Abhishek Bachchan
-
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
బాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇవాళ అభిషేక్ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. మీకు ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యం, ప్రేమతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే అభిషేక్ బచ్చన్.. గతేడాది ఐ వాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో అభిషేక్ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.ఐశ్వర్య రాయ్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఇందులో చియాన్ విక్రమ్, రవి మోహన్, శోభితా ధూళిపాల, త్రిష కృష్ణన్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.ఐశ్వర్య- అభిషేక్పై రూమర్స్..కాగా.. గతేడాది అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా వేడుకలో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతకుముందు కూతురు ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట ఈ వార్తలపై స్పందించలేదు.జంటగా పార్టీకి హాజరుబాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాదిలో మరింత బలపడ్డాయి. కానీ వీరిద్దరు ఓ పార్టీలో ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. దీంతో విడాకుల రూమర్స్కు చెక్ పడింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
కెరీర్లో ఎక్కువ ఫ్లాపులే.. ఆస్తులు మాత్రం కోట్లలో..
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. చాన్స్ల కోసం ఏళ్లుగా ఎదురుచూసే వాళ్లు చాలానే ఉంటారు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లకి మాత్రం ఫస్ట్ చాన్స్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే..వాళ్లను కూడా పట్టించుకోరు. వారసత్వంగా వచ్చి.. వెనక్కి వెళ్లిన నటులు చాలా మందే ఉన్నారు. మరికొంతమందికి మాత్రం ఎన్ని ఫ్లాపులు వచ్చిన అవకాశాలు వస్తునే ఉంటాయి. వరుస సినిమాలు తీస్తూ కోట్ల ఆస్తులను కూడబెడుతుంటారు. అలాంటి వారిలో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఒక్కరు. ఆయన సీనీ కెరీర్లో అత్యధిక ఫ్లాపులే ఉంటాయి. కానీ ఆస్తుల విషయంలో మాత్రం స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గలేదు. నేడు(ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ బర్త్డే. ఈ సందర్భంగా ఆయన ఆస్తులపై ఓ లుక్కేద్దాం.విశాలవంతమైన విల్లాలుఅభిషేక్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లకు పైగా ఉంటుందట. ఇందులో ఎక్కువగా సొంతంగా సంపాదించుకున్నదే అట. తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తులు కలిపిస్తే..ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సినిమాలపై వస్తే డబ్బును ఎక్కువగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టాడట. అలాగే దుబాయ్లో ఓ విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశాడు. అభిషేక్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఉంటాడు. దీని ధర 16 కోట్ల రూపాయలు. ‘బాంద్రా-కుర్లా’ కాంప్లెక్స్, 5 BHK అపార్ట్మెంట్తో సహా అనేక ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఈ హీరోకి క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి. అందుకే జైపూర్ పింక్ పార్టనర్స్ (ప్రో కబడ్డీ), చెన్నైయిన్ FC (ఫుట్బాల్) పెట్టుబడి పెట్టారు.లగ్జరీ కార్లుఅభిషేక్ దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్ జీటీ(3.29 కోట్లు), ఆడి ఏ8ఎల్, మెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130X లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్పై కూడా భారీగా డబ్బు పెట్టాడల. ముంబైలో పలు చోట్ల ఓపెన్ ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారట. మొత్తంగా అభిషేక్ ఆస్తులు 280 కోట్లకు పైనే ఉంటుందట. అయితే భార్య ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)తో పోలీస్తే మాత్రం అభిషేక్ ఆస్తులు విలువ చాలా తక్కువేనట. ఐశ్వర్య మొత్తం ఆస్తుల విలువ రూ.776 కోట్ల వరకు ఉంటుందట.నటనకు ప్రశంసలు కానీ..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్.. కెరీర్లో ఎక్కువగా ఫ్లాపులనే చవి చూశడు. ఆయన తొలి సినిమా రెఫ్యూజీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే నటన పరంగా మాత్రం అభిషేక్కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అభిషేక్ నటించిన 8 సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. అయినా కూడా అభిషేక్ని చాన్స్లు వచ్చాయి. ధూమ్ సినిమాతో అభిషేక్కి తొలి బ్లాక్ బస్టర్ దక్కింది. బంటీ ఔర్ బబ్లీ మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్యాపులు వచ్చాయి. ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్, ఐ వాంట్ టు టాక్ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన గులాబ్ జామున్, డ్యాన్సింగ్ డాడ్తో పాటు ధూమ్ 4 చిత్రాల్లో నటిస్తున్నాడు. -
బర్త్డే స్పెషల్..అభిషేక్ బచ్చన్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మరోసారి ఢిల్లీ హైకోర్టుని(Delhi High Court) ఆశ్రయించింది. గతేడాదిలో తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కథనాలను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆరాధ్య పిటిషన్పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో గూగుల్కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆ వీడియోలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా, కొన్ని వెబ్సైట్లతో పాటు పలు సోషల్మీడియా ఖాతాలు వాటిని పాటించలేదు. దీంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది. (ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)గతేడాదిలో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే వార్తలను యూట్యూబ్ వేదికగా ప్రసారం చేశారు. ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆరాధ్య ఇక లేరంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యాజ్యం వేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తప్పు అని, ఇలాంటి చర్యలు సమాజంలో అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కోర్టు తెలిపింది. సమాజంలోని ప్రతి చిన్నారిని గౌరవంగా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం ఎట్టిపరిస్థితిల్లోనూ సహించదని కోర్టు పేర్కొంది. ఇలాంటి వీడియోలు గూగుల్ దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే తొలగించాలని న్యాయస్థానం తెలిపింది. అయితే, కొన్ని ఇంకా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తన తండ్రితో పాటు ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించడంతో గూగుల్కు మరోసారి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పిటిషన్పై విచారణ మార్చి 17న జరగనుందని తెలిపింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. -
అభిషేక్ బచ్చన్ మూవీతో ఏం చేయాలో దిక్కుతోచలేదు: డైరెక్టర్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గతేడాది ఐ వ్యాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతేడాది నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు సుజిత్ సిర్కార్ ఈ మూవీ పరాజయం గురించి మాట్లాడారు. ఈ సినిమా ఫలితం తనకు దిక్కుతోచని పరిస్థితి తీసుకెళ్లిందని అన్నారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు. ఐ వాంట్ టు టాక్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ థియేటర్లలో విఫలం కావడం తనను బాధించిందని సుజిత్ సిర్కార్ తెలిపారు.డైరెక్టర్ సుజిత్ సిర్కార్ మాట్లాడుతూ.. "నా నిబంధనల ప్రకారం.. నాకు ఉన్న దృష్టితో నేను సినిమాలు తీయగలిగినంత కాలం తీస్తూనే ఉంటా. ఇలాంటి పరాజయాలు కొన్నిసార్లు మమ్మల్ని కలవరపెడుతూనే ఉంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనే విషయం తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా. ఈ సినిమా ఫలితం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు నా సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలో చాలామంది ఆడియన్స్ స్పందించడం సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి చిత్రమనే నేను అనుకుంటున్నా.' అని అన్నారు.కాగా.. సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్పై రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ఓ ఎన్నారై పాత్రలో కనిపించారు. జీవితాన్ని మార్చే ఓ సర్జరీ చేయించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకునే ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం ఏకంగా బరువు కూడా పెరిగాడు. విభిన్నమైన పొట్టతో అభిషేక్ బచ్చన్ ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో అహల్య బమ్రూ, జయంత్ క్రిప్లానీ, జానీ లీవర్, పెర్లే డే, క్రిస్టిన్ గొడ్దార్డ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఐ వాంట్ టూ టాక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
అభిషేక్ బచ్చన్కు ఎస్బీఐ నుంచి భారీ ఆదాయం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.ఎస్బీఐ నుంచి నెలకు రూ.18లక్షలుదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.రూ.280 కోట్ల నెట్వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్బీఐ లీజుకు తీసుకుంది. -
సందడిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
క్రికెట్ లీగ్లో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) క్రికెట్ లీగ్లో పెట్టుబడులు పెట్టాడు. క్రీడా ఔత్సాహికుడైన బచ్చన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఐసీసీ అమోదం పొందిన ETPL ఈ ఏడాది లాంచ్ కానుంది. ఈ లీగ్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఆమ్స్టర్డామ్, రోట్టర్డామ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో నగరాలకు చెందిన ప్రాంచైజీలు బరిలో ఉంటాయి. ఈ లీగ్ జులై 15 నుంచి ఆగస్ట్ 3 మధ్యలో జరుగుతుంది. ఫ్రాంచైజీ పేర్లు, ఓనర్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.కాగా, అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ మరియు ఇండియన్ సూపర్ లీగ్లో (ఫుట్బల్) పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు లీగ్ల్లో బచ్చన్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాడు. ETPLలో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. ఈ లీగ్ మూడు దేశాల (ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్) క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు వస్తుందని అన్నాడు. ETPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుందని తెలిపాడు. క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇది సరిహద్దులను అధిగమించే ఏకీకృత శక్తి అని బచ్చన్ చెప్పుకొచ్చాడు. ETPLలో అభిషేక్ చేరిక ప్రధాన పెట్టుబడులను ఆకర్శిస్తుంది. ETPL యూరోపియన్లకు క్రికెట్ను మరింత చేరువ చేస్తుంది.ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ క్రికెట్ లీగ్ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ లీగ్ భారత్ వేదికగా జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్(BBL) ఎక్కువ ప్రజాధరణ ఉంది. వివిధ దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్లు..ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్)గ్లోబల్ టీ20 కెనడా (కెనడా)ఇండియన్ ప్రీమియర్ లీగ్ (భారత్)ఇంటర్నేషన్ లీగ్ టీ20 (దుబాయ్)లంక ప్రీమియర్ లీగ్మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్ఏ)నేపాల్ ప్రీమియర్ లీగ్పాకిస్తాన్ సూపర్ లీగ్SA20 (సౌతాఫ్రికా)సూపర్ స్మాష్ (న్యూజిలాండ్)టీ20 బ్లాస్ట్ (ఇంగ్లండ్) -
ఓటీటీలో అభిషేక్ బచ్చన్ సినిమా.. కానీ, షరతులు వర్తిస్తాయ్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన కొత్త సినిమా 'ఐ వాంట్ టు టాక్' ఓటీటీలోకి వచ్చేసింది. అభిషేక్ ప్రధాన పాత్రలో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామాగా గతేడాది నవంబర్ 22న విడుదలైంది. అయితే, థియేటర్స్లో పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. కానీ, సినిమా చూసిన కొందరు పాజిటివ్ రివ్యూలు ఇవ్వండంతో నెట్టింట కాస్త క్రేజ్ పెరిగింది. అయితే, చాలామంది ఈ చిత్రాన్ని ఓటీటీలో వచ్చాక చూడొచ్చు అనే అభిప్రాయం ఉన్నట్లు సోషల్మీడియాలో వెల్లడి అయింది.'ఐ వాంట్ టు టాక్' సినిమా ఆమెజాన్ ప్రైమ్లో తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సినిమా చూడాలంటే రూ. 349 చెల్లించాలని అమెజాన్ పేర్కొంది. అయితే, ఉచిత స్ట్రీమింగ్ విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా, ఇలా అద్దెకు ఉన్న సినిమాలు 30 రోజుల టైమ్లైన్ తర్వాత ఉచితంగా ప్రసారం చేయబడతాయి.అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ఎన్ఆర్ఐ అర్జున్ సేన్గా మెప్పించారు. తన డ్రీమ్ నిజమైన తర్వాత అకస్మాత్తుగా క్యాన్సర్ బారీన పడిన అర్జున్ ఆపై భార్యతో విడాకులు తీసుకోవడం. ఈ క్రమంలో తన కుమార్తెకు ఎదురైన కష్టం వంటి సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అర్జున్ కేవలం 100 రోజులు మాత్రమే జీవిస్తాడని వైద్యులు చెప్పడంతో ఆయన తన కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఎలాగైన క్యాన్సర్ నుంచి మరణాన్ని జయించాలని సుమారు 20 ఆపరేషన్స్ చేయించుకుంటాడు. అయితే, ఈ కథలో అర్జున్ సేన్ చివరికి ప్రాణాలతో బయటపడుతాడా..? ఆయన కుమార్తె పరిస్థితి ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్.. అభిషేక్తో సెల్ఫీలు
బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదైతే ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. వాళ్లు కలిసి ఉండట్లేదని, విడాకులు తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ట్రాష్.. అందులో నిజమే లేదని ఫోటోలతో సమాధానం చెప్పారు ఐష్- అభిషేక్.భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యవీరిద్దరూ తాజాగా ఓ పార్టీకి కలిసి వెళ్లారు. ఇద్దరూ నలుపు రంగు దుస్తులే వేసుకున్నారు. పార్టీలో ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ మేరకు ఓ ఫోటోను ఎంటర్ప్రెన్యూర్ అను రంజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. అందరూ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందించారు. నటి ఆయేషా జుల్క సైతం ఐష్ దంపతులతో దిగిన సెల్ఫీలు షేర్ చేసింది.ఐష్ చేస్తోందదేఇది చూసిన నెటిజన్లు చాలా బాగుంది.. ఈ ఒక్క ఫోటోతో చాలామంది మెదళ్లలో ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేశావు, ధైర్యవంతులైన వారు సమస్య నుంచి తప్పించుకోవడానికి విడాకులు ఎంచుకోరు. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ఈ దంపతులు కూడా అదే చేస్తున్నారు. ఐష్, తన తల్లితోపాటు భర్తతో కలిసి ఓ పార్టీకి వెళ్లడమే అందుకు నిదర్శనం అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anu Ranjan (@anuranjan1010) చదవండి: నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. అమలాపాల్ -
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
ఐశ్వర్య డ్రెస్సింగ్పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
విడాకుల వార్తల వేళ అభిషేక్ సంచలన కామెంట్స్
-
యూట్యూబర్గా సక్సెస్ అయ్యి..ఏకంగా బాలీవుడ్ మూవీ..!
పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అరోవిల్’నురహస్య నగరం అంటారు. కులం, మతం, డబ్బు లేకుండా కొంతమంది జీవించే ఇక్కడి నుంచే పెరిగి పెద్దదయ్యింది అహిల్య బామ్రూ. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్గా ఈమె చేసిన ‘ప్రయోగం’ సక్సెస్ అయ్యి బాలీవుడ్ దాకా చేర్చింది. ఇటీవల విడుదలయ్యి ప్రశంసలు పొందుతున్న‘ఐ వాంట్ టు టాక్’లో అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించింది. ‘అరోవిల్’లో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను తీర్చిదిద్దింది అంటున్న అహిల్య జీవితం ఆసక్తికరం.‘నేను ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కానేమో. ఆరోవిల్లో పెరగడం వల్ల నేను ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగాను’ అంటుంది అహిల్యా అమ్రూ. అహిల్యా గురించి చె΄్పాలంటే ఒక విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి చాలదు. ఆ అమ్మాయి గాయని, చిత్రకారిణి, డాన్సర్, నటి, వాయిస్ఓవర్ ఆర్టిస్ట్, డిజిటల్ క్రియేటర్...‘ఇవన్నీ నేను ఆరోవిల్లో ఉచితంగా నేర్చుకున్నాను. ఉచితంగా నేర్పించేవారు అక్కడ ఉన్నారు. బయట ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతిదానికీ డబ్బు కావాలి’ అంటుంది అహిల్య.ఇంతకీ ఆరోవిల్ అంటే? అదొక రహస్య నగరి. ఆధ్యాత్మిక కేంద్రం. లేదా భిన్న జీవన స్థావరం. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ 42 దేశాలకు చెందిన 3000 మంది పౌరులు జీవిస్తున్నారు. వారి పని? డబ్బు ప్రస్తావన లేకుండా జీవించడం. పండించుకోవడం, తినడం, పుస్తకాలు చదువుకోవడం, తమకు వచ్చింది మరొకరికి నేర్పించడం, మెడిటేషన్. వీరు చేసేవాటిని ‘గ్రీన్ ప్రాక్టిసెస్’. అంటే పృథ్వికీ, పర్యావరణానికీ ద్రోహం చేయనివి. అక్కడే అహిల్య పెరిగింది.స్వేచ్ఛ ఉంటుంది‘మాది ముంబై. నేను అక్కడే పుట్టా. ఆ తర్వాత మా అమ్మానాన్నలు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ నేను ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆరోవిల్కు మారాము. అక్కడ విశేషం ఏమిటంటే చదువులో, జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది.ఏది ఇష్టమో అది నేర్చుకుంటూపోవచ్చు. విసుగు పుడితే మానేయవచ్చు. బయట ప్రపంచానికి సంబంధం లేని పోటీతో జీవన శైలితో ఉండవచ్చు. ఇది అందరికీ సెట్ అవదు. కాని నాకు సెట్ అయ్యింది. నేను ఇక్కడ ఎన్నెన్ని నేర్చుకున్నానో చెప్పలేను. ఇక్కడ పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతితో ముడిపడి ఉండటం అంటే ఏమిటో తెలిసింది. భిన్న సంస్కృతులు, జీవితాలు తెలిశాయి. ఆరోవిల్ లక్ష్యం విశ్వమానవులను ఏకం చేయడం. ఇది చిన్న లక్ష్యం కాదు. మనుషులందరూ ఒకటే అని చాటాలి. బయట ఉన్న రొడ్డకొట్టుడు జీవితంతో, ΄ోటీతో విసుగుపుట్టి ఎందరో ఇక్కడకొచ్చి ఏదైనా కొత్తది చేద్దాం అని జీవిస్తున్నారు. ఆరోవిల్ మీద విమర్శలు ఉన్నాయి. ఉండదగ్గవే. కాని ఇది ప్రతిపాదిస్తున్న జీవనశైలి నచ్చేవారికి నచ్చుతుంది’ అంటుంది అహిల్య.రీల్స్తో మొదలుపెట్టి...వ్యంగ్యం, హాస్యం ఇష్టం అ«ధికంగా ఉన్న అహిల్య సరదాగా రీల్స్తో మొదలుపెట్టి డిజిటల్ క్రియేటర్గా మారింది. మన దేశానికి వచ్చిన విదేశీయులు ఆవును చూసి, గేదెను చూసి ఎంత ఆశ్చర్యపోతుంటారో అహిల్య చాలా సరదాగా చేసి చూపిస్తుంది. అందరి యాక్సెంట్, బాడి లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే వీడియోలకు ఫ్యాన్స్ కొల్ల. అందుకే అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలో నవంబర్ 22న విడుదలైన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ నటిగా మొదటి అడుగు వేయగలిగింది అహిల్య. ఈ సినిమాలో కేన్సర్ పేషంట్ అయిన సింగిల్ పేరెంట్ అభిషేక్ తన కూతురితో అంత సజావుగా లేని అనుబంధాన్ని సరి చేసుకోవడానికి పడే కష్టం, కూతురుగా అహిల్య పడే తాపత్రయం అందరి ప్రశంసలు పొదేలా చేశాయి. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా వైరల్ (ఫోటోలు)
-
విడాకుల రూమర్లు: హాట్ టాపిక్గా ఐష్-అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా
బాలీవుడ్లో అందమైన జంట అనగానే మొదటగా గుర్తొచ్చే పేర్లు అందాలతార స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, హీరో అభిషేక్ బచ్చన్. ఆర్థికంగా కూడా చాలా బలమైన జంట వీరిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఐష్, ఇంకా అభిషేక్ విడిపోతున్నారనే పుకార్ల మధ్య ఖరీదైన వారి దుబాయ్ విల్లా నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ లిస్ట్లో టాప్లో ఉండే ఐశ్వర్య.. కెరియర్ పీక్లో ఉండగానే 2007లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ను వివాహమాడింది. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. విలాసవంతమైన కార్లు, బంగ్లాలు, వ్యాపారాలతో ఐశ్వర్యరాయ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ దేశంలో అత్యంత ధనిక జంట అని చెప్పవచ్చు. సీఎన్బీసీ నివేదిక ప్రకారం, ఐశ్వర్య నికర విలువ రూ. 776 కోట్లుగా ఉండగా, అభిషేక్ బచ్చన్ రూ. 280 కోట్లు . 2015లో కొనుగోలు దుబాయ్విల్లా ఇపుడు హాట్ టాపిక్. దుబాయ్ విల్లాదుబాయ్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్లోని ఈ బంగ్లా సుమారు 16 కోట్ల రూపాయల విలువ చేస్తుంది ఈ లగ్జరీ బంగ్లా. అత్యాధునిక సౌకర్యాలతో శాంక్చురీ ఫాల్స్లో ఒక అందమైన విశాలమైన విల్లాను వీరు కొనుగోలు చేశారు. స్విమ్మింగ్ పూల్, ఆధునిక వంటగది, ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్, హోమ్ థియేటర్, విశాలమైన వాకింగ్ ట్రాక్ లాంటివి ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలో 5 విలాస వంతమైన బంగ్లాలు, ముంబైలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లలో అనేక ఖరీదైన అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. -
ఆ విషయంలో ఐశ్వర్యకి థ్యాంక్స్: అభిషేక్ బచ్చన్
‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేస్తున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలను నా భార్య ఐశ్వర్యా రాయ్ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. ఆ విషయంలో తనకు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని హీరో అభిషేక్ బచ్చన్ అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ–‘‘కుటుంబం విషయంలో ఐశ్వర్య ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఆమె వల్లే నేను సినిమాలపై పూర్తీగా దృష్టి పెడుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు.నేను పుట్టిన తర్వాత మా అమ్మ జయా బచ్చన్ సినిమాలు మానేశారు. భర్త, పిల్లలు, కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న అమితాబ్ బచ్చన్ సినిమాలతో బిజీగా ఉండి రాత్రి ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ నా స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్ కు, నా బాస్కెట్ బాల్ cటీలకు నాన్న వచ్చేవారు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి. అలాగే వారి నుంచి ప్రేరణ ΄పొందాలి. ప్రపంచంలోని తల్లిదండ్రులపై నాకు అమితమైన గౌరవం ఉంది.తల్లి బాధ్యతలు మరెవరూ చేయలేరు. తండ్రికి కూడా ఎంతో ప్రేమ, బాధ్యతలు ఉంటాయి. కానీ వాటిని పైకి చూపించడు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమవుతుంది’’ అని చె΄్పారు అభిషేక్. కాగా అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ మాటలతో ఆ వార్తలకు చెక్ పడిందని బాలీవుడ్ టాక్. -
కూతురు బర్త్ డేకు రాని అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్య విడాకులు కన్పర్మా?
-
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -16 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
గురునానక్ జయంతి: ప్రత్యేక ప్రార్థనలు, ప్రసాదం రెసిపీ షేర్ చేసిన బాలీవుడ్ నటి
కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి పర్వదినాన్ని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ జరుపుకుంది. ఈ శుభ సందర్భంగా స్వయంగా ఇంట్లోనే కడ ప్రసాదం(హల్వా) తయారు చేసి గురుద్వారాలో ప్రార్థనలు, నివేదన అనంతరం పంచిపెట్టింది. కుటుంబంలో తరతరాలుగా కడ ప్రసాదం తయారు చేస్తున్న వైనాన్ని వివరించి, ఈ రెసిపీ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. గురుద్వారాలో పూజల తరువాత మీడియాకు ప్రసాదాన్ని పంచిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.గురునానక్ జయంతి సందర్భంగా ప్రసాదం హల్వాను ఎలా తయారు చేయాలో దశలవారీగా నిమ్రత్ కౌర్ వెల్లడించింది. ఈ ప్రసాదం తయారు చేయడం తన తల్లి దగ్గరనుంచి నేర్చుకున్నట్టు తెలిపింది. అలాగే తన తాతగారు చాలా ఏళ్లు గురుద్వారాలో హల్వా తయారు చేసేవారనీ, ఆయన్నుంచి అమ్మ , అమ్మనుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది.కాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ అభిషేక్ బచ్చన్తో ఎఫైర్ ఉందనే పుకార్ల మధ్య గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మధ్య సమస్యలకు నిమ్రత్ కౌర్తో ఎఫైర్ ఒక కారణమని ఊహాగానాలు జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఊహిస్తున్నాయి. ఈ వివాదాలను, ఆరోపణల ప్రభావం తనమీద ఏమాత్రం పడకుండా నిమ్రత్ కౌర్ తన పని తాను చేసుకుపోతోంది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ
గత కొన్నాళ్లుగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల రూమర్స్ దీనికి కారణం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడిపోనున్నారనే టాక్ బాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు నిమ్రత్ కౌర్ అనే నటి కారణమని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది పక్కనబెడితే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఒకేసారి 10 ఫ్లాట్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ప్రభాస్ 'కల్కి'లో ఆశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ములంద్ ఏరియాలోని ఒబెరాయ్ రియల్టీ, ఒబెరాయ్ ఎటెర్నియాలో 10 ఫ్లాట్స్ ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.24.95 కోట్లు అని తెలుస్తోంది. అక్టోబర్ 9న రిజిస్టేషన్ జరిగిన ఈ కొనుగోలు కోసం కోటిన్నర వరకు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారట.ఈ పదింటిలో ఆరు అభిషేక్ పేరు మీద రిజిస్టర్ చేయించగా.. నాలుగింటిని అమితాబ్ పేరుపై రిజిస్టర్ చేయించారు. ఇకపోతే గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ దాదాపు రూ.200 కోట్ల మేర రియల్ ఎస్టేట్ కోసం డబ్బు పెడుతున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు పలు సినిమాలతో తండ్రికొడుకు ఫుల్ బిజీగా ఉన్నారు. విడాకులు రూమర్స్ కావొచ్చు, ఫ్లాట్స్ కొనడం కావొచ్చు, ఏదో రకంగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
ఇంట్లో ఇల్లాలు.. సెట్లో ప్రియురాలు.. అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ డివోర్స్ కన్ఫర్మ్
-
మరోసారి విడాకుల రూమర్స్.. అభిషేక్ రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిలోనూ వీరిద్దరు విడివిడిగా ఫోటోలకు ఫోజులివ్వడంతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అయితే తాజాగా అభిషేక్కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. దీంతో తమపై వస్తున్న విడాకాల రూమర్స్పై చివరికీ అభిషేక్ బచ్చన్ స్పందించాల్సి వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం. నాకు పెళ్లయింది క్షమించండి' అన్నాడు అతను తన ఉంగరాన్ని చూపించాడు. దీంతో తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. అభిషేక్, ఐశ్వర్య 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించారు. వీరిద్దరూ జంటగా ధాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, గురు, ధూమ్- 2, రావణ్ లాంటి చిత్రాల్లో నటించారు. -
ఐశ్వర్య-అభిషేక్ల విడాకుల రూమర్.. ఆ డాక్టరే కారణమా? (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్తో విడాకుల రూమర్స్..
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. ఈ జంటకు ఆరాధ్య అనే ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఐశ్వర్యరాయ్ ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు. తన అభిషేక్ బచ్చన్తో కలిసి పెళ్లి వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి.అయితే గత కొన్నేళ్లుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ బర్త్ డే రోజు ఆలస్యంగా విష్ చేయడంతో అప్పట్లోనే.. వీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆరాధ్య పుట్టినరోజు సైతం ఇలాంటి రూమర్స్ బీటౌన్లో వైరలయ్యాయి.తాజాగా అభిషేక్ బచ్చన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఐశ్వర్యరాయ్తో విడాకులు తీసుకుంటున్నట్లు అభిషేక్ మాట్లాడిన వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల సినీతారలపై డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో మరోసారి విడాకుల చర్చ మొదలైంది. అయితే ఇది ఫేక్ వీడియో అంటూ ఐశ్వర్య, అభిషేక్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by aishwaryafan (@aishwaryaraireall) -
ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా?
బాలీవుడ్ జంట ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారట! కొన్ని నెలల నుంచి ఈ వార్త జోరీగలా సోషల్ మీడియా అంతటా తిరుగుతోంది. కలిసి కనిపించకపోతే విడాకులనేస్తారా? మా కాపురంలో నిప్పులు పోస్తున్నారేంటని హీరో అభిషేక్ బచ్చన్ ఎప్పటిలాగే ఇటీవల సైతం మండిపడ్డాడు. తాము బాగానే ఉన్నామని తెలియజేస్తూ.. ఒకరి బర్త్డేకి మరొకరు ఆలస్యంగానైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.ఫంక్షన్కు వేర్వేరుగాఅయినా ఎక్కడో తేడా కొడుతుంది అని ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు. వీరి అనుమానాలను నిజం చేస్తూ ఐశ్వర్య తన కూతురు ఆరాధనను తీసుకుని అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లింది. అలా అని అభిషేక్ వెళ్లలేదా? అంటే వెళ్లాడు. తన తల్లిదండ్రులు జయ- అమితాబ్ బచ్చన్తో కలిసి ఫంక్షన్కు వెళ్లాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. కుటుంబమంతా కలిసి రాకుండా ఇలా సెపరేట్గా వచ్చారేంటి? వీళ్లు కలిసి లేరని ఇక్కడే అర్థమవుతోందోని ఎవరికి వారే అనుకున్నారు. విడాకుల పోస్టుపై అభిషేక్ ఆసక్తిపెళ్లికి కలిసి వెళ్లలేదు, కలిసి ఫోటోలూ దిగలేదు.. కానీ లోపలికి వెళ్లాక మాత్రం ఐష్- అభిషేక్ పక్కపక్కనే కూర్చుని కబుర్లాడినట్లు ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. దీంతో వీరి వ్యవహారం ఎవరికీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఇంతలోనే తాజాగా అభిషేక్ ఓ విడాకుల పోస్టును లైక్ చేశాడు. అందులో ప్రేమ కష్టంగా మారితే.. అని రాసుంది.50 ఏళ్ల తర్వాత కూడా..ఇంకా ఏమని ఉందంటే.. విడాకులు తీసుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదు. కానీ కొన్ని సార్లు జీవితం మనం అనుకున్నట్లు సాగదు. దశాబ్దాలపాటు కలిసుండి వేరుపడితే ఆ బాధను ఎలా తట్టుకుంటున్నారు? 50 ఏళ్ల తర్వాత కూడా విడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలున్నాయని అందులో రాసుకొచ్చారు. పత్రికలో వచ్చిన వ్యాసాన్ని దీనికి జత చేశారు. ఈ పోస్టును అభిషేక్ లైక్ చేయడంతో.. మళ్లీ విడాకుల చర్చ మొదలైంది.చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్ -
విలన్గా అభిషేక్ బచ్చన్.. షారుఖ్తో ఢీ!
షారుక్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుక్ ఖాన్ , ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ తెరకెక్కనుంది. (చదవండి: ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్లో నటిస్తే.. ఇది అదే)ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీలో విలన్ రోల్ కొత్తగా ఉంటుందట. ఈ రోల్కు అభిషేక్ బచ్చన్ను సంప్రదించారట సుజోయ్ ఘోష్. నెగటివ్ రోల్ కావడంతో మొదట కాస్త విముఖతను వ్యక్తం చేసిన అభిషేక్.. పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఫైనల్గా ఓకే చె΄్పారని బాలీవుడ్ సమాచారం. -
అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!
శుభమా అని అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుంటే విడాకుల గురించి మాట్లాడుతున్నాం ఏంటా అని మీరు అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చర్చంతా దీని గురించే నడుస్తోంది. గత కొన్నాళ్లుగా విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ విడాకుల గురించి అప్పుడప్పుడు పుకార్లు వినిపించాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అంబానీ పెళ్లి వల్ల ఇదే నిజమేనా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: అనంత్- రాధిక వెడ్డింగ్.. ఒక్క పాటకు రూ.25 కోట్లా!)ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కనివినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడ ప్రముఖులు పెళ్లిలో సందడి చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా మహేశ్ బాబు, రామ్ చరణ్, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇదే వేడుకకు ఐశ్వర్యా రాయ్ మాత్రం భర్తతో కాకుండా విడిగా వచ్చింది.అంబానీల పెళ్లిక కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ రాగా.. ఈమె భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం తన కుటుంబంతో కలిసి విచ్చేశాడు. ఇది చూస్తే ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్త నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఇలా విడిగా వచ్చారా అని సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకోరేమో?(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అనసూయ సినిమాపై అభిషేక్ కన్ను.. ఎందుకో తెలుసా..?
-
కుమారుడితో కలిసి కల్కి చూసిన బిగ్బీ.. ఇంత ఆలస్యంగానా? (ఫోటోలు)
-
మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవలే కొత్త ఫ్లాట్లు కొన్నాడు. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. వీటి కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. తాజాగా ఈయన తండ్రి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఆఫీసు పెట్టుకునేందుకు పనికివచ్చే మూడు కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ముంబైలోని వీరసావర్కర్ సిగ్నేచర్ భవంతిలోనే ఈ ఆఫీస్ స్పేస్ ఉందట! దీని మొత్తం విలువ రూ.60 కోట్లు కాగా.. వీటికోసం బిగ్ బీ ఇప్పటికే సుమారు రూ.4 కోట్లు అడ్వాన్స్గా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా కమర్షియల్ ప్రాపర్టీ కొనడం అమితాబ్కు కొత్తేం కాదు. గతంలోనూ ఇదే సిగ్నేచర్ బిల్డింగ్లో నాలుగు ఆఫీస్ స్పేస్లను కొని గతేడాది అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దె ద్వారానే ఏడాదికి రూ.2.07 కోట్లు సంపాదిస్తున్నాడు.సినిమాల విషయానికి వస్తే.. బిగ్బీ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ రేపు (జూన్ 26న) విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా? -
ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?
సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా సరే ఒక్క ఫ్లాట్ లేదా బంగ్లా కొంటే దాని రేటు ఎంత? అనే విషయాలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితా ఒక్కసారే అన్ని కొనేయాల్సిన అవసరమేంటి? ఇంతకీ వీటి రేట్ ఎంత అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు హిట్స్ కొట్టాడు. మంచి నటుడు అనిపించుకున్నాడు. కానీ మరీ సూపర్ స్టార్ రేంజుకి వెళ్లలేకపోయాడు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వ్యాపారాల్లో ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తూ వస్తున్నాడు. కబడ్డీ ప్రీమియర్ లీగ్లోనూ ఇతడికి ఓ జట్టు ఉంది.ఇక తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా.. మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ.3.5 కోట్లు విలువ చేసేవి. మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. గత నెల 28నే కొనుగోలు పూర్తవగా, 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు) -
కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్..
కొన్ని పాటలు ఎవర్గ్రీన్.. ఎప్పుడు విన్నా ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. అలాంటి పాటే కజ్రారే.. కజ్రారే..! 2005లో వచ్చిన బంటీ ఔర్ బబ్లీ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అందులో అమితాబ్ బచ్చన్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ నటించారు. అయితే ఈ పాట రిలీజయ్యే సమయానికి వారికింకా పెళ్లి కాలేదు.. అది వేరే విషయం!ఎంతో పాపులర్..బంటీ ఔర్ బబ్లీ సినిమా రిలీజై 19 ఏళ్లు అయిన సందర్భంగా బిగ్బీ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. ఓ అభిమాని కజ్రారే సాంగ్ ఫోటోను షేర్ చేయగా దానిపై అమితాబ్ స్పందిస్తూ.. ఆ పాట ఎంత పాపులర్ అయిందో! ఇప్పటికీ ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. మర్చిపోలేని విషయం ఏంటంటే.. భయ్యూ(అభిషేక్)తో కలిసి స్టేజీపై ఈ పాటకు లైవ్లో డ్యాన్స్ చేశాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. ఐశ్వర్య పేరు ప్రస్తావించాల్సింది!కాగా 2006 జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్తో పాటు ఐశ్వర్య రాయ్.. స్టేజీపై కజ్రారే పాటకు డ్యాన్స్ చేశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న బిగ్బీ.. ఐశ్వర్య పేరు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు మీరు, మీ కుమారుడు ఈ పాటకు అవసరం కూడా లేదు. ఐశ్వర్య లేకపోతే ఎవరూ చూసేవారు కూడా కాదు, అలాంటిది తననే మర్చిపోయారా? అని విమర్శిస్తున్నారు. సీక్వెల్..బంటీ ఔర్ బబ్లీ విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో అభిషేక్ హీరోగా రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి 2022లో సీక్వెల్ కూడా వచ్చింది. ఇందులో అభిషేక్కు బదులుగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అలాగే రాణీ ముఖర్జీ, సిద్దాంత్ చతుర్వేది, శర్వారి వాఘ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. the song became so popular that it still regenerates attention and love .. and the best moments with the song, Bhaiyu, were when we performed this live on stage .. 🙏🤣🤣 https://t.co/vKuMM7ipIN— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2024 చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ -
ఐశ్వర్య కూతురేనా? గుర్తుపట్టలేకుండా ఉందే..
అందాల తార ఐశ్వర్యరాయ్- బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ దంపతుల గారాలపట్టి.. ఆరాధ్య. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. అటు ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్కు తప్పక హాజరువుతుంది. ఇక అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్కు బాలీవుడ్ తారలు హాజరైన సంగతి తెలిసిందే! అందులో బచ్చన్ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్, ఐష్, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్ను తెగ ఎంజాయ్ చేశారు. గెటప్ మార్చింది.. అయితే ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్కట్ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్ లీవ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆరాధ్య గెటప్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 'ఆ నుదుటి మీద కురులు(బ్యాంగ్స్) లేకపోతే ఆరాధ్య ఎంత బాగుందో.. ఈ పిల్ల అచ్చం ఆమె అమ్మలాగే ఉంది.' అచ్చం తల్లిలాగే.. 'యవ్వనంలో ఐశ్వర్య ఎలా ఉండేదో.. సేమ్ టు సేమ్.. అలాగే ఉంది. ఇంత క్యూట్గా ఉన్న పాప ఎందుకని అలా బ్యాంగ్స్తో తన ముఖాన్ని దాచుకుందో..', 'ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్స్టైల్ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది' అని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 16న ఆరాధ్య జన్మించింది. Look at my two girls 😍 they look so beautiful 😻 #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/hDE73iuXzQ — AISHWARYA RAI 💙 (@my_aishwarya) March 3, 2024 The family ❤️. Beautiful #AishwaryaRai with Aradhya pic.twitter.com/h4O8HWs4TE — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 4, 2024 చదవండి: తెలుగు సినిమాల్లో కనిపించట్లే.. అవకాశాలు రావడం లేదా? -
హిందీకి అరి
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘పేపర్ బాయ్’ చిత్రదర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం విడుదలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే గ్రాండ్గా విడుదల చేయనున్నాం. ఈ సినిమా హిందీ రీమేక్పై అభిషేక్ బచ్చన్ ఆసక్తిగా ఉన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ప్రివ్యూని అభిషేక్ బచ్చన్కి చూపించారట దర్శకుడు జయశంకర్. కాన్సెప్ట్ యూనివర్సల్గా ఉందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: కృష్ణ ప్రసాద్. -
దేవుడా..! బచ్చన్కి బిడియం ఎక్కువే..!
'ప్రతీ ఒక్కరి జీవితంలో.. సిగ్గు, బిడియాలు ఉండక తప్పవు. కాస్త అవి ఎక్కువైతే.. మాట్లాడడాలు, మాట్టాడుకోవడాలు ఉండనే ఉండవు. అవి కాస్త ముదిరితే.. ఏం చేయాలో తెలియక మనలో మనమే మదన పడుతూంటాం. ఇక ఆ పరిస్థితే.. ఓ బాలీవుడ్ యాక్టర్కి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వారెవరో చూద్దాం..' అభిషేక్ బచ్చన్కి బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడలేడు. తనతోపాటు నలుగురు లేనిదే ఎక్కడికీ కదలడు. కొత్తవాళ్లతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడడు. అంతెందుకు హోటల్ రూమ్లో ఉంటే.. రూమ్ సర్వీస్ ఎంత అవసరమైనా.. ఫోన్ చేసి అడగడట. ఆకలి దంచేస్తున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టడట. అతని సిగ్గు, బిడియం, బెరుకు ఆ రేంజ్లో ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో అభిషేకే చెప్పాడు. ఇవి చదవండి: సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం! -
‘అరి’ రీమేక్పై స్టార్ హీరోల గురి?
తెలుగు దర్శకులు సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలిసిన కథలే అయినా..వాటికి కొత్త నేపథ్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన పురాణాలు, ఇతిహాసాల కథల్ని వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలాంటి చిత్రాలకు టాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు నిదర్శనం కార్తికేయ, హనుమాన్, కాంతారా, ఓ మై గాడ్ సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాయి. అలాంటి కాన్సెప్ట్తో తాజాగా మరో చిత్రం రాబోతుంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల కాకముందే దీని రీమేక్పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘అరి’పై శివకార్తికేయన్ గురి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. ఆయన ఇటీవల అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్లో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ హీరో కన్ను ఇప్పుడు అరిపై పడింది. అయలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్కి వచ్చిన శివకార్తికేయన్కి దర్శకుడు జయశంకర్ ‘అరి’ ట్రైలర్ చూపించాడు. అది శివకార్తికేయన్కు విపరీతంగా నచ్చడంతో.. సినిమా మొత్తం చూశాడట. అందులోని కృష్ణుడు పాత్ర అతన్ని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్కి చెప్పాడట. అరి తెలుగులో రిలీజై.. హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా తమిళ్లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిందీ రీమేక్లో అభిషేక్? ఒక హీరో మాస్ క్యారెక్టర్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే కృష్ణుడి పాత్రను చేయడానికి అంతే ఆసక్తి చూపుతాడు. ఇక నార్త్లో అయితే కృష్ణతత్వం కాన్సెప్ట్తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన కార్తికేయ 2 సౌత్లో కంటే నార్త్లో బాగా ఆడింది. ‘అరి’ కూడా అలాంటి చిత్రమే కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అభిషేక్ని కృష్ణుడిగా చూడొచ్చు. ‘అరి’పై ప్రముఖుల ప్రశంసలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీలీజ్కు రేడీగా ఉంది అరి సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులకు చూపించారు మేకర్స్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్తో పాటు చినజీయర్ స్వామి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. భర్తలాగే సింపుల్గా చెప్పేసింది!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ జంటల్లో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈ మాజీ ప్రపంచసుందరి బాలీవుడ్ హీరోను పెళ్లాడింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు ఉంది. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీపై ఇటీవల పెద్దఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆ సమయంలో కేవలం ఆమె తన తల్లి, కుమార్తెతో మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా ఆరోజు అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం అభిషేక్ ధరించడం లేదని తెలిసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు కూడా. అయినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్తో అలాంటి వాటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీరో, ఐశ్వర్యారాయ్ భర్త తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, సినీతారలు పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తమ అభిమాన హీరో బర్త్డే కావడంతో ఉదయం నుంచి బాలీవుడ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఇదిగో మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ బర్త్ డే సందర్భంగా అభిషేక్ ఇలానే సింపుల్గా విషెస్ చెప్పారు. ఐశ్వర్య కూడా కాస్తా లేటైనా భర్తకు అదే తరహాలో విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన హీరోకు హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఈ ఒక్క పోస్ట్తో విడాకుల రూమర్స్కు చెక్ పెట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే గతేడాది పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో ఐశ్వర్యరాయ్ మెప్పించింది. అభిషేక్ సైతం గతేడాది గూమర్ చిత్రంతో అలరించాడు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
ఆ స్టార్ కపుల్పై విడాకుల రూమర్స్.. ఆ పోస్టే కారణమా?
సినీ తారలపై రూమర్స్ ఎక్కువగా వింటుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా రోజుల్లో అవీ కాస్తా ఎక్కువగానే వస్తున్నాయనే చెప్పాలి. లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలా రోజు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్లో అయితే ఇలాంటివీ మరీ ఎక్కువే. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్పై విడాకులు తీసుకుంటున్నట్లు తెగ చర్చ నడుస్తోంది. ఇటీవల అభిషేక్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అభిషేక్ తన ఇన్స్టాలో రాస్తూ.. “విఫలమవుతుందనే భయం మీ కలలను నాశనం చేస్తుంది. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటే మీ కలలను నిర్మిస్తుంది' అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా? అన్న చర్చ మరోసారి మొదలైంది. అయితే గతంలోనూ ఈ జంటపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. (ఇది చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?) విడాకుల రూమర్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయింది. ఈ జంటకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇటీలస ఆరాధ్య స్కూల్ డే ఈవెంట్కు ఐశ్వర్య మాత్రమే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. ఆ తర్వా బిగ్ బితో కలిసి ప్రొ కబడ్డీ ఆటను చూసేందుకు కూడా రావడంతో రూమర్స్కు బ్రేక్ పడింది. అంతే కాకుండా ఓ ఈవెంట్లో అభిషేక్ బచ్చన్.. పెళ్లి ఉంగరం ధరించకుండా రావడంతో మరోసారి రూమర్స్ వైరలయ్యాయి. అయితే తాజాగా అభిషేక్ చేసిన పోస్ట్ వల్ల మరోసారి విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్లో ఫెయిల్యూర్పై పోస్ట్ పెట్టడమేనని తెలుస్తోంది. ఈ పోస్ట్ ద్వారానే విడాకులకు హింట్ ఇచ్చారని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంతవరకు అభిషేక్, ఐశ్వర్య ఎవరూ స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మెప్పించింది. మరోవైపు చిరంజీవి విశ్వంభరలో నటించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా.. అభిషేక్ బచ్చన్ సైతం ఇటీవలే గూమర్ చిత్రంతో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. -
అయోధ్య రామాలయానికి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్
-
ఒకే ఫ్రేమ్లో ఐశ్వర్య రాయ్ కుటుంబం.. ఆ ఒక్కరు మాత్రం లేరు
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి కుటుంబం నుంచి ఎన్నో ఊహాగానాలు వచ్చినా వారు మరింత రెట్టింపుతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ మ్యాచ్కు జయ బచ్చన్ మినహా ఆ కుటుంబం మొత్తం హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ కబడ్డీ మ్యాచ్లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. వీరంతా అభిషేక్ బచ్చన్కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఉత్సాహపరిచేందుకు అక్కడికి వచ్చారు. ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) సీజన్ 10 మ్యాచ్లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న ఆ జట్టు యు ముంబాను ఓడించింది. ఆ మ్యాచ్లో సందడిగా కనిపించిన బచ్చన్ కుటుంబాన్ని స్టార్ స్పోర్ట్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బచ్చన్ కుటుంబ సభ్యులు అందరూ జైపూర్ పింక్ పాంథర్స్ షర్టులు ధరించి వచ్చారు. యు ముంబా జట్టుతో జైపూర్ పింక్ పాంథర్స్ గట్టి పోటీనిచ్చింది. యు ముంబా జట్టును ఓడించడంతో, బచ్చన్ కుటుంబం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించిన ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ జట్టు 2014 నుంచి ప్రొ కబడ్డీ లీగ్లో పోటీ చేయడం ప్రారంభించింది. తాజాగా జరిగిన మ్యాచ్లో యు ముంబా జట్టుపై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. అభిషేక్, ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బచ్చన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పలు ప్రోగ్రామ్స్లో కలిసి కనిపిస్తూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అమితాబ్ ఇంటి నుంచి ఐశ్వర్య బయటకు వచ్చేసిందని దీనంతటికి కారణం తన అత్తగారు జయా బజ్చన్, అమితాబ్ బచ్చన్ అంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఒకే చోట కూర్చొని ఆనందంగా గడిపారు. ఇకనైన ఈ వార్తలకు చెక్ పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. .@SrBachchan, @juniorbachchan & #AishwaryaRaiBachchan were all in attendance to watch the #JaipurPinkPanthers win their 1st game of the Mumbai leg! 🤩 Tune-in to #PUNvCHE in #PKLOnStarSports Tomorrow, 7:30 PM onwards | Star Sports Network#HarSaansMeinKabaddi pic.twitter.com/lUE0ksnU8r — Star Sports (@StarSportsIndia) January 6, 2024 -
దుస్తులు ఫ్రీగా ఇచ్చేవారు కాదు, కొనుక్కునే స్థోమత లేక..
సంతోషమైనా, దుఃఖమైనా ఏదీ కలకాలం ఉండదు. పగలూరేయిలా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ పోతూనే ఉంటాయి. బిగ్బీ అమితాబ్ బచ్చన్ జీవితంలోనూ ఇదే జరిగింది. స్టార్ అన్న బిరుదు సంపాదించడానికి ముందు ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో సంపాదించినదంతా పోగొట్టుకుని ఉట్టి చేతులతో నిలబడ్డాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా మెరుపు వేగంతో మళ్లీ సంపాదించి నిలదొక్కుకున్నాడు. తాజాగా ఆనాటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు బిగ్బీ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్. సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో చాలా కష్టపడ్డాను. నటుడిని అవ్వాలన్న కోరిక నాలో బలంగా ఉండేది. కానీ రెండేళ్లపాటు చాలామంది డైరెక్టర్లు నాతో సినిమా చేయడానికి వెనుకడుగు వేశారు. అదే సమయంలో నాన్న(అమితాబ్ బచ్చన్) ఓ బిజినెస్ ప్రారంభించి ఉన్నదంతా పోగొట్టుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. నేను, నా స్నేహితుడు కలిసి సొంతంగా కథ రాసుకోవాలనుకున్నాం.. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీన పరిస్థితి.. ఒకరోజు నాన్న.. ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమానికి రమ్మన్నాడు. ఈవెంట్కు ఎలా రెడీ అయి వెళ్లాలని అందరూ కొన్ని నెలల ముందే ప్రిపేర్ అవుతుంటారు. పైగా 20 ఏళ్ల క్రితం ఎవరూ ఉచితంగా దుస్తులు ఇచ్చేవారు కాదు. కొనుక్కున్న వాటినే వేసుకుని వెళ్లాలి. సాయంత్రం షూటింగ్ లాంటివి పెట్టుకోకుండా ఇండస్ట్రీ అంతా సమయానికి అక్కడికి చేరుకుంటుంది. నేనేమో ఫంక్షన్కు ఏం వేసుకోవాలి? అని నాన్నను అడిగాను. ఇప్పుడిది మీకు విచిత్రంగా అనిపించవచ్చేమో కానీ ఆ సమయంలో మాత్రం పరిస్థితి అంత దారుణంగా ఉంది. నా దగ్గర సరైన బట్టలు లేవు. కొనుక్కునే స్థోమత లేదు ఆర్థిక కష్టాల వల్ల కొనుక్కునేంత స్థోమత కూడా లేకపోయింది. ఫార్మల్ డ్రెస్ లేదు, జీన్స్-టీషర్ట్ వేసుకుని వెళ్తే బాగోదు. మా సోదరి పెళ్లికి కొన్నేళ్ల క్రితం కొనుక్కున్న డ్రెస్ ఉంటే అదే వేసుకెళ్లాను' అని చెప్పుకొచ్చాడు అభిషేక్. కాగా ఈ ఫంక్షన్లో బార్డర్ సినిమాకుగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న జేపీ దత్తా.. అభిషేక్ను చూసి తనతో సినిమా తీయాలనుకున్నాడు. రిఫ్యూజీ మూవీతో అభిషేక్ను వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్కు సైతం ఇదే తొలి సినిమా! అభిషేక్ చివరగా ఘూమర్ సినిమాలో కనిపించాడు. చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి.. -
Aishwarya Rai: బచ్చన్ ఫ్యామిలీతో విభేదాలు.. ట్రెండింగ్లో ఐశ్వర్యరాయ్ (ఫోటోలు)
-
భర్త, మామతో ఈవెంట్కు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. కాకపోతే!
బాలీవుడ్ దంపతులు ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ఈ మధ్య ఎక్కువగా బయట కలిసి కనిపించడం లేదు. ఐశ్వర్య పుట్టినరోజున కూడా చాలా లేట్గా బర్త్డే విషెస్ తెలిపాడు అభిషేక్. అది కూడా ఏదో పైపైనే చెప్పినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు బచ్చన్ కుటుంబంలో ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఈ అనుమానాలు ఈమధ్య మొదలైనవి కాదు. కొన్నేళ్ల నుంచే వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సదరు పుకార్లను కొట్టిపారేశాడు అభిషేక్. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైన సమయంలోనూ ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్వీట్ చేశాడు. ఇంటి నుంచి బయటకు? అయినప్పటికీ ఈ రూమర్స్ ఆగిపోలేదు. పైకి ఏదో కవరింగ్ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరే ఉందని అనుమానిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఐశ్వర్య.. తన కూతురిని తీసుకుని బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తగారు జయాబచ్చన్తో చాలాఏళ్లుగా మాటలు లేవని, భర్తతోనూ విభేదాలు రావడంతో ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అభిషేక్- ఐశ్వర్య కలిసి కనిపించారు. వీరిద్దరూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్కు చెరో కారులో.. అయితే ఐశ్వర్య, తన తల్లి బృంద్య రాయ్తో కలిసి ఓ కారులో రాగా.. అభిషేక్, తన తండ్రి అమితాబ్ బచ్చన్తో కలిసి మరో కారులో ఈవెంట్కు హాజరయ్యారు. కారు దిగగానే ఐశ్వర్య.. బిగ్బీని పలకరించింది. అటు అభిషేక్.. భార్యపై చేయి వేసి ఆమెతో సరదాగా మాట్లాడుతూ లోనికి వెళ్లిపోయాడు. ఈవెంట్లోనూ బిగ్బీ, అభిషేక్, ఐశ్వర్య సరదాగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భర్తతో పాటు అదే కారులో వెళ్లింది ఐశ్వర్య. ఇది చూసిన జనాలు ఇదేం ట్విస్టు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by AISHVERSE 💌 (@theaishverse) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: అపర్ణకు కంగ్రాట్స్ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..? -
కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకొచ్చేసిన ఐశ్వర్య రాయ్
బాలీవుడ్లో అందరూ ఇష్టపడే జంటలలో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్లు ముందు వరసలో ఉంటారు. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ ప్రస్తుతం తమ వివాహ విషయంలో చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ విడిపోతున్నారని పలుమార్లు పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ, వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని ఆమె తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు అయిన జయా బచ్చన్తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం. ఇదే క్రమంలో భర్త అభిషేక్ బచ్చన్తో కూడా విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చిందట. ఇలాంటి గొడవల మధ్య తన కూతురును పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొద్దిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్ తన 50వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆమె తన తల్లి, కుమార్తెతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం తను ధరించడం లేదని తెలిసింది. దీంతో వారి అభిమానుల్లో కొంతమేరకు ఆందోళన మొదలైంది. -
విడిపోనున్న అభిషేక్, ఐశ్వర్యారాయ్...?
-
మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇండస్ట్రీలో అమితాబ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. గతంలో ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన పుట్టిన రోజున సియోన్లోని జీఎస్బీ సేవా మండల్లో క్యాన్సర్ పేషెంట్లతో కలిసి వేడుక చేసుకుంది. ఇందులో ఆమెతోపాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో భర్త అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడం ఫ్యాన్స్కు ఆశ్చర్య కలిగించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిషేక్పై నెటిజన్స్ మండిపడ్డారు. భార్య పుట్టినరోజున విషెస్ చెప్పిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా లేటుగా ఆమెకు విషెస్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆమె 50వ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుకుంటారని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. దీంతో అభిషేక్ వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. కాగా.. ఇటీవలే ముంబయిలో మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి బాష్లో ఐశ్వర్య సింగిల్గానే కనిపించింది. పార్టీలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ రాలేదు. దీంతో మరోసారి ఈ జంటపై విడాకుల రూమర్స్ తెరపైకొస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు వేడుకలకు భర్త దూరంగా ఉండడం, అంతే కాకుండా ఎప్పుడో అర్ధరాత్రి విష్ చేయడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి డైవర్స్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ జంటకు ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?
Abhishek Bachchan Politics: సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలకు దగ్గర సంబంధముంది. ఎంతలా అంటే నటీనటులుగా పేరు తెచ్చుకున్న చాలామంది.. పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ నుంచి త్వరలో పార్టీ పెట్టబోతున్న దళపతి విజయ్ వరకు ఈ లిస్ట్ పెద్దదే.ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ హీరో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ పేరు చెప్పగానే చాలామంది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. 50 ఏళ్ల నుంచి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి చాలా పేరు తెచ్చుకున్నారు. ఈయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా హీరోగా పలు సినిమాలు చేశాడు గానీ ఎందుకో తండ్రిలా హిట్స్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయని అభిషేక్.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. (ఇదీ చదవండి: ఆడిషన్స్కి వెళ్తే డ్రగ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత: ప్రముఖ నటి) ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీలోనే అభిషేక్ చేరబోతున్నాడట. అలానే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, 1984లో కాంగ్రెస్ తరఫున ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు కొడుకు అదే స్థానంలో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అమితాబ్ భార్య, అభిషేక్ కి తల్లి అయిన జయా బచ్చన్.. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మరి తల్లిదండ్రుల వారసత్వంగా అభిషేక్ రాజకీయాల్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలానే సినిమాల్లో రాణించలేకపోయిన అభిషేక్.. మరి పాలిటిక్స్ లో ఏం చేస్తారో చూడాలి. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
నువ్వు కూతుర్ని చూసుకో, ఐశ్వర్యను సినిమాలు చేయనివ్వు..
ఐశ్వర్యరాయ్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే! అప్పటికి, ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలోనూ తన అందంతో, హావభావాలతో అదరగొట్టింది. హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు ఐశ్వర్య భర్త, హీరో అభిషేక్ బచ్చన్. చిత్రయూనిట్ కృషి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కొనియాడాడు. ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్కు ఓ నెటిజన్్ స్పందిస్తూ.. 'ఇప్పటికైనా తెలిసిందిగా! నువ్వు ఆరాధ్యను చూసుకో, తనను మరిన్ని సినిమాలు చేయనివ్వు' అని కామెంట్ చేశాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. 'నేనేమైనా వద్దన్నానా? సర్, తను ఏది చేయాలనుకున్నా అందుకు నా అనుమతి అవసరం లేదు. అందులోనూ తనకు నచ్చిన పనులు చేయాలనుకుంటే నేనెందుకు వద్దంటాను' అని రిప్లై ఇచ్చాడు. అతడి సమాధానం విని సంతోషం వ్యక్తం చేసిన ఫ్యాన్స్.. 'చాలా బాగా చెప్పారు సర్, అలాగే మీరిద్దరు కూడా కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అభిషేక్, ఐశ్వర్య.. గురు, ధూమ్ 2, రావన్, ఉమ్రావో జాన్ వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరు 2007లో పెళ్లి చేసుకోగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. ఇటీవల అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఐశ్వర్య ఒక్కరే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతుండటంతో వీరిమధ్య దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. కానీ అదంతా వదంతి మాత్రమేనని కొట్టిపారేశాడు అభిషేక్. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్ అని ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో షేర్ చేయగా దీనిపై అభిషేక్ స్పందిస్తూ నాకు కూడా ఫేవరెట్ అని కామెంట్ చేశాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్కు చెక్ పడినట్లైంది. Let her sign??? Sir, she certainly doesn’t need my permission to do anything. Especially something she loves. — Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) April 29, 2023 చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే? -
ఐశ్వర్య రాయ్ తో విడాకులు ? అభిషేక్ బచ్చన్ షాకింగ్ రియాక్షన్
-
ఐశ్వర్యరాయ్తో విడాకులు? అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల వైవాహిక జీవితం గురించి కొద్దిరోజులుగా తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిమధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రస్తుతం బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్కు ఐష్ అభిషేక్ లేకుండా కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లడంతో వీరి విడాకుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొంతకాలంగా సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది. లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది. దీంతో ఐష్-అభిషేక్ల మధ్య పొసగడం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలను అభిషేక్ ఖండించారు. ఓ ఈవెంట్లో ఆరాధ్యతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్(My Fav People)అని పేర్కొనగా..దీనికి అభిషేక్ స్పందిస్తూ.. నాకు కూడా ఫేవరెట్(Mine Too) అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఐశ్వర్య-అభిషేక్ విడిపోనున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐష్-అభిషేక్లకు కూతురు ఆరాధ్య సంతానం. My fav people ❤️♥️ @juniorbachchan pic.twitter.com/hAoODtjuTD — Shruti (@Shrutibwb) April 1, 2023 -
బీటలు వారిన బంధం.. భర్తకు ఐశ్వర్య రాయ్ విడాకులు?
బాలీవుడ్లోని బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ జంట అగ్రస్థానంలో ఉంటుంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. చాలా కార్యక్రమాలకు, పార్టీలకు ఐశ్వర్య ఒంటరిగానో లేదంటే కూతురిని తీసుకునో వెళుతోంది. కానీ భర్త అభిషేక్తో మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్కు కూడా ఐశ్వర్య తన గారాలపట్టి ఆరాధ్యతో కలిసి వెళ్లింది. వీరి వెంట అభిషేక్ మాత్రం వెళ్లలేదు. కేవలం ఈ ఒక్క ప్రోగ్రామ్ అనే కాదు చాలా సందర్భాల్లో ఐశ్వర్య వెంట అభిషేక్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగి ఉండొచ్చని నెటిజన్లు సందేహిస్తున్నారు. వీరు విడాకులు తీసుకోబోతున్నారేమోనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీరు విడిపోతున్నారంటూ వార్తలు రావడం ఇదేం కొత్తేమీ కాదు. 2014లోనూ వీరిద్దరి బంధం చెడింది, విడాకులు తథ్యం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. ఓకే, నేను విడాకులు తీసుకుంటున్నానని నమ్ముతున్నాను. ఈ విషయం నాకు గుర్తుచేసినందుకు థ్యాంక్స్. పనిలో పనిగా నా రెండో పెళ్లి ఎప్పుడో కూడా మీరే చెప్పండి అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చి రూమర్స్కు చెక్ పెట్టాడు. కాగా ఐశ్వర్య, అభిషేక్ 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. -
ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సంతోషం పట్టలేక తన భార్య, నటి ఐశ్వర్యరాయ్ని హగ్ చేసుకున్ను వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా జరిగిన ప్రో కబడ్డి ఫినాలే మ్యాచ్ చూసేందుకు భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొన్నాడు అభిషేక్. ఈ 9వ సీజన్లో అభిషేక్ టీం జైపూర్ పింక్ పాంథర్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. తన టీం గెలవడంతో అభిషేక్ ఆనందంలో మునిగిపోయాడు. పట్టలేని సంతోషంలో ఉన్న అభిషేక్ పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చదవండి: రామ్ చరణ్పై ‘కింగ్ ఖాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నారని, వారి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా తరచూ వీరి విడాకుల రూమర్స్ బి-టౌన్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని అభిషేక్ భార్యతో షేర్ చేసుకోవడం.. ఐశ్వర్య కూడా భర్తను చీర్ చేసిన ఈ వీడియో వారి ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు విడాకుల గురించి వస్తున్న పుకార్లకు ఈ వీడియోతో చెక్ పడిందంటూ ఈ జంట ఫ్యాన్స్, ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రాయ్, అభిషేక్లు 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి రూమ్లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి: విరాట్ హోటల్ రూమ్ వీడియో లీక్పై అనుష్క తీవ్ర ఆగ్రహం) ఈ ఘటనపై కింగ్ కోహ్లీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రూమ్ వీడియోను హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ ఖండించారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అనైతికమైన చర్య అని బాలీవుడ్ ప్రముఖులు మండిపడ్డారు. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, ఊర్వశి రౌతేలా, కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఫైరయ్యారు. దీనికి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బాలీవుడ్ నటులు డిమాండ్ చేస్తున్నారు. -
తండ్రి బర్త్డేకు అభిషేక్ బచ్చన్ సర్ప్రైజ్ ప్లాన్, ఎమోషనల్ అయిన బిగ్ బి
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 11 ఆయన బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, భారత సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బర్త్డే నేపథ్యంలో బిగ్ బి హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్ను సర్ప్రైజ్ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కేబీసీ షోలో అడుగుపెట్టాడు. చదవండి: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి ఆయన షో నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగింది. ఆ తర్వాత షో అయిపోయిందా? అని అందరు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ బచ్చన్ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. తనయుడి రాకతో బిగ్ బి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం తండ్రిని హాట్ సీట్లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్లో తను కూర్చోని అమితాబ్ను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా బిగ్బి అభిషేక్కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పక్కనే ఉన్న ఆయన సతీమణి జయ బచ్చన్ అమితాబ్ను తట్టి ఓదారుస్తున్న వీడియో నెటిజన్లు ఆకట్టుకుంది. అనంతరం షోలోనే కేక్ కట్ చేయించి తండ్రికి ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించాడు అభిషేక్. చదవండి: బాలీవుడ్ దిగ్గజం.. ఆయనకు గుర్తింపు అంత ఈజీగా రాలేదు View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను అభిషేక్ షేర్ చేశాడు. ‘దీని వెనుక చాలా ప్రణాళిక, ఎన్నో రిహార్సల్, హార్డ్ వర్క్ ఉంది. చాలా గోప్యంగా ఇది సరిగ్గా చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇంత చేసిన ఆయనకు ఇది తక్కువే అనిపిస్తుంది. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్ ప్లేస్లో(కేబీసీ షో) జరుపడం సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇది భావోద్వేగానికి గురి చేసింది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్ బనేగా కరోడ్పతి టీంకు నా కృతజ్ఞతలు’ అంటూ అభిషేక్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
ఐశ్వర్యతో విడాకులా..రెండో పెళ్లి ఎప్పుడు?.. అభిషేక్ ట్వీట్ వైరల్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 2014లో ఐశ్యర్యరాయ్తో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో అప్పట్లో అభిషేక్ ఆసక్తికర ట్వీట్ చేశారు. వాటిపై స్పందిస్తూ 'నేను విడాకులు తీసుకుంటానని నమ్ముతున్నా. ఈ విషయం నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రెండో పెళ్లి విషయం కూడా మీరే చెప్పండి. థ్యాంక్స్ అంటూ ట్విటర్లో అభిషేక్ రాసుకొచ్చారు. (చదవండి: పొన్నియన్ సెల్వన్: అమ్మకానికి ఐశ్వర్య రాయ్, త్రిషల నగలు) కాగా... అభిషేక్, ఐశ్వర్యరాయ్ జంట 20 ఏప్రిల్ 2007లో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు అమ్మాయి పుట్టగా ఆరాధ్య అని పేరు పెట్టారు. అప్పట్లో 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నట్లు రూమర్లు పెద్దఎత్తున వ్యాపించాయి. గతంలో ఈ బాలీవుడ్ జంటపై వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ ప్రస్తావించారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'ఐశ్వర్యతో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి చెప్పేందుకు అంగీకరించను. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు.. ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు.' అని అన్నారు. Ok…. So I believe I’m getting divorced. Thanks for letting me know! Will you let me know when I’m getting re-married too? Thanks. #muppets — Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) May 16, 2014 -
‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’
స్టార్ కిడ్ అయిన దుల్కర్ సల్మాన్ సైతం ట్రోల్స్ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్షాట్స్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’. సెప్టెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా దుల్కర్ మీడియాతో మాట్లాడుతూ పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్పై స్పందించాడు. చదవండి: Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్ వదులుకున్నా ఈ మేరకు దుల్కర్ మాట్లాడుతూ.. ‘గతంలో అభిషేక్ బచ్చన్ గురించి ఓ వార్త విన్నాను. ఆయనను విమర్శిస్తు రాసిన ఆర్టికల్కు సంబంధించిన పేపర్ కట్టింగ్స్ను అద్దంపై అతికించుకుంటారట. వాటిని రోజు చదువుతారని విన్నాను. నా విషయానికి వస్తే నేను కూడా అలాగే చేస్తాను. నా ఫోన్ గ్యాలరీ చూస్తే మీకు అన్ని స్క్రీన్షాట్స్యే కనిపిస్తాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శల తాలుకు స్క్రిన్షాట్స్ అవి. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా అన్నింటి స్క్రీన్ షాట్స్ సేవ్ చేసి పెట్టుకుంటాను. వాటిని అప్పుడప్పుడు చూస్తుంటా. అందులో నన్ను పర్సనల్గా అటాక్ చేసిన ఐడీలు కూడా నాకు బాగా గుర్తున్నాయి’ అని చెప్పాడు. -
సెట్లో నుంచి హీరోయిన్ను ఎత్తుకెళ్లిపోయా: హీరో
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తాజాగా కేస్ తో బంతా హై అనే కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో హోస్ట్ రితేష్ దేశ్ముఖ్.. అభిషేక్ బచ్చన్ సెట్స్లో కొన్ని వస్తువులు దొంగతనం చేశాడని సరదాగా ఆరోపించాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. అవును, గురు సెట్స్లో ఐశ్వర్య రాయ్ను ఎత్తుకెళ్లిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదిలా ఉంటే గురు సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. ఆ వెంటనే 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2012లో కూతురు ఆరాధ్య జన్మించింది. చదవండి: 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? మూడు రోజుల్లో సీతారామం ఎంత రాబట్టిందంటే? -
ద్యేవుడా.. ఆ హీరోయిన్ కింద పడితే సినిమా హిట్!
ఒకరి నమ్మకం.. ఇంకొకరికి పిచ్చిగా అనిపించొచ్చు. నవ్వులాటగానూ తోచొచ్చు. అలాంటి నమ్మకాలు సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్స్.. గిమ్మిక్స్ చేసే వాళ్లకు ఎక్కువ. అవి సెల్యూలాయిడ్ సెంటిమెంట్స్గానే మిగిలిపోవట్లేదు.. ఆ సెలెబ్రిటీ రియల్ లైఫ్లోనూ భాగమవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ వీళ్లే...! ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఈ ఊసుపోని కబుర్లను మేం పోగేసుకు రావట్లే మరి.. ఆ పిచ్చిలో పడి! ఎనిమిదే కావాలి.. బిహైండ్ ది స్క్రీన్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్బీర్ కపూర్! ఆ బాబుక్కూడా ఓ సెంట్మెంట్ ఉండండోయ్. అది వాళ్లమ్మ నీతూ సింగ్ జన్మదిన తేదీ. అది ఎనిమిది. తాను ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఎనిమిదో తేదీనే మొదలుపెడ్తాడు.. వెళ్తాడు. తన దగ్గరున్న కార్ల నంబర్ కూడా ఎనిమిది వచ్చేలానే చూసుకుంటాడు. అదీ ఆ అబ్బాయి సెంట్మెంట్! పడితేనే హిట్.. ..ఎక్కడండీ.. ఎవరండీ..? అని అంత ఆత్రం ఎందుకండీ..? ఎక్కడంటే మరి.. షూటింగుల్లోనే. ఎవరంటే మరి.. సోనమ్ కపూర్ అహూజా. షూటింగ్ అప్పుడు సెట్స్లో ఒక్కసారైనా ఆమె కిందపడితే ఆ సినిమా సూపర్ హిట్టే అట. అలా ఒకట్రెండు సినిమా సెట్స్లో ఆమె పడితే ఆ సినిమాలు హిట్ అయ్యాయని.. అప్పటి నుంచి ఆ నమ్మకాన్ని.. సెంట్మెంట్ను వానిటీ వ్యాన్లో పెట్టుకుని తిరుగుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు. ఓ నిమ్మకాయ.. నాలుగు మిరపకాయలు.... అది బెంగాలీ బ్యూటీ బిపాశా బసు సెంటిమెంట్. తన ఇంటి ప్రధాన గుమ్మాలు, కార్లు.. ఇలా పరుల దృష్టి పడుతుంది అని అనుమానమున్న ప్రతి చోటా అలా నిమ్మకాయలు, మిరపకాయలను ఓ ఇనుప వైరుకి గుచ్చి కడుతుందట బిపాశా. అవి దుష్టదృష్టి నుంచి తనను, తన ఇంటిని కాపాడుతాయనే గట్టి నమ్మకం ఆమెదని బిపాశా సన్నిహితుల చెప్పే మాట. దేవుడి దయ.... మీద కత్రీనా కైఫ్కు మహావిశ్వాసం. అందుకే ఆమె నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు విధిగా ముంబైలోని సిద్ధివినాయకుడి గుడి, మౌంట్ మేరీ చర్చ్, అజ్మీర్లోని షరీఫ్ దర్గా.. ఇలా మూడింటినీ దర్శించుకుని వస్తుందట. ఆ దర్శనాల వల్ల తన సినిమా హిట్ అవుతుందని ఆమె నమ్మకం. కూర్చుంటేనే వరిస్తుంది.. స్పోర్ట్స్ అంటే అభిషేక్ బచ్చన్ ప్రాణం పెడ్తాడని బాలీవుడ్కే కాదు.. భారతదేశంలోని అతని అభిమానులు అందరికీ తెలుసు. క్రికెట్ అంటే క్రేజ్ అతనికి. ఎంతంటే.. వెర్రి నమ్మకాలను క్రియేట్ చేసేంత! క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అతను గ్యాలరీలోనైనా.. ఇంట్లో అయినా.. కూర్చున్న చోట నుంచి కదలడట.. మ్యాచ్ అయిపోయేంత వరకు. ఏమట పాపం? అని అడక్కండి! తాను కదిలితే తన ఫేవరెట్ టీమ్ ఓడిపోతుందని భయమట పాఫం! దీనికి లాజిక్ కూడా చెప్తాడు ఆ హీరో.. అస్తమానం అటూ ఇటూ కదులుతూ.. తిరుగుతూ ఉంటే నెగెటివ్ ఎనర్జీ అన్ని దిక్కులకు పాకి అది టీమ్ మీద ప్రభావం చూపుతుంది అంటూ! ‘ఓహో.. తమరు అలా ఆ నెగెటివ్ ఎనర్జీని కుర్చీకి కట్టేస్తారన్నమాట’ అని అభిమానులు గాట్ హిజ్ పాయింట్ అన్నమాట. నాట్ ఆన్ థర్స్డేస్.. బాలీవుడ్ డాన్స్ కింగ్.. గోవిందా తెలుసు కదా! సెంటిమెంట్లలో అతనిదొక విధము. గురువారాలు గోవిందాకు అచ్చిరావుట. అదొక్క నమ్మకమే కాదు.. జ్యోతిష్యుడి సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేయడుట. ఆఖరుకు క్రాఫ్ చేయించుకోవాలన్నా.. హెయిర్ వీవింగ్ చేయించుకోవాలన్నా జ్యోతిష్యుడు వారం, వర్జ్యం చూసి ఘడియలు లెక్కబెట్టి ముహూర్తం నిర్ణయించాల్సిందే! అంతెందుకు షూటింగ్లో కెమెరా ముందు ఏ యాంగిల్లో నిలబడాలో గోవిందా సర్కు డైరెక్టర్ కాదు చెప్పాల్సింది.. సర్ ఫ్యామిలీ జ్యోతిష్యుడు చెప్పాలి. ఇదండీ ఇతని సంగతి! -
దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్ రెహమాన్ను ఏమార్చలేం: డైరెక్టర్
చెన్నై సినిమా: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాదంటే ఈ చిత్రం ఉండేది కాదని 'ఇరవిన్ నిళల్' (Iravin Nizhal) చిత్ర దర్శకుడు, కథానాయకుడు పార్తిపన్ (Parthiban) అన్నారు. ఈయన సింగిల్ షాట్లో తెరకెక్కించి గిన్నీస్ రికార్డు కెక్కిన ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలైపులి ఎస్. ధాను పొంది ఈ నెల 24వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్తిపన్ ఆదివారం రాత్రి స్థానిక ఐఐటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పార్క్ ఆవరణలో వైవిధ్యభరితంగా నిర్వహించారు. సంగీత దర్శకుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. పార్తిపన్ మాట్లాడుతూ వైవిధ్యభరిత కథా చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ అవసరం అయ్యిందని, ఆ సపోర్టే ఏఆర్ రెహమాన్ అని పేర్కొన్నారు. అయితే భగవంతుడినైనా అభిషేకంతో ఏమార్చవచ్చు గానీ మన ఏఆర్ రెహమాన్ను ఏమార్చలేమని అభిప్రాయపడ్డారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్..
Abhishek Bachchan On Pan India Movies Does not Believe In The Term: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల 'దస్వీ' చిత్రంతో నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చదువుకు ఉన్న ప్రాధాన్యత తెలుపుతూ తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా చిత్రాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అభిషేక్. పాన్ ఇండియా పదంపై తనకు నమ్మకం లేదన్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ లేదన్న వాదనను తిరస్కరించాడు. ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. 'పాన్ ఇండియా అనే పదంపై నాకు నమ్మకం లేదు. మరేదైనా ఇండస్ట్రీకి ఈ పదాన్ని వాడుతున్నామా ? లేదు కదా. కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హిందీలో మంచి వసూళ్లు సాధించాయి. మంచి సినిమా హిట్ అవుతుంది. లేకుంటే ప్లాప్ ఎక్కడైనా ప్లాప్ అవుతుంది. బాలీవుడ్లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదనడం సరికాదు. గంగుబాయి కతియావాడి, సూర్యవంశీ మంచి హిట్ సాధించాయి. రీమేక్ అనేది ఎప్పుడూ జరిగేదే. అది ఒక చాయిస్ మాత్రమే. మన దగ్గర సినీ ప్రియులు ఎక్కవ. సినిమాకు భాషతో పనిలేదు. ఏ భాషలో వచ్చిన అంతిమంగా అది సినిమానే. వివిధ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే. ఏదిఏమైనా మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే.' అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు. కాగా అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం 'బ్రీత్' వెబ్ సిరీస్ మూడో సీజన్లో నటిస్తున్నాడని సమాచారం. చదవండి: అభిషేక్ బచ్చన్ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్, బిజినెస్ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా అలరించారు కొందరు స్టార్ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్ భాయ్పాయ్, కెకె మీనన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్ యాక్టర్స్కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 1. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్: ఇన్టు ది షాడోస్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. 2. సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్ స్టార్లలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్ లుక్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా వచ్చింది. 3. అజయ్ దేవగణ్ 'ఆర్ఆర్ఆర్'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అజయ్ దేవగణ్ తాజాగా వెబ్ సిరీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' అనే వెబ్ సిరీస్లో అజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్లో టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించడం విశేషం. 4. వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ 'ప్రిన్స్'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్గా పేరొందిన ఈ హీరో రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషిస్తున్న వివేక్ 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్ చేసింది. 5. మాధవన్ విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మాధవన్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్' వెబ్ సిరీస్తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
అభిషేక్ బచ్చన్ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే..
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో విభిన్న కథలను ఎంచుకుంటూ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల బిగ్ బుల్, బాబ్ బిస్వాస్ చిత్రంతో అలరించిన అభిషేక్ తాజాగా 'దస్వీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన తాజాగా నటించిన 'దస్వీ' మూవీ చదువు గొప్పతనం, పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నెల 7న నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ ఒక వెబ్ సిరీస్, 4 సినిమాల్లో నటించాడు. ఇవన్ని నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ కావడం విశేషం. కాగా అభిషేక్ తన నటనతో మెప్పించిన ఆ వెబ్ సిరీస్, సినిమాలేంటో చూసేద్దాం ! చదవండి: ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ 1. దస్వీ నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ 'దస్వీ'. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరక్షరాస్యుడైన గంగారామ్ చౌదరి పాత్రలో అభిషేక్ బచ్చన్ తన నటనతో మెప్పించాడు. అభిషేక్ బచ్చన్తోపాటు యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 7 నుంచి నెట్ఫ్లిక్స్, జియో సినిమాలలో స్ట్రీమింగ్ అవుతోంది. 2. బాబ్ బిస్వాస్ 2012లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ 'కహాని' డైరెక్టర్ సుజోయ్ ఘోష్ కథ అందించిన సీరియల్ కిల్లర్ క్రైమ్ డ్రామా చిత్రం 'బాబ్ బిస్వాస్'. ఈ సినిమాకు సుజోయ్ ఘోష్ కుమార్తె దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అభిషేక్ బచ్చన్.. బాబ్ బిస్వాస్ పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5లో డిసెంబర్ 3, 2021 నుంచి ప్రసారం అవుతోంది. 3. ది బిగ్ బుల్ ప్రముఖ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ 'ది బిగ్ బుల్'. ఇందులో హేమంత్ షా అనే లీడింగ్ రోల్లో అభిషేక్ బచ్చన్ నటించాడు. ఏప్రిల్ 8, 2021 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్షద్ మెహతా ఫైనాన్షియల్ కుంభకోణానికి ప్రేరణగా వచ్చిన 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఈ మూవీ వచ్చింది. 4. లూడో రాజ్ కుమార్ రావు, ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్లతోపాటు అభిషేక్ బచ్చన్ నటించిన డార్క్ క్రైమ్ కామెడీ చిత్రం 'లూడో'. ఈ మూవీకి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో నవంబర్ 12, 2020 నుంచి ప్రదర్శించబడుతున్న ఈ చిత్రంలో 'బటుకేశ్వర్ బిట్టు తివారీ' అనే గూండా పాత్రలో అలరించాడు అభిషేక్ బచ్చన్. 5. బ్రీత్: ఇన్టు ది షాడోస్ జూలై 10, 2020న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సైకలాజికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇన్టు ది షాడోస్'. ఈ వెబ్ సిరీస్తోనే అభిషేక్ బచ్చన్ ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు. ఇందులో అతి భయంకరమైన కిడ్నాపర్ నుంచి తన కుమార్తెను రక్షించడానికి ఎంతకైనా తెగించే డాక్టర్ అవినాష్ సబర్వాల్ పాత్రలో ఆకట్టుకున్నాడు అభిషేక్ బచ్చన్. ఇది 2018లో వచ్చిన 'బ్రీత్' సిరీస్కు సీక్వెల్గా తెరకెక్కింది. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ
టైటిల్: దస్వీ నటీనటులు: అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్ కథ: రామ్ బాజ్పాయ్ నిర్మాత: దినేష్ విజన్ దర్శకత్వం: తుషర్ జలోటా సంగీతం: సచిన్-జిగర్ ఓటీటీ: నెట్ఫ్లిక్స్, జియో సినిమా విడుదల తేది: ఏప్రిల్ 7, 2022 చదువు ప్రాముఖ్యత గురించి చెప్పిన చిత్రాలు రావడం చాలా అరుదు. 'ఈ ప్రంపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు' అని నెల్సన్ మండెలా చెప్పిన కొటేషన్తో చదువు గొప్పతనం గురించి వివరించిన హిందీ చిత్రం 'దస్వీ'. నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ ఇది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. అధికారమనే రుచి మరిగితే భార్యాభర్తల నడుమ కూడా ఎలాంటి శత్రుత్వం, పోటీ వస్తుందో కామెడీ తరహాలో చూపించారు దర్శకుడు తుషర్ జలోటా. సొంత ఇంట్లోనే పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఇదివరకూ చాలానే సినిమాలు వచ్చాయి. కానీ దస్వీ మాత్రం అటు పాలిటిక్స్, ఇటు చదువు విలువను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కామెడీ, సెటైరికల్ జనర్లో రూపొందించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్. జియో సినిమా వేదికగా ఏప్రిల్ 7న విడుదలైన ఈ 'దస్వీ' చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 'దస్వీ' అంటే పదో తరగతి. జాట్ తెగకు చెందిన గంగారామ్ చౌదరి (అభిషేక్ బచ్చన్) హరిత ప్రదేశ్ (కల్పిత రాష్ట్రం)కు ముఖ్యమంత్రి. గంగారామ్ చౌదరి నిరాక్షరాస్యుడు, అవినీతి పరుడైన రాజకీయవేత్త. అనేక కుంభకోణాలు చేసిన ముఖ్యమంత్రిగా పేరుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ స్కామ్లో గంగారామ్ చౌదరిని దోషిగా తేల్చి జైలు శిక్ష విధిస్తారు. దీంతో తన భార్య భీమ్లా దేవి (నిమ్రత్ కౌర్)ని సీఎంగా ప్రకటిస్తాడు గంగారామ్ చౌదరి. జైలుకు వెళ్లిన గంగారామ్ చౌదరి మొదటగా వీఐపీ సౌకర్యాలు పొందుతాడు. కానీ తర్వాత ఆ జైలుకు స్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా జ్యోతి దేశ్వాల్ (యామీ గౌతమ్) ఎంటర్ అవుతుంది. దీంతో గంగారామ్ చౌదరి ఆటలు సాగవు. మిగతా ఖైదీల్లానే గంగారామ్ కూడా ఉండాలని హెచ్చరిస్తుంది జ్యోతి దేశ్వాల్. ఇది తట్టుకోలేక జైలులో పని తప్పించుకునేందుకు పదో తరగతి చదవాలని నిశ్చయించుకుంటాడు గంగారామ్ చౌదరి. అదే విషయం సూపరింటెండెంట్గా జ్యోతి దేశ్వాల్కు చెబుతాడు. తను 10వ తరగతి తప్పించుకునేందుకే అని గ్రహించిన జ్యోతి దేశ్వాల్ అందులో ఫెయిల్ అయితే మళ్లీ సీఎం పదవికి పోటీ చేయొద్దని షరతు విధిస్తుంది. కండిషన్కు ఒప్పుకున్న గంగారామ్ పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతాడు. మరీ గంగారామ్ పదో తరగతి పూర్తి చేశాడా ? అతనికి ఎవరు సహాయపడ్డారు ? అతను పదో తరగతి పూర్తి చేయకుండా ఎవరూ అడ్డుకున్నారు ? చివరికి గంగారామ్ చౌదరి తెలుసుకున్నదేంటీ ? పదో తరగతి తర్వాత గంగారామ్ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు ? అనేదే 'దస్వీ' కథ. విశ్లేషణ: చదువు నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువే అయినా రాజకీయాలకు, చదువుకు ముడిపెట్టి సెటైరికల్ డ్రామాగా 'దస్వీ'ని తెరకెక్కించారు డైరెక్టర్ తుషర్ జలోటా. 2007లో వచ్చిన 'షోబిజ్' సినిమాలో నటించిన తర్వాత తుషర్ జలోటా డైరెక్ట్ చేసిన తొలి చిత్రమిది. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న వివిధ ఛాలెంజ్ (గ్రీన్ ఛాలెంజ్, ఫిట్ ఛాలెంజ్)లను రాజకీయనాయకులు ఎలా తీసుకుంటారో వ్యంగంగా చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. అసలుకే చదువురాని, మోస్ట్ కరప్ట్డ్ సీఎంగా పేరొందిన హరిత ప్రదేశ్ ముఖ్యమంత్రి గంగారామ్ చౌదరికి టీచర్ పోస్టుల భర్తీ స్కామ్లో ఊహించని విధంగా కోర్టు తీర్పు వెలువడుతుంది. అయితే కథ దృష్ట్యా స్కామ్ ఎలా జరిగిందో అదేమి వివరించకుండా నేరుగా జైలు శిక్ష విధిస్తున్నట్లు సినిమాలో చూపించారు. ఇక జైలుకు వెళ్లిన గంగారామ్ చౌదరికి అక్కడ ఎదురయ్యే కష్టాలు అంతా ప్రభావంగా చూపించకపోయిన కామెడీ యాంగిల్లో చూపించారు. రాజకీయనాయకులు జైలులో ఉండి తమ పనులు తమ బంధువులతో ఎలా చేయగలరో ఈ సినిమాలో చూపించారు. అయితే జైలుకు కొత్త సూపరింటెండెంట్గా జ్యోతి దేశ్వాల్ రావడం, ఆమె రూల్స్ తట్టుకోలేక పదో తరగతి చదవాలని గంగారామ్ నిశ్చయించుకోవడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో గంగారామ్ చౌదరి పదో తరగతి చదువుకునే తీరు చాలా నవ్విస్తూ ఆకట్టుకుంటుంది. పదో తరగతిలోని ఒక్కో సబ్టెక్ట్ను జైలులో ఉన్న ఒక్కో ఖైదీ గంగారామ్కు నేర్పించడం చాలా సరదాగా ఆకట్టుకుంటుంది. ఈ సన్నివేశాలు సినిమాకు చాలా ప్లస్గా కూడా నిలిచాయి. ఇక చరిత్ర చదివేటప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ లాలా లజపతిరాయ్, మహాత్మ గాంధీజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులతో కలిసి గంగారామ్ చౌదరి ట్రావెల్ చేసినట్లు చూపించడం, వారి మధ్య సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. వారు తమ ప్రాణాలను ఎందుకు త్యాగం చేయాల్సివచ్చిందో చెప్పడం బాగా ఆకట్టుకున్నాయి. గంగారామ్ చౌదరి.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ నేర్చుకునే విధానం ఎంతో అలరిస్తుంది. అలాగే మరోవైపు గంగారామ్ చౌదరి భార్య భీమ్లా దేవి ముఖ్యమంత్రిగా రాణిస్తూ తన భర్తనే తొక్కేయ్యాలని చూసే సీన్లను కామెడీగా బాగా చూపించారు. గంగారామ్ చౌదరికి మళ్లీ సీఎం పదవి దక్కకుండా చేసే భీమ్లా దేవి ప్రయత్నాలు సైతం బాగున్నాయి. పొలిటిషియన్స్ తమను తాము ఎలా ప్రమోట్ చేసుకుంటారో సెటైరికల్గా చాలా బాగా చూపించారు డైరెక్టర్ తుషర్ జలోటా. ఎవరెలా చేశారంటే ? హరిత ప్రదేశ్ అవినీతి, నిరాక్షరాస్యుడైన ముఖ్యమంత్రి గంగారామ్ చౌదరిగా అభిషేక్ బచ్చన్ అద్భుతంగా నటించాడు. తన యాస, డైలాగ్ డెలీవరీ, నిరాక్షరాస్యుడిగా పలికే కొన్ని మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. రాజకీయ నాయకుడి వ్యవహార శైలీ, అహంకారం, కామెడీ టైమింగ్, హావాభావాలు ఎంతో మెచ్చుకునేలా ఉన్నాయి. గంగారామ్ చౌదరి భార్య భీమ్లా దేవిగా నిమ్రత్ కౌర్ తన నటనతో మెస్మరైజ్ చేసిందనే చెప్పవచ్చు. తన సెటైరికల్ ఎక్స్ప్రెషన్స్, హౌజ్ వైఫ్ నుంచి సీఎంగా మారిన తన ట్రాన్స్ఫార్మెషన్ తీరు చాలా బాగా ఆకట్టుకుంది. తన హ్యూమరస్ డైలాగ్లతో మంచి ఫన్ జెనరేట్ చేసింది. ముఖ్యమంత్రిగా, భర్తను తొక్కేసే భార్యగా, సెల్ఫీల పిచ్చి ఉన్నసెలబ్రిటీగా తన నటనతో చాలా వరకు అలరించిందనే చెప్పవచ్చు. ఇక జైలు సూపరింటెండెంట్ జ్యోతి దేశ్వాల్గా యామీ గౌతమ్ తనదైన నటనతో మెప్పించింది. పైఅధికారి హుందాతనం, అహంకారం నిండి ఉన్న పొలిటిషియన్ ఖైదీకి గుణపాఠం చెప్పే పోలీసు అధికారిగా ఆకట్టుకుంది. అప్పటిదాకా పూర్తి వినోదభరితంగా సాగి.. సినిమా క్లైమాక్స్లో మాత్రం అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టిపడేశాయి. ఈ మూవీకి సచిన్, జిగర్లు అందించిన నేపథ్యం సంగీతం చాలా ఆకట్టుకుంది. సన్నివేశాలకు తగిన బీజీఎంతో వావ్ అనిపించారు. ఓవరాల్గా 'దస్వీ' చిత్రం చదువు ప్రాముఖ్యతను తెలియజేసే పూర్తి వినోదభరితపు పొలిటికల్ సెటైరికల్ డ్రామా. -
ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి
అపర కుబేరులు అంబానీ ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగాయి. వ్యాపారవేత్త అనిల్ అంబానీ-టీనా అంబానిల పెద్ద కుమారుడు జై అన్మోల్ ప్రియురాలు క్రిషా షాతో ఏడడుగులు వేశాడు. ఆదివారం వీరి పెళ్లి వేడుక అంత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ మహోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ కుటుంబాలు సందడి చేశాయి. ఈ సందర్భంగా అన్మోల్-క్రిషాల పెళ్లి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ పెళ్లిలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు షెర్వాని ధరించి కనిపించారు. అలాగే అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ నందా, ముఖేశ్ అంబానీ భార్య నితా అంబానీ, ఇషాతో పాటు ప్రముఖ ఎంట్రప్రెన్యూర్, సోషల్ యాక్టివిస్ట్ పింకిరెడ్డిలు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాగా గతేడాది డిసెంబర్లో అన్మోల్, క్రిషాల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అన్మోల్ అంబానీ-క్రిషా షాల వెడ్డింగ్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలోని అంబానీ ఫ్యామిలీ హోమ్లో జరిగినట్టు సమాచారం. View this post on Instagram A post shared by Pinky Reddy (@pinkyreddyofficial) కేవలం సన్నిహిత వర్గాలు, దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే వీరి వేడుకకు హాజరయ్యారు. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా అన్మోల్, క్రిషాలతోపాటు, బచ్చన్ ఫ్యామిలీ, ముఖేశ్ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనలు పింకి రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు వైరల్గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇది సిక్సర్కు మించినది.. సెలబ్రిటీల ప్రశంసల జల్లు
Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation: క్రికెట్ ప్రియులకు ఆ ఆట అన్నా, ఆటపై వచ్చే సినిమాలన్న పిచ్చి ఇష్టం. వాటిపై సినిమాలు వస్తే ఇండియా వరల్డ్ కప్ గెలిచినంతగా ఆనందపడతారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఎంఎస్. ధోనీ చిత్రానికి ఎంత హిట్ ఇచ్చారో తెలిసిందే. అలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ, క్రికెట్ అభిమానుల కోసం తెరకెక్కిందే '83' చిత్రం. ఎంతగానో ఎదురు చూస్తున్న బాలీవుడ్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. గత క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనాతో ఆలస్యం అయింది. అశేష అభిమానుల ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రణ్వీర్ సింగ్ క్రికెట్ దిగ్గజం, ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్గా కనిపించిన 3 నిమిషాల 49 సెకన్ల ట్రైలర్ను అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం తెగ ఇష్టపడుతున్నారు. ఈ ట్రైలర్ను రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా గ్రామ్లో 'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంక్రెడబుల్ ట్రూ స్టోరీ #83 ట్రైలర్ హిందీ భాషలో వచ్చేసింది. డిసెంబర్ 24, 2021న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లోనే కాకుండా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' రాస్తూ షేర్ చేశాడు. ఈ పోస్ట్పై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ షేక్హ్యాండ్ ఎమోజీతో వ్యాఖ్యానిస్తే, 'వాట్ ఏ వావ్... ఇది సిక్సర్ని మించినది. మీరు చేయలేనిది అంటూ ఏముంది రణ్వీర్ సింగ్. గూస్బంప్స్ తెప్పించింది. ఇది కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేసింది. ఇషా డియోల్ 'ఔట్ స్టాండింగ్. రణ్వీర్ సింగ్ నిన్ను చూసి గర్వపడుతున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా నటించారు. అలాగే తాహీర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దిన్కర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, ఆదినాథ్ కూడా యాక్ట్ చేశారు. దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నదియడ్వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. -
బిగ్ బీ మనవడి బర్త్ డే.. అభిషేక్ బచ్చన్ ఎలా విష్ చేసాడో తెలుసా
Abhishek Bachchan Wishes To Agastya Nanda On His Birthday: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా మంగళవారం (నవంబర్ 23)న 21వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగస్త్యకు అతని సోదరి నవ్య నవేలి, మేనమామ అభిషేక్ బచ్చన్ బర్త్ డే విషెస్ తెలిపారు. పూజలో కూర్చున్న అగస్త్య చిన్ననాటి ఫొటోను తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేశారు అభిషేక్ బచ్చన్. అందులో '21వ హ్యాపీ బర్త్ డే అగస్త్య. దయ, ప్రేమ, కేరింగ్, బాధ్యాయుతమైన మనిషిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నువ్వు అధికారికంగా పెద్దవాడివి. దయచేసి ఇకనైనా ఈ మామ బట్టలు, షూ వేసుకోకు. నీవే సొంతగా కొనుక్కో. లవ్ యూ'. అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) అలాగే అగస్త్య సోదరి నవ్య నవేలి నందా తన సోదరుడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోను ఇన్స్టాలో పంచుకుంటూ ' 21 ఏళ్లుగా నువ్ నా గదిలోకి వచ్చి, నావైపు మౌనంగా చూసి వెళ్లి పోతావు'. రాసుకొచ్చింది. అలాగే అగస్త్య తల్లి శ్వేత బచ్చన్ కూడా తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఖుషీ కపూర్, సుహానా ఖాన్లతో జోయా అక్తర్ తర్వాతి చిత్రంలో అగస్త్య సినిమాల్లోకి అడుగుపెడతాడని గతంలో పుకార్లు వచ్చాయి. సెప్టెంబర్లో జోయా కార్యాలయం బయట ఈ ముగ్గురు కనిపించడం గమనార్హం. View this post on Instagram A post shared by Navya Naveli Nanda (@navyananda) View this post on Instagram A post shared by S (@shwetabachchan) -
నా కొడుకువైనందుకు గర్వంగా ఉంది: అమితాబ్
Amitabh Bachchan Showered Abhishek Bachchan: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తాజా చిత్రం 'బాబ్ బిస్వాస్'. ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. క్రైమ్ డ్రామాగా ఆసక్తిరేకేత్తించింది ఈ సినిమా ట్రైలర్. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ 'బాబ్ బిస్వాస్' ప్రయాణం గురించి సాగింది. ధీర్ఘకాలంగా ఉన్న కోమా నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అతనికి గుర్తు రాని వివరాలు ఏంటి? అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో మధ్యవయస్కుడైన హిట్మ్యాన్ బాబ్ బిస్వాస్ పాత్రలో అభిషేక్ నటించారు. బాబ్ బిస్వాస్ భార్య పాత్రలో చిత్రాంగద సింగ్ యాక్ట్ చేశారు. ఈ ట్రైలర్కు విశేస స్పందన లభించింది. అభిషేక్ బచ్చన్ అభిమానులను ఎంతగానే అలరించింది ఈ ట్రైలర్. అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ చిత్ర ట్రైలర్ను బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ వీక్షించారు. అది చూసి 'నువ్వు నా కొడుకువని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను' అని అభిషేక్ బచ్చన్పై ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'మాకు బాబ్ బిస్వాస్ వంటి అద్భుతమైన బృందం దొరికింది. బాబ్ పాత్రలో లీనమవుతూ నటించడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. నేను పని చేసిన మంచి చిత్రాల్లో ఇది ఒక్కటి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను' అంటూ అభిషేక్ చెప్పారు. T 4100 - I am proud to say you are my Son ! ... BYCMJBBN .. !! ❤️🙏🚩👏👏👏👏👏👏👏👏 https://t.co/yk3BIzJIEb — Amitabh Bachchan (@SrBachchan) November 19, 2021 ఈ చిత్రం కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ చుట్టూ తిరుగుతుంది. మొదట విద్యాబాలన్ నటించిన 'కహానీ' చిత్రంలో ఈ పాత్రను చిత్రీకరించారు. ఈ సినిమాకు దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహించిగా గౌరీ ఖాన్, సుజోయ్ ఘోష్, గౌరవ్ వర్మ నిర్మించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3, 2021న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
Aaradhya Birthday:ఆరాధ్య పదో బర్త్డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్
బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య ముగ్గురు మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. నవంబర్ 13న ఈ ముగ్గురు ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. అభిషేక్, ఐశ్వర్య నుదిటిపై తిలకంతో క్యాజువల్స్ వేర్స్లో కనిపించారు. బచ్చన్ వంశం కుటుంబ సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లినట్లు తెలిసిందే. ఈ దంపతుల కుమార్తె ఆరాధ్య నవంబర్ 16న 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అయితే కూతురు బర్త్డేను మాల్దీవుల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఐశ్వర్య రాయ్ మాల్దీవుల దీవుల్లో చిల్ అవుతున్న దృశ్యాన్ని ఇన్స్టా గ్రామ్లో పంచుకున్నారు. ఆ స్నాప్ను షేర్ చేసి, 'సన్ బ్రీజ్ అండ్ ప్యారడైజ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అభిషేక్ కూడా దీవుల నుంచి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ 'మేల్కొల్పడానికి చెడు దృశ్యం కాదు' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) గత సంవత్సరం, 2020లో, ఐశ్వర్య సోషల్ మీడియాలో ఆరాధ్యతో ఉన్న ఒక అందమైన స్నాప్ను షేర్ చేశారు. అందులో, " నా జీవితపు సంపూర్ణ ప్రేమ, నా ప్రియమైన దేవదూత ఆరాధ్యా.. నేను నిన్ను ఎప్పటికీ, నిత్యం, అనంతంగా ప్రేమిస్తాను. నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నీకోసమే అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ లవ్' అంటూ 9వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధ్య నవంబర్ 16, 2011లో జన్మించింది. -
రెండోసారి గర్భవతి అయిన ఐశ్వర్యరాయ్?వీడియోతో లీక్!
Is Aishwarya Rai Bachchan Pregnant For Second Time: అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? బచ్చన్ ఫ్యామిలీకి మరో వారసుడు రానున్నాడా అనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడింది. ఆ సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్బ్యాగ్ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. బెల్లీని చాలా వరకు దాచి ఉంచే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో ఐశ్వర్య రెండోసారి గర్భవతి అయ్యిందనే రూమర్స్కి బలం చేకూరినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లకు వివాహమైంది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐష్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
‘ధూమ్ 2’ నటుడు మృతి.. హన్సల్ మెహతా ఎమోషనల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, వెలరన్ యాక్టర్ యూసుఫ్ హుస్సేన్ అక్టోబర్ 30న మృతి చెందాడు. 73 ఏళ్ల వయస్సులో కరోనా కారణంగా లీలావతి హాస్పిటల్లో కన్నుమూశాడు. ఆయన ‘ధూమ్ 2’, ‘రాయిస్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ నటుడికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళి తెలిపారు. యూసుఫ్ అల్లుడు ‘స్కామ్ 1992’ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా ట్వీట్ చేసి నివాళి అర్పించాడు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ‘ధూమ్ 2’ మూవీలో ఆయనతో నటించిన అభిషేక్ బచ్చన్, ‘ఫ్యామీలీ మ్యాన్’ స్టార్ మనోజ్ బాజ్పాయ్, నటి పూజా భట్ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చదవండి: పునీత్ రాజ్కుమార్ మృతి, సినీ ప్రముఖుల నివాళి RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732 — Hansal Mehta (@mehtahansal) October 29, 2021 #RIP Yusuf ji. We worked together in several films starting with Kuch na kaho and lastly on Bob Biswas. He was gentle, kind and full of warmth. Condolences to his family. 🙏🏽 pic.twitter.com/6TwVnU0K8y — Abhishek Bachchan (@juniorbachchan) October 30, 2021 Sad News!!! Condolences to @safeenahusain @mehtahansal & the entire family!!! Rest in peace Yusuf saab🙏 https://t.co/q7CFbbEo95 — manoj bajpayee (@BajpayeeManoj) October 30, 2021 This brought tears to my eyes Hansal. Can’t begin to imagine what you’ll are feeling. My deepest condolences to all! 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 30, 2021 -
అద్దె రూపంలో భారీగా సంపాదిస్తున్న బచ్చన్ కుటుంబం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని జుహులో గల వారి వత్స, అమ్ము అనే రెండు బంగ్లా గ్రౌండ్ ఫ్లోర్ ను నెలకు రూ.18.9 లక్షల అద్దెతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాలుకు లీజుకు ఇచ్చినట్లు Zapkey.com పేర్కొంది. ఈ లీజు ఒప్పందాన్ని సెప్టెంబర్ 28, 2021న చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ బంగ్లాలు ప్రస్తుతం బచ్చన్ కుటుంబం నివసిస్తున్న పక్కనే ఉన్నాయి. ఎస్బిఐ అద్దెకు తీసుకున్న ఈ ఆస్తి 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్లు Zapkey పేర్కొంటుంది. అద్దె & డిపాజిట్ డాక్యుమెంట్ ప్రకారం, రెండు బంగ్లాలను నెలకు రూ.18.9 లక్షల అద్దెకు ఇచ్చారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు 25 శాతం అద్దె పెంచుకునే విధంగా ఒక నిబంధన కూడా చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత అద్దె రూ.23.6 లక్షలు, పదేళ్ల తర్వాత రూ.29.5 లక్షలుగా అద్దె ఉంటుందని డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి. 12 నెలల అద్దెకు సమానమైన రూ.2.26 కోట్ల డిపాజిట్ ను ఇప్పటికే బ్యాంకు చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్బిఐ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ స్పందించలేదు. ఈ ప్రాంగణాన్ని ఇంతకు ముందు సిటీ బ్యాంక్కు లీజుకు ఇచ్చినట్లు బ్రోకర్లు తెలిపారు.(చదవండి: చైనా కార్లా?.. టెస్లాకు భారత్ డెడ్లీవార్నింగ్) హెచ్ఎన్ఐ ప్రాంతం ఖాతాదారులకు సేవలందించే అనేక బ్యాంకులు హెచ్ఎన్ఐ ప్రాంతంలో ఉన్నాయని స్థానిక బ్రోకర్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చాలా మంది ప్రముఖులు, వ్యాపార టైకూన్లు నివసిస్తున్నారు. ఈ ప్రదేశంలో వాణిజ్య అద్దె చదరపు అడుగుకు రూ.450 నుంచి చదరపు అడుగుకు రూ.650 మధ్య ఉంటుంది. స్వతంత్ర బంగ్లాలు కొనాలంటే రూ.100 నుంచి 200 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాది మేలో అమితాబ్ బచ్చన్ ముంబైలో టైర్-2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ అభివృద్ధి చేసిన అట్లాంటిస్ అనే ప్రాజెక్టులో రూ.31 కోట్ల విలువైన 5,184 చదరపు అడుగుల గల ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 2020లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.(చదవండి: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్) -
అభిషేక్కు గాయాలు.. హాస్పిటల్కు రాని ఐశ్వర్యరాయ్?
ముంబై : ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట ఓ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి గాయమైంది. తాజాగా ఆ గాయం మరోసారి తిరగబడటంతో ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా కూతురు శ్వేతా బచ్చన్తో కలిసి అమితాబ్ బచ్చన్ లీలావతి హాస్పిటల్కు వెళ్లారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అభిషేక్ బచ్చన్ మరోవైపు అభిషేక్ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్కు రాకపోవడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆమె మణిరత్నం డైరెక్షన్లో పొన్నియన్ సెల్వం అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ఉన్న ఐశ్వర్య ఆదివారం రాత్రి ముంబైకి చేరుకుంది. కాగా ప్రస్తుతం అభిషేక్ బాబ్ బిస్వాస్, దాస్వి చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి: 'ఓ హీరోను టార్గెట్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు' షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి -
రాఖీ స్పెషల్: సెలబ్రిటీల అన్నాచెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లను చూశారా?
.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) View this post on Instagram A post shared by KTR (@ktrtrs) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by S (@shwetabachchan) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Tusshar Kapoor (@tusshark89) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
అభిషేక్ బచ్చన్ లగ్జరీ అపార్ట్మెంట్ అమ్మకం.. ధర ఎంతంటే?
ముంబై: అభిషేక్ బచ్చన్ ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో ఉన్న తన లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించాడు. దీని అమ్మకం ద్వారా ఆయనకు రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో ఒబెరాయ్ 360 అపార్టుమెంట్ పడమరలో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అభిషేక్ బచ్చన్ ఈ ఇంటిని 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా అదే బిల్డింగ్లో షాహిద్ తన అపార్ట్మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాకుండా రాణి ముఖర్జీ, దిశా పటానీ ఖార్ వెస్ట్ పరిసరాల్లో సముద్ర ముఖంగా ఉన్న గృహాలను కొనుగోలు చేశారు. రాణి ముఖర్జీ దీనికోసం రూ.7.12 కోట్లు ఖర్చు చేయగా.. దిశా పటానీ రూ.5.95 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా హన్సల్ మెహతా హిట్ సిరీస్తో పోల్చితే బాగా ఆడలేదనే చెప్పాలి. ఆయన తదుపరి రెండు చిత్రాలు నిమ్రత్ కౌర్తో దాస్వి, చిత్రాంగద సేన్తో బాబ్ బిశ్వాస్ సిమాలు విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా ఐశ్వర్య చివరిసారిగా అనిల్ కపూర్, రాజ్కుమార్ రావుతో కలిసి ఫన్నీ ఖాన్ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా తెరకెక్కనున్న పీరియడ్ ఇతిహాసం. -
ఐశ్వర్యా, అభిషేక్లను కలిసిన నటి వరలక్ష్మీ.. పోస్ట్ వైరల్
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఐశ్వర్యా రాయ్ని నటుడు శరత్కుమార్, ఆయన కుమార్తె, నటి వరలక్ష్మి కలిశారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, ఆనందం వ్యక్తం చేశారు వరలక్ష్మి. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
నువ్వే మా ప్రపంచం, హ్యాపీ బర్త్డే: ఐశ్వర్య రాయ్
అలనాటి అందాల హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇంట బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం (మే 23న) ఐశ్వర్య తల్లి వృందా రాయ్ 70వ వడిలోకి అడుగు పెట్టింది. కోవిడ్ వల్ల ఈ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంట్లోనే బర్త్డే పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఈ సెలబ్రేషన్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐశ్వర్య ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఇందులో వృంద ఎదురుగా మూడు బ్యూటిఫుల్ కేకులతో పాటు అందమైన పూలు పరుచుకుని ఉన్నాయి. 'డార్లింగ్ మమ్మీకి హ్యాపీ బర్త్డే. నువ్వే మా ప్రపంచం. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం.. ఆ భగవంతుడు మా దేవతను చల్లగా చూడాలి' అని ఐశ్వర్య క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన అమ్మమ్మను గాఢంగా హత్తుకున్న ఫొటోతో సహా భర్త అభిషేక్ బచ్చన్తో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పలువురూ ఐశ్వర్య తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్.. దూకి చస్తానని బెదిరించి.. ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. ఇప్పడు ఆమె ఓ స్టార్ యాంకర్