Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Palnadu Rentapalla Visit Updates1
Updates: మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం

పల్నాడు పర్యటనకు వైఎస్‌ జగన్‌.. అప్‌డేట్స్‌ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం:మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదంపల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారీకేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు వాహనాలు,కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని కోరిన అంబటి రాంబాబు బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల ఓవరాక్షన్‌ అంబటి రాంబాబుతో వ్వాగాదానికి దిగిన పోలీసులు కాసేపట్లో సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వైఎస్‌ జగన్‌పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్‌విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లిపరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రిపల్నాడు..పల్నాడు జిల్లాలోకి వైఎస్‌ జగన్ప్రభంజనంగా మారిన పల్నాడు ఎంట్రన్స్కంటెపూడి వద్ద జనసందోహంవైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన పల్నాడు ప్రాంత మాజీ ఎమ్మెల్యేలుగోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ స్వాగతం..పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కంటెపూడిమేడికొండూరు చేరుకున్న వైఎస్ జగన్భారీగా తరలివచ్చిన తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలుమండుతున్న ఎండలోనూ జగన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వృద్దులుభారీ బైకు ర్యాలీతో జగన్ కాన్వాయ్ ని తీసుకెళ్తున్న యూత్పల్నాడు..పల్నాడు జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్పేరేచర్ల జంక్షన్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్భారీ జనసందోహంతో కిటకిటలాడుతున్న పేరేచర్లజై జగన్, జైజై జగన్ నినాదాలతో మార్మోగుతున్న జంక్షన్అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్జగన్ పర్యటనలో కనపడని పోలీసులు!వైఎస్‌ జగన్‌ పల్నాడు రెంటపాళ్ల పర్యటనపోలీసులమయంగా సత్తెనపల్లి నియోజకవర్గంఆంక్షల పేరుతో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన పోలీసులుకానీ.. జగన్‌ పర్యటనలో కనబడని పోలీసులుజగన్‌ కాన్వాయ్‌కు రోడ్ క్లియర్ చేయని పోలీసులుమాజీ సీఎం హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్జగన్ కాన్వాయ్ కి ముందు కనపడని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీకాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనపడని ఖాకీలుజగన్ కాన్వాయ్‌కి ముందు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేస్తున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని గుంటూరు శివారు నల్లపాడు చేరుకున్న వైఎస్ జగన్జైజగన్ నినాదాలతో మార్మోగుతున్న నల్లపాడుమహిళలు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న నల్లపాడు మిర్చి మార్కెట్ యార్డు దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్న కేడర్జనసంద్రం నడుమ నెమ్మదిగా..కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లుఅడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రంచుట్టుగుంట సెంటర్‌లో జగన్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్‌ జగన్‌ కాన్వాయ్వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్‌పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్మహిళలు, పార్టీ కేడర్‌తో రోడ్లన్నీ ఫుల్రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులుపల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండజగన్‌ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలువైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంఅయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులుపోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలుజగన్‌ వెంటే జనం అని మరోసారి రుజువుచంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్‌కాదు: ఆర్కే రోజాజగన్‌ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందనసీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్నగతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవాల‌ని చూడ‌డం ఏ మాత్రం క‌రెక్టు కాదు మీ ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, ఆయ‌న కుటుంబాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్య‌ర్త‌లు చ‌నిపోయిన‌ప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాల‌ను ప‌రామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్‌సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు జగన్‌ కాన్వాయ్‌ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులుబైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులుపోలీసులతో పార్టీ కేడర్‌ వాగ్వాదంగుంటూరులో జగన్‌కు ఘన స్వాగతంగుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతంభారీగా బైక్ ర్యాలీతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలుజై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్‌పురం రోడ్డుఅడుగడుగునా ఆంక్షలు, అయినా..సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతిజగన్‌ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలునరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలురెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులుఆధార్‌ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనంగ్రామస్తులకు సైతం ఆధార్‌ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులుఅయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానంజగన్‌ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులుకాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నంప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్‌కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ కేడర్సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్‌దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులుమధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేతదారిపొడవునా అభిమానమే.. వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటనగుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్అడుగడుగునా అపూర్వ స్వాగంపార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీభారీగా తరలివచ్చిన కార్యకర్తలుదారిపొడవునా జై జగన్‌.. జైజై జగన్‌ నినాదాలుఏ రోడ్డు చూసినా జగన్‌కు ఉప్పొంగిన అభిమానందారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనంమార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్‌మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్‌ జగన్‌వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటనపోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగన్‌జగన్‌ పర్యటనపై పచ్చ కుట్రలుపర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావుమా బంధువులను కూడా అడ్డుకుంటున్నారుపరామర్శకు అనుమతి తీసుకున్నారుమీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండిఆంక్షలను లెక్కచేయకుంలడా.. జగన్‌ కోసం జనంపల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులుపోలీస్‌ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనంపొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపుఆధార్‌ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడిరెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్‌పోస్టులు పెట్టారు. ప్రతీ రెండు కిలోమీటర్‌కు ఓ చెక్‌పోస్టుపోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌జగన్‌ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం పోలీస్‌మయంగా మారిపోయిన పల్నాడుపల్నాడులో ఇవాళ వైఎస్‌ జగన్‌ పర్యటనసత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్‌సీపీ అధినేత పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావుబాధిత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శజగన్‌ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలుపోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లాసత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులువైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఆంక్షలుజగన్‌ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలుజగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

