14.9 మిలియన్ క్రెడిట్ కార్డులు, 33.8 మిలియన్ డెబిట్ కార్డులను కస్టమర్లకు బ్యాంక్ జారీ చేసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్@ రూ. 8 లక్షల కోట్లు
ముంబై, సాక్షి: ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త రికార్డ్ సాధించింది. తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్క్ను అధిగమించింది. తద్వారా దేశీ లిస్టెడ్ కంపెనీలలో మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. నేటి ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 2 శాతం లాభపడటం ద్వారా రూ. 1464 వద్ద సరికొత్త గరిష్టాన్ని సైతం షేరు తాకింది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 8 ట్రిలియన్లను దాటింది. వెరసి గరిష్ట మార్కెట్ క్యాప్ను సాధించిన తొలి ఫైనాన్షియల్ రంగ సంస్థగా నిలిచింది. 98 శాతం జూమ్ కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది మార్చిలో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు రూ. 739 వరకూ పతనమైంది. ఆ స్థాయి నుంచి ర్యాలీ బాట పట్టి తాజాగా రూ. 1464కు చేరింది. వెరసి 8 నెలల్లో 98 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో గత మూడు నెలల్లో 30 శాతం, గత నెల రోజుల్లో 17 శాతం చొప్పున బలపడుతూ వచ్చింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 18 శాతంపైగా ఎగసి రూ. 7,513 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 15,776 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. జాబితా ఇలా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్లో ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 13.34 లక్షల కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాటా గ్రూప్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రూ. 10.19 ట్రిలియన్ల విలువతో రెండో ర్యాంకులో నిలుస్తోంది. ఇదే విధంగా రూ. 5.08 లక్షల కోట్లతో ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ కంపెనీ హెచ్యూఎల్, రూ. 4.83 ట్రిలియన్ల విలువతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 4, 5 ర్యాంకులను పొందుతున్నాయి. కాగా.. పోటీ సంస్థలతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రీమియంతో ట్రేడయ్యేందుకు అర్హత కలిగి ఉన్నట్లు విదేశీ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. పటిష్ట లాభదాయకత, నిలకడైన మార్జిన్లు, అండర్రైటింగ్ నాణ్యత వంటి పలు అంశాలు బ్యాంకునకు సానుకూల అంశాలుగా పేర్కొంది. దీంతో రూ. 1,700 టార్గెట్ ధరతో కొనుగోలుకి సిఫారసు చేస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 0.7 శాతం వెనకడుగుతో రూ. 1428 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1454 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ. 1421 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. -
పురీ వేవ్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికార్డ్స్
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను రెండున్నర దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆదిత్య పురీ సోమవారం(26న) పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్గా విధులు నిర్వహిస్తున్న శశిధర్ ఎండీ, సీఈవో బాధ్యతలను పురీ నుంచి స్వీకరించారు. పురీ 1994 సెప్టెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీగా పదవిని చేపట్టారు. ఆపై బ్యాంక్ పలు విధాలుగా వృద్ధి బాటలో పరుగు పెట్టింది. తద్వారా తీవ్రమైన పోటీలోనూ బ్యాంకు తొలి స్థానంలో నిలుస్తూ వచ్చింది. ప్రస్థానమిలా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1995 మే 19న బీఎస్ఈలో లిస్టయ్యింది. అప్పట్లో బ్యాంకు ఆస్తులు రూ. 3,394 కోట్లుగా నమోదుకాగా.. ప్రస్తుతం రూ. 16 లక్షల కోట్లకుపైగా విస్తరించాయి. మొత్తం డిపాజిట్లు రూ. 642 కోట్ల నుంచి రూ. 12.29 లక్షల కోట్లకు ఎగశాయి. ఇదేవిధంగా 1995 మార్చిలో రూ. 98 కోట్లుగా ఉన్న రుణాలు(అడ్వాన్సులు) 2020 సెప్టెంబర్కల్లా రూ. 10.38 లక్షల కోట్లను తాకాయి. వెరసి పురీ హయాంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 7 లక్షల కోట్లకు చేరింది. వెరసి ప్రయివేట్ రంగ బ్యాంకులలో టాప్ ర్యాంకుకు చేరుకుంది. 1997లో బ్యాంక్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 1,000 కోట్లను అధిగమించింది. గత 25 సంవత్సరాలలో బ్యాంకు షేరు రూ. 3 నుంచి రూ. 1,200కు దూసుకెళ్లింది. అంటే 1995 నుంచి చూస్తే 30,000 శాతానికిపైగా రిటర్నులు అందించింది. లాభాల బాటలో ఏస్ ఈక్విటీ వివరాల ప్రకారం 1995 మే చివర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 432 కోట్లను తాకింది. ఆపై 1997 కల్లా రూ. 1,000 కోట్లను అధిగమించగా.. 2005 జులై 6న రూ. 20,130 కోట్లకు చేరింది. ఈ బాటలో 2007 కల్లా రూ. 