Abhishek Bachchan
-
ఐశ్వర్య ఫోన్ చేస్తే టెన్షన్ వచ్చేస్తుంది: అభిషేక్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవలే 'బి హ్యాపీ' చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో కూతురి గెలుపు కోసం పాటుపడే తండ్రిగా కనిపించాడు. అయితే తండ్రయ్యాక రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఇబ్బందిగా ఉందని.. దానివల్ల అలాంటి సన్నివేశాలున్న సినిమాలను వదిలేసుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఉత్తమ నటుడిగా తొలి అవార్డ్ఇకపోతే 'ఐ వాంట్ టు టాక్' (I want to Talk) చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా షోషా రీల్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా నేను గెల్చుకున్న తొలి అవార్డు ఇదేనంటూ అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంతలో హీరో అర్జున్ కపూర్.. ఐ వాంట్ టు టాక్ (నేను నీతో మాట్లాడాలి) అని ఎవరు అన్నప్పుడు నువ్వు టెన్షన్ పడతావు? అని ప్రశ్నించాడు.పెళ్లయితే తెలుస్తుందిఅందుకు అభిషేక్.. నీకింకా పెళ్లి కాలేదు కదా.. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు దానికి ఆన్సరేంటో నీకే తెలుస్తుంది. నా భార్య ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఒత్తిడిగా ఫీలవుతాను. ప్రత్యేకంగా మాట్లాడాలని ఫోన్ చేసిందంటే కచ్చితంగా మనం సమస్యలో ఇరుక్కున్నట్లే లెక్క అని సరదాగా చెప్పాడు. కాగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య జన్మించింది. కాగా అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నట్లు పలుమార్లు రూమర్లు రాగా.. అవి నిజం కాదని నటుడు క్లారిటీ ఇచ్చాడు.చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
నాన్నను కదా ఆ మాట చెప్పలేకపోతున్నా: అమితాబ్
స్టార్ హీరోహీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. బ్యాగ్రౌండ్ సపోర్ట్తో సినిమా చాన్స్లు ఈజీగానే వస్తాయి. కానీ టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. రికమెండేషన్తో ఒకటిరెండు సినిమా చాన్స్లు వచ్చినా.. నటనతో ఆకట్టుకోలేకపోతే ఎంతపెద్ద స్టార్ కిడ్ అయినా దుకాణం సర్దుకోవాల్సిందే. అయితే కొంతమందికి నెపోటిజం అనేది వరంగా మారితే..మరికొంతమందికి మాత్రం అదే శాపంగా మారుతుంది. ఎంత టాలెంట్ ఉన్నా.. అద్భుతంగా నటించినా..నెపోటిజం(బంధుప్రీతి) వల్లే చాన్స్లు వస్తున్నాయని విమర్శలు చేసే వాళ్లు ఉంటారు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నవారిలో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan ) ఒకరు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) వారసుడిగా ఇండస్ట్రీలోకి పెట్టిన అభిషేక్.. యువ, ధూమ్, గురు, ఢిల్లీ 6 లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించినా.. ఇప్పటికీ ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. నెపోటిజం(Nepotism) వల్లే ఆయన పరిశ్రమలో కొనసాగుతున్నారని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్పై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ తన కొడుకుకు మద్దతుగా నిలిచాడు. ‘ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినప్పటికీ.. అభిషేక్ అనవసరంగా నెపో కిడ్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా?’ అని ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ..‘నిజం చెప్పాలంటే నాక్కుడా అదే ఫీలింగ్. కానీ నాన్నని కదా ఈ మాట చెప్పలేకపోతున్నాను’ అని రిప్లై ఇచ్చాడు. కాగా, గతంలో అభిషేక్ నెపోటిజం విమర్శలపై స్పందిస్తూ..‘నా కెరీర్ విషయంలో నాన్న ఎప్పుడు సాయం చేయలేదు. నాతో సినిమాలను చేయమని ఎవరిని అడగలేదు. అందరి నటులలాగే నేను అవకాశాల కోసం తిరిగాను. నా టాలెంట్ని గుర్తించి దర్శకనిర్మాతలు చాన్స్లు ఇచ్చారు. అంతేకానీ నాన్న ఎప్పుడూ నాకు రికమెండేషన్ చేయలేదు. నా సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించలేదు. నేనే ఆయన నటించిన ‘పా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను’ అని చెప్పారు. -
అభిషేక్ - ఐశ్వర్యపై విడాకుల రూమర్స్.. ఇకపై తెరపడినట్లే!
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్పై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి సమయంలోనూ వీరిద్దరు విడిపోనున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ బర్త్ డే రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడంతో మరోసారి డివోర్స్ వార్తలు వినిపించాయి. అలా ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.విడాకుల వార్తల నేపథ్యంలో స్టార్ కపుల్ బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడి పెళ్లిలో జంటగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఓ శుభ కార్యానికి హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు పడుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి హాజరైన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కిరణ్ రావ్, గాయత్రీ ఒబెరాయ్, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్ముఖ్, విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి సినీతారలు హాజరయ్యారు. అశుతోష్ కుమారుడు కోణార్క్ మార్చి 2న నియతిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.అభిషేక్-ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరిద్దరికి 2011లో ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె జన్మించారు. జూలై 2024లో అనంత్ అంబానీ పెళ్లి నుంచి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్పై విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ జంట పెళ్లికి హాజరవ్వడంతో ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్లే. View this post on Instagram A post shared by Aishwarya Rai Team🇲🇺 (@aishwarya_raifan) -
హెచ్టీ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల వేడుకలో తారల సందడి (ఫొటోలు)
-
ఓటీటీ సినిమా.. కూతురి కల కోసం తండ్రి చేసిన పోరాటమే 'బి హ్యాపీ'
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన 'బి హ్యాపీ' డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం చాలామంది హృదయాన్ని కదిలించేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రెమో డిసౌజా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై లిజెల్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బచ్చన్తో పాటు అమితాబ్ బచ్చన్, నోరా ఫతేహి, ఇనాయత్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. నాసర్, జానీ లివర్ మరియు హర్లీన్ సేథి సహాయక పాత్రల్లో నటించారు.'బి హ్యాపీ' చిత్రాన్ని మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని అభిషేక్ బచ్చన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ తండ్రి, కూతురు మధ్య ఉన్న అమితమైన ప్రేమను చూపుతుంది. ఒంటరి గా ఉన్న తండ్రి శివ్ ( అభిషేక్ బచ్చన్ ) అతని చురుకైన కుమార్తె ధారా (ఇనాయత్ వర్మ) మధ్య విడదీయరాని బంధానికి ప్రేక్షకులు ఫిదా అవుతారని చిత్ర యూనిట్ పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో వేదికపై డ్యాన్స్ చేయాలనే ఆశతో ఉన్న కూతురి కలను ఒక తండ్రి ఎలా నెరవేర్చాలనుకుంటాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. కానీ, ఊహించని సంక్షోభం వల్ల వారిద్దరికి ఎదురయ్యే కష్టాలు ఏంటి..? తన కూతురి ఆశయాన్ని నిజం చేసేందుకు ఆ తండ్రి ఏం చేశాడు..? విధిని కూడా సవాల్ చేసిన ఒక తండ్రి కథే 'బి హ్యాపీ' చిత్రం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మార్చి 14న విడుదల కానుంది. -
ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్కు రూ.18 లక్షలు చెల్లింపు.. ఎందుకంటే..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇద్దరు ప్రముఖ భారతీయ వ్యక్తులు మహేంద్ర సింగ్ ధోనీ, అభిషేక్ బచ్చన్కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రముఖ క్రికెటర్ ధోనికేమో బ్యాంక్ బ్రాండ్ను ఎండార్స్ చేస్తున్నందుకు డబ్బు చెల్లిస్తుంటే.. అభిషేక్ బచ్చన్కు తన ప్రాపర్టీని బ్యాంకు అద్దెకు తీసుకున్నందుకు చెల్లింపులు చేస్తుంది.ఎంఎస్ ధోనీతో డీల్కెప్టెన్ కూల్గా పిలవబడే మహేంద్ర సింగ్ ధోనీని ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. క్రికెట్ జట్టులో అసాధారణ నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన ధోని ఎస్బీఐతో కలిసి పనిచేయడం సంస్థ ఉత్పత్తులను, రెవెన్యూ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని బ్యాంకు నమ్ముతుంది. ధోనీకి తమ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం ఎస్బీఐ రూ.ఆరు కోట్లు చెల్లిస్తుంది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న చివరి భారత కెప్టెన్గా ధోనీకి ఎంతో గుర్తింపు ఉంది. క్రికెట్ అభిమానులను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలుఅభిషేక్ బచ్చన్తో ప్రాపర్టీ లీజు ఒప్పందంబాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఎస్బీఐ నుంచి ప్రతి నెల రూ.18,00,000 అద్దె పొందుతున్నారు. ముంబయిలోని ప్రముఖులు నివసించే జుహు ప్రాంతాలోని బచ్చన్ కుటుంబానికి చెందిన జుహు బంగ్లాను లీజుకు ఇవ్వడానికి బ్యాంకుతో 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో లీజు ఒప్పందంలో భాగంగా బచ్చన్ కుటుంబానికి స్థిరమైన ఆదాయ సమకూరుతోంది. ఈ ఒప్పందంలో కాలానుగుణ అద్దె పెంపు కోసం క్లాజులు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ విజయవంతమైన నటుడిగానే కాకుండా వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా తన వ్యాపార చతురతను నిరూపించుకున్నారు. జుహు బంగ్లాను ఎస్బీఐకు లీజుకు ఇవ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం మెరుగైన ఆర్థిక ప్రణాళికల్లో ఒకటిగా చూస్తున్నారు. -
భర్తకు విషెస్ చెప్పిన ఐశ్వర్య రాయ్.. ఎప్పటిలాగే ఆలస్యంగా!
బాలీవుడ్ అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇవాళ అభిషేక్ తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. అభిషేక్ బచ్చన్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. మీకు ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యం, ప్రేమతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే అభిషేక్ బచ్చన్.. గతేడాది ఐ వాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో అభిషేక్ విభిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.ఐశ్వర్య రాయ్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది. ఇందులో చియాన్ విక్రమ్, రవి మోహన్, శోభితా ధూళిపాల, త్రిష కృష్ణన్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.ఐశ్వర్య- అభిషేక్పై రూమర్స్..కాగా.. గతేడాది అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు. ఇద్దరూ విడివిడిగా వేడుకలో కనిపించడంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతకుముందు కూతురు ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో అభిషేక్ కనిపించకపోవడంతో డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట ఈ వార్తలపై స్పందించలేదు.జంటగా పార్టీకి హాజరుబాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతేడాదిలో మరింత బలపడ్డాయి. కానీ వీరిద్దరు ఓ పార్టీలో ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు దిగారు. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. దీంతో విడాకుల రూమర్స్కు చెక్ పడింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
కెరీర్లో ఎక్కువ ఫ్లాపులే.. ఆస్తులు మాత్రం కోట్లలో..
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. చాన్స్ల కోసం ఏళ్లుగా ఎదురుచూసే వాళ్లు చాలానే ఉంటారు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లకి మాత్రం ఫస్ట్ చాన్స్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే..వాళ్లను కూడా పట్టించుకోరు. వారసత్వంగా వచ్చి.. వెనక్కి వెళ్లిన నటులు చాలా మందే ఉన్నారు. మరికొంతమందికి మాత్రం ఎన్ని ఫ్లాపులు వచ్చిన అవకాశాలు వస్తునే ఉంటాయి. వరుస సినిమాలు తీస్తూ కోట్ల ఆస్తులను కూడబెడుతుంటారు. అలాంటి వారిలో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఒక్కరు. ఆయన సీనీ కెరీర్లో అత్యధిక ఫ్లాపులే ఉంటాయి. కానీ ఆస్తుల విషయంలో మాత్రం స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గలేదు. నేడు(ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ బర్త్డే. ఈ సందర్భంగా ఆయన ఆస్తులపై ఓ లుక్కేద్దాం.విశాలవంతమైన విల్లాలుఅభిషేక్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లకు పైగా ఉంటుందట. ఇందులో ఎక్కువగా సొంతంగా సంపాదించుకున్నదే అట. తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తులు కలిపిస్తే..ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సినిమాలపై వస్తే డబ్బును ఎక్కువగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టాడట. అలాగే దుబాయ్లో ఓ విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశాడు. అభిషేక్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఉంటాడు. దీని ధర 16 కోట్ల రూపాయలు. ‘బాంద్రా-కుర్లా’ కాంప్లెక్స్, 5 BHK అపార్ట్మెంట్తో సహా అనేక ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఈ హీరోకి క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి. అందుకే జైపూర్ పింక్ పార్టనర్స్ (ప్రో కబడ్డీ), చెన్నైయిన్ FC (ఫుట్బాల్) పెట్టుబడి పెట్టారు.లగ్జరీ కార్లుఅభిషేక్ దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్ జీటీ(3.29 కోట్లు), ఆడి ఏ8ఎల్, మెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130X లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్పై కూడా భారీగా డబ్బు పెట్టాడల. ముంబైలో పలు చోట్ల ఓపెన్ ఫ్లాట్లు కూడా కొనుగోలు చేశారట. మొత్తంగా అభిషేక్ ఆస్తులు 280 కోట్లకు పైనే ఉంటుందట. అయితే భార్య ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)తో పోలీస్తే మాత్రం అభిషేక్ ఆస్తులు విలువ చాలా తక్కువేనట. ఐశ్వర్య మొత్తం ఆస్తుల విలువ రూ.776 కోట్ల వరకు ఉంటుందట.నటనకు ప్రశంసలు కానీ..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్.. కెరీర్లో ఎక్కువగా ఫ్లాపులనే చవి చూశడు. ఆయన తొలి సినిమా రెఫ్యూజీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే నటన పరంగా మాత్రం అభిషేక్కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అభిషేక్ నటించిన 8 సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. అయినా కూడా అభిషేక్ని చాన్స్లు వచ్చాయి. ధూమ్ సినిమాతో అభిషేక్కి తొలి బ్లాక్ బస్టర్ దక్కింది. బంటీ ఔర్ బబ్లీ మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్యాపులు వచ్చాయి. ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్, ఐ వాంట్ టు టాక్ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన గులాబ్ జామున్, డ్యాన్సింగ్ డాడ్తో పాటు ధూమ్ 4 చిత్రాల్లో నటిస్తున్నాడు. -
