ప్రధాన వార్తలు

Updates: మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం
పల్నాడు పర్యటనకు వైఎస్ జగన్.. అప్డేట్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం:మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదంపల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారీకేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు వాహనాలు,కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని కోరిన అంబటి రాంబాబు బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల ఓవరాక్షన్ అంబటి రాంబాబుతో వ్వాగాదానికి దిగిన పోలీసులు కాసేపట్లో సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వైఎస్ జగన్పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లిపరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రిపల్నాడు..పల్నాడు జిల్లాలోకి వైఎస్ జగన్ప్రభంజనంగా మారిన పల్నాడు ఎంట్రన్స్కంటెపూడి వద్ద జనసందోహంవైఎస్ జగన్కు స్వాగతం పలికిన పల్నాడు ప్రాంత మాజీ ఎమ్మెల్యేలుగోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ స్వాగతం..పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కంటెపూడిమేడికొండూరు చేరుకున్న వైఎస్ జగన్భారీగా తరలివచ్చిన తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలుమండుతున్న ఎండలోనూ జగన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వృద్దులుభారీ బైకు ర్యాలీతో జగన్ కాన్వాయ్ ని తీసుకెళ్తున్న యూత్పల్నాడు..పల్నాడు జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్పేరేచర్ల జంక్షన్కు చేరుకున్న జగన్ కాన్వాయ్భారీ జనసందోహంతో కిటకిటలాడుతున్న పేరేచర్లజై జగన్, జైజై జగన్ నినాదాలతో మార్మోగుతున్న జంక్షన్అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్జగన్ పర్యటనలో కనపడని పోలీసులు!వైఎస్ జగన్ పల్నాడు రెంటపాళ్ల పర్యటనపోలీసులమయంగా సత్తెనపల్లి నియోజకవర్గంఆంక్షల పేరుతో వైఎస్సార్సీపీ కేడర్ను ఇబ్బంది పెట్టిన పోలీసులుకానీ.. జగన్ పర్యటనలో కనబడని పోలీసులుజగన్ కాన్వాయ్కు రోడ్ క్లియర్ చేయని పోలీసులుమాజీ సీఎం హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్జగన్ కాన్వాయ్ కి ముందు కనపడని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీకాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనపడని ఖాకీలుజగన్ కాన్వాయ్కి ముందు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేస్తున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని గుంటూరు శివారు నల్లపాడు చేరుకున్న వైఎస్ జగన్జైజగన్ నినాదాలతో మార్మోగుతున్న నల్లపాడుమహిళలు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న నల్లపాడు మిర్చి మార్కెట్ యార్డు దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్న కేడర్జనసంద్రం నడుమ నెమ్మదిగా..కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లుఅడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రంచుట్టుగుంట సెంటర్లో జగన్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్ జగన్ కాన్వాయ్వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్మహిళలు, పార్టీ కేడర్తో రోడ్లన్నీ ఫుల్రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులుపల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండజగన్ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలువైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంఅయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులుపోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలుజగన్ వెంటే జనం అని మరోసారి రుజువుచంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్కాదు: ఆర్కే రోజాజగన్ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందనసీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్నగతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం కరెక్టు కాదు మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు జగన్ కాన్వాయ్ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులుబైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులుపోలీసులతో పార్టీ కేడర్ వాగ్వాదంగుంటూరులో జగన్కు ఘన స్వాగతంగుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతంభారీగా బైక్ ర్యాలీతో వైఎస్ జగన్కు స్వాగతం పలికిన కార్యకర్తలుజై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్పురం రోడ్డుఅడుగడుగునా ఆంక్షలు, అయినా..సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతిజగన్ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలునరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలురెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులుఆధార్ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనంగ్రామస్తులకు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులుఅయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానంజగన్ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులుకాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నంప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ కేడర్సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులుమధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేతదారిపొడవునా అభిమానమే.. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనగుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్అడుగడుగునా అపూర్వ స్వాగంపార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీభారీగా తరలివచ్చిన కార్యకర్తలుదారిపొడవునా జై జగన్.. జైజై జగన్ నినాదాలుఏ రోడ్డు చూసినా జగన్కు ఉప్పొంగిన అభిమానందారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనంమార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్ జగన్వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్ జగన్జగన్ పర్యటనపై పచ్చ కుట్రలుపర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావుమా బంధువులను కూడా అడ్డుకుంటున్నారుపరామర్శకు అనుమతి తీసుకున్నారుమీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండిఆంక్షలను లెక్కచేయకుంలడా.. జగన్ కోసం జనంపల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులుపోలీస్ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనంపొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపుఆధార్ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడిరెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్పోస్టులు పెట్టారు. ప్రతీ రెండు కిలోమీటర్కు ఓ చెక్పోస్టుపోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్ జగన్జగన్ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం పోలీస్మయంగా మారిపోయిన పల్నాడుపల్నాడులో ఇవాళ వైఎస్ జగన్ పర్యటనసత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావుబాధిత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శజగన్ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలుపోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లాసత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులువైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఆంక్షలుజగన్ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలుజగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్పూర్ ఉదయ్రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్పాల్కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్జహాన్పూర్కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Fastag: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రం
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటివరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా, ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. పాస్ యాక్టివేషన్, రెన్యువల్ కోసం ప్రత్యేక లింక్ను త్వరలో రాజ్గార్ యాత్ర యాప్తో పాటు ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు.Important Announcement 📢 🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025ఇదీ చదవండి: ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపదఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. పరిమిత కాలంపాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది.

మీ ప్రమేయం లేదు.. ఇక మీదట ఉండబోదు కూడా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇక మీదట కూడా ఉండబోదని ట్రంప్నకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు ఫోన్ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి.. దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను మోదీ ట్రంప్కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే.. మోదీ ట్రంప్తో మాట్లాడుతూ.. పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్ ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరునకు అమెరికా మద్ధతు ఉంటుందని తెలిపారు. ట్రంప్-మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ మోదీకి సంతాపం తెలియజేశారని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదేనని మిస్రీ తెలిపారు. అయితే కెనడా పర్యటన ముగిచుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్ మోదీని ఆహ్వానించగా.. షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని మోదీ తెలిపినట్లు సమాచారం. భారత్లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారుఇదిలా ఉంటే.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకోవడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రకటనపై స్పష్ట త ఇవ్వాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేశాయి కూడా.

అమ్మాయిలూ.. బహుపరాక్!
వివాహం అంటే నూరేళ్ల పంట. తమ పిల్లలు నిండు నూరేళ్లు ఆనందదాయకమైన జీవితం గడపాలని ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల గురించి ఆరాలు తీస్తారు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండి, ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్నెట్ జమానాలో ఇవి మాత్రమే సరిపోదని అంటోంది ఓ అమ్మాయి. ఆ యువతి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిది మంచి ఉద్యోగం. మంచి కుటుంబ నేపథ్యం. అందుకే ఇంట్లో వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. అయితే అతడి గురించి కుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. నా స్నేహితుడి ఐడీతో ఆన్లైన్లో అతనితో చాట్ చేశా. అలా.. సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్ల ద్వారా అతను వ్యవహరించే తీరు బయటపడింది. అతని తీరు నన్ను కంగుతినేలా చేసింది. కాబోయేవాడు మంచి సంపాదనపరుడైతే చాలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అయినా కూడా సరిపోదు. అంతరంగికంగా అతడి తీరు ఎలా ఉంటుందనే చెప్పి డిజిటల్ తనిఖీలు కూడా అత్యంత ముఖ్యమే. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని నా కుటుంబ సభ్యులకు వివరించి చెప్పా. అతనితో నా పెళ్లి రద్దు చేయించుకున్నా అని ఆమె ఆ పోస్టులో వివరించింది. అందువల్ల.. అమ్మాయిలూ బహుపరాక్. పెద్దలు కుదిర్చిన సంబంధాలపై గౌరవం ఉంటే సరిపోదు. నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలంటే అతని డబ్బు, స్టేటస్ కంటే అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే డిజిటిల్ తనిఖీ అనేది ఈ కాలంలో అత్యంత ముఖ్యం. అంటూ ఆ యువతి పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఈరోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినవాళ్లతోనే, బంధువులతోనో అయిపోతోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ తరహా విచారణలోనూ మార్పులు కూడా తప్పనిసరి అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. సోషల్ మాధ్యమాల పరంగా అబ్బాయి మంచోడు అనుకుంటేనే.. పెళ్లికి సుముఖత చూపాలని, లేదంటే వద్దని సూచిస్తోంది ఆ అమ్మాయి. డిజిటల్ తనిఖీలు కూడా ముఖ్యమే అని మరో యువతి వ్యాఖ్యానించింది. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!)

తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్కు ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడు అడిషనల్ డీజీపీ హెచ్ఎం జయరామ్(HM Jayaram)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టు వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. కిడ్నాప్ కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయాలని ఆదేశించడం ఏమేర సహేతకమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ను వేటును ఎత్తేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.మద్రాస్ హైకోర్టు(Madras HC) తన అరెస్ట్కు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జయరామ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. జయరామ్ తరఫు న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు. తన క్లయింట్ జయరామ్ను అరెస్ట్ అయిన వెంటనే కస్టడీలోకి తీసుకున్నారని, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేసిన 24 గంటల తర్వాతే విడుదల(జూన్ 17న) చేశారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక అధికారిని అయోమయమైన ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేయమని చెప్పడం ఏంటి?. ఇది ఎటువంటి న్యాయ ప్రక్రియకు సరిపోతుంది?. ఇది పరిపాలనా వ్యవస్థపైనా ప్రభావం చూపించే అంశమే కదా. అధికారులపై ఇలాంటి చర్యలు మానసికంగా దెబ్బతీసేలా ఉంటాయి’’అని అభిప్రాయపడింది.అదే సమయంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది?. విచారణకు సహకరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం ఏంటి?.. సస్పెన్షన్ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోండి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడీజీపీ జయరామ్ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు వద్ద బాలుడి కిడ్నాప్ కేసులో గత సోమవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తిపై కూడా ఆరోపణలున్నాయి. కోర్టు విచారణకు జయరామ్ హాజరు కాగా.. ఆ ప్రాంగణంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఏడీజీపీ జయరామన్ను హోంశాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ సమయంలో.. ఈ కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యే, పోలీస్ ఉన్నతాధికారి తీరుపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (Kangaroo Courts)నడిపించడమేంటని? జగన్మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేసింది.అలాగే.. ఏడీజీపీ జయరామన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. జగన్మూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.జరిగింది ఇదే.. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ధనుష్(22) అనే యువకుడ్ని ఓ యువతి వివాహం చేసుకుంది. ఆ యువకుడిని పట్టుకుని తన కూతురిని తిరిగి తనకు అప్పగించాలంటూ ఆమె తండ్రి వనరాజా మాజీ కానిస్టేబుల్ అయిన మహేశ్వరి సాయం కోరాడు. దీంతో ఆమె ఏడీజీపీ జయరామ్ను సంప్రదించింది. ఆపై ఆ పంచాయితీ పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తి చెంతకు చేరింది. ఈ క్రమంలో ధనుష్ కనిపించకపోవడంతో అతని 16 ఏళ్ల సోదరుడిని అమ్మాయి కుటుంబం కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులో ఒత్తిళ్ల నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని ఓ హెటల్ వద్ద వదిలేసి వెళ్లారు. అయితే ఆ బాలుడ్ని వదిలేసిన వాహనం ఏడీజీపీ జయరామ్ అధికారిక వాహనం కావడం, పైగా అందులో వనరాజా, మహేశ్వరి ఉండడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. భారత్లో క్రికెట్ అభిమానులకు శుభవార్త
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ 20 నుంచి లీడ్స్ (హెడింగ్లే) వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.ఈ మ్యాచ్ భారత్లో సోని స్పోర్ట్స్ నెటవర్క్లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ జియో హాట్స్టార్ యాప్తో పాటు వెబ్సైట్లో జరుగుతుంది. ఈ సిరీస్లో ఐదు మ్యాచ్లు ఇవే నెట్వర్క్లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.ఈ సిరీస్కు ముందు భారత్లో ఉన్న క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ డిడి స్పోర్ట్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఛానెల్లో భారత్-ఇంగ్లండ్ సిరీస్ మొత్తాన్ని ఉచితంగా వీక్షించవచ్చు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్భారత్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్లో రైల్వే ట్రాక్పై పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్పై బుధవారం ఉదయం పేలుళ్లు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పాకిస్తాన్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పేలుడు కారణంగా మూడు అడుగుల మేర గుంత పడినట్లు ధ్రువీకరించిన పోలీసులు. కాగా, సదరు రైలు.. బలూచిస్తాన్లోని రెసిడెన్షియల్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి పెషావర్కు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. రైలు ఆగిపోయిన అనంతరం, ప్రయాణీకులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియో వైరల్గా మారింది. بلوچستان کے علاقے بولان پمپ کے صدر تھانے کی حدود میں ریلوے ٹریک پر دھماکے کے نتیجے میں جعفر ایکسپریس کی چھ بوگیاں پٹری سے اتر گئیں۔An explosion on the railway track in Balochistan's Bolan Pump area caused six carriages of the Jaffar Express to derail. pic.twitter.com/S9CBiMLknR— Brahag Baluch (@brahagbaluch) June 18, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ రైల్వేస్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ మధ్య నడుస్తుంది. దాదాపు 34 గంటల 10 నిమిషాల్లో 1,632 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అయితే, జాఫర్ ఎక్స్ప్రెస్ రైలునే ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. క్వెట్టాకు దక్షిణంగా ఉన్న పర్వత ప్రాంతం సమీపంలో వందలాది మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి భద్రతా సిబ్బందిని బీఎల్ఏ దళాలు హతమార్చాయి.NEWSFLASH: Four bogies of the Peshawar to Quetta Jaffar Express derailed after an explosion near Jacobabad. No casualties reported. The Jaffar Express was hijacked by terrorists earlier in the year near Sibi. pic.twitter.com/cLQaZREBhM— Khabar Kada (@KhabarKada) June 18, 2025

అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే కర్మ?
అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.నటన రాదని హేళనఅనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.ఆ హీరోయిన్ల విషయంలోనూ..ఒకప్పుడు హీరోయిన్ సిమ్రాన్ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూన్ 27న విడుదల కానుంది.సినిమాఅనుపమ విషయానికి వస్తే.. నివీన్ పౌలీ 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజీస్, టిల్లు స్క్వేర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్, లాక్డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ చిత్రాలున్నాయి.చదవండి: హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం

Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్ జారీ చేసింది.ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి
ఆ తాతకు భార్య అంటే ఎంత ప్రేమ..! వీడియో వైరల్
విశ్వంభర ‘స్పెషల్’.. కీరవాణి కాదు.. భీమ్స్!
తెలంగాణ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది!
అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
Fastag: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రం
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
విధ్వంసకర శతకం.. గేల్, కోహ్లి సెంచరీల క్లబ్లో చేరిన మ్యాక్స్వెల్
‘తండ్రి’కి వందనం
శ్రీవారి సేవలో అలనాటి టాలీవుడ్ హీరోయిన్లు (ఫొటోలు)
‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్’
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
అఖిల్ పెళ్లి బరాత్ జ్ఞాపకాలతో శోభిత (ఫొటోలు)
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ..ఆకాశమంత ఆనందం! (ఫొటోలు)
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
అలాగే గాజాకు, పాలస్తీనాకు, ఇరాన్కు.. మొత్తం ప్రపంచానికే క్షమాపణలు చెప్పాలి సార్!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్?
చంద్రబాబు ఇలాకా కుప్పంలో దారుణం
ఆ తాతకు భార్య అంటే ఎంత ప్రేమ..! వీడియో వైరల్
విశ్వంభర ‘స్పెషల్’.. కీరవాణి కాదు.. భీమ్స్!
తెలంగాణ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది!
అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
Fastag: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రం
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
విధ్వంసకర శతకం.. గేల్, కోహ్లి సెంచరీల క్లబ్లో చేరిన మ్యాక్స్వెల్
‘తండ్రి’కి వందనం
‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్’
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
అలాగే గాజాకు, పాలస్తీనాకు, ఇరాన్కు.. మొత్తం ప్రపంచానికే క్షమాపణలు చెప్పాలి సార్!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్?
కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. బెంబేలెత్తిపోయిన ప్రత్యర్ధి బౌలర్లు
125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!
సీమలోనూ సీను సితారే!
సినిమా

హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం
విశాఖపట్నం(కంచరపాలెం): టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ.. వృత్తిలో ఉన్న సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చదివించి, వారి అవసరాలు తీర్చి అండగా నిలిచారు. ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు, ప్రముఖ హీరో సందీప్ కిషన్ మద్రాసులో స్థిరపడినప్పటికీ, జ్ఞానాపురంలో తమ బంధువులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ(ఆగ్నేసమ్మ) మరణవార్త విని చలించిపోయిన సందీప్ కిషన్..తన మేనమామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. ఆగ్నేసమ్మ భూ స్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. సెయింట్ పీటర్స్ చర్చి పరిసరాల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

పాకిస్తాన్ టూర్.. అజ్ఞాతం వీడిన యూట్యూబర్ సన్నీ యాదవ్!
తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీయాదవ్(Bayya Sunny Yadav) కిడ్నాప్ డ్రామాకు తెరపడింది. నెల రోజులుగా కనిపించకుండా పోయిన సన్నీ యాదవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ప్రత్యేక్షమయ్యాడు. నెల క్రితం బైక్పై పాకిస్తాన్ వెళ్లి వచ్చిన అతను..చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్కు వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్.. అక్కడి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకి స్పైగా పని చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని సన్నీ యాదవ్ తండ్రి చెప్పడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్..సన్నీ దేశ ద్రోహి అంటూ పలు వీడియోలు చేయడంతో సన్నీ యాదవ్ ని కిడ్నాప్ చేశారేమోననే అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా సన్నీ యాదవ్ సింహాచలం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సస్పెన్స్కి తెర దించాడు. ‘నేను వచ్చేశా’ అంటూ సింహాచలం ఆలయం ముందు దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు.అలాగే తనపై ఆరోపణలు చేసిన నా అన్వేష్ను లక్ష్యంగా చేసుకొని ఇన్స్టా స్టోరీలో వరుస పోస్టులు పెట్టాడు. ' అన్నయ్య నేనొచ్చేశా.. వైజాగ్ వెళ్తున్నా.. మీ ఇంటికెళ్తా.. అమ్మానాన్నకి ధైర్యం చెబుతా.. నువ్వు టెన్షన్ పడకు' అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. తనను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, ఇప్పుడే విడిచిపెట్టారని చెబుతూ.. రాబోయే నాలుగు రోజులు తనకు ఎంతో కీలకమని, ఇది హనీమూన్ కాదంటూ.. ఏదైనా ఎదుర్కొవడానికి రెడీగా ఉన్నానని’ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పోస్ట్ వైరల్గా మారింది. నెల రోజులుగా సన్నీ ఎక్కడ ఉన్నాడు? ఎన్ఐఏ అధికారులు నిజంగానే అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. View this post on Instagram A post shared by BAYYA SUNNY YADAV 🇮🇳 (@bayyasunnyyadav)

రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కారులో విజయ్-రష్మిక జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?)హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం 'మా' అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. 'ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది' అని కాజోల్ చెప్పింది.మరి కాజోల్ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటైన 'దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే' సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మా' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)"I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world."- Bollywood Actress #Kajol pic.twitter.com/0znOCXyQ4s— Movie Threat (@MovieThreat) June 18, 2025

కారులో జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?
రష్మిక పేరు చెప్పగానే ఆమె సినిమాలతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మీడియా కంటపడకుండా సీక్రెట్గా విదేశాలకు వెళ్లి వస్తుంటారు. వ్యక్తిగతంగా ఫొటోలు షేర్ చేస్తారు తప్పితే జంటగా అస్సలు కనిపించారు. కానీ ఎవరో తీసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో మాత్రం రష్మిక కొద్దికొద్దిగా ఓపెన్ అవుతోంది. విజయ్పై తనుకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్)కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని రష్మిక చెప్పింది. దీంతో అందరి చూపు విజయ్ దేవరకొండపై పడింది. తాజాగా 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రష్మిక మాట్లాడుతూ విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో ఒకే కారులో జంటగా వెళ్తూ కనిపించారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ విషయానికొస్తే.. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక పాన్ ఇండియా సూపర్స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'కుబేర' రిలీజ్కి రెడీగా ఉంది. మరోవైపు గర్ల్ఫ్రెండ్, థామా తదితర సినిమాలు ఆల్రెడీ సెట్స్పై ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడక చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు దృష్టంతా 'కింగ్డమ్'పైనే పెట్టుకున్నాడు. పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రం.. జూలై 25న ఎట్టకేలకు రిలీజ్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం)Our favs #VijayDeverakonda and #RashmikaMandanna just got spotted together after ages!! My heart’s so full 😭❤️ pic.twitter.com/Ku1Z2Nv75J— Lilly ✨ (@therwdygirl) June 18, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

గ్లెన్ మ్యాక్స్వెల్ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో ఊచకోత
ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. మేజర్ లీగ్ క్రికెట్-2025 ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. ఇవాళ (జూన్ 18) లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో) విరుచకుపడ్డాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ రికార్డు స్థాయిలో 13 సిక్సర్లు బాదాడు. ALL THE 13 SIXES & 2 FOURS BY MAXWELL IN HIS 106*(49) KNOCK IN MLC 🤯 pic.twitter.com/ZjBVw4KKqh— Johns. (@CricCrazyJohns) June 18, 2025జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) బరిలోకి దిగిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులే చేశాడు. ఆతర్వాత మ్యాక్సీకి పూనకం వచ్చింది. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. మొత్తంగా మ్యాక్సీ ఈ ఇన్నింగ్స్లో 49 బంతులు ఎదుర్కొని 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు (వాషింగ్టన్ ఫ్రీడం) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో మ్యాక్సీది వన్మ్యాన్ షో నడిచింది. అతను మినహా మిచెల్ ఓవెన్ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. ఒబస్ పియెనార్ను (15 బంతుల్లో 11 నాటౌట్) మరో ఎండ్లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసకాండను కొనసాగించాడు. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 8, ఆండ్రియస్ గౌస్ 12, మార్క్ చాప్మన్ 17, జాక్ ఎడ్వర్డ్స్ 11 పరుగులు చేశాడు. నైట్రైడర్స్ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ ఓ వికెట్ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్ ఘోర పతనం దిశగా సాగుతుంది. ఆ జట్టు తొలి ముగ్గురు బ్యాటర్లు (అలెక్స్ హేల్స్, సునీల్ నరైన్, ఉన్ముక్త్ చంద్) డకౌట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన రోవ్మన్ పావెల్ (4), మాథ్యూ ట్రంప్ (2) కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశాడు. ఫలితంగా నైట్రైడర్స్ 10 ఓవర్ల తర్వాత 5 వికెట్లు నష్టపోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. సైఫ్ బదార్ (32 నాటౌట్), జేసన్ హోల్డర్ (21 నాటౌట్) పోరాడుతున్నారు. వాషింగ్టన్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 2, మిచెల్ ఓవెన్, మార్క్ అడైర్, సౌరభ్ నేత్రావల్కర్ తలో వికెట్ తీశారు.