UP Father And Son Selected Constable Job Viral Story Details2
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్‌ జాబ్‌ కొట్టాడు

అతనికి పోలీస్‌ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్‌ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్‌లో) 60 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. ఆ పరీక్షలో యశ్‌పాల్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్‌లో ఆయన కొడుకు శేఖర్‌(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్‌. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్‌పాల్‌ స్వస్థలం హపూర్‌ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్‌పూర్‌ ఉదయ్‌రాంపూర్‌ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్‌ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాడు. రెండు అటెంప్ట్‌లలో జాబ్‌ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్‌ తర్వాత వలంటీర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ విడుదలదైంది. అప్పటికి ఇంటర్‌ పూర్తి చేసిన యశ్‌ పాల్‌ పెద్ద కొడుకు శేఖర్‌ ఈ పరీక్షకు ప్రిపేర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్‌ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్‌ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్‌పాల్‌ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్‌ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్‌ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్‌పాల్‌కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్‌ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృ‍త్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్‌, న్యూమరికల్‌ రీజనింగ్‌ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యారు. లోకల్‌గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్‌తో.. యూపీ కానిస్టేబుల్‌ పరీక్షతో పాటు సీడీఎస్‌, ఎస్సై ఎగ్జామ్‌లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్‌లీక్‌ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్‌ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్‌ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్‌ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్‌ 15వ తేదీన) జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో అమిత్‌షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్‌జహాన్‌పూర్‌కు యశ్‌పాల్‌, బరేలీకి శేఖర్‌ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్‌పాల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

govt introduced FASTag based Annual Pass priced at Rs 30003
Fastag: వార్షిక టోల్‌ పాస్‌ను ప్రకటించిన కేంద్రం

టోల్‌ గేట్‌ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటివరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా, ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. పాస్‌ యాక్టివేషన్, రెన్యువల్‌ కోసం ప్రత్యేక లింక్‌ను త్వరలో రాజ్‌గార్‌ యాత్ర యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్‌టీహెచ్‌ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు.Important Announcement 📢 🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025ఇదీ చదవండి: ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపదఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. పరిమిత కాలంపాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్‌ గేట్ల వద్ద వెయిటింగ్‌ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది.

