బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ ఫోటోగ్రాఫర్ను పిలిచి కెమెరాలోని ఫోటోలను చూపించమని అడిగిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్తో కలిసి మనీశ్ మల్హోత్రా ఇచ్చిన డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. ఐష్కు మల్హోత్రా మంచి స్నేహితుడే కాకుండా తన తదుపరి చిత్రం ఫన్నె ఖాన్ చిత్రానికి కూడా డిజైనర్గా ఉన్నాడు. మల్హోత్రా ఇచ్చిన పార్టీకి దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా వెళ్లాడు.