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్బాష్ లీగ్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నివేదికల ప్రకారం.. సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ 2025-26 ఎడిషన్ కోసం బాబర్తో 4,20,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 7.7 కోట్లు. భారత కరెన్సీలో రూ.2.35 కోట్లు.బాబర్తో సిక్సర్స్ డ్రాఫ్ట్ (వేలం) కంటే ముందే ఒప్పందం చేసుకుంది (ప్రీ డ్రాఫ్ట్ సైనింగ్). బీబీఎల్లో ఓవర్సీస్ డ్రాఫ్ట్ కంటే ముందే ప్రీ డ్రాఫ్ట్ కింద విదేశీ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవచ్చు. సిక్సర్స్ బాబర్తో పాటు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్తో కూడా ఇలాగే ఒప్పందం చేసుకుంది. బీబీఎల్లో బాబర్కు ఇదే తొలి డీల్. ఈ సీజన్తోనే అతను ఆసీస్ దేశవాలీ టీ20 లీగ్లో అరంగేట్రం చేస్తాడు. ఈ సీజన్ బీబీఎల్ డ్రాఫ్ట్ జూన్ 19న జరుగనుంది.బీబీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడుబాబర్ బీబీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాక్ మీడియా డప్పు కొట్టుకుంటుంది. బీబీఎల్లో అత్యధిక ధర పలికే ప్లాటినం కేటగిరీలో ఆటగాళ్లకు 3,40,000 ఆస్ట్రేలియన్ డాలర్లు పారితోషికంగా ఇస్తారు. అయితే బాబర్తో సిక్సర్స్ ఇంతకంటే 80,000 డాలర్లు అధికంగా ఒప్పందం చేసుకుంది. బీబీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా డి'ఆర్సీ షార్ట్ పేరిట రికార్డు ఉంది. అతనికి 2023-24 సీజన్లో హోబర్ట్ హరికేన్స్ 2,58,900 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించింది.బీబీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్ల జాబితా:డి'ఆర్సీ షార్ట్ – $2,58,900 (హోబార్ట్ హరికేన్స్)ఆండ్రూ టై – $2,46,800 (పెర్త్ స్కార్చర్స్)మార్కస్ స్టోయినిస్ – $2,27,900 (మెల్బోర్న్ స్టార్స్)క్రిస్ లిన్ – $2,02,000 (బ్రిస్బేన్ హీట్)జో రూట్ – $2,00,000 (సిడ్నీ థండర్)బీబీఎల్లో ఆటగాళ్ల జీతాల శ్రేణుల వివరాలు:ప్లాటినం: $3,40,000గోల్డ్: $2,60,000సిల్వర్: $1,75,000కాంస్యం: $1,00,000ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ల కంటే తక్కువేబీబీఎల్లో బాబర్ అత్యధిక ధర పలికిన ఆటగాడే అయినా, ఐపీఎల్లో ఓ అన్క్యాప్డ్ ప్లేయర్కు లభించే మొత్తం కంటే తక్కువే తీసుకుంటాడు. భారత కరెన్సీలో బాబర్కు 2.35 కోట్లు (బీబీఎల్ పారితోషికం) లభిస్తే.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు, అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్యకు రూ.3.5 కోట్లు లభిస్తుంది.ఇదిలా ఉంటే, ప్రపంచవాప్తంగా ఉండే చాలా క్రికెట్ లీగ్ల్లో ఆడే (పీఎస్ఎల్, సీపీఎల్, ఎల్పీఎల్, బీపీఎల్, బీబీఎల్) బాబర్కు స్వదేశ టీ20 జట్టులో చోటు కరువైంది. పాకిస్తాన్ టీ20 సెటప్ నుంచి బాబర్తో పాటు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిని పక్కన పెట్టారు.

సంచలనం.. 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ స్నేహితుడు
భారత క్రికెట్కు మరో చిచ్చరపిడుగు పరిచయమయ్యాడు. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన 13 ఏళ్ల అయన్ రాజ్ కేవలం 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ 30 ఓవర్ల మ్యాచ్లో సంస్కృతి క్రికెట్ అకాడమీకి ప్రాతినిథ్యం వహించిన అయన్.. 134 బంతుల్లో 22 సిక్సర్లు, 41 ఫోర్ల సాయంతో 327 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయన్ బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే 220.89 స్ట్రయిర్రేట్తో 296 పరుగులు చేయడం మరో విశేషం.అయన్ రాజ్ భారత యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దగ్గరి మిత్రుడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు. ఇంకా చిన్న వయసులో ఇద్దరు కలిసి ఆడారు. అయన్ వైభవ్ను ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయన్ను దగ్గరగా చూసిన వారు అతన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు.రికార్డు ట్రిపుల్ సెంచరీ తర్వాత ఎన్డీటీవీ స్పోర్ట్స్తో మాట్లాడిన అయన్ స్నేహితుడు వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని అశాభావం వ్యక్తం చేశాడు. వైభవ్తో మాట్లాడిన ప్రతిసారి ప్రేరణతో కూడిన గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపాడు. వైభవ్ను చూసి ఫోకస్డ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నానని అన్నాడు. వైభవ్ అడుగుజాడల్లో నడిచి తాను కూడా గొప్ప పేరు తెచ్చుకుంటానని తెలిపాడు.తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని..!అయన్ తండ్రి ఓ మాజీ క్రికెటర్ (లోకల్). టీమిండియాకు ఆడాలని అతను కలలు కన్నాడు. అయితే అతని విషయంలో అది నెరవేరలేదు. కొడుకుతోనైనా తన కలను సాకారం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ దిశగా అయన్ను రాటుదేలుస్తున్నాడు. అయన్ కూడా తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తండ్రితో పాటు తల్లి మద్దతుతో కేవలం క్రికెట్పైనే దృష్టి కేంద్రీకరించాడు.వైభవ్ విషయానికొస్తే.. అయన్ కన్నా ఏడాది పెద్దవాడైన వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోని అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఐపీఎల్లో తన మూడో మ్యాచ్లోనే రికార్డు బ్రేకింగ్ సెంచరీ చేసి హేమాహేమీల రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్పై వైభవ్ చేసిన 35 బంతుల శతకం ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం. అలాగే ఐపీఎల్లో భారత ఆటగాడు చేసిన వేగవంతమైన శతకం. ఐపీఎల్ 2025కు ముందు వైభవ్ కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతని స్నేహితుడు అయన్ రాజ్ కూడా అతి చిన్నవయసులోనే పెద్దల క్రికెట్ ఆడే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయన్ ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడటం కొనసాగిస్తే.. భారత క్రికెట్లో వైభవ్ తర్వాత మరో సంచలనం అవుతాడు.

సారీ... కోకో!
బెర్లిన్: తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ కోకో గాఫ్కు ప్రపంచ నంబర్వన్ ప్లేయర్ సబలెంకా (బెలారస్) క్షమాపణలు చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం ఇద్దరు తలపడగా... అమెరికన్ స్టార్ కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం రన్నరప్ సబలెంకా మాట్లాడుతూ... తన స్వీయ తప్పిదాల వల్లే ప్రత్యర్థి గెలిచిందని, విజయంలో గాఫ్ పాత్రలేదన్నట్లుగా వ్యాఖ్యానించింది. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత అయిన సబలెంకా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో క్షమాపణలు కోరుతూ సబలెంకా లేఖ రాసింది. ‘నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఓ విజేతను ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదు. నా భావోద్వేగాలను నియంత్రించుకుని ఉంటే బాగుండేది. గాఫ్ను క్షమాపణలు కోరుతున్నాను. మనుషులందరూ పొరపాట్లు చేస్తుంటారు. జీవితంలో నేర్చుకునే దశలో ఉన్న నేను కూడా అంతే. తదనంతరం నేను మాట్లాడిన మాటలు నన్నే కలత పెట్టాయి. ముమ్మాటికి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచే అర్హత గాఫ్కే ఉంది. ఆమె విజయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా’ అని లేఖలో పేర్కొంది. నిజానికి గాఫ్పై మాటలతో దాడి చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. మ్యాచ్ ముగిసిన వెంటనే మీడియా సమావేశం జరగడం... ఫలితంతో నిరాశలో ఉన్న తాను అలా మాట్లాడాల్సి వ చ్చిందని వివరణ ఇ చ్చింది. ‘ఎప్పుడైనా సరై ప్రత్యరి్థని గౌరవించే నాకు ఇలా చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేయడం పట్ల మనస్తాపం చెందాను. అందుకే మన్నించమని విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో నేను ఎప్పటికి గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది’ అని సబలెంకా తెలిపింది. బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా రెండు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) టైటిల్స్తో పాటు ఒక యూఎస్ ఓపెన్ (2024) ట్రోఫీ గెలుచుకుంది. అయితే ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తడబడింది. ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసింది. గాఫ్ మాత్రం 30 తప్పిదాలే చేసి టైటిల్ విజేతగా నిలిచింది. కోకో గాఫ్ 2023లో సబలెంకాపైనే గెలిచి యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధించింది.
బిజినెస్

ఐపీఓలకు సెబీ లైన్ క్లియర్
కొత్త ఏడాదిలో తిరిగి జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. ఈ ప్రభావంతో తాజాగా మూడు కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిపొందాయి. జాబితాలో సన్షైన్ పిక్చర్స్, లూమినో ఇండస్ట్రీస్, ఎంఅండ్బీ ఇంజినీరింగ్ చేరాయి. ఈ మూడు కంపెనీలు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..విపుల్ షా సంస్థటీవీ, సినిమాల నిర్మాత, దర్శకుడు విపుల్ షా కంపెనీ సన్షైన్ పిక్చర్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవోలో 83.75 లక్షల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో ప్రధానంగా విపుల్ అమృత్లాల్ షా 23.69 లక్షల షేర్లు, షెఫాలీ విపుల్ షా 10 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. వీటితోపాటు రూ. 94 కోట్లు భవిష్యత్ వృద్ధి, కార్యకలాపాల నిర్వహణకు వెచ్చించనుంది.ఈపీసీ కంపెనీప్రధానంగా ఈపీసీ కార్యకలాపాలు నిర్వహించే కోల్కతా కంపెనీ లూమినో ఇండస్ట్రీస్ ఐపీవో బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రూ. 15 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.పీఈబీ సేవలు ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ)తోపాటు సెల్ఫ్సపోర్టెడ్ రూఫింగ్ సర్వీసులందించే ఎంఅండ్బీ ఇంజినీరింగ్ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గుజరాత్ కంపెనీ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 328 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. దీంతో ఐపీవో ద్వారా రూ. 653 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 64 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచి్చంచనుంది. రూ. 60 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 110 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కేటాయించయనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.గ్లోబ్ ప్రాజెక్ట్స్ @ రూ. 67–71మౌలిక సదుపాయాల అభివృద్ధి కంపెనీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 67–71 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 1,67,60,560 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 119 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 75 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 14 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన 9 నెలల కాలానికి దాదాపు రూ. 255 కోట్ల ఆదాయం, రూ. 18 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 మార్చి31కల్లా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 669 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990స్టార్బిగ్బ్లాక్ ఐపీవో బాటస్టార్బిగ్బ్లాక్ బిల్డింగ్ మెటీరియల్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు వాటాదారులు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. బీఎస్ఈ లిస్టెడ్ బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్కు పూర్తి అనుబంధ సంస్థఇది. ఐపీవో ద్వారా సంస్థకు సరైన విలువను వెలికితీయడం, విస్తరణకు అవసరమైన పెట్టుబడుల సమీకరణ తదితరాలకు వీలుంటుందని మాతృ సంస్థ బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్ పేర్కొంది. అయితే నియంత్రణ సంస్థల అనుమతులు, క్యాపిటల్ మార్కెట్ పరిస్థితులు, ఇతర క్లియరెన్స్లపై ఆధారపడి ఐపీవో చేపట్టనున్నట్లు వివరించింది. 2015లో ఏర్పాటైన బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్ దేశీయంగా ఏఏసీ బ్లాకు తయారీలో ఏకైక లిస్టెడ్ కంపెనీగా నిలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలలోగల ప్లాంట్ల ద్వారా వార్షికంగా 1.3 మిలియన్ ఘనపు మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 225 కోట్ల ఆదాయం సాధించింది.

తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!
బ్రాడ్క్యాస్టింగ్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్)కు ప్రమోటర్లు పెట్టుబడులు సమకూర్చనున్నారు. తద్వారా తమ వాటాను పెంచుకోనున్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థల నుంచి రూ. 2,237 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు జీల్ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో పూర్తిగా మారి్పడికి వీలయ్యే 16.95 కోట్లకుపైగా వారంట్లను జారీ చేసేందుకు బోర్డు అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆల్టిలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రమోటర్ల నుంచి అందుకోనున్న పెట్టుబడుల ద్వారా కంపెనీ ప్రధాన బిజినెస్ విభాగాలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో వృద్ధి అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేసింది.ఒక్కో వారంట్కు రూ.132 ధరలో..ఒక్కో వారంట్కు రూ. 132 ధర చొప్పున ప్రమోటర్లకు 16,95,03,400 వారంట్లను జీల్ జారీ చేయనుంది. తద్వారా నగదు రూపేణా రూ. 2,237.44 కోట్లు లభించనుండగా.. కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.39 శాతానికి చేరనున్నట్లు జీల్ వివరించింది. కాగా.. సెబీ మార్గదర్శకాల ప్రకారం వారంట్ను రూ. 128.58 ధరలో కేటాయించవలసి ఉన్నప్పటికీ బోర్డు రూ. 3.42 ధర అధికంగా నిర్ణయించింది. ఇందుకు ప్రమోటర్లు సైతం అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇష్యూ ధరలో ప్రమోటర్లు ముందస్తుంగా 25 శాతం(రూ. 33) ధర చెల్లించనున్నారు. వారంట్లను అలాట్మెంట్ నుంచి గరిష్టంగా 18 నెలల్లోగా ప్రమోటర్లు షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990ఒక్కో వారంట్కు రూ. 99(75 శాతం) చొప్పున చెల్లించడం ద్వారా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.99 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. దేశీ మీడియా బిజినెస్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)ను జీల్తో విలీనం చేసే ప్రతిపాదనను గతేడాది సోనీ గ్రూప్ విరమించుకున్న నేపథ్యంలో ప్రమోటర్ల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా ‘2025 ఎక్స్ఎల్ 750 ట్రాన్సల్ప్’ పేరుతో అడ్వెంచర్ బైక్ను విడుదల చేసింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.10,99,990గా ఉంది. బుకింగ్లు మొదలయ్యాయి. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. రాక్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ 755 సీసీ లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను కలిగి ఉంది.ఇది 9,500 ఆర్పీఐ వద్ద గరిష్టంగా 67.5 కిలోవాట్ల పవర్ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్కు 6–స్పీడ్ గేర్బాక్స్ జత చేశారు. ఐదు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో థ్రోటిల్–బై–వైర్ (టీబీడబ్ల్యూ) వ్యవస్థ ఉంది. 5.0 అంగుళాల ఫుల్–కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్లులున్నాయి. ఇదీ చదవండి: కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్ఇంజిన్ పవర్, బ్రేకింగ్, ఏబీఎస్ వంటి అంశాలు రైడర్ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్ ఇది. ముఖ్యంగా సాహస యాత్రలను కోరుకునే రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.

మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు మెటల్, ఫార్మా, ఆయిల్అండ్గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 81,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు పతనమై 24,853 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 369 పాయింట్లు కోల్పోయి 81,427 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 24,814 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.ఆసియాలో కొరియా, జపాన్ నికాయ్ ఇండెక్సులు లాభాల్లో.., చైనా, హాంగ్కాంగ్ ఇండెక్సులు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి 30 పైసలు బలహీనపడి 86.34 వద్ద స్థిరపడింది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, డాలర్ బలోపేతం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 85.96 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 85.96 – 86.28 శ్రేణిలో ట్రేడైంది.ఓస్వాల్ పంప్స్ ఐపీఓకు 34 రెట్ల స్పందన ఓస్వాల్ పంప్స్ పబ్లిక్ ఇష్యూకు 34.42 రెట్ల అధిక స్పందన లభించింది. క్యూఐబీ కోటా 88.08 రెట్లు, రిటైల్ కోటా 3.60 రెట్లు, నాన్ ఇన్స్టి ట్యూషనల్ కోటా 36.7 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి.
ఫ్యామిలీ

ఆర్టీ‘షీ’ డ్రైవర్!
ఆటో డ్రైవర్గా తండా గతుకుల రోడ్డు మీద ప్రయాణం ప్రారంభించిన సరిత నాయక్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ సవాళ్లకు భయపడి ఉంటే... తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్గా ప్రత్యేకత సాధించేది కాదు.సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరిత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ బాధ్యతలు భుజాలకెత్తుకుంది. అక్క భర్త దేవరకొండలో ఆటోడ్రైవర్. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఆటో నడపడం నేర్చుకుంది సరిత. బావకు విశ్రాంతి ఇచ్చి తానే ఆటో నడిపేది. తోటి డ్రైవర్లు రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్లు. ఆటోకు పంక్చర్లు చేయ్యడం, బ్రేక్డౌన్ చేసి ఇబ్బందులకు గురి చేసేవారు.అన్ని ఇబ్బందులు తట్టుకుంటూ మూడు సంవత్సరాల పాటు అక్కడే ఆటో నడిపింది. ఆ తరువాత ఆసుపత్రిలో నర్సుగా పని చేయడానికి హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్ళింది. హోలి మేరీ నర్సింగ్ కాలేజిలో చేరడానికి ప్రయత్నం చేసినప్పటికి ఫీజు కట్టే స్థోమత లేక అదే కాలేజిలో వార్డెన్ ఉద్యోగంలో చేరింది. వార్డెన్ గా పనిచేస్తునే హెవీ డ్రైవింగ్ స్కూల్లో బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. అదే కాలేజీలోనే బస్ డ్రైవర్గా పనిచేసింది.తండా టు దిల్లీహెవీ వెహికిల్ నడపడంలో సరిత నైపుణ్యం ఆజాద్ ఫౌండేషన్ ప్రతినిధి భానుశ్రీ దృష్టికి వచ్చింది. ఆమె సరితకు తమ సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చింది. ‘సఖీ క్యాబ్స్’ పేరుతో వంద మంది మహిళా డ్రైవర్లతో క్యాబ్స్ నడుపుతోంది ఆజాద్ ఫౌండేషన్. దిల్లీలో క్యాబ్ డ్రైవర్గా కొత్త జీవితం ప్రారంభించిన సరిత, ఫౌండేషన్ ఇచ్చిన శిక్షణతో హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలలో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో మహిళా డ్రైవర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకుంది. అన్ని పరీక్షలలో నెగ్గి ఆ ఉద్యోగానికి ఎంపిక అయింది.తెలంగాణ ఆర్టీసీ గతంలో మహిళ డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన్నప్పటికీ ఎవరూ దరఖాస్తు చేయ్యలేదు. సరిత ఆర్టీసీలో బస్సు డ్రైవర్గా చేరడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళ డ్రైవర్గా ప్రత్యేకత సాధించింది. – తడకమళ్ళ శ్రీధర్, సాక్షి, సంస్థాన్ నారాయణపురంఅమ్మా,నాన్నల కోసం...దిల్లీలో ఉద్యోగం వదిలిపెట్టి అమ్మ,నాన్నల కోసం హైదరాబాద్కు వచ్చాను. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్గా గుర్తింపు లభించినందుకు గర్వంగా ఉంది. నేను ప్రయాణించిన దారిలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.– సరిత నాయక్

Sagubadi ఎరువుల లోకం..!
రసాయనిక ఎరువులు, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, నీటిపారుదల సదుపాయాలు.. ఈ మూడింటిని ఒక ప్యాకేజీగా రైతులకు అందుబాటులోకి తెచ్చింది ‘హరిత విప్లవం’. ఆంగ్లంలో ఈ మూడిటిని కలిపి గ్రీన్ రెవెల్యూషన్ టెక్నాలజీస్ (జిఆర్టిలు) అంటారు. హరిత విప్లవ కాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో రైతులకు ఈ మూడే విస్తృతంగా అందుబాటులోకి రావటంతో పంట దిగుబడులు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఏటేటా రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందులు తదితర వ్యవసాయ రసాయనాల వాడకం పెరుగుతూనే ఉంది.పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తిని పెంచవలసి వస్తోంది. అయితే, రసాయనిక ఎరువుల వాడకాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోవటం వల్ల పర్యావరణ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. నేలలు చౌడుబారిపోతున్నాయి. నీటి వనరులు రసాయనిక ఎరువుల అవశేషాలతో కలుషితం అవుతున్నాయన్న ఆందోళనలు సైతం పెరిగిపోతున్నాయి. అందువల్లనే పర్యావరణానికి అంతగా హాని చేయని సుస్థిర / సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇటీవల కాలంలో గతమెన్నడూ లేనంతగా ఆదరణ పొందుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ నూటికి 95 శాతం మంది రైతులు రసాయనిక ఎరువులతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ, ఏయే దేశాల్లో పంటలకు ఎంతెంత మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు? నత్రజని అనగానే యూరియా గుర్తొస్తుంది. పంటలకు యూరియా యేతర మార్గాల ద్వారా నత్రజని ఎంతెంత అందుతుంది? ఎరువులను ఎంతెంత వాడుతున్నారు? వీటిని శాస్త్రవేత్తలు సూచించిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువ వాడుతుండటం వల్ల వస్తున్న పరిణామాలేంటి? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను పరిశీలిద్దాం.. కాసేపు రసాయనిక ఎరువుల లోకంలోకి తొంగి చూద్దాం...పంట మొక్కలు, తోటలు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇవ్వాలంటే వాటి పెరుగుదలకు అవసరమైనంత మోతాదులో 17 రకాల పోషకాలు అవసరం. ఇవి రెండు రకాలు.. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్.. ఈ మూడింటిని వాతావరణం నుంచి మొక్కలు గ్రహిస్తాయి. మిగతా 14 రకాలు నేల నుంచి వేర్ల ద్వారా పంటలు గ్రహిస్తాయి.చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?అదేవిధంగా ఎరువుల్లో రెండు రకాలు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు (జీవన ఎరువులు కూడా ఈ కోవలోకే వస్తాయి). నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి స్థూల పోషకాలు. ఇవి పెద్ద పరిమాణంలో పంటలకు అవసరం. ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం.. వంటి సూక్ష్మపోషకాలు. ఇవి స్వల్ప పరిమాణంలో అవసరం. సాధారణంగా రసాయనిక ఎరువులు అని అంటే చాలా వరకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనే అర్థం. ఎన్పీకే ఎరువులని అంటుంటాం. 2024లో 19.54 కోట్ల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా రైతులు పంటల సాగు కోసం ఉపయోగించారు. 2023 కన్నా ఇది కొంచెం ఎక్కువ. 2022లో 18.5 కోట్ల టన్నులు వాడారు. 2021తో పోల్చితే ఇది 7% తక్కువ. కొవిడ్ నేపథ్యంలో రసాయనిక ఎరువుల ధరలు బాగా పెరిగిపోవటంతో కొన్ని చోట్ల వాడకం తగ్గినా అది తాత్కాలిక పరాణామమేనని చెప్పాచ్చు.రసాయనిక ఎరువుల ఉత్పత్తి, ఎగుమతి యూరప్, అమెరికా ఖండాల్లో ఎక్కువ. ఐదు దేశాలు ఎరువుల ఎగుమతిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వాడకం ఆసియాలో ఎక్కువ. భారత్ సహా ఆసియా దేశాలన్నీ రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకుంటూ వ్యవసాయానికి మద్దతు పలుకుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధ కాలంలో ఎరువుల సరఫరా తగ్గి, ధర పెరిగిపోవటం మనకు తెలుసు. ఆయా దేశాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, నేలల్లో సారం, రైతుల స్థోమత, వారు అనుసరిస్తున్న సాంకేతికత, స్థానిక ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు వంటి అనేక పర్యావరణ, ఆర్థిక, భౌగోళిక అంశాలపై ఎరువుల వాడకం మోతాదులు, దిగుబడులు వంటివి ఆధారపడి ఉంటాయి.ఎరువుల వినియోగం 18.5 కోట్ల టన్నులుప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం (పంటలు, పశుపోషణ, ఆక్వాకల్చర్, అడవుల పెంపకం, చేపల వేటసహా) ద్వారా సమకూరే ఆదాయం 2000–2022 మధ్య కాలంలో 89 శాతం పెరిగింది. 2022లో 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో ఆసియా దేశాలదే 66%తో ప్రధాన పాత్ర. ప్రపంచ దేశాల వార్షిక ఆదాయంలో 4% మాత్రమే వ్యవసాయ రంగం నుంచి వస్తున్నప్పటికీ స్వతంత్ర ఆహారోత్పత్తి వ్యవస్థను కలిగి ఉండటం ఏ దేశానికైనా ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవటానికి అవసరమే. అందుకు ఈ రోజుకు ప్రధాన సాధనంగా రసాయనిక ఎరువులే నిలుస్తున్నాయి. ఇదీ చదవండి: పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?ఆహార వ్యవసాయ సంస్థ (యుఎన్–ఎఫ్పిఓ) ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 నాటికి ప్రపంచంలో రసాయనిక ఎరువుల వార్షిక వినియోగం 18.5 కోట్ల టన్నులకు చేరింది. ఇందులో సింహభాగం 58% నత్రజని ఎరువులే. 10.8 కోట్ల టన్నుల యూరియా వాడకం జరిగింది. 4.2 కోట్ల టన్నుల ఫాస్ఫరస్ (23%), 3.5 కోట్ల టన్నుల పొటాషియం (19%) ఎరువులను రైతులు వాడారు. 2022లో రసాయనిక ఎరువుల వాడకంలో 55 శాతం వాటాతో ఆసియా ముందంజలో ఉంది. అమెరికా దేశాలు రెండోస్థానంలో, యూరప్ మూడో స్థానంలో, ఓసియానా నాలుగో స్థానంలో ఉన్నాయి. చైనా, భారత్, బ్రెజిల్, అమెరికా దేశాలు అధికంగా రసాయనిక ఎరువులు వాడుతున్నాయి. ఆసియా దేశాల్లో వాడుతున్న ఎరువుల్లో నత్రజని ఎరువుల వాటా 61–62% మేరకు ఉంది.హెక్టారుకు 130 కిలోలుహెక్టారు పొలంలో రసాయనిక ఎరువుల వాడకం 130 కిలోల మేరకు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా ఉంది. అమెరికా ఖండంలో 130 కిలోలు, ఓసియానా దేశాల్లో 84 కిలోలు, యూరప్లో 64 కిలోలు, ఆఫ్రికాలో అతి తక్కువగా 22 కిలోల మేరకు రసాయనిక ఎరువులు వాడుతున్నారు. అమెరికా ఖండంలో 2000–2022 మధ్యకాలంలో వినియోగం 57% పెరిగింది. ఆసియాలో 37%, ఆఫ్రికాలో 32%, ఓసియానాలో 15% పెరగ్గా, యూరప్ దేశాల్లో 2% తగ్గింది. చెరకు, మొక్కజొన్న. గోధుమ, వరి పంటలను అత్యధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.వర్షం ద్వారా 9.8 కిలోల నత్రజని!ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పంటలకు నత్రజని అందేది యూరియా ద్వారా మాత్రమే కాదు. అందుకు అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. యుఎన్–ఎఫ్ఎఓ గణాంకాల ప్రకారం (2022).. ప్రపంచవ్యాప్తంగా సగటున హెక్టారుకు ఏడాదికి సేంద్రియ ఎరువుల ద్వారా 16.2 కిలోల నత్రజని పంటలకు అందుతోంది. రసాయనిక ఎరువుల ద్వారా అందుతోంది 64.3 కిలోలు. వర్షం/మంచు ద్వారా 9.8 కిలోల నత్రజని వాతావరణంలో నుంచి గ్రహించి సూక్ష్మజీవులు అందిస్తున్నది 25.5 కిలోలు. పంట కోతల ద్వారా (ఫలసాయం, పంట వ్యర్థాలతో కలుపుకొని) మనం భూమి నుంచి పొందుతున్న నత్రజని 65.1 కిలోలు మాత్రమే. చదవండి: 125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!అయితే, వర్షం, మంచు ద్వారా భారత్లో పొలాలకు 2022లో అందిన నత్రజని సగటున హెక్టారుకు 21.2 కిలోలు! ఇది ప్రపంచ సగటు 9.8 కిలోలతో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ కావటం విశేషం. 2021లో వివిధ మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా హెక్టారు భూమికి సగటున 116.9 కిలోల నత్రజని అందింది. అందులో నుంచి, పంట పండిన తర్వాత మనం పొందే ఫలసాయం ద్వారా 65.1 కిలోల నత్రజని పోగా మిగతా 51.8 కిలోల నత్రజని ప్రతి హెక్టారు భూమిలో మిగిలిందని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. 2000 సంవత్సరంలో ఇలా మిగిలింది 48.3 కిలోలు మాత్రమేనట.

కట్నంగా కిడ్నీ
వరకట్నమా... అదెక్కడుంది? అని పైకి అంటున్నారు గానీ లాంఛనాలు నెరవేర్చడానికి తల్లిదండ్రులు ఎన్ని అప్పులు చేస్తున్నారో సమాజానికి తెలుసు. తాజాగా బిహార్లో ఒక ఘటన ఉలిక్కిపడేలా చేసింది. వరుడు అడిగిన మోటార్ సైకిల్ని పెళ్లికూతురు ఇవ్వలేననేసరికి ‘పోనీ కిడ్నీ ఇవ్వు.. అమ్ముకుంటాం’ అన్నారు. దాంతో పెద్ద కేసయ్యి పెళ్లి ఆగిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు తగ్గి ఉండాల్సిన అవసరం ఇంకా ఉందా? వాళ్లు మొదట బైక్ అన్నారు. లేదా నాలుగు లక్షల క్యాష్ అన్నారు. లేదా కిడ్నీ అన్నా ఇవ్వు అంటున్నారు. బిహార్లోని ముజఫర్పూర్లో ఉంటున్న దీప్తి అనే మహిళ ఈ విషయమైన పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయడానికి వస్తే పోలీసులు కూడా డంగై పోయారు. విషయం ఏమిటంటే– దీప్తికి 2021లో పార్థ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో దీప్తి వివరించింది– ‘మా అమ్మా నాన్నలు నా పెళ్లి కోసం 30 లక్షలు ఖర్చు పెట్టారు.అయినా అత్తవారింటిలో అడుగు పెట్టినప్పటి నుంచి కట్నం కోసం సూటి పోటి మాటలు వినిపించేవి. మా అత్తగారు ఆయుర్వేద దుకాణం తెరవడానికి మరో 8 లక్షలు తెమ్మని నన్ను కోరారు. నేను అతి కష్టం మీద 3 లక్షలు నాన్నను అడిగి తెచ్చాను. రెండేళ్ల క్రితం నా భర్తకు కిడ్నీ వ్యాధి ముదిరింది. అది పెళ్లికి ముందే ఉంటే దాచి పెళ్లి చేశారు. మేము ఢిల్లీకి వెళ్లి అక్కడ మా ఆడపడుచు ఇంట్లో ఉండి వైద్యం చేయించాం. అక్కడి నుంచే నాకు సమస్యలు మొదలయ్యాయి’ అని తెలిపిందామె.డబ్బు లేదా కిడ్నీదీప్తిని ఆమె అత్తామామలు మొదట బైక్ అడిగారు. తర్వాత నాలుగు లక్షలు తెమ్మన్నారు. తర్వాత భర్తకు కిడ్నీ అయినా ఇవ్వు అని డిమాండ్ చేశారు. దీప్తి ఇవ్వను అని చెప్పేసరికి పుట్టింటికి తరిమేశారు. దాంతో తట్టుకోలేకపోయిన దీప్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే విడాకులు కావాలని డిమాండ్ కూడా చేసింది. భర్త ఇందుకు నిరాకరించినా దీప్తి మాత్రం ఈ పెళ్లి నుంచి బయటపడాలని నిశ్చయించుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.మెడకు చుట్టుకుంటున్న లాంఛనాలుకట్నం అనే మాట మన దేశంలో ఎట్టకేలకు అనాగరికంగా మారాక ఆడపెళ్లివారికి ఖర్చులు మరో విధంగా చుట్టుముట్టాయి. వాటిలో ప్రధానమైనది బంగారం. పిల్లకు ఏం పెడతారు అనే విషయం చాలా పెద్ద సమస్య– బంగారం రేటును తలుచుకుంటే! అలాగే కల్యాణ మంటపం, భోజనాలు, ఇతర ఆర్భాటాలు మహామహులను కూడా అప్పుల పాలు చేస్తున్నాయి. పెళ్లయ్యాక కూడా ఆ ఖర్చు అనీ ఈ ఖర్చు అనీ అల్లుళ్లు పిండేస్తున్నారు. కార్లు అడిగే అల్లుళ్లు కొందరైతే వ్యాపారానికి పెట్టుబడి అడిగేవారు కొందరు. ఇటు భర్తకు సర్ది చెప్పలేక అటు తల్లిదండ్రులను అడగలేక ఆడపిల్లలు పోకచెక్కలవుతున్నారు.అమ్మాయికి ఏం తక్కువ?ఇన్నేళ్ల తర్వాత కూడా అమ్మాయి డబ్బు ఇచ్చేదిగా అబ్బాయి డబ్బు తీసుకునేవాడిగా వివాహ వ్యవస్థ ఉండటం విషాదం. ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ మరో వైపు కుటుంబంలో కీలకపాత్ర పోషిస్తూ ఉన్నా ‘తగ్గి ఉండే’ ధోరణిని సమాజంప్రోత్సహిస్తూనే ఉంది. విద్యావంతులైన వధూవరులు పెళ్లి విషయంలో పరస్పర గౌరవనీయమైన లాంఛనాలను చర్చించి ఎవరికీ ఇబ్బంది, ఆర్థిక భారం కలిగించని వాటికే చోటిస్తూ వివాహానికి అంగీకరించాలి. అందుకు పెద్దల్ని ఒప్పించాలి. పెద్దలు ఏవేవో డిమాండ్లు పెట్టి, నెరవేర్చుకుని పక్కకు తప్పుకున్నాక కాపురం చేయాల్సింది వధువరులే. కనుక పరస్పర గౌరవానికి చోటుండే వివాహాలపై వారే ముందడుగు వేయాల్సి ఉంది.మరాఠాలు ఇస్తున్న సందేశంమొన్నటి మే నెలలో పుణెలోని వైష్ణవి హగవానె అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం – వరకట్న వేధింపులు. ఈ ఆత్మహత్య మహరాష్ట్రలో సంచలనం సృష్టించింది. దీనికి విరుగుడు కనిపెట్టడానికి మరాఠా సమూహాలు వరకట్నాన్ని, పెళ్లి ఆర్భాటాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. పుణె చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరిగి రైతుల భూములకు రెక్కలొచ్చాయి. బిల్డర్లకు భూములు అమ్మిన రైతులు భారీగా ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు. వీటిని చూసి సగటు మధ్యతరగతి వారు కూడా చేతులు కాల్చుకుని అప్పుల పాలవుతున్నారు. ఎంత ఖర్చయినా పర్లేదు... మంచి కుర్రాణ్ణి తేవాలని వేలానికి దిగుతున్నారు. వీటన్నింటిని నిషేధిస్తూ మరాఠా పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అక్కడి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తుండటంతో ప్రభావం కనపడుతోంది.

సమానత్వం అంటే ఇదేనా?
ఖాన్ సర్.. యూట్యూబ్లో చాలా ఫేమస్. ఆయన పాఠాలు బాగా చెబుతారు. అంతేకాదు చాలా విషయాల గురించి సాధికారికంగా వివరిస్తారు. ఆయన చెప్పే పాఠాలు వినేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపిస్తారు. ఆయన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. యూట్యూబ్ ఖాన్ సర్ చానల్కు కోట్లలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. పుట్టింది యూపీ అయినప్పటికీ పేరు తెచ్చుకుంది మాత్రం బిహార్లో. ఆన్లైన్ పాఠాలతో ఇప్పుడు ఆయన దేశంలోని విద్యార్థులందరికీ సుపరిచితులయ్యారు. సడన్గా ఇప్పుడు ఖాన్ సర్ ప్రస్తావన ఎందుకొచ్చిందానేగా మీ డౌటు.తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థకు ఖాన్ సర్ ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తన భార్య గురించి ఆయన వెల్లడించిన విషయాలు చర్చకు దారి తీశాయి. కొంత మంది ఆయనకు మద్దతుగా నిలిస్తే, మరికొందరు విమర్శలకు దిగారు. కొద్ది రోజుల క్రితం జరిగిన తమ పెళ్లి రిసెప్షన్లో ఖాన్ సార్ భార్య ముఖాన్ని కవర్ చేస్తూ తల పైనుంచి చీర కొంగు కప్పుకోవడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజా పాడ్కాస్ట్లో దీని గురించి వివరణయిచ్చారు ఖాన్ సర్.రహస్యంగా పెళ్లిగత నెలలో ఖాన్ సర్ సీక్రెట్గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. పెళ్లి సింపుల్ జరిగిపోవడంతో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల కోసం కొద్ది రోజుల క్రితం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ఖాన్ సర్ భార్య ముసుగు (ఘూంఘాట్) ధరించడం పట్ల చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. వధువు ముఖం కప్పుకోవడాన్ని ప్రశ్నించారు. తన పాఠాల్లో సమానత్వం, మహిళల హక్కుల గురించి బోధించే ఖాన్ సర్.. చేతల్లో మాత్రం చతికిలపడ్డారని నెటిజనులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. భార్య ఇష్టాన్ని గౌరవించారని కొంతమంది ఆయనకు మద్దతుగా కామెంట్లు పెట్టారు.ముసుగు వద్దన్నా వినలేదు..తాజాగా ఏఎన్ఐ పాడ్కాస్ట్లో దీని గురించి ఖాన్ సర్ వివరణయిచ్చారు. తన భార్య ఆమె ఇష్టప్రకారమే ఘూంఘాట్ ధరించిందని, తానేమి బలవంత పెట్టలేదని వెల్లడించారు. ముసుగు ధరించవద్దని వారించినా ఆమె వినిపించుకోలేదన్నారు. "వివాహ రిసెప్షన్లో ఘూంఘాట్ ధరించడం నా భార్య నిర్ణయం. ఇది తన చిన్ననాటి కల అని, ప్రతి అమ్మాయి ఘూంఘాట్ ధరించి వధువు కావాలని కలలు కంటుందని ఆమె నాతో చెప్పింది. అలా చేస్తే ప్రజలు నన్ను నిందిస్తారని ఆమెతో అన్నాను. ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాను. కానీ ఆమె నా మాట వినలేద''ని వివరించారు.తక్కువ టైంలోనే ఫేమస్కాగా, ఖాన్ సర్ (Khan Sir) అసలు పేరు పైజల్ ఖాన్. ఉత్తరప్రదేశ్లోని డియోరియా ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం తర్వాత అలహాబాద్ యూనివర్సిటీలో బీఎస్సీ, ఎంఎస్సీతో పాటు జియోగ్రఫీలో ఎంఏ పూర్తి చేశారు. చదువు పూర్తైన తర్వాత బిహార్ రాజధాని పట్నాలో కోచింగ్ సెంటర్లో టీచింగ్ కెరీర్ మొదలు పెట్టారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి ఆయన బోధించేవారు. తక్కువ టైంలోనే తనదైన టీచింగ్ శైలితో విద్యార్థులను ఆకట్టుకున్నారు. చదవండి: మూడు సంస్థానాలు.. 46 జాగీర్లుపేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో 2019లో ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్ పేరుతో పట్నాలో సొంతంగా కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. అయితే కోవిడ్-19 కారణంగా అది మూత పడింది. తన కోచింగ్ సెంటర్ పేరుతోనే యూట్యూబ్లో చానల్ ప్రారంభించి, ఆన్లైన్లో పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. ఆదరణ పెరగడంతో 2021లో యాప్ కూడా ప్రారంభించారు. ఖాన్ GS రీసెర్చ్ సెంటర్ యూట్యూబ్ చానల్కు 24 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 400 వీడియోలు ఉన్నాయి.
ఫొటోలు
అంతర్జాతీయం

మరింత ఉధృతంగా దాడులు
టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్: అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఇరాన్ సముపార్జించకుండా అడ్డుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్ తన దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇరాన్ అత్యున్నత నేత, సుప్రీం కమాండర్ అయ తొల్లా అలీ ఖమేనీకి సన్నిహితుడు, ఖాటమ్ అల్ –అన్బియా సెంట్రల్ హెడ్క్వార్డర్స్ సారథి, సైనిక జనరల్ అలీ షాద్మానీని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని షాద్మానీ ఉంటున్న ఒక రహస్య ప్రదేశంపై క్షిపణుల వర్షం కురిపించి ఆయన ప్రాణాలుతీసింది. భూతలం నుంచి భూతలం మీది లక్ష్యాలను ఛేదించే 120 మిస్సైల్ లాంఛర్లను నాశనం చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.ఎఫ్–14 రకం రెండు యుద్ధవిమానాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. 10 కమాండ్ సెంటర్లను నేలకూల్చామని పేర్కొంది. దీంతో ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో బాలిస్టిక్ క్షిపణులతో బదులు చెప్పింది. టెల్ అవీవ్ సిటీలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కార్యాల యంపై మెరుపు దాడులు చేసింది. దీంతో ఆ భవనం ధ్వంసమైనట్లు వార్తలొచ్చాయి. టెల్ అవీవ్తోపాటు వెస్ట్ జెరూసలేంలోనూ బాంబుల మోతలు మోగాయి.ఇజ్రాయెల్లోని హెర్జిలియాలో 8 అంతస్తుల భవంతి ధ్వంసమైంది. ఇకపై మరింతగా దాడులు చేస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సయ్యద్ అబ్దుల్రహీం మౌసావీ ప్రకటించారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఇరాన్లో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,277 మంది గాయపడ్డారు. ఇరాన్ జరిపిన మిస్సైళ్ల దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. 500 మందికిపైగా పౌరులు గాయపడ్డారు.హెర్జిలియాపై ఇరాన్ దాడిలో ధ్వంసమైన భవంతి నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు , మిలటరీ కమాండర్ షాద్మానీ టెహ్రాన్లో హాహాకారాలుఇరాన్ గగనతల రక్షణవ్యవస్థ దెబ్బతినడంతో ఇజ్రాయెల్ క్షిపణులు పట్టపగ్గాల్లేకుండా విచ్చలవిడిగా విరుచుకుపడ్డాయి. దీంతో టెహ్రాన్ నగరవ్యాప్తంగా మంగళవారం అప్రమత్త సైరన్లు మోగుతూనే ఉన్నాయి. కొందరు ప్రాణభయంతో ఇళ్లలో, బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటే లక్షలాది మంది కాస్పియన్ సముద్రతీరాలకు వాహనాల్లో తరలిపోతున్నారు. వందలాది మంది సమీప అజర్బైజాన్ దేశానికి వలసవెళ్లారు. సొంత వాహనాల్లో జనం వలసవెళ్తుండటంతో రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. స్టాక్మార్కెట్ పనిచేయలేదు. సరఫరాలేక పెట్రోల్బంకుల్లో నోస్టాక్ బోర్డులు కనిపించాయి. స్టాక్ ఉన్నచోట్ల చాంతాడంత క్యూ లైన్లు కనిపించాయి.ఖమేనీ జాడ తెలుసు... ఇప్పుడే చంపం: ట్రంప్జీ7 సదస్సు నుంచి హడావిడిగా అమెరికాకు పయనమైన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ జాడపై మాట్లాడారు. ‘‘ ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ప్రస్తుతానికి ఆయనను అక్కడే తలదాచుకోనిద్దాం. ఆయనను చంపేందుకు మిస్సైళ్లను ప్రయోగిస్తే సాధారణ పౌరులు, అమెరికా జవాన్లూ చనిపోయే ప్రమాదముంది. అందుకే ఇప్పుడే ఆయనను చంపబోం. కానీ ఆయనను అలా ప్రాణాలతో ఎక్కువ రోజులు ఉండనివ్వం.అసలే మాకు ఓపిక చాలా చాలా తక్కువ’’ అని ట్రంప్ అన్నారు. ‘‘ ఖమేనీగానీ, ఇరాన్గానీ మాకు వీలైనంత త్వరగా బేషరతుగా లొంగిపోతే మంచిది. అణుఒప్పందం కుదుర్చుకోవాలని ఇప్పటికే సూచించా. మధ్యవర్తిత్వం వహించాలనే ఆసక్తి నాలో తగ్గుతోంది. ఇరాన్ అణుఆశలపై నీళ్లు చల్లాం. నేను కాల్పుల విరమణను కోరుకోవట్లేదు. అంతకుమించిన ఫలితాన్ని ఆశిస్తున్నా. ఇప్పుడు ఈ సమస్యకు వాస్తవిక ‘ముగింపు’ పలకాల్సిందే’’ అని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మరో పోస్ట్పెట్టారు.బంకర్ బస్టర్ బాంబు ఇవ్వండిఇరాన్లో ఫోర్దో అణుఇంధన శుద్ధి కార్మాగారం ఒక పర్వతం కింద భూగర్భంలో నిర్మించారు. దీనిని భూస్థాపితం చేస్తేగానీ ఇరాన్ అణు కార్యక్రమం ఆగదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఎలాగైనా బంకర్లను బద్దలుకొట్టే భారీ బాంబు కోసం అమెరికాను సాయం కోరనుంది. మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ)గా పిలుచుకునే జీబీయూ–57ఏ/బీ బాంబు బరువు ఏకంగా 14,000 కేజీలు. ఇది పేలితే అక్కడ భూమి 200 అడుగుల లోతుదాకా బద్ధలైపోతుంది. అంటే భూగర్భంలోని బంకర్, అణుస్థావరం పూర్తిగా సమాధిదిబ్బగా మారుతుంది.అందుకే ఈ బంకర్ బస్టింగ్ బాంబును తమకు ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరుతున్నట్లు సమాచారం. ఇంతటి బరువైన బాంబును కేవలం బీ–2 స్టెల్త్ బాంబర్ యుద్దవిమానం నుంచే ప్రయోగించే వీలుంది. ఈ విమానం కూడా ఇజ్రాయెల్ వద్ద లేదు. ఇజ్రాయెల్ అభ్యర్థనను అంగీకరిస్తే అమెరికానే స్వయంగా తన విమానంతో ఈ బాంబును యురేనియం శుద్ధికర్మాగారంపై పడేయాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.ఎలక్ట్రానిక్ డివైజ్లు వాడొద్దని నిషేధాజ్ఞలుఇజ్రాయెల్ తన శత్రుదేశంలో సైనికుల చేతుల్లోకి వాకీటాకీలు, రేడియోసెట్లను ఏకకాలంలో పేల్చి సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ అధికారులు, వారి వ్యక్తిగత సహాయకులు ఎవరూ స్మార్ట్ఫోన్, స్మార్ట్వాచ్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించకూడదని ఇరాన్ నిషేధం విధించింది.

అసిమ్ మునీర్.. యూఎస్ పర్యటనకు వస్తావా?, నీకు సిగ్గుందా?
వాషింగ్టన్ డీసీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్. నియంతగా, అత్యంత కఠినాత్ముడిగా పేరుంది. పాకిస్తాన్లో ప్రధాని పేరు కంటే కూడా అసిమ్ మునీర్ పేరే ఎక్కువగా వినిపిస్తుందనేది కాదనలేని సత్యం. ఇదంతా ఒకటైతే, ఇప్పుడు మునిర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అధికారిక అమెరికా పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు మునీర్. అయితే మునీర్కు అమెరికాలో నిరసన సెగ మామూలుగా లేదు. పెద్ద ఎత్తును మునీర్ అమెరికా పర్యటనపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. భారీగా హోర్డింగ్లు వెలవడంతో పాటు నిరసనకారులు కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు అమెరికా పర్యటనకు రావడానికి నీకు సిగ్గుందా..? అని మనీర్ బస చేస్తున్న చోట నిరసనకారులు ఆందోళన చేపట్టారు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాకిస్తాన్ ప్రజలు ప్రాణాలు తీసే నీవు ఇక్కడ ఏం మాట్లాడాతావ్, ఇక తుపాకీలు మాట్లాడితే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్లే’ అని వెలసిన హోర్డింగ్లు మునీర్పై తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. WATCH: Failed Asim Munir gets humiliated by the Pakistani Diaspora during his trip to USA.He was called 'Murderer of Pakistanis'. pic.twitter.com/NSRKywNuh3— Sensei Kraken Zero (@YearOfTheKraken) June 17, 2025 pic.twitter.com/poIqJuGdnv Asim Munir has fallen into the hands of Pakistanis in America—exposed as the dictator, traitor, and butcher of his own people that he truly is!" From Pakistan #11YearsofInjustice Trump and Israel— ⁱᴵⁿˢᵃᶠ فکر (@shaoooohoor) June 17, 2025 ఐదు రోజుల అమెరికా పర్యటనపాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు.

కాల్పుల విరమణ కాదు.. ట్రంప్ రియల్ ఎండ్ వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజు కొనసాగుతోంది. యుద్ధం తీవ్రతరం కావొచ్చని.. పశ్చిమాసియా నుంచి ఈ ఉద్రిక్తతలు మిగతా ప్రపంచానికి విస్తరించవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటలను, చేష్టలను, చర్యలను అన్వయించుకుంటున్నారు. అయితే..ట్రంప్ మాత్రం ఊహకందని రీతిలో స్పందిస్తున్నారు. జీ7 సదస్సు నుంచి ఎయిర్ఫోర్స్ వన్లో బయల్దేరే ముందు తాను కాల్పుల విరమణ కోసం ప్రయత్నించడం లేదని.. అంతకు మించి ఉత్తమమైన మార్గం కోసం ప్రయత్నిస్తున్నానని మీడియా ప్రతినిధులతో అన్నారు. కాల్పుల విరమణ కాదు.. నిజమైన ముగింపు కోసం ప్రయత్నిస్తున్నాం. అది నిజమైన ముగింపుగా ఉండనుంది అని ట్రంప్ పేర్కొన్నట్లు బీబీసీ ఒక కథనం ప్రచురించింది.ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ప్రకటించడంపై ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారాయన. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయన్న ట్రంప్.. రాబోయే రెండు రోజుల్లో మీరే చూస్తారని, అప్పటిదాకా ఎవరూ వెనక్కి తగ్గకపోవచ్చని సీబీఎస్ జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి అమెరికా నుంచి దౌత్య వేత్తలను ఇరాన్తో చర్చలకు పంపించవచ్చని రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేదంటే పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్లలో ఎవరో ఒకరిని పంపొచ్చని ఆ కథనం ఉటంకించింది.ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట జూన్ 13వ తేదీ నుంచి దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో ఒకవైపు ఇరుదేశాల్లో ప్రాణ నష్టంతో పాటు మరోవైపు చమురు మార్కెట్ కుదేలు అవుతోంది. ఈ క్రమంలో..జీ7 సదస్సును కుదించుకుని మరీ హడావిడిగా వాషింగ్టన్ బయల్దేరారు అధ్యక్షుడు ట్రంప్. అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదన చేశారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. కాసేపటికే అందులో వాస్తవం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. జరగబోయేది మేక్రాన్కు తెలియదని.. అది కాల్పుల విరమణకు మించే ఉంటుందని ట్రంప్ సోషల్ ట్రూత్ వేదికగా ప్రకటించారు.న్యూక్లియర్ ఎలాంటి అణ్వాయుధాలను కలిగి ఉండడానికి వీల్లేదంటున్న ట్రంప్.. టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈలోపు.. ఆయన సిట్యుయేషన్ రూమ్లో జాతీయ భద్రతా మండలితో భేటీ అవుతుండడంతో ‘ఏదో జరగబోతోందంటూ’ చర్చ నడుస్తోంది.ఇదీ చదవండి: టైం లేదు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

ఏం జరగబోతోంది?.. ట్రంప్ గరం గరం.. సిట్యుయేషన్ రూమ్ రెడీ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్ రూమ్ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ట్రంప్ ఆఫర్ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?అంతకు ముందు.. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణకు ట్రంప్ ఆఫర్ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్ ప్రతిపాదించారని, అయితే ఈ ఆఫర్ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్ అన్నారు. అయితే.. మేక్రాన్ ప్రకటనను ట్రంప్ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్ సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిణామాలపై ట్రంప్ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. ఈ వారంలో న్యూక్లియర్ డీల్పై ఇరాన్ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. ఇక.. టెహ్రాన్ను వీడాలని ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ట్రంప్పై ఒత్తిడి..ఇరాన్ మాస్టర్ ప్లాన్గల్ఫ్ దేశాలతో ట్రంప్ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
జాతీయం

ఇప్పుడే వద్దు! ఇద్దరు చాలు!!
‘ఉద్యోగం / వ్యాపారంలో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’.. ఇంతేగా ఓ సగటు యువతీ, యువకుడి ఆలోచన. ఇదంతా పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత వారి ఆలోచనల్లో చాలా మార్పులొస్తున్నాయి. ఇప్పుడే వద్దు అని చెప్పేవారు కొందరైతే.. ఇద్దరిని మించి పెంచలేం బాబోయ్ అంటున్నవారు మరికొందరు. పిల్లలను వద్దనుకోవడానికి లేదా వాయిదా వేయడానికే మొగ్గుచూపుతున్న జంటల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా విద్యావంతులైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ఆర్థిక, అనారోగ్య సమస్యలే పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్అనారోగ్య సమస్యలు వంధ్యత్వం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు భారత్లో 13 శాతం, అమెరికాలో 16 శాతం మంది వెల్లడించారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, ఊబకాయం వంటివి సంతానోత్పత్తికి ఆటంకంగా మారుతున్నాయి. సమయపాలన లేని ఆహారపుటలవాట్లు; విధులు, ఉద్యోగంలో భాగంగా గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేమి, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. గర్భధారణ సమయంలో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం కారణమని భారత్లో 14 శాతం, యూఎస్లో 8 శాతం మంది తెలిపారు. గర్భం వచ్చిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించడంతోపాటు, మందులు వాడాలి. ఈ ప్రక్రియను ఆర్థికంగా భారంగా భావించడమో, లేదా వైద్య సౌకర్యాలు లేకపోవడమో కారణంగా.. మాతృత్వాన్ని కాదనుకోవడమో, వాయిదా వేయడమో చేస్తున్నారు.చూసుకునేవారు లేక..తగినంత/నాణ్యమైన పిల్లల సంరక్షణ అవకాశాలు లేకపోవడం కారణమని భారత్లో 18 శాతం, అమెరికాలో 12 శాతం మంది తెలిపారు. అంటే పిల్లలను చూసుకోవడానికి పెద్దవారు అందుబాటులో లేకపోవడం, సంరక్షణ కేంద్రాల లేమి.. కుటుంబాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలను చూసుకునేవారు లేకపోతే తల్లిదండ్రులు పని చేయడం కష్టతరం అవుతుంది. వారి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలకు దూరం కావడానికి దారితీస్తుంది. ఇలాంటి కారణాలతో భాగస్వామి తక్కువ మంది పిల్లలను కోరుకోవడమూ ప్రధాన కారణమని భారత్, యూఎస్లలో 19 శాతం మంది వెల్లడించారు.మనదేశంలో జననాల రేటు 1960లలో సగటున ఒక్కో మహిళకు సుమారు 6గురు పిల్లలుగా ఉండేది. ఇప్పుడు ఇది 1.9కి పడిపోయింది. అంటే ఇద్దరు పిల్లలు కూడా కాదన్నమాట. ప్రపంచ సగటు 2.2తో పోలిస్తే ఇది తక్కువే. ఇందుకు ఆర్థిక పరిమితులు, ఉద్యోగ అభద్రత, అనారోగ్య సమస్యలు... ఇలా ఎన్నో కారణాలు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ జనాభాలో 37 శాతం మంది ఉన్న భారత్, అమెరికా వంటి 14 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.ఇద్దరు చాలంటున్నారుఎంతమంది పిల్లలు కావాలని అడిగితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చెప్పిన సమాధానం.. ఇద్దరు! మనదేశంలో అసలు పిల్లలే వద్దన్నవారు సగటున 5 శాతం కాగా, ఇది అమెరికాలో సుమారు 14 శాతం కావడం గమనార్హం. ఒక్కరే చాలని మనదేశంలో సగటున 14 శాతం మంది చెబితే.. అమెరికాలో కేవలం 7 శాతం మందే ఇలా కోరుకున్నారు. ఇద్దరు బిడ్డలు కావాలని మనదేశంలో పురుషుల్లో 33 శాతం, మహిళల్లో 41 శాతం మంది చెప్పారు. అమెరికాలో ఇలా కావాలన్నవారి సగటు కేవలం 26 శాతమే. మనదేశంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కావాలన్నవారు స్త్రీ, పురుషుల్లో గరిష్ఠంగా 6 శాతాన్ని కూడా మించలేదు. ఆసక్తికరంగా అమెరికాలో ఇలా కావాలన్నవారు దాదాపు 16 శాతం.ఆర్థిక పరిమితులుభారత్, అమెరికాలో ఆర్థిక పరిమితులే ప్రధానంగా మాతృత్వానికి అడ్డంకిగా ఉన్నాయని 38 శాతం మంది వెల్లడించారు. ఆదాయ అసమానతలు, అప్పులు పేరుకుపోవడం, ఊహించని ఖర్చులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, నిరుద్యోగం, పొదుపు లేకపోవడం లేదా సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వంటి ఆర్థిక పరిమితులు చుట్టుముడుతున్నాయి. ఈ సవాళ్లే కుటుంబ జీవితంలోని వివిధ అంశాలను.. ప్రధానంగా బిడ్డలను కనాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలను వద్దనుకోవడానికి.. నిరుద్యోగం లేదా ఉద్యోగం పోతుందేమోనన్న అభద్రతాభావం కారణమని 21 శాతం భారతీయులు, 17 శాతం అమెరికన్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో అనిశ్చితి ఒకవైపు.. ఏఐ వంటి నూతన సాంకేతికత రాకతో కొన్ని రంగాలకు చెందిన పలు విభాగాల్లో ఉద్యోగుల తీసివేతలు మరోవైపు.. వెరసి యువతకు ఉద్యోగాలు, కొత్త అవకాశాల వేట తప్పడం లేదు. ఇవన్నీ కూడా పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్
షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ వివేక్ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్స్ట్రక్షన్లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్ సైగ.. రాజాపై విశాల్ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్ చౌహాన్ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్దాంగ్ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్లో పడేశారు. జూన్ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్ ఇండియాకు షాక్ల మీద షాక్లు!
న్యూఢిల్లీ: భారతదేశ ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియాకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఈరోజు(మంగళవారం, జూన్ 17) వరుసపెట్టి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. మంగళవారం ఆరు ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన ఆరు ఎయిర్ ఇండియా విమానాలు కూడా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాలే కావడం గమనార్హం. AI 153(ఢిల్లీ-వియన్నా), AI 143(ఢిల్లీ-పారిస్), AI 159 (అహ్మదాబాద్-లండన్), AI 133 (బెంగళూరు-లండన్), AI 170 (లండన్-అమృత్సర్)లతో పాటు శాన్ఫ్రానిస్కక్ష నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు ఉదయమే రద్దయ్యింది. అధునాతన టెక్నాలజీతో నడిచే బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో విమాన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఆరు బోయింగ్ విమానాల్లో సమస్యలు కనిపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన కనబడుతోంది. విమానం మాట ఎత్తితేనే హడలిపోతున్న ప్రయాణికులు.. బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం అంటే వామ్మో అని పరిస్థితికి వచ్చారు.

Air India Incident: దర్యాప్తులో RAT కీలక పాత్ర పోషించనుందా?
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జూన్ 12వ తేదీన జరిగిన విమాన ప్రమాదం అతి పెద్ద విషాదంగా మారిపోయింది. ఆ విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది. అయితే ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో విమానంలో ఒకేసారి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం ఆసక్తికరంగా మారింది. అసలు డ్యుయల్ ఇంజన్తో నడిచే విమానాల్లో ఒక ఇంజన్ పని చేయని పక్షంలో మరో ఇంజన్ పునరుద్ధరించబడుతోంది. ఇది సెకన్లలో జరిగే ప్రక్రియ. ఇందుకు RAT(Ram Air Turbine) దోహదం చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నెలకొంది. రెండు ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని అధిక శాతం మంది విమాన రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇలా జరిగినప్పుడు RAT ఎంతవరకూ పని చేసిందనేది మరో కోణంలో చర్చకు తెరలేపింది. ఎయిర్లైన్స్లో RAT అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (Ram Air Turbine). ఇది విమానంలో ఒక చిన్న టర్బైన్, ఇది విమానం యొక్క ప్రాథమిక శక్తి వనరులు విఫలమైనప్పుడు ఉపయోగించబడుతుంది. ఇది విమాన నియంత్రణ వ్యవస్థలతో పాట ఇతర ముఖ్యమైన భాగాలకు శక్తిని అందించి తిరిగి గాడిలో పడేందుకు ఉపకరిస్తుంది. విమానంలో ఆటోమేటిక్గా పని చేసే RAT.. డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం, విద్యుత్ వైఫల్యం లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ RAT ఎంతవరకూ పని చేసిందనేది ప్రధాన ప్రశ్న. గేర్లను విస్తరించడానికి లేదా ఉపసంహరించుకోవడంతో పాటు విద్యుత్ శక్తిని పునరుద్ధరిస్తుంది. కీలకమైన విద్యుత్ వ్యవస్థలను నిర్వహించడంలో సహాయపడటానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన RAT.. ఇప్పుడు దర్యాప్తులో కీలకం కానుంది. విమాన ప్రమాదం జరిగే సమయంలో RAT యాక్టివేట్ అయ్యిందనే చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రమాద ఘటన వీడియోల్లో కూడా కనిపించింది. అయితే విమానం గాల్లోకి టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలోనే కూలిపోవడంతో RAT యాక్టివేట్ అయినా అది విఫలంగానే మిగిలిపోయిందనేది మరో వాదన. టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు
ఎన్ఆర్ఐ