PM Modi Tells Trump On Phone Over Pak India Mediation4
మీ ప్రమేయం లేదు.. ఇక మీదట ఉండబోదు కూడా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్‌ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇక మీదట కూడా ఉండబోదని ట్రంప్‌నకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్‌ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు ఫోన్‌ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి.. దానికి ప్రతిగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను మోదీ ట్రంప్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే.. మోదీ ట్రంప్‌తో మాట్లాడుతూ.. పహల్గాం, ఆపరేషన్‌ సిందూర్‌ పరిణామాల సమయంలో భారత్‌-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్‌పాక్‌ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్‌ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్‌ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్‌లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్‌ ఉగ్రవాదంపై భారత్‌ జరిపే పోరునకు అమెరికా మద్ధతు ఉంటుందని తెలిపారు. ట్రంప్‌-మోదీ మధ్య ఫోన్‌ కాల్‌ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫోన్‌ కాల్‌ ద్వారా ట్రంప్‌ మోదీకి సంతాపం తెలియజేశారని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదేనని మిస్రీ తెలిపారు. అయితే కెనడా పర్యటన ముగిచుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్‌ మోదీని ఆహ్వానించగా.. షెడ్యూల్‌ ప్రకారం తాను రాలేనని మోదీ తెలిపినట్లు సమాచారం. భారత్‌లో జరిగే క్వాడ్‌ తదుపరి సమావేశం కోసం ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్‌లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారుఇదిలా ఉంటే.. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్‌ ప్రకటించుకోవడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌ ప్రకటనపై స్పష్ట త ఇవ్వాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్‌ చేశాయి కూడా.

Woman Urges Digital Checks Before Marriage Goes Viral On Socialmedia5
అమ్మాయిలూ.. బహుపరాక్‌!

వివాహం అంటే నూరేళ్ల పంట. తమ పిల్లలు నిండు నూరేళ్లు ఆనందదాయకమైన జీవితం గడపాలని ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల గురించి ఆరాలు తీస్తారు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండి, ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్నెట్‌ జమానాలో ఇవి మాత్రమే సరిపోదని అంటోంది ఓ అమ్మాయి. ఆ యువతి పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వ్యక్తిది మంచి ఉద్యోగం. మంచి కుటుంబ నేపథ్యం. అందుకే ఇంట్లో వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. అయితే అతడి గురించి కుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. నా స్నేహితుడి ఐడీతో ఆన్‌లైన్‌లో అతనితో చాట్‌ చేశా. అలా.. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా అతను వ్యవహరించే తీరు బయటపడింది. అతని తీరు నన్ను కంగుతినేలా చేసింది. కాబోయేవాడు మంచి సంపాదనపరుడైతే చాలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అయినా కూడా సరిపోదు. అంతరంగికంగా అతడి తీరు ఎలా ఉంటుందనే చెప్పి డిజిటల్‌ తనిఖీలు కూడా అత్యంత ముఖ్యమే. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని నా కుటుంబ సభ్యులకు వివరించి చెప్పా. అతనితో నా పెళ్లి రద్దు చేయించుకున్నా అని ఆమె ఆ పోస్టులో వివరించింది. అందువల్ల.. అమ్మాయిలూ బహుపరాక్‌. పెద్దలు కుదిర్చిన సంబంధాలపై గౌరవం ఉంటే సరిపోదు. నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలంటే అతని డబ్బు, స్టేటస్‌ కంటే అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే డిజిటిల్‌ తనిఖీ అనేది ఈ కాలంలో అత్యంత ముఖ్యం. అంటూ ఆ యువతి పోస్ట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈరోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ అయినవాళ్లతోనే, బంధువులతోనో అయిపోతోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ తరహా విచారణలోనూ మార్పులు కూడా తప్పనిసరి అని ఓ వ్యక్తి కామెంట్‌ చేశారు. సోషల్‌ మాధ్యమాల పరంగా అబ్బాయి మంచోడు అనుకుంటేనే.. పెళ్లికి సుముఖత చూపాలని, లేదంటే వద్దని సూచిస్తోంది ఆ అమ్మాయి. డిజిటల్‌ తనిఖీలు కూడా ముఖ్యమే అని మరో యువతి వ్యాఖ్యానించింది. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!)