50,000 కోట్లు, 2010 ఆగస్ట్లో రూ. లక్ష కోట్ల మార్క్ను దాటేసింది. తిరిగి 2018 జనవరిలో మరింత వృద్ధి చూపుతూ రూ. 5 లక్షల కోట్లను తాకింది. ఇక ప్రస్తుతం అంటే 2020 అక్టోబర్ 27కల్లా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.73 లక్షల కోట్లకు చేరింది.ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం పుంజుకుని రూ. 1,223 వద్ద ట్రేడవుతోంది. షేర్ల విభజన గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండుసార్లు షేర్ల ముఖ విలువను విభజించింది. 2011లో రూ. 10 ముఖ విలువను రూ. 2కు, తిరిగి 2019లో రూ. 2 నుంచి రూ. 1కు షేర్ల విభజన చేపట్టింది. ప్రస్తుతం బీఎస్ఈ డేటా ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 26.02 శాతంగా నమోదైంది. పబ్లిక్ వాటా దాదాపు 74 శాతానికి చేరింది. వీటిలో మ్యూచువల్ ఫండ్స్ 13.95 శాతం, ఎల్ఐసీ 3.79 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) 37.43 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అపోలో ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.40 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు తన కస్టమర్లకు అందిస్తుంది. అవసరమైన వెంటనే ఈ లోన్ను మంజూరు చేస్తారు. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్ఫాంపై వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చు. చికిత్స విషయంలో తమ కస్టమర్లకు ప్రాధాన్యత ఉంటుందని హెచ్డీఎఫ్సీ సీఈవో, ఎండీ ఆదిత్య పురి బుధవారం మీడియాకు తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక రంగంపై ఈ భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపిస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఉన్న 6.5 కోట్ల మంది కస్టమర్లకు ఇది ప్రయోజనమని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ బంపర్ ఆఫర్..
ముంబై: రానున్న పండగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్) బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లను లోన్స్, ఈఎమ్ఐ, క్యాష్బ్యాక్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్స్, తదితర విభాగాలలో వర్తింప చేయనున్నట్లు ప్రకటించింది. కాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆటో, పర్సనల్ తదితర రుణాలలో ప్రాసెసింగ్ ఫీజు తగ్గించనున్నట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దిగ్గజ రిటైల్ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు, అదనపు రివార్డ్ పాయింట్లు, ఆన్-లైన్ కొనుగోళ్లలో అందిస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, టాటాక్లిక్, మైంట్రా, పెప్పర్ఫ్రై, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి ఆన్లైన్ మేజర్లతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు విజయ్ అమ్మకాలు, కోహినూర్, జీఆర్టీ, ఓఆర్ఆర్ఏ వంటి వివిధ ఉత్పత్తులు, సేవలపై 5 నుంచి 15 శాతం వరకు క్యాష్బ్యాక్ను హెడ్ఎఫ్సీ అందిస్తుంది. ఈ ఆఫర్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి స్పందిస్తు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దేశ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పండగల వేళ దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, అందుకు గాను దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింత పెంచేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తక్కువ రుణాల ఆఫర్లను ప్రకటించిందని ఆదిత్య పురి పేర్కొన్నారు. కాగా గత రెండు, మూడు నెలలుగా బ్యాంక్ రుణాలు తీసుకునేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారని, పండగ సీజన్లో కస్టమర్లు సంతృప్తి పరచే విధంగా తమ ఆఫర్లు ఉంటాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. (చదవండి: కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం) -
కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగా తన బ్యాంకింగ్ కరస్పాండెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కస్టమర్కు ఉత్తమ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారి సమిత్ భగత్ పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 11వేల మంది కరస్పాండెట్లకు మరో అదనంగా 14వేల మందిని నియమిస్తామని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని వారు కొత్త ఖాతాను తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, పేమెంట్ ప్రొడెక్ట్లు, లోన్ క్లోజింగ్ లాంటి సదుపాయాలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చని ఆమె వివరించారు. అలాగే కరస్పాండెంట్ల వ్యవస్థను మరింత బలపరించేందుకు, విస్తరించేందుకు ప్రభుత్వ కామన్ సర్వీసు సెంటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకునే యత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై అమెరికాలో దావా?
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిందంటూ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై అమెరికాలో దావాకు రంగం సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్ల హక్కుల సాధనకు సంబంధించి న్యాయ సేవలు అందించే రోజెన్ లా ఫర్మ్ ఈ అంశం వెల్లడించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యాపారపరమైన సమాచారాన్ని ఇచ్చి ఉండవచ్చన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ తాము దావా వేయనున్నట్లు రోజెన్ తమ వెబ్సైట్లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందన్న ఆరోపణలకు సంబంధించిన వార్తలు, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభాల అంచనాలను అందుకోలేకపోవడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది. మదుపుదారుల తరఫున వేసే ఈ కేసుకు సంబంధించి ‘హెచ్డీఎఫ్సీ షేర్లు కొన్నవారు మా వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ దావాలో భాగం కావచ్చు‘ అని పేర్కొంది. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్) రూపంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అమెరికాలోని ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీలో ట్రేడవుతుంటాయి. మరోవైపు, దావా విషయం తమ దాకా రాలేదని, మీడియా ద్వారానే తెలిసిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. వివరాల వెల్లడిలో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. దావాకు సంబంధించిన వివరాలు అందిన తర్వాత పరిశీలించి, తగు విధంగా స్పందిస్తామని బ్యాంకు తెలిపింది. వాహన రుణాల విభాగంలో ఒక కీలక అధికారి తీరుపై ఆరోపణలు రావడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూలైలో అంతర్గతంగా విచారణ ప్రారంభించడం దావా వార్తలకు ఊతమిచ్చింది. రోజెన్ లా సంస్థ గతేడాది కూడా ఇదే తరహాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్పై క్లాస్ యాక్షన్ దావా వేస్తున్నామంటూ హడావుడి చేసింది. కంపెనీలోని ఉన్నత స్థాయి అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఓ ప్రజావేగు చేసిన ఆరోపణల ఆధారంగా దీన్ని సిద్ధం చేసింది. -
పురి.. వారసుడొచ్చాడు!
ముంబై: ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా శశిధర్ జగ్దీశన్ నియమితులయ్యారు. ఆదిత్యపురి స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త చీఫ్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదముద్ర పడినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అక్టోబర్ 27 నుంచీ మూడేళ్లపాటు జగ్దీశన్ ఈ బాధ్యతల్లో ఉంటారు. 25 యేళ్ల అనుబంధం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో గత 25 సంవత్సరాలుగా జగ్దీశన్ వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. బ్యాంక్లో అత్యుత్తమ రీతిలో ‘స్ట్రేటజిక్ చేంజ్ ఏజెంట్’గా పనిచేస్తున్న ఘనత ఆయనకు ఉంది. ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న కొద్ది మందిలో 55 సంవత్సరాల జగ్దీశన్ ఒకరు. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– సోమవారం సాయంత్రం మొత్తం మూడు పేర్లను ఆమోదం నిమిత్తం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డ్ ఆర్బీఐకి పంపింది. ఇందులో జగ్దీశన్ పేరు బ్యాంక్ బోర్డ్ మొదటి ప్రాధాన్యతలో ఉంది. హోల్సేల్ లెండింగ్ చీఫ్ కజాద్ బారూచా, సిటీ కమర్షియల్ బ్యాంక్ సీఈఓ సునీల్ గార్గ్లు బ్యాంక్ బోర్డ్ ఆర్బీఐకి పంపిన జాబితాలో మరో రెండు పేర్లు. జర్మన్ బ్యాంక్ డాయిష్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1996లో జగ్దీశన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్స్ శాఖలో మేనేజర్గా చేరారు. 1999లో ఫైనాన్స్ విభాగం బిజినెస్ హెడ్ అయ్యారు. 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. తరువాత బ్యాంక్ అన్ని విభాగాల అత్యుత్తమ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి ‘చేంజ్ ఏజెంట్’గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలతోపాటు ఫైనాన్స్, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యతల వంటి కీలక విభాగాలు ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. బ్యాంక్ లాభాల బాట... ఆదిత్యపురి సుదీర్ఘ బాధ్యతల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్నో విజయాలు సాధించింది. ఇన్వెస్టర్లకు విశ్వసనీయ బ్యాంక్గా మార్కెట్క్యాప్ రూ.5.71 లక్షల కోట్లకుపైగా చేరింది. మొండిబకాయిల భారం భారీగా పెరిగిపోకుండా పటిష్ట నియంత్రణలు ఇక్కడ చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాల పురి పదవీ కాలంలోని తొలి పదేళ్లలో బ్యాంక్ 30 శాతంపైగా లాభాల వృద్ధిని నమోదుచేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో ఇటీవలి సంవత్సరాల్లో ఈ శాతం 20కి తగ్గింది. ఈ ఏడాది జూన్ నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 15.45 లక్షల కోట్లు. ఇందులో రూ.10 లక్షల కోట్ల రుణాల పోర్ట్ఫోలియో ఉంది. బ్యాం క్కు ప్రస్తుతం ఉన్న నాన్–బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో లిస్ట్కానుంది. పురి బాధ్య తలు అక్టోబర్ 26తో ముగుస్తాయనీ, తరువాతి రోజు నుంచీ జగ్దీశన్ ఆ చైర్లోకి వస్తారనీ స్టాక్ ఎక్సే్చంజీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. సవాళ్లున్నాయ్... బ్యాంక్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక సవాళ్లు జగ్దీశన్కు ఎదురుకానున్నాయి. అనిశ్చితి ఆర్థిక వాతావరణంలో బ్యాంక్ నిర్వహణ ఇందులో మొదటిది. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో గత లాభాల బాటలో కొనసాగడానికి బ్యాంక్ కొత్త వ్యాపార వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ వాహన ఫైనాన్స్ బిజినెస్లో అసమంజస రుణ విధానాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే పలువురు ఎగ్జిక్యూటివ్ల తొలగింపులు, బదిలీలు జరిగాయి. ఈ తరహా ఆందోళనలను జగ్దీశన్ పూర్తిస్థాయిలో నివారించాల్సి ఉంటుంది. దూసుకుపోయిన షేర్... కొత్త సీఈఓ నియామకం పట్ల ఇన్వెస్టర్లలో హర్షం వ్యక్తమైంది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సే్చంజ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 3.94 శాతం (రూ.39.45) ఎగసి రూ.1,041కి చేరింది. హర్షణీయం... ఈ నియామకం నాకు సం తోషాన్ని ఇచ్చింది. చేంజ్ ఏజెంట్గా నియమితులైననాటి నుంచీ ఆయనతో నేను ఎంతో సన్నిహితంగా పనిచేశాను. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని శక్తిసామర్థ్యాలు, నైపుణ్యత శశిధర్ జగదీశన్కు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ వ్యక్తి చేతుల్లో ఉందని భావిస్తున్నాను. మరిన్ని విజయాలు సాధిస్తారని విశ్వసిస్తున్నాను. – ఆదిత్యపురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. శశిధర్ ఎంపిక వెనుక!
ప్రయివేట్ బ్యాంకింగ్ రంగంలోని అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త సీఈవోగా శశిధర్ జగదీశన్ ఎంపికయ్యారు. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఆమోదముద్ర వేసింది. 25ఏళ్లుగా బ్యాంక్కు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ పురోభివృద్ధి పథంలో నిలిపిన ప్రస్తుత సీఈవో ఆదిత్య పురీ ఈ ఏడాది సెప్టెంబర్కల్లా పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎంపిక కమిటీ ప్రతిపాదించిన ముగ్గురు అధికారుల్లో శశిధర్కే ఆర్బీఐ ఓటు వేసింది. దీంతో కొద్ది రోజులుగా బ్యాంకింగ్ వర్గాలు అత్యంత ఆసక్తితో ఎదురుచూసిన అంశానికి తెరపడింది. ప్రస్తుత కోవిడ్-19 సవాళ్లు, దేశీ బ్యాంకింగ్ రంగంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రముఖ పాత్ర పోషిస్తుండటం, యస్ బ్యాంక్ వైఫల్యం వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ సైతం సీఈవో ఎంపికలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇందువల్లనే ఎంపిక నిర్ణయం ఆలస్యమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. శశిధర్ పదవీకాలం మూడేళ్లపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సొంత సిబ్బంది నుంచే ఆదిత్య పురీ బాటలో శశిధర్ జగదీశన్ సైతం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 25ఏళ్లుగా పలు బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. నిజానికి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఇతర సీనియర్లతో పోలిస్తే శశిధర్కు వివిధ విభాగాలలో పనిచేసిన అనుభవం అవకాశాలను పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. శశిధర్.. బ్యాంకుకు సంబంధించిన ఫైనాన్స్ గ్రూప్ హెడ్గా, మానవ వనరులు, లీగల్, సెక్రటేరియల్, పరిపాలన, మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్స్లతోపాటు సీఎస్ఆర్ విభాగంలోనూ సేవలు అందించారు. 1996లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఫైనాన్స్ విభాగంలో 1996లో శశిధర్ తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 1999కల్లా ఫైనాన్స్ బిజినెస్ హెడ్గా ఎదిగారు. తదుపరి 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్వో)గా ప్రమోట్ అయ్యారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. గత 25 ఏళ్ల కాలంలో కార్యకలాపాలను భారీగా విస్తరించింది. దీంతో బ్యాంకు కార్యనిర్వాహక బాధ్యతలను సొంత సిబ్బందినుంచే ఎంపిక చేసుకోవడం మేలు చేయగలదని పురీ భావిస్తూ వచ్చారు. ఇందువల్లనే ఎంపిక కమిటీ సైతం ముగ్గురితో కూడిన ప్రతిపాదన చేసినప్పటికీ బ్యాంకులో వివిధ విభాగాలలో ఎక్స్పీరియన్స్ ఉన్న శశిధర్ వైపు అధికంగా మొగ్గు చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. బాధ్యతలు స్వీకరించేందుకు రెండు నెలల గడువు మిగలడంతో పురీ నేతృత్వంలో బ్యాంక్ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా అర్ధం చేసుకుని నిర్వహించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. షేరు అప్ బ్యాంక్ కొత్త సీఈవోగా శశిధర్ ఎంపికతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు తొలుత 6 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 1061 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 1043 వద్ద ట్రేడవుతోంది. -
ఇద్దరు హెచ్డీఎఫ్సీ అధికారులు అరెస్ట్
ముంబై: లంచం వసూలు చేసిన ఇద్దరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. లంచం డిమాండ్ చేస్తున్నరనే ఫిర్యాదుతో సీబీఐ అధికారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్, రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మహారాష్ట్ర పుణే జిల్లాలోని బారామతి శాఖ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పని చేస్తున్న మేనేజర్ రూ. 99 లక్షల లోన్ మంజూరు విషయంలో ఓ వ్యక్తి వద్ద రూ. 2.70లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో డిమాండ్ చేసిన డబ్బును వసూలు చేసుకురమ్మని బ్యాంక్లో పనిచేసే రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని సదరు వ్యక్తి వద్దకు పంపాడు. (ఉద్యోగమిస్తామని ఊబిలోకి నెట్టారు) సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతని వద్ద పట్టుబడిన నగదును అధికారులు సీజ్ చేశారు. బ్యాంకు మేనేజర్పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుపై పూర్తిగా స్థాయిలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు -
వాటాను విక్రయించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పురి ఇదే బ్యాంకులో కొంత మొత్తంలో తన వాటాను విక్రయించారు. ఆదిత్య ఈ జూలై 21-24 తేదిల మధ్య 74.2లక్షల ఈక్విటీ షేర్లను రూ.843 కోట్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదిత్య గతకొన్నేళ్లుగా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్(ఈఎస్ఓపీ)ద్వారా దాదాపు 78లక్షల షేర్లను దక్కించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020లో ఈఎస్ఓపీ ద్వారా 6.82 లక్షల ఈక్విటీ షేర్లను పొందారు. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో స్టాక్ ఆప్షన్లను మినహాయించి ఆదిత్య రూ.18.92 కోట్ల జీతాభత్యాన్ని అందుకున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకును 1994లో స్థాపించారు. నాటి నుంచి ఆదిత్యపురి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పనిచేస్తారు. ఏడాది అక్టోబర్ 20తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్లో తదుపరి సీఈవో ఎంపిక కోసం బ్యాంకు బోర్డు సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో 6గురు సభ్యులున్నారు. ఈ పదవిలో రేసులో శశిధర్ జగ్దీషన్, కైజద్ బరుచా, సునీల్ గార్గ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బ్యాంక్ షేరు 3.50శాతం క్రాష్: బ్యాంక్ సీఈవో వాటా విక్రయంతో నేడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు సోమవారం 3.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.1079.30 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మిడ్సెషన్ కల్లా 3.22శాతం నష్టంతో రూ.1082.80 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.738.90, రూ.1304.10గా ఉన్నాయి. ఈ మార్చి 24లో రూ.765 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. నాటి నుంచి ఏకంగా నేటి వరకు 46శాతం రికవరిని సాధించింది. -
3వ రోజూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించిన ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్కు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వరుసగా మూడో రోజు లాభాల బాటలో సాగుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4.2 శాతం జంప్చేసి రూ. 1,145 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,153 వరకూ ఎగసింది. వెరసి మూడు రోజుల్లో 10 శాతం పురోగమించింది. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 2.41 కోట్ల షేర్లు చేతులు మారాయి. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.62 కోట్ల షేర్లు మాత్రమే. 20 శాతం అప్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 6659 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 15,665 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతం వద్ద నిలకడను చూపాయి. స్థూల మొండిబకాయిలు నామమాత్రంగా పెరిగి 1.4 శాతంగా నమోదయ్యాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.6,659 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.5,568 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.6,659 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.32,362 కోట్ల నుంచి రూ.34,453 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు... రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 1.40 శాతం నుంచి 1.36 శాతానికి, నికర మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.2,614 కోట్ల నుంచి రూ.3,892 కోట్లకు పెరిగాయి. కాగా ఫలితాలపై సానుకూల అంచనాలతో శుక్రవారం ఈ షేర్ ధర బీఎస్ఈలో 3% లాభంతో రూ.1,099 వద్ద ముగిసింది. వారసుడు సొంత సంస్థ నుంచే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ ఆదిత్య పురి త్వరలో రిటైర్కాబోతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోనే 25 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తే తన వారసుడయ్యే అవకాశాలున్నాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. శశిధర్ జగదీశన్, కైజాద్ బరూచాలు బ్యాంక్ సీఈఓ రేసులో ఉన్నారని సమాచారం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 20% అప్
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 6,659 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 18 శాతం పెరిగి రూ. 15,665 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ ఫలితాలివి. ఈ కాలంలో రుణ మంజూరీ 21 శాతం పుంజుకోగా, డిపాజిట్లు 25 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 49 శాతం పెరిగి రూ. 3891 కోట్లను దాటాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఫ్లోటింగ్ ప్రొవిజన్లకు రూ. 1451 కోట్లు, కంటింజెన్సీలకు రూ. 4002 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం 15 శాతం బలపడి రూ. 12,829 కోట్లను తాకింది. నిర్వహణ వ్యయాలు 2.9 శాతం తగ్గి రూ. 7117 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్పీఏలు అప్ క్యూ1లో త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ఆర్థిక మందగమనం కారణంగా రిటైల్ రుణాలు, థర్డ్పార్టీ ప్రొడక్టుల విక్రయాలు, క్రెడిట్ కార్డుల వినియోగం నీరసించినట్లు బ్యాంక్ పేర్కొంది. దీంతో ఫీజు ఆధారిత ఆదాయం సుమారు రూ. 2000 కోట్లు తగ్గినట్లు తెలియజేసింది. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 4 శాతం జంప్చేసి రూ. 1103 వద్ద ముగసింది. ఇంట్రాడేలో రూ. 1104 వద్ద గరిష్టాన్ని తాకగా.. 1058 వద్ద కనిష్టానికీ చేరింది. ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్లో ప్రతిఫలించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లలో అమ్మకాలు
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు వెల్లుత్తాయి. ఫలితంగా సూచీలు సోమవారం ఉదయం ఆర్జించిన భారీ లాభాల్ని మిడ్సెషన్ కల్లా కోల్పోయి స్వల్పనష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకింగ్ రంగ షేర్లతో పాటు ఫైనాన్స్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మిడ్సెషన్ కల్లా 1.50శాతం నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయానికి ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్, నిఫ్టీ ప్రభుత్వరంగ, ప్రైవేట్ రంగ ఇండెక్స్లు 1.50శాతానికి పైగా క్షీణించాయి. బ్యాంకింగ్ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు 1శాతం నుంచి 1.75శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇక ఫైనాన్స్ రంగంలో హెవీ వెయిటేజీ షేర్లైన హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2శాతం నష్టాన్ని చవిచూశాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు సెన్సెక్స్ 36567 వద్ద, నిఫ్టీ 10769 స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయానికి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లతో పాటు రియల్టీ రంగ షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోంటున్నాయి. -
రుణ రేట్లను తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ముంబై: ఇటీవలి కాలంలో ఆర్బీఐ రేపో రేటును గణనీయంగా తగ్గించడం ఫలితంగా బ్యాంకులు రుణాలపై రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐతోపాటు పీఎన్బీ రుణ రేట్లను తగ్గించగా.. తాజాగా బ్యాంకు ఆఫ్ బరోడా(బీవోబీ), యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే 0.05 శాతం. సవరణ తర్వాత ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.30 శాతానికి, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతానికి, ఏడాది కాల ఎంసీఎల్ఆర్ (రిటైల్ రుణాలకు ఎక్కువగా అమలయ్యేది) 7.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి దిగొచ్చినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రకటించింది. సవరించిన రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది. బీవోబీ సైతం ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (0.15 శాతం) తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.80 శాతం నుంచి 7.65 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.65 శాతం నుంచి 7.50 శాతానికి దిగొచ్చాయి. ఈ రేట్లు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయని బీవోబీ ప్రకటించింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.30 శాతం, ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి తగ్గాయి. -
అన్ని ప్రభుత్వ బ్యాంకుల కంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెట్టింపు
స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్టైన మొత్తం 13 ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్ క్యాప్తో పోలిస్తే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రెండింతలుగా ఉంది. శుక్రవారం మార్కెట్ ముగింపు ఆధారంగా మార్కెట్ క్యాప్ విలువను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.4.6లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు 13 ప్రభుత్వరంగ బ్యాంకుల మొత్తం మార్కెట్ క్యాప్ను లెక్కిస్తే రూ.2.55లక్షల కోట్లుగా ఉంది. రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు... వాటి ప్రత్యర్థి ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్ వాటాను ఆక్రమిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, లాక్డౌన్ తరువాత ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే పీఎస్యూ బ్యాంకుల లోన్ బుక్స్ మరింత వేగంగా క్షీణించే అవకాశం ఉందని వారు అంటున్నారు. ‘‘ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరర్ధక ఆస్తుల పెరుగుదల భారాన్ని భరిస్తున్నాయి. ఈ రంగ బ్యాంకులు మొత్తం ఎన్పీఏల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా విభాగానికి ఎక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే వివిధ క్రెడిట్ గ్యారెంటీ పథకాలలో పీఎస్యూ బ్యాంకుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకుడు కాజల్ గాంధీ పేర్కోన్నారు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కె్ట్ క్యాప్ భారీగా క్షీణించగా.., శుక్రవారం మార్కెట్ ముగింపు సమయానికి ఎస్బీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.1.35లక్షల కోట్లుగా ఉంది. ఇక ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరువాత రెండో స్థానంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.2.2లక్షల కోట్లుగా ఉంది. ‘‘రుణగ్రహీతలకు రుణాలు ఇచ్చే రిస్క్ను పరిగణనలోకి తీసుకుని పీఎస్యూ బ్యాంకులపై మేము ప్రతికూలంగా ఉన్నాము. కోవిడ్ -19 కారణంగా ప్రభుత్వం నుంచి ఉద్దీపన ప్రకటనలు, మారిటోరియం విధింపు తదితర అంశాలతో ప్రభుత్వరంగాల పరపతి విలువ క్షీణించింది. మరోవైపు, ఆర్బీఐ రివర్స్ రెపో తగ్గింపు... బ్యాంకులకు ఆదాయాన్ని పెంచే అవకాశాలను మరింత తగ్గిస్తుంది.’’ అని ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ విశ్లేషకుడు అభిమన్యు సోఫత్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు క్షీణిస్తాయని ఎలారా సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రవి సుందర్ అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్ల తగ్గింపుతో క్రమంగా బ్యాంకుల్లో డిపాజిట్లు క్షీణిస్తాయని, ప్రభుత్వ రంగ బ్యాంక్లు రానున్న రోజుల్లో మరింత అధ్వాన పరిస్థితులను ఎదుర్కోంటాయని రవి సుందర్ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.., ఎస్బీఐ బ్యాంకు ఉత్తమ ఎంపిక సుందర్ సలహానిస్తున్నారు. అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకుల విభాగంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లు రానున్న రోజుల్లో రాణిస్తాయని రవి సుందర్ అంచనా వేస్తున్నారు. -
ఈ 2 ఫైనాన్స్ షేర్లకు మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేటింగ్
ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ పైనాన్షియల్ షేర్లపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు ‘‘బై’’ రేటింగ్ను కేటాయించింది. ఈ రెండు షేర్లపై బ్రోకరేజ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా సమగ్ర నివేదికను ఇప్పుడు పరిశీలిద్దాం... ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఫైనాన్స్ రంగ షేర్లు ప్రదర్శన అంత బాగాలేదు. ఇటీవల స్థూల ఆర్థికవ్యవస్థలో ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు ఫైనాన్స్ రంగంలో అధిక స్లిపేజ్లు, రుణ వ్యయాలకు దారితీశాయి. ఇంతకు ముందు కార్పోరేట్ ఎన్పీఏలు పెరగడం.. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఫైనాన్స్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు ఎన్బీఎఫ్సీలు, మధ్య స్థాయి బ్యాంకులకు అధిక ఎక్స్పోజర్ను కలిగి ఉంటాయని సిద్ధార్థ నివేదికలో పేర్కోన్నారు. ధీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు మధ్య స్థాయి బ్యాంకులు, ఎన్బీఎబీఎఫ్సీలతో పోలిస్తే ఈ రంగంలో పెద్ద బ్యాంకులుగా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే ఈ రెండు బ్యాంకులపై ఎక్స్పోజర్ల ఒత్తిడి స్వల్ప కాలానికే పరిమితమయ్యే ఆస్కారం ఉంది. ఒకటి లేదా రెండు క్వార్టర్లో మాత్రమే షేర్లపై ఎక్స్పోజర్ల ఒత్తిడి ఉండవచ్చు. అలాగే ఆస్తి నాణ్యత, అధిక స్లిప్పేజీలు మాత్రమే కాకుండా ప్రస్తుత వాతావరణంలో మనుగడ కోసం అదనపు మూలధనాన్ని సమీకరించుకోగలవు. కాబట్టి మేము ఈ రంగంలో ప్రధాన షేర్లైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లేదా ఐసీఐసీఐ బ్యాంక్లను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహానిస్తున్నామని సిద్ధార్థ తెలిపారు. -
క్యూ4లో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై : 2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ అదరగొట్టింది. శనివారం విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 17.7 శాతం పుంజుకుని 6,928 కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు ఏడాది కాలంలో ఇది 5,885 కోట్ల రూపాయలు. ఏకీకృత మొత్తం ఆదాయం, 38,287 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 33,260 కోట్లగా వుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 16.2 శాతం పెరిగి రూ .15,204 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పిఎ) రూ .12,650 కోట్లకు, నికర ఎన్పిఎలు 3,542 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ సంక్షోభంతో ప్రొవిజన్లు గత ఏడాదితో పోలిస్తే (1,889 కోట్లు) రూ. 3,784.5 కోట్లకు పెరిగాయి. మునుపటి త్రైమాసికంలో రూ. 3,043.6 కోట్లు. (హెచ్డీఎఫ్సీలో చైనా బ్యాంక్ వాటాలు పెంపు) కోవిడ్-19వల్ల ఏర్పడిన అనిశ్చితి వాతావరణంలో డివిడెండ్ చెల్లింపులపై శుక్రవారం ప్రకటించిన ఆర్బీఐ ఆదేశాల మేరకు 2019-20కి సంబంధించి డివిడెండ్ చెల్లింపులు చేయబోమని బ్యాంక్ తెలిపింది. లిక్విడిటీ ప్రొఫైల్తో పాటు బలమైన వ్యాపారాన్ని కలిగి వున్న నేపథ్యంలో ఎస్ అండ్ పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్థిరమైన రేటింగ్ను ప్రకటించింది. సగటు ఆదాయానికి మించి బలమైన ఆదాయాలు, సాధారణ మూలధన సేకరణ, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో వైవిధ్యం, మంచి ఎసెట్ క్వాలిటీ మద్దతుతో బ్యాంకు క్యాపిటలైజేషన్ భారతీయ బ్యాంకింగ్ రంగం సగటు కంటే గణనీయంగా బలంగా ఉందనీ, భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యుత్తమంగా ఉందని హెచ్డీఎఫ్సీ ఎస్ అండ్ పి వ్యాఖ్యానించింది. -
రుణాలపై వడ్డీరేటును తగ్గించిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణ రేటును 0.20 శాతం తగ్గించింది. ఫండ్స్ బేస్డ్ లెండింగ్ (ఎంసీఎల్ఆర్) రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. సవరించిన ఈ వడ్డీరేట్టు ఈనెల 7నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన రేట్ల ప్రకారం ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 7.95 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగా మారిందని తెలిపింది. దీంతో గురువారం నాటి మార్కెట్టలో హెచ్డిఎఫ్సి షేరు లాభపడుతోంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్ డౌన్ నేపథ్యంలో ముందస్తు పరపతి విధాన సమీక్ష చేపట్టిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండయా కీలక వడ్డీరేట్లను బాగా తగ్గించింది. దీంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా రుణాలు, డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా డిపాజిట్లు, రుణాల వడ్డీరేటు కోతను ప్రకటించింది. చదవండి: లాభాల ప్రారంభం : ఫార్మా జోరు