బర్త్డే స్పెషల్..అభిషేక్ బచ్చన్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మరోసారి ఢిల్లీ హైకోర్టుని(Delhi High Court) ఆశ్రయించింది. గతేడాదిలో తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కథనాలను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆరాధ్య పిటిషన్పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో గూగుల్కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆ వీడియోలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా, కొన్ని వెబ్సైట్లతో పాటు పలు సోషల్మీడియా ఖాతాలు వాటిని పాటించలేదు. దీంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది. (ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)గతేడాదిలో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే వార్తలను యూట్యూబ్ వేదికగా ప్రసారం చేశారు. ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆరాధ్య ఇక లేరంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యాజ్యం వేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తప్పు అని, ఇలాంటి చర్యలు సమాజంలో అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కోర్టు తెలిపింది. సమాజంలోని ప్రతి చిన్నారిని గౌరవంగా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం ఎట్టిపరిస్థితిల్లోనూ సహించదని కోర్టు పేర్కొంది. ఇలాంటి వీడియోలు గూగుల్ దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే తొలగించాలని న్యాయస్థానం తెలిపింది. అయితే, కొన్ని ఇంకా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తన తండ్రితో పాటు ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించడంతో గూగుల్కు మరోసారి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పిటిషన్పై విచారణ మార్చి 17న జరగనుందని తెలిపింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. -
అభిషేక్ బచ్చన్ మూవీతో ఏం చేయాలో దిక్కుతోచలేదు: డైరెక్టర్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గతేడాది ఐ వ్యాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతేడాది నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు సుజిత్ సిర్కార్ ఈ మూవీ పరాజయం గురించి మాట్లాడారు. ఈ సినిమా ఫలితం తనకు దిక్కుతోచని పరిస్థితి తీసుకెళ్లిందని అన్నారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు. ఐ వాంట్ టు టాక్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ థియేటర్లలో విఫలం కావడం తనను బాధించిందని సుజిత్ సిర్కార్ తెలిపారు.డైరెక్టర్ సుజిత్ సిర్కార్ మాట్లాడుతూ.. "నా నిబంధనల ప్రకారం.. నాకు ఉన్న దృష్టితో నేను సినిమాలు తీయగలిగినంత కాలం తీస్తూనే ఉంటా. ఇలాంటి పరాజయాలు కొన్నిసార్లు మమ్మల్ని కలవరపెడుతూనే ఉంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనే విషయం తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా. ఈ సినిమా ఫలితం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు నా సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలో చాలామంది ఆడియన్స్ స్పందించడం సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి చిత్రమనే నేను అనుకుంటున్నా.' అని అన్నారు.కాగా.. సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్పై రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ఓ ఎన్నారై పాత్రలో కనిపించారు. జీవితాన్ని మార్చే ఓ సర్జరీ చేయించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకునే ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం ఏకంగా బరువు కూడా పెరిగాడు. విభిన్నమైన పొట్టతో అభిషేక్ బచ్చన్ ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో అహల్య బమ్రూ, జయంత్ క్రిప్లానీ, జానీ లీవర్, పెర్లే డే, క్రిస్టిన్ గొడ్దార్డ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఐ వాంట్ టూ టాక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
అభిషేక్ బచ్చన్కు ఎస్బీఐ నుంచి భారీ ఆదాయం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.ఎస్బీఐ నుంచి నెలకు రూ.18లక్షలుదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.రూ.280 కోట్ల నెట్వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్బీఐ లీజుకు తీసుకుంది. -
సందడిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
క్రికెట్ లీగ్లో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) క్రికెట్ లీగ్లో పెట్టుబడులు పెట్టాడు. క్రీడా ఔత్సాహికుడైన బచ్చన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఐసీసీ అమోదం పొందిన ETPL ఈ ఏడాది లాంచ్ కానుంది. ఈ లీగ్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఆమ్స్టర్డామ్, రోట్టర్డామ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో నగరాలకు చెందిన ప్రాంచైజీలు బరిలో ఉంటాయి. ఈ లీగ్ జులై 15 నుంచి ఆగస్ట్ 3 మధ్యలో జరుగుతుంది. ఫ్రాంచైజీ పేర్లు, ఓనర్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.కాగా, అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ మరియు ఇండియన్ సూపర్ లీగ్లో (ఫుట్బల్) పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు లీగ్ల్లో బచ్చన్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాడు. ETPLలో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. ఈ లీగ్ మూడు దేశాల (ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్) క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు వస్తుందని అన్నాడు. ETPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుందని తెలిపాడు. క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇది సరిహద్దులను అధిగమించే ఏకీకృత శక్తి అని బచ్చన్ చెప్పుకొచ్చాడు. ETPLలో అభిషేక్ చేరిక ప్రధాన పెట్టుబడులను ఆకర్శిస్తుంది. ETPL యూరోపియన్లకు క్రికెట్ను మరింత చేరువ చేస్తుంది.ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ క్రికెట్ లీగ్ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ లీగ్ భారత్ వేదికగా జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్(BBL) ఎక్కువ ప్రజాధరణ ఉంది. వివిధ దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్లు..ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్)గ్లోబల్ టీ20 కెనడా (కెనడా)ఇండియన్ ప్రీమియర్ లీగ్ (భారత్)ఇంటర్నేషన్ లీగ్ టీ20 (దుబాయ్)లంక ప్రీమియర్ లీగ్మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్ఏ)నేపాల్ ప్రీమియర్ లీగ్పాకిస్తాన్ సూపర్ లీగ్SA20 (సౌతాఫ్రికా)సూపర్ స్మాష్ (న్యూజిలాండ్)టీ20 బ్లాస్ట్ (ఇంగ్లండ్) -
ఓటీటీలో అభిషేక్ బచ్చన్ సినిమా.. కానీ, షరతులు వర్తిస్తాయ్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన కొత్త సినిమా 'ఐ వాంట్ టు టాక్' ఓటీటీలోకి వచ్చేసింది. అభిషేక్ ప్రధాన పాత్రలో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామాగా గతేడాది నవంబర్ 22న విడుదలైంది. అయితే, థియేటర్స్లో పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. కానీ, సినిమా చూసిన కొందరు పాజిటివ్ రివ్యూలు ఇవ్వండంతో నెట్టింట కాస్త క్రేజ్ పెరిగింది. అయితే, చాలామంది ఈ చిత్రాన్ని ఓటీటీలో వచ్చాక చూడొచ్చు అనే అభిప్రాయం ఉన్నట్లు సోషల్మీడియాలో వెల్లడి అయింది.'ఐ వాంట్ టు టాక్' సినిమా ఆమెజాన్ ప్రైమ్లో తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సినిమా చూడాలంటే రూ. 349 చెల్లించాలని అమెజాన్ పేర్కొంది. అయితే, ఉచిత స్ట్రీమింగ్ విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా, ఇలా అద్దెకు ఉన్న సినిమాలు 30 రోజుల టైమ్లైన్ తర్వాత ఉచితంగా ప్రసారం చేయబడతాయి.అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ఎన్ఆర్ఐ అర్జున్ సేన్గా మెప్పించారు. తన డ్రీమ్ నిజమైన తర్వాత అకస్మాత్తుగా క్యాన్సర్ బారీన పడిన అర్జున్ ఆపై భార్యతో విడాకులు తీసుకోవడం. ఈ క్రమంలో తన కుమార్తెకు ఎదురైన కష్టం వంటి సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అర్జున్ కేవలం 100 రోజులు మాత్రమే జీవిస్తాడని వైద్యులు చెప్పడంతో ఆయన తన కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఎలాగైన క్యాన్సర్ నుంచి మరణాన్ని జయించాలని సుమారు 20 ఆపరేషన్స్ చేయించుకుంటాడు. అయితే, ఈ కథలో అర్జున్ సేన్ చివరికి ప్రాణాలతో బయటపడుతాడా..? ఆయన కుమార్తె పరిస్థితి ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్.. అభిషేక్తో సెల్ఫీలు
బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారని ఏళ్ల తరబడి నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదైతే ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. వాళ్లు కలిసి ఉండట్లేదని, విడాకులు తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ట్రాష్.. అందులో నిజమే లేదని ఫోటోలతో సమాధానం చెప్పారు ఐష్- అభిషేక్.భర్తతో పార్టీకి వెళ్లిన ఐశ్వర్యవీరిద్దరూ తాజాగా ఓ పార్టీకి కలిసి వెళ్లారు. ఇద్దరూ నలుపు రంగు దుస్తులే వేసుకున్నారు. పార్టీలో ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ మేరకు ఓ ఫోటోను ఎంటర్ప్రెన్యూర్ అను రంజన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఐష్ తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు. అందరూ కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందించారు. నటి ఆయేషా జుల్క సైతం ఐష్ దంపతులతో దిగిన సెల్ఫీలు షేర్ చేసింది.ఐష్ చేస్తోందదేఇది చూసిన నెటిజన్లు చాలా బాగుంది.. ఈ ఒక్క ఫోటోతో చాలామంది మెదళ్లలో ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేశావు, ధైర్యవంతులైన వారు సమస్య నుంచి తప్పించుకోవడానికి విడాకులు ఎంచుకోరు. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ఈ దంపతులు కూడా అదే చేస్తున్నారు. ఐష్, తన తల్లితోపాటు భర్తతో కలిసి ఓ పార్టీకి వెళ్లడమే అందుకు నిదర్శనం అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anu Ranjan (@anuranjan1010) చదవండి: నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. అమలాపాల్ -
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
ఐశ్వర్య డ్రెస్సింగ్పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
విడాకుల వార్తల వేళ అభిషేక్ సంచలన కామెంట్స్
-
యూట్యూబర్గా సక్సెస్ అయ్యి..ఏకంగా బాలీవుడ్ మూవీ..!
పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అరోవిల్’నురహస్య నగరం అంటారు. కులం, మతం, డబ్బు లేకుండా కొంతమంది జీవించే ఇక్కడి నుంచే పెరిగి పెద్దదయ్యింది అహిల్య బామ్రూ. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్గా ఈమె చేసిన ‘ప్రయోగం’ సక్సెస్ అయ్యి బాలీవుడ్ దాకా చేర్చింది. ఇటీవల విడుదలయ్యి ప్రశంసలు పొందుతున్న‘ఐ వాంట్ టు టాక్’లో అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించింది. ‘అరోవిల్’లో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను తీర్చిదిద్దింది అంటున్న అహిల్య జీవితం ఆసక్తికరం.‘నేను ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కానేమో. ఆరోవిల్లో పెరగడం వల్ల నేను ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగాను’ అంటుంది అహిల్యా అమ్రూ. అహిల్యా గురించి చె΄్పాలంటే ఒక విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి చాలదు. ఆ అమ్మాయి గాయని, చిత్రకారిణి, డాన్సర్, నటి, వాయిస్ఓవర్ ఆర్టిస్ట్, డిజిటల్ క్రియేటర్...‘ఇవన్నీ నేను ఆరోవిల్లో ఉచితంగా నేర్చుకున్నాను. ఉచితంగా నేర్పించేవారు అక్కడ ఉన్నారు. బయట ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతిదానికీ డబ్బు కావాలి’ అంటుంది అహిల్య.ఇంతకీ ఆరోవిల్ అంటే? అదొక రహస్య నగరి. ఆధ్యాత్మిక కేంద్రం. లేదా భిన్న జీవన స్థావరం. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ 42 దేశాలకు చెందిన 3000 మంది పౌరులు జీవిస్తున్నారు. వారి పని? డబ్బు ప్రస్తావన లేకుండా జీవించడం. పండించుకోవడం, తినడం, పుస్తకాలు చదువుకోవడం, తమకు వచ్చింది మరొకరికి నేర్పించడం, మెడిటేషన్. వీరు చేసేవాటిని ‘గ్రీన్ ప్రాక్టిసెస్’. అంటే పృథ్వికీ, పర్యావరణానికీ ద్రోహం చేయనివి. అక్కడే అహిల్య పెరిగింది.స్వేచ్ఛ ఉంటుంది‘మాది ముంబై. నేను అక్కడే పుట్టా. ఆ తర్వాత మా అమ్మానాన్నలు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ నేను ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆరోవిల్కు మారాము. అక్కడ విశేషం ఏమిటంటే చదువులో, జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది.ఏది ఇష్టమో అది నేర్చుకుంటూపోవచ్చు. విసుగు పుడితే మానేయవచ్చు. బయట ప్రపంచానికి సంబంధం లేని పోటీతో జీవన శైలితో ఉండవచ్చు. ఇది అందరికీ సెట్ అవదు. కాని నాకు సెట్ అయ్యింది. నేను ఇక్కడ ఎన్నెన్ని నేర్చుకున్నానో చెప్పలేను. ఇక్కడ పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతితో ముడిపడి ఉండటం అంటే ఏమిటో తెలిసింది. భిన్న సంస్కృతులు, జీవితాలు తెలిశాయి. ఆరోవిల్ లక్ష్యం విశ్వమానవులను ఏకం చేయడం. ఇది చిన్న లక్ష్యం కాదు. మనుషులందరూ ఒకటే అని చాటాలి. బయట ఉన్న రొడ్డకొట్టుడు జీవితంతో, ΄ోటీతో విసుగుపుట్టి ఎందరో ఇక్కడకొచ్చి ఏదైనా కొత్తది చేద్దాం అని జీవిస్తున్నారు. ఆరోవిల్ మీద విమర్శలు ఉన్నాయి. ఉండదగ్గవే. కాని ఇది ప్రతిపాదిస్తున్న జీవనశైలి నచ్చేవారికి నచ్చుతుంది’ అంటుంది అహిల్య.రీల్స్తో మొదలుపెట్టి...వ్యంగ్యం, హాస్యం ఇష్టం అ«ధికంగా ఉన్న అహిల్య సరదాగా రీల్స్తో మొదలుపెట్టి డిజిటల్ క్రియేటర్గా మారింది. మన దేశానికి వచ్చిన విదేశీయులు ఆవును చూసి, గేదెను చూసి ఎంత ఆశ్చర్యపోతుంటారో అహిల్య చాలా సరదాగా చేసి చూపిస్తుంది. అందరి యాక్సెంట్, బాడి లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే వీడియోలకు ఫ్యాన్స్ కొల్ల. అందుకే అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలో నవంబర్ 22న విడుదలైన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ నటిగా మొదటి అడుగు వేయగలిగింది అహిల్య. ఈ సినిమాలో కేన్సర్ పేషంట్ అయిన సింగిల్ పేరెంట్ అభిషేక్ తన కూతురితో అంత సజావుగా లేని అనుబంధాన్ని సరి చేసుకోవడానికి పడే కష్టం, కూతురుగా అహిల్య పడే తాపత్రయం అందరి ప్రశంసలు పొదేలా చేశాయి. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా వైరల్ (ఫోటోలు)
-
విడాకుల రూమర్లు: హాట్ టాపిక్గా ఐష్-అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా
బాలీవుడ్లో అందమైన జంట అనగానే మొదటగా గుర్తొచ్చే పేర్లు అందాలతార స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, హీరో అభిషేక్ బచ్చన్. ఆర్థికంగా కూడా చాలా బలమైన జంట వీరిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఐష్, ఇంకా అభిషేక్ విడిపోతున్నారనే పుకార్ల మధ్య ఖరీదైన వారి దుబాయ్ విల్లా నెట్టింట్ హల్ చల్ చేస్తోంది.బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ లిస్ట్లో టాప్లో ఉండే ఐశ్వర్య.. కెరియర్ పీక్లో ఉండగానే 2007లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ను వివాహమాడింది. ఈ దంపతులకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. విలాసవంతమైన కార్లు, బంగ్లాలు, వ్యాపారాలతో ఐశ్వర్యరాయ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ దేశంలో అత్యంత ధనిక జంట అని చెప్పవచ్చు. సీఎన్బీసీ నివేదిక ప్రకారం, ఐశ్వర్య నికర విలువ రూ. 776 కోట్లుగా ఉండగా, అభిషేక్ బచ్చన్ రూ. 280 కోట్లు . 2015లో కొనుగోలు దుబాయ్విల్లా ఇపుడు హాట్ టాపిక్. దుబాయ్ విల్లాదుబాయ్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్లోని ఈ బంగ్లా సుమారు 16 కోట్ల రూపాయల విలువ చేస్తుంది ఈ లగ్జరీ బంగ్లా. అత్యాధునిక సౌకర్యాలతో శాంక్చురీ ఫాల్స్లో ఒక అందమైన విశాలమైన విల్లాను వీరు కొనుగోలు చేశారు. స్విమ్మింగ్ పూల్, ఆధునిక వంటగది, ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్, హోమ్ థియేటర్, విశాలమైన వాకింగ్ ట్రాక్ లాంటివి ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలో 5 విలాస వంతమైన బంగ్లాలు, ముంబైలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లలో అనేక ఖరీదైన అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. -
ఆ విషయంలో ఐశ్వర్యకి థ్యాంక్స్: అభిషేక్ బచ్చన్
‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేస్తున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలను నా భార్య ఐశ్వర్యా రాయ్ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. ఆ విషయంలో తనకు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని హీరో అభిషేక్ బచ్చన్ అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ–‘‘కుటుంబం విషయంలో ఐశ్వర్య ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఆమె వల్లే నేను సినిమాలపై పూర్తీగా దృష్టి పెడుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు.నేను పుట్టిన తర్వాత మా అమ్మ జయా బచ్చన్ సినిమాలు మానేశారు. భర్త, పిల్లలు, కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న అమితాబ్ బచ్చన్ సినిమాలతో బిజీగా ఉండి రాత్రి ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ నా స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్ కు, నా బాస్కెట్ బాల్ cటీలకు నాన్న వచ్చేవారు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి. అలాగే వారి నుంచి ప్రేరణ ΄పొందాలి. ప్రపంచంలోని తల్లిదండ్రులపై నాకు అమితమైన గౌరవం ఉంది.తల్లి బాధ్యతలు మరెవరూ చేయలేరు. తండ్రికి కూడా ఎంతో ప్రేమ, బాధ్యతలు ఉంటాయి. కానీ వాటిని పైకి చూపించడు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమవుతుంది’’ అని చె΄్పారు అభిషేక్. కాగా అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ మాటలతో ఆ వార్తలకు చెక్ పడిందని బాలీవుడ్ టాక్. -
కూతురు బర్త్ డేకు రాని అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్య విడాకులు కన్పర్మా?
-
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -16 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
గురునానక్ జయంతి: ప్రత్యేక ప్రార్థనలు, ప్రసాదం రెసిపీ షేర్ చేసిన బాలీవుడ్ నటి
కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి పర్వదినాన్ని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ జరుపుకుంది. ఈ శుభ సందర్భంగా స్వయంగా ఇంట్లోనే కడ ప్రసాదం(హల్వా) తయారు చేసి గురుద్వారాలో ప్రార్థనలు, నివేదన అనంతరం పంచిపెట్టింది. కుటుంబంలో తరతరాలుగా కడ ప్రసాదం తయారు చేస్తున్న వైనాన్ని వివరించి, ఈ రెసిపీ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. గురుద్వారాలో పూజల తరువాత మీడియాకు ప్రసాదాన్ని పంచిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.గురునానక్ జయంతి సందర్భంగా ప్రసాదం హల్వాను ఎలా తయారు చేయాలో దశలవారీగా నిమ్రత్ కౌర్ వెల్లడించింది. ఈ ప్రసాదం తయారు చేయడం తన తల్లి దగ్గరనుంచి నేర్చుకున్నట్టు తెలిపింది. అలాగే తన తాతగారు చాలా ఏళ్లు గురుద్వారాలో హల్వా తయారు చేసేవారనీ, ఆయన్నుంచి అమ్మ , అమ్మనుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది.కాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ అభిషేక్ బచ్చన్తో ఎఫైర్ ఉందనే పుకార్ల మధ్య గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మధ్య సమస్యలకు నిమ్రత్ కౌర్తో ఎఫైర్ ఒక కారణమని ఊహాగానాలు జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఊహిస్తున్నాయి. ఈ వివాదాలను, ఆరోపణల ప్రభావం తనమీద ఏమాత్రం పడకుండా నిమ్రత్ కౌర్ తన పని తాను చేసుకుపోతోంది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ
గత కొన్నాళ్లుగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల రూమర్స్ దీనికి కారణం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడిపోనున్నారనే టాక్ బాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు నిమ్రత్ కౌర్ అనే నటి కారణమని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది పక్కనబెడితే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఒకేసారి 10 ఫ్లాట్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ప్రభాస్ 'కల్కి'లో ఆశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ములంద్ ఏరియాలోని ఒబెరాయ్ రియల్టీ, ఒబెరాయ్ ఎటెర్నియాలో 10 ఫ్లాట్స్ ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.24.95 కోట్లు అని తెలుస్తోంది. అక్టోబర్ 9న రిజిస్టేషన్ జరిగిన ఈ కొనుగోలు కోసం కోటిన్నర వరకు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారట.ఈ పదింటిలో ఆరు అభిషేక్ పేరు మీద రిజిస్టర్ చేయించగా.. నాలుగింటిని అమితాబ్ పేరుపై రిజిస్టర్ చేయించారు. ఇకపోతే గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ దాదాపు రూ.200 కోట్ల మేర రియల్ ఎస్టేట్ కోసం డబ్బు పెడుతున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు పలు సినిమాలతో తండ్రికొడుకు ఫుల్ బిజీగా ఉన్నారు. విడాకులు రూమర్స్ కావొచ్చు, ఫ్లాట్స్ కొనడం కావొచ్చు, ఏదో రకంగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
ఇంట్లో ఇల్లాలు.. సెట్లో ప్రియురాలు.. అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ డివోర్స్ కన్ఫర్మ్
-
మరోసారి విడాకుల రూమర్స్.. అభిషేక్ రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురించి గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిలోనూ వీరిద్దరు విడివిడిగా ఫోటోలకు ఫోజులివ్వడంతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అయితే తాజాగా అభిషేక్కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. దీంతో తమపై వస్తున్న విడాకాల రూమర్స్పై చివరికీ అభిషేక్ బచ్చన్ స్పందించాల్సి వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను దాని గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇదంతా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటాం. నాకు పెళ్లయింది క్షమించండి' అన్నాడు అతను తన ఉంగరాన్ని చూపించాడు. దీంతో తమపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్ పెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో కొత్తదా? పాతదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. అభిషేక్, ఐశ్వర్య 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించారు. వీరిద్దరూ జంటగా ధాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, గురు, ధూమ్- 2, రావణ్ లాంటి చిత్రాల్లో నటించారు. -
ఐశ్వర్య-అభిషేక్ల విడాకుల రూమర్.. ఆ డాక్టరే కారణమా? (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్తో విడాకుల రూమర్స్..