Jayaram Case Updates: Supreme Court Raps TN Madras High Court6
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్‌కు ఊరట

న్యూఢిల్లీ: తమిళనాడు అడిషనల్‌ డీజీపీ హెచ్‌ఎం జయరామ్‌(HM Jayaram)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టు వ్యవహారంలో మద్రాస్‌ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. కిడ్నాప్‌ కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్‌ చేయాలని ఆదేశించడం ఏమేర సహేతకమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్‌ను వేటును ఎత్తేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.మద్రాస్‌ హైకోర్టు(Madras HC) తన అరెస్ట్‌కు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జయరామ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిన్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. జయరామ్‌ తరఫు న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు. తన క్లయింట్‌ జయరామ్‌ను అరెస్ట్‌ అయిన వెంటనే కస్టడీలోకి తీసుకున్నారని, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్‌ వేసిన 24 గంటల తర్వాతే విడుదల(జూన్‌ 17న) చేశారని బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం బెంచ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక అధికారిని అయోమయమైన ఆధారాల ఆధారంగా అరెస్ట్‌ చేయమని చెప్పడం ఏంటి?. ఇది ఎటువంటి న్యాయ ప్రక్రియకు సరిపోతుంది?. ఇది పరిపాలనా వ్యవస్థపైనా ప్రభావం చూపించే అంశమే కదా. అధికారులపై ఇలాంటి చర్యలు మానసికంగా దెబ్బతీసేలా ఉంటాయి’’అని అభిప్రాయపడింది.అదే సమయంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేసిన తమిళనాడు ప్రభుత్వంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆయన్ని సస్పెండ్‌ చేయాల్సిన అవసరం ఏముంది?. విచారణకు సహకరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం ఏంటి?.. సస్పెన్షన్‌ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోండి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడీజీపీ జయరామ్‌ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు వద్ద బాలుడి కిడ్నాప్ కేసులో గత సోమవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్‌మూర్తిపై కూడా ఆరోపణలున్నాయి. కోర్టు విచారణకు జయరామ్‌ హాజరు కాగా.. ఆ ప్రాంగణంలోనే ఆయన్ని అరెస్ట్‌ చేశారు. అరెస్టు అనంతరం ఏడీజీపీ జయరామన్‌ను హోంశాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ సమయంలో.. ఈ కిడ్నాప్‌ కేసులో ఎమ్మెల్యే, పోలీస్‌ ఉన్నతాధికారి తీరుపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (Kangaroo Courts)నడిపించడమేంటని? జగన్‌మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేసింది.అలాగే.. ఏడీజీపీ జయరామన్‌ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. జగన్‌మూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.జరిగింది ఇదే.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన ధనుష్‌(22) అనే యువకుడ్ని ఓ యువతి వివాహం చేసుకుంది. ఆ యువకుడిని పట్టుకుని తన కూతురిని తిరిగి తనకు అప్పగించాలంటూ ఆమె తండ్రి వనరాజా మాజీ కానిస్టేబుల్‌ అయిన మహేశ్వరి సాయం కోరాడు. దీంతో ఆమె ఏడీజీపీ జయరామ్‌ను సంప్రదించింది. ఆపై ఆ పంచాయితీ పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్‌మూర్తి చెంతకు చేరింది. ఈ క్రమంలో ధనుష్‌ కనిపించకపోవడంతో అతని 16 ఏళ్ల సోదరుడిని అమ్మాయి కుటుంబం కిడ్నాప్‌ చేశారు. అయితే ఈ కేసులో ఒత్తిళ్ల నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని ఓ హెటల్‌ వద్ద వదిలేసి వెళ్లారు. అయితే ఆ బాలుడ్ని వదిలేసిన వాహనం ఏడీజీపీ జయరామ్‌ అధికారిక వాహనం కావడం, పైగా అందులో వనరాజా, మహేశ్వరి ఉండడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