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం

Indian Student In USA: బేడీలేసి.. బలంగా అదిమిపట్టి
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కార్ కర్కశ వైఖరి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యవహారం ఆలస్యంగా మీడియాకు బహిర్గతమైంది. విద్యార్థిని నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి, దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విద్యాభ్యాసం కోసం తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఒక ప్రవాసభారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక భారతీయ యువకుడిని నెవార్క్ ఎయిర్పోర్ట్కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. నేనే తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కిందపడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. ‘‘ నేరస్తుడిలా సంకెళ్లు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలివేసింది. కలలను నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చిఉంటాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టకపోయినా ఇలా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూస్తూకూడా నేను నిస్సహాయుడినైపోయా. నా హృదయం ముక్కలైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను ఇలా బలవంతంగా పంపేయడం నిజంగా పెద్ద విషాదం. ఆ అబ్బాయి హరియాణా యాస అయిన హర్యాణ్వీలో మాట్లాడుతున్నాడు. ‘‘నాకేం పిచ్చిలేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడిని అని అందర్నీ న మ్మించేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ విద్యార్థి అరవడం ఆ వీడియోలో కనిపించింది. Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ఇండియన్ ఎంబసీ ఆదుకోవాలి‘‘ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్ ఎయిర్పోర్ట్లో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది’’ అని జైన్ రాసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విదేశీ విద్యార్థుల వీసా గడువును ముగించేసి వాళ్లను బలవంతంగా దేశబహిష్కరణ చేస్తున్న వేళ తాజాగా ఈ ఘటన జరగడం గమనార్హం. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ విద్యార్థులను గుర్తించి గెంటేస్తున్న ఉదంతాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువయ్యాయి.

Junicorn Summit 2025: అంతర్జాతీయ వేదికపై పల్లె బాలల ప్రతిభ
సాన్ మార్కస్, టెక్సాస్: టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన ISF గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ AI సమ్మిట్ 2025 చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్కి చెందిన గ్రామీణ ప్రాంతాల నుండి ఎంపికైన 50 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో చిన్నారులు రూపొందించిన ఆవిష్కరణలు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమ్మిట్కు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ISF) ఆధ్వర్యం వహించగా, వ్యవస్థాపకుడు డా. జె.ఎ. చౌదరి దూరదృష్టితో, ISF USA అధ్యక్షుడు అట్లూరి సమన్వయ నాయకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులకు విమాన ప్రయాణం, నివాసం, వర్క్షాపులు, డెమో డే వంటి సౌకర్యాలు ఉచితంగా అందించారు.ప్రత్యక్షంగా ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలుNaturaShe: బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్స్ – గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం రూపొందించిన ప్రయోగం.Sense Vibe: దివ్యాంగుల కోసం రూపొందించిన నావిగేషన్ పరికరం.Jalapatra: తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరంNGreenTech: ఈ-వేస్ట్ రీసైక్లింగ్ మోడల్.. వీటికి తోడు మరెన్నో ఆవిష్కరణలకు ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్, బ్రేకిత్రూ థింకర్, ప్రోటోటైప్, స్టోరిటెల్లింగ్ విభాగాల్లో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డుగత నెలలో ఆకస్మికంగా కన్నుమూసిన రామ్ పుప్పాల జ్ఞాపకార్థం ‘రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ISF USA అధ్యక్షుడు అట్లూరి ప్రకటించారు.లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు – 2025ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి గౌరవప్రదంగా అవార్డులు అందజేశారు.జయ్ తల్లూరి – ఇన్ఫ్రా & సామాజిక అభివృద్ధి,ప్రసాద్ గుండుమోగుల – డిజిటల్ ట్రావెల్ టెక్నాలజీ,స్వాతి అట్లూరి – కళా, సాంస్కృతిక సేవలు,నిశిత్ దేశాయ్ – న్యాయ రంగ మార్గదర్శకత, లాక్స్ చెపూరి – ఇన్నోవేషన్ అవార్డు – టెక్ టాలెంట్ డెవలప్మెంట్.పద్మా అల్లూరి, ప్రకాశ్ బొద్ధాలు ఈవెంట్ యాంకర్లు వ్యవహరించగా, డా. మహేష్ తంగుటూరు, సత్యేంద్ర, శేషాద్రి వంగల, విశాలా రెడ్డి నిర్వాహణలో ముఖ్యపాత్ర వహించారు. వందలాది వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు కలిసి ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మిట్ అనంతరం విద్యార్థులు NASA స్పేస్ సెంటర్, Texas Science Museum, డల్లాస్, ఆస్టిన్ పరిధిలోని ఇన్నోవేషన్ హబ్లను సందర్శించే అవకాశం పొందారు. ఫాలో-అప్ మెంటారింగ్, పెట్టుబడులు, స్టార్టప్ స్కేలింగ్ అవకాశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.విజన్ 2030 – లక్ష్యంISF ప్రకటించిన దీర్ఘకాలిక విజన్ ప్రకారం, 2030 నాటికి లక్ష మంది గ్రామీణ యువ స్టార్టప్ వ్యవస్థాపకులను రూపొందించాలనే ధ్యేయంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు – ఒక సామాజిక ఆవిష్కరణ ఉద్యమం. ISF అధికారికంగా ప్రకటించిన ప్రకారం, జ్యూనికార్న్ సమ్మిట్ 2026 ను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు.

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్

భర్తను కాదని.. వేరే వ్యక్తితో పరిచయం..!
భీమునిపట్నం: భీమిలిలో నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మంగళవారం బీచ్రోడ్డులోని జీడి తోటలో శవమై కనిపించింది. కృష్ణాకాలనీకి చెందిన బంగారు కవిత (28) గత నెల 10న సరకులు తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త పైడిరాజు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవిత అదృశ్యంపై ఆమె భర్త, కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. కాగా.. బీచ్రోడ్డులోని మార్లిన్ కే రెస్టారెంట్ ఎదురుగా ఉన్న జీడి తోటలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న మహిళ తల, వేరుపడిన శరీరం ఉండడాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ తిరుమలరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.హత్య? ఆత్మహత్య? కవిత మృతి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తేలాల్సి ఉంది. అదృశ్యమైన ఒకటి, రెండు రోజుల్లోనే ఆమె చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. మంగళవారం వరకు మృతదేహం ఎవరికీ తెలియకపోవడంతో తల నుంచి శరీరం నేల మీద పడిపోయి, బాగా పాడైపోయిన స్థితిలో ఉంది. దీంతో పోస్టుమార్టంను అక్కడే నిర్వహించారు.పోలీసుల దర్యాప్తులో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఏదైనా గొడవలు జరిగి ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు బీచ్రోడ్డులో నిరసన తెలిపారు.

నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి..
సంగీత ప్రపంచంలో పాపులారిటీ సంపాదించుకుంటోందనుకున్న సమయంలోనే.. ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని.. హత్య చేశారనే విషయం బయటపడడంతో అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రముఖ హర్యానా మోడల్ శీతల్ చౌద్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి.. గొంతుకోసి హత్య చేశాడని క్రైమ్బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. ఆపై ఘటనను ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. నిందితుడు సునీల్ తన నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. హర్యానా మోడల్ అయిన శీతల్ చౌద్రీ.. అక్కడి మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువుల అమ్మాయిలతో పానిపట్ సత్కర్తర్ కాలనీలో నివసించసాగింది. అయితే జూన్14వ తేదీన ఓ ఆల్బమ్ షూట్కు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్లౌదా పీఎస్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు.. ఆదివారం(జూన్ 15న) ఓ కాలువలో ఆమె ప్రయాణించిన కారు కొట్టుకువచ్చింది. అయితే అందులో ఆమె మృతదేహాం లేదు. ఆ మరుసటిరోజు.. కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్ మృతదేహామేనని నిర్ధారించుకున్నారు. ఈలోపు.. ఆమె ప్రియుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోస్ట్మార్టం నివేదికలో ఆమె గొంతు, శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేలింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన హర్యానా క్రైమ్ బ్రాంచ్ విభాగం.. చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్ను గట్టిగా విచారించడంతో విషయం బయటకు వచ్చింది. శీతల్ గతంలో సునీల్ పని చేసిన ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా పని చేసింది. వీళ్ల మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్ ఐదు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తాబిడ్డలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్ శీతల్కు ప్రపోజ్ పెట్టారు. ఈలోపు సునీల్కు ఇదివరకే పెళ్లైందని.. ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. తన పరువును బజారున పడేస్తుందన్న భయంతో.. మాట్లాడుకుందామని శీతల్ను పిలిచాడు సునీల్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు. నిందితుడు సునీల్ నేరం అంగీకరించడంతో.. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 14వ తేదీ.. పానిపట్లో శీతల్ ఆల్బమ్ షూటింగ్.. ఆపై సునీల్తో ఔటింగ్. అర్ధరాత్రి దాకా కలిసి తాగిన శీతల్-సునీల్. ఆపై తన సోదరికి కాల్ చేసి సునీల్ దాడి చేస్తున్నాడని చెప్పిన శీతల్. కాల్ కట్ కావడంతో కంగారుపడిపోయిన శీతల్ సోదరి. జూన్ 15వ తేదీ.. మిస్సింగ్ కేసు నమోదు. పోలీసులు ఎంక్వైరీ. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ను ప్రశ్నించిన పోలీసులు. తాము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, తాను ఈత కొడుతూ బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరానని, శీతల్ కారుతో సహా కొట్టుకుపోయిందని సునీల్ వాంగ్మూలం. శీతల్ ప్రయాణించిన కారు స్వాధీనం.జూన్ 16వ తేదీ.. శీతల్ మృతదేహాం లభ్యం. పోస్ట్మార్టం నివేదికలో హత్య జరిగిందని నిర్ధారణ.జూన్ 17వ తేదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ నేరాంగీకరణ. ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధింపు.CCTV Footage में आखिरी बार अपने Boyfriend के साथ दिखी Haryana Model sheetal । India News Haryana #haryananews #crimenews #cctv #model #sheetalchaudhary #mudercase #boyfriendexpose #boyfriendgirlfriend #viralvideo #ytshorts #breakingnews #latest pic.twitter.com/0yGuANnWns— India News Haryana (@indianews_hr) June 17, 2025Video Credits: India News Haryana

పెళ్లయిన నెల రోజులకే మృత్యు ఒడికి..
గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాదరూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి..కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ములగాడ మీదుగా పోర్టు రోడ్లోని మారుతీ సర్కిల్ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

ఇంటర్లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య
నస్పూర్/అక్కన్నపేట(హుస్నాబాద్)/జహీరాబాద్ టౌన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లోని జయశంకర్ కాలనీలో నివాసం ఉండే కోటేజీ కృష్ణార్జునరావు, ప్రవీణ దంపతుల చిన్న కూతురు అక్షయ సెకండియర్ గణితం ఫెయిల్ కాగా సప్లిమెంటరీ పరీక్ష రాసింది. సోమవారం వెలువడిన ఫలితాల్లోనూ పాస్ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ ఫ్యాన్కు ఉరేసుకుంది. తండ్రి గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్తండా గ్రామానికి చెందిన గుగులోతు కవిత–సూర్యనాయక్ దంపతుల రెండవ కుమార్తె హారిక (17) హనుమకొండ జిల్లా వంగర గురుకులంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాటనీ సబ్జెక్ట్లో ఫెయిలైంది. తిరిగి సప్లిమెంటరీ రాసినా పాస్ కాకపోవడంతో సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. రాయికోడ్ మండలం మహబత్పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ కుమారుడు వెంకటరమణ(18)ఆర్ఎల్ఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లోనూ ఒక సబెక్టులో ఫెయిల్ కావడంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.