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. ఈ జంటకు ఆరాధ్య అనే ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఐశ్వర్యరాయ్ ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు. తన అభిషేక్ బచ్చన్తో కలిసి పెళ్లి వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి.అయితే గత కొన్నేళ్లుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ బర్త్ డే రోజు ఆలస్యంగా విష్ చేయడంతో అప్పట్లోనే.. వీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆరాధ్య పుట్టినరోజు సైతం ఇలాంటి రూమర్స్ బీటౌన్లో వైరలయ్యాయి.తాజాగా అభిషేక్ బచ్చన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఐశ్వర్యరాయ్తో విడాకులు తీసుకుంటున్నట్లు అభిషేక్ మాట్లాడిన వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల సినీతారలపై డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో మరోసారి విడాకుల చర్చ మొదలైంది. అయితే ఇది ఫేక్ వీడియో అంటూ ఐశ్వర్య, అభిషేక్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by aishwaryafan (@aishwaryaraireall) -
ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా?
బాలీవుడ్ జంట ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారట! కొన్ని నెలల నుంచి ఈ వార్త జోరీగలా సోషల్ మీడియా అంతటా తిరుగుతోంది. కలిసి కనిపించకపోతే విడాకులనేస్తారా? మా కాపురంలో నిప్పులు పోస్తున్నారేంటని హీరో అభిషేక్ బచ్చన్ ఎప్పటిలాగే ఇటీవల సైతం మండిపడ్డాడు. తాము బాగానే ఉన్నామని తెలియజేస్తూ.. ఒకరి బర్త్డేకి మరొకరు ఆలస్యంగానైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.ఫంక్షన్కు వేర్వేరుగాఅయినా ఎక్కడో తేడా కొడుతుంది అని ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు. వీరి అనుమానాలను నిజం చేస్తూ ఐశ్వర్య తన కూతురు ఆరాధనను తీసుకుని అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లింది. అలా అని అభిషేక్ వెళ్లలేదా? అంటే వెళ్లాడు. తన తల్లిదండ్రులు జయ- అమితాబ్ బచ్చన్తో కలిసి ఫంక్షన్కు వెళ్లాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. కుటుంబమంతా కలిసి రాకుండా ఇలా సెపరేట్గా వచ్చారేంటి? వీళ్లు కలిసి లేరని ఇక్కడే అర్థమవుతోందోని ఎవరికి వారే అనుకున్నారు. విడాకుల పోస్టుపై అభిషేక్ ఆసక్తిపెళ్లికి కలిసి వెళ్లలేదు, కలిసి ఫోటోలూ దిగలేదు.. కానీ లోపలికి వెళ్లాక మాత్రం ఐష్- అభిషేక్ పక్కపక్కనే కూర్చుని కబుర్లాడినట్లు ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. దీంతో వీరి వ్యవహారం ఎవరికీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఇంతలోనే తాజాగా అభిషేక్ ఓ విడాకుల పోస్టును లైక్ చేశాడు. అందులో ప్రేమ కష్టంగా మారితే.. అని రాసుంది.50 ఏళ్ల తర్వాత కూడా..ఇంకా ఏమని ఉందంటే.. విడాకులు తీసుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదు. కానీ కొన్ని సార్లు జీవితం మనం అనుకున్నట్లు సాగదు. దశాబ్దాలపాటు కలిసుండి వేరుపడితే ఆ బాధను ఎలా తట్టుకుంటున్నారు? 50 ఏళ్ల తర్వాత కూడా విడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలున్నాయని అందులో రాసుకొచ్చారు. పత్రికలో వచ్చిన వ్యాసాన్ని దీనికి జత చేశారు. ఈ పోస్టును అభిషేక్ లైక్ చేయడంతో.. మళ్లీ విడాకుల చర్చ మొదలైంది.చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్ -
విలన్గా అభిషేక్ బచ్చన్.. షారుఖ్తో ఢీ!
షారుక్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుక్ ఖాన్ , ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ తెరకెక్కనుంది. (చదవండి: ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్లో నటిస్తే.. ఇది అదే)ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీలో విలన్ రోల్ కొత్తగా ఉంటుందట. ఈ రోల్కు అభిషేక్ బచ్చన్ను సంప్రదించారట సుజోయ్ ఘోష్. నెగటివ్ రోల్ కావడంతో మొదట కాస్త విముఖతను వ్యక్తం చేసిన అభిషేక్.. పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఫైనల్గా ఓకే చె΄్పారని బాలీవుడ్ సమాచారం. -
అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!
శుభమా అని అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుంటే విడాకుల గురించి మాట్లాడుతున్నాం ఏంటా అని మీరు అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చర్చంతా దీని గురించే నడుస్తోంది. గత కొన్నాళ్లుగా విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ విడాకుల గురించి అప్పుడప్పుడు పుకార్లు వినిపించాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అంబానీ పెళ్లి వల్ల ఇదే నిజమేనా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: అనంత్- రాధిక వెడ్డింగ్.. ఒక్క పాటకు రూ.25 కోట్లా!)ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కనివినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడ ప్రముఖులు పెళ్లిలో సందడి చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా మహేశ్ బాబు, రామ్ చరణ్, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇదే వేడుకకు ఐశ్వర్యా రాయ్ మాత్రం భర్తతో కాకుండా విడిగా వచ్చింది.అంబానీల పెళ్లిక కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ రాగా.. ఈమె భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం తన కుటుంబంతో కలిసి విచ్చేశాడు. ఇది చూస్తే ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్త నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఇలా విడిగా వచ్చారా అని సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకోరేమో?(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అనసూయ సినిమాపై అభిషేక్ కన్ను.. ఎందుకో తెలుసా..?
-
కుమారుడితో కలిసి కల్కి చూసిన బిగ్బీ.. ఇంత ఆలస్యంగానా? (ఫోటోలు)
-
మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవలే కొత్త ఫ్లాట్లు కొన్నాడు. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. వీటి కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. తాజాగా ఈయన తండ్రి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఆఫీసు పెట్టుకునేందుకు పనికివచ్చే మూడు కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ముంబైలోని వీరసావర్కర్ సిగ్నేచర్ భవంతిలోనే ఈ ఆఫీస్ స్పేస్ ఉందట! దీని మొత్తం విలువ రూ.60 కోట్లు కాగా.. వీటికోసం బిగ్ బీ ఇప్పటికే సుమారు రూ.4 కోట్లు అడ్వాన్స్గా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా కమర్షియల్ ప్రాపర్టీ కొనడం అమితాబ్కు కొత్తేం కాదు. గతంలోనూ ఇదే సిగ్నేచర్ బిల్డింగ్లో నాలుగు ఆఫీస్ స్పేస్లను కొని గతేడాది అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దె ద్వారానే ఏడాదికి రూ.2.07 కోట్లు సంపాదిస్తున్నాడు.సినిమాల విషయానికి వస్తే.. బిగ్బీ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ రేపు (జూన్ 26న) విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా? -
ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?
సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా సరే ఒక్క ఫ్లాట్ లేదా బంగ్లా కొంటే దాని రేటు ఎంత? అనే విషయాలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితా ఒక్కసారే అన్ని కొనేయాల్సిన అవసరమేంటి? ఇంతకీ వీటి రేట్ ఎంత అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు హిట్స్ కొట్టాడు. మంచి నటుడు అనిపించుకున్నాడు. కానీ మరీ సూపర్ స్టార్ రేంజుకి వెళ్లలేకపోయాడు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వ్యాపారాల్లో ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తూ వస్తున్నాడు. కబడ్డీ ప్రీమియర్ లీగ్లోనూ ఇతడికి ఓ జట్టు ఉంది.ఇక తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా.. మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ.3.5 కోట్లు విలువ చేసేవి. మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. గత నెల 28నే కొనుగోలు పూర్తవగా, 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు) -
కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్..
కొన్ని పాటలు ఎవర్గ్రీన్.. ఎప్పుడు విన్నా ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. అలాంటి పాటే కజ్రారే.. కజ్రారే..! 2005లో వచ్చిన బంటీ ఔర్ బబ్లీ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అందులో అమితాబ్ బచ్చన్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ నటించారు. అయితే ఈ పాట రిలీజయ్యే సమయానికి వారికింకా పెళ్లి కాలేదు.. అది వేరే విషయం!ఎంతో పాపులర్..బంటీ ఔర్ బబ్లీ సినిమా రిలీజై 19 ఏళ్లు అయిన సందర్భంగా బిగ్బీ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. ఓ అభిమాని కజ్రారే సాంగ్ ఫోటోను షేర్ చేయగా దానిపై అమితాబ్ స్పందిస్తూ.. ఆ పాట ఎంత పాపులర్ అయిందో! ఇప్పటికీ ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. మర్చిపోలేని విషయం ఏంటంటే.. భయ్యూ(అభిషేక్)తో కలిసి స్టేజీపై ఈ పాటకు లైవ్లో డ్యాన్స్ చేశాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. ఐశ్వర్య పేరు ప్రస్తావించాల్సింది!కాగా 2006 జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్తో పాటు ఐశ్వర్య రాయ్.. స్టేజీపై కజ్రారే పాటకు డ్యాన్స్ చేశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న బిగ్బీ.. ఐశ్వర్య పేరు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు మీరు, మీ కుమారుడు ఈ పాటకు అవసరం కూడా లేదు. ఐశ్వర్య లేకపోతే ఎవరూ చూసేవారు కూడా కాదు, అలాంటిది తననే మర్చిపోయారా? అని విమర్శిస్తున్నారు. సీక్వెల్..బంటీ ఔర్ బబ్లీ విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో అభిషేక్ హీరోగా రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి 2022లో సీక్వెల్ కూడా వచ్చింది. ఇందులో అభిషేక్కు బదులుగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అలాగే రాణీ ముఖర్జీ, సిద్దాంత్ చతుర్వేది, శర్వారి వాఘ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. the song became so popular that it still regenerates attention and love .. and the best moments with the song, Bhaiyu, were when we performed this live on stage .. 🙏🤣🤣 https://t.co/vKuMM7ipIN— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2024 చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ -
ఐశ్వర్య కూతురేనా? గుర్తుపట్టలేకుండా ఉందే..
అందాల తార ఐశ్వర్యరాయ్- బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ దంపతుల గారాలపట్టి.. ఆరాధ్య. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. అటు ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్కు తప్పక హాజరువుతుంది. ఇక అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్కు బాలీవుడ్ తారలు హాజరైన సంగతి తెలిసిందే! అందులో బచ్చన్ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్, ఐష్, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్ను తెగ ఎంజాయ్ చేశారు. గెటప్ మార్చింది.. అయితే ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్కట్ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్ లీవ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆరాధ్య గెటప్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 'ఆ నుదుటి మీద కురులు(బ్యాంగ్స్) లేకపోతే ఆరాధ్య ఎంత బాగుందో.. ఈ పిల్ల అచ్చం ఆమె అమ్మలాగే ఉంది.' అచ్చం తల్లిలాగే.. 'యవ్వనంలో ఐశ్వర్య ఎలా ఉండేదో.. సేమ్ టు సేమ్.. అలాగే ఉంది. ఇంత క్యూట్గా ఉన్న పాప ఎందుకని అలా బ్యాంగ్స్తో తన ముఖాన్ని దాచుకుందో..', 'ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్స్టైల్ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది' అని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 16న ఆరాధ్య జన్మించింది. Look at my two girls 😍 they look so beautiful 😻 #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/hDE73iuXzQ — AISHWARYA RAI 💙 (@my_aishwarya) March 3, 2024 The family ❤️. Beautiful #AishwaryaRai with Aradhya pic.twitter.com/h4O8HWs4TE — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 4, 2024 చదవండి: తెలుగు సినిమాల్లో కనిపించట్లే.. అవకాశాలు రావడం లేదా? -
హిందీకి అరి
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘పేపర్ బాయ్’ చిత్రదర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం విడుదలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే గ్రాండ్గా విడుదల చేయనున్నాం. ఈ సినిమా హిందీ రీమేక్పై అభిషేక్ బచ్చన్ ఆసక్తిగా ఉన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ప్రివ్యూని అభిషేక్ బచ్చన్కి చూపించారట దర్శకుడు జయశంకర్. కాన్సెప్ట్ యూనివర్సల్గా ఉందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: కృష్ణ ప్రసాద్. -
దేవుడా..! బచ్చన్కి బిడియం ఎక్కువే..!
'ప్రతీ ఒక్కరి జీవితంలో.. సిగ్గు, బిడియాలు ఉండక తప్పవు. కాస్త అవి ఎక్కువైతే.. మాట్లాడడాలు, మాట్టాడుకోవడాలు ఉండనే ఉండవు. అవి కాస్త ముదిరితే.. ఏం చేయాలో తెలియక మనలో మనమే మదన పడుతూంటాం. ఇక ఆ పరిస్థితే.. ఓ బాలీవుడ్ యాక్టర్కి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వారెవరో చూద్దాం..' అభిషేక్ బచ్చన్కి బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడలేడు. తనతోపాటు నలుగురు లేనిదే ఎక్కడికీ కదలడు. కొత్తవాళ్లతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడడు. అంతెందుకు హోటల్ రూమ్లో ఉంటే.. రూమ్ సర్వీస్ ఎంత అవసరమైనా.. ఫోన్ చేసి అడగడట. ఆకలి దంచేస్తున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టడట. అతని సిగ్గు, బిడియం, బెరుకు ఆ రేంజ్లో ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో అభిషేకే చెప్పాడు. ఇవి చదవండి: సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం! -
‘అరి’ రీమేక్పై స్టార్ హీరోల గురి?
తెలుగు దర్శకులు సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలిసిన కథలే అయినా..వాటికి కొత్త నేపథ్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన పురాణాలు, ఇతిహాసాల కథల్ని వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలాంటి చిత్రాలకు టాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు నిదర్శనం కార్తికేయ, హనుమాన్, కాంతారా, ఓ మై గాడ్ సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాయి. అలాంటి కాన్సెప్ట్తో తాజాగా మరో చిత్రం రాబోతుంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల కాకముందే దీని రీమేక్పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘అరి’పై శివకార్తికేయన్ గురి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. ఆయన ఇటీవల అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్లో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ హీరో కన్ను ఇప్పుడు అరిపై పడింది. అయలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్కి వచ్చిన శివకార్తికేయన్కి దర్శకుడు జయశంకర్ ‘అరి’ ట్రైలర్ చూపించాడు. అది శివకార్తికేయన్కు విపరీతంగా నచ్చడంతో.. సినిమా మొత్తం చూశాడట. అందులోని కృష్ణుడు పాత్ర అతన్ని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్కి చెప్పాడట. అరి తెలుగులో రిలీజై.. హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా తమిళ్లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిందీ రీమేక్లో అభిషేక్? ఒక హీరో మాస్ క్యారెక్టర్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే కృష్ణుడి పాత్రను చేయడానికి అంతే ఆసక్తి చూపుతాడు. ఇక నార్త్లో అయితే కృష్ణతత్వం కాన్సెప్ట్తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన కార్తికేయ 2 సౌత్లో కంటే నార్త్లో బాగా ఆడింది. ‘అరి’ కూడా అలాంటి చిత్రమే కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అభిషేక్ని కృష్ణుడిగా చూడొచ్చు. ‘అరి’పై ప్రముఖుల ప్రశంసలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీలీజ్కు రేడీగా ఉంది అరి సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులకు చూపించారు మేకర్స్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్తో పాటు చినజీయర్ స్వామి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. భర్తలాగే సింపుల్గా చెప్పేసింది!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ జంటల్లో ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ఒకరు. ఈ మాజీ ప్రపంచసుందరి బాలీవుడ్ హీరోను పెళ్లాడింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు ఉంది. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీపై ఇటీవల పెద్దఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆ సమయంలో కేవలం ఆమె తన తల్లి, కుమార్తెతో మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా ఆరోజు అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం అభిషేక్ ధరించడం లేదని తెలిసింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు కూడా. అయినప్పటికీ సోషల్ మీడియాలో రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్తో అలాంటి వాటికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీరో, ఐశ్వర్యారాయ్ భర్త తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, సినీతారలు పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తమ అభిమాన హీరో బర్త్డే కావడంతో ఉదయం నుంచి బాలీవుడ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. తన కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఇదిగో మీకివే నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు చాలా సంతోషం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని.. ఆ దేవుడు ఆశీర్వాదంతో ఎల్లప్పుడు మీరు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే గతంలో ఐశ్వర్యరాయ్ బర్త్ డే సందర్భంగా అభిషేక్ ఇలానే సింపుల్గా విషెస్ చెప్పారు. ఐశ్వర్య కూడా కాస్తా లేటైనా భర్తకు అదే తరహాలో విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు తమ అభిమాన హీరోకు హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఈ ఒక్క పోస్ట్తో విడాకుల రూమర్స్కు చెక్ పెట్టిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే గతేడాది పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో ఐశ్వర్యరాయ్ మెప్పించింది. అభిషేక్ సైతం గతేడాది గూమర్ చిత్రంతో అలరించాడు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
ఆ స్టార్ కపుల్పై విడాకుల రూమర్స్.. ఆ పోస్టే కారణమా?
సినీ తారలపై రూమర్స్ ఎక్కువగా వింటుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా రోజుల్లో అవీ కాస్తా ఎక్కువగానే వస్తున్నాయనే చెప్పాలి. లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలా రోజు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్లో అయితే ఇలాంటివీ మరీ ఎక్కువే. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్పై విడాకులు తీసుకుంటున్నట్లు తెగ చర్చ నడుస్తోంది. ఇటీవల అభిషేక్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అభిషేక్ తన ఇన్స్టాలో రాస్తూ.. “విఫలమవుతుందనే భయం మీ కలలను నాశనం చేస్తుంది. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటే మీ కలలను నిర్మిస్తుంది' అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా? అన్న చర్చ మరోసారి మొదలైంది. అయితే గతంలోనూ ఈ జంటపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. (ఇది చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?) విడాకుల రూమర్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయింది. ఈ జంటకు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇటీలస ఆరాధ్య స్కూల్ డే ఈవెంట్కు ఐశ్వర్య మాత్రమే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. ఆ తర్వా బిగ్ బితో కలిసి ప్రొ కబడ్డీ ఆటను చూసేందుకు కూడా రావడంతో రూమర్స్కు బ్రేక్ పడింది. అంతే కాకుండా ఓ ఈవెంట్లో అభిషేక్ బచ్చన్.. పెళ్లి ఉంగరం ధరించకుండా రావడంతో మరోసారి రూమర్స్ వైరలయ్యాయి. అయితే తాజాగా అభిషేక్ చేసిన పోస్ట్ వల్ల మరోసారి విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్లో ఫెయిల్యూర్పై పోస్ట్ పెట్టడమేనని తెలుస్తోంది. ఈ పోస్ట్ ద్వారానే విడాకులకు హింట్ ఇచ్చారని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇంతవరకు అభిషేక్, ఐశ్వర్య ఎవరూ స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మెప్పించింది. మరోవైపు చిరంజీవి విశ్వంభరలో నటించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా.. అభిషేక్ బచ్చన్ సైతం ఇటీవలే గూమర్ చిత్రంతో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. -
అయోధ్య రామాలయానికి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్
-
ఒకే ఫ్రేమ్లో ఐశ్వర్య రాయ్ కుటుంబం.. ఆ ఒక్కరు మాత్రం లేరు
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి కుటుంబం నుంచి ఎన్నో ఊహాగానాలు వచ్చినా వారు మరింత రెట్టింపుతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ మ్యాచ్కు జయ బచ్చన్ మినహా ఆ కుటుంబం మొత్తం హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ కబడ్డీ మ్యాచ్లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. వీరంతా అభిషేక్ బచ్చన్కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఉత్సాహపరిచేందుకు అక్కడికి వచ్చారు. ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) సీజన్ 10 మ్యాచ్లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న ఆ జట్టు యు ముంబాను ఓడించింది. ఆ మ్యాచ్లో సందడిగా కనిపించిన బచ్చన్ కుటుంబాన్ని స్టార్ స్పోర్ట్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బచ్చన్