India VS England Test Series Will Be Telecast On DD Sports For Free7
ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. భారత్‌లో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్‌ 20 నుంచి లీడ్స్‌ (హెడింగ్లే) వేదికగా తొలి టెస్ట్‌ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.ఈ మ్యాచ్‌ భారత్‌లో సోని స్పోర్ట్స్‌ నెటవర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ జియో హాట్‌స్టార్‌ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లో జరుగుతుంది. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఇవే నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.ఈ సిరీస్‌కు ముందు భారత్‌లో ఉన్న క్రికెట్‌ అభిమానులకు శుభవార్త అందింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ డిడి స్పోర్ట్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఛానెల్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌ మొత్తాన్ని ఉచితంగా వీక్షించవచ్చు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌..జూన్‌ 20-24- తొలి టెస్ట్‌ (లీడ్స్‌)జులై 2-6- రెండో టెస్ట్‌ (బర్మింగ్హమ్‌)జులై 10-14- మూడో టెస్ట్‌ (లార్డ్స్‌)జులై 23-27- నాలుగో టెస్ట్‌ (మాంచెస్టర్‌)జులై 31-ఆగస్ట్‌ 4- ఐదో టెస్ట్‌ (కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌) ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌, అభిమన్యు ఈశ్వరన్‌, యశస్వి జైస్వాల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌భారత్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

Peshawar to Quetta Jaffar Express derailed Near Jacobabad8
పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. సింధ్‌ ప్రావిన్స్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై బుధవారం ఉదయం పేలుళ్లు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పాకిస్తాన్‌కు చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పేలుడు కారణంగా మూడు అడుగుల మేర గుంత పడినట్లు ధ్రువీకరించిన పోలీసులు. కాగా, సదరు రైలు.. బలూచిస్తాన్‌లోని రెసిడెన్షియల్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి పెషావర్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. రైలు ఆగిపోయిన అనంతరం, ప్రయాణీకులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. بلوچستان کے علاقے بولان پمپ کے صدر تھانے کی حدود میں ریلوے ٹریک پر دھماکے کے نتیجے میں جعفر ایکسپریس کی چھ بوگیاں پٹری سے اتر گئیں۔An explosion on the railway track in Balochistan's Bolan Pump area caused six carriages of the Jaffar Express to derail. pic.twitter.com/S9CBiMLknR— Brahag Baluch (@brahagbaluch) June 18, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ రైల్వేస్‌కు చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ మధ్య నడుస్తుంది. దాదాపు 34 గంటల 10 నిమిషాల్లో 1,632 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అయితే, జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలునే ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. క్వెట్టాకు దక్షిణంగా ఉన్న పర్వత ప్రాంతం సమీపంలో వందలాది మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. పాకిస్తాన్‌ ఆర్మీకి భద్రతా సిబ్బందిని బీఎల్‌ఏ దళాలు హతమార్చాయి.NEWSFLASH: Four bogies of the Peshawar to Quetta Jaffar Express derailed after an explosion near Jacobabad. No casualties reported. The Jaffar Express was hijacked by terrorists earlier in the year near Sibi. pic.twitter.com/cLQaZREBhM— Khabar Kada (@KhabarKada) June 18, 2025

Suresh Gopi: Simran faced similar treatment as Anupama Parameswaran in Mollywood9
అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్‌ హీరోయిన్లకూ అదే కర్మ?

అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్‌కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.నటన రాదని హేళనఅనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్‌లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్‌ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్‌ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్‌ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్‌ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.ఆ హీరోయిన్ల విషయంలోనూ..ఒకప్పుడు హీరోయిన్‌ సిమ్రాన్‌ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్‌ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. ‍కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్‌, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ జూన్‌ 27న విడుదల కానుంది.సినిమాఅనుపమ విషయానికి వస్తే.. నివీన్‌ పౌలీ 'ప్రేమమ్‌' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్‌', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్‌, 18 పేజీస్‌, టిల్లు స్క్వేర్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ, బైసన్‌, లాక్‌డౌన్‌, పరదా, పెట్‌ డిటెక్టివ్‌ చిత్రాలున్నాయి.చదవండి: హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం

Maharashtra 3rd Language Notification Hindi Not Mandatory10
Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’

ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్‌ జారీ చేసింది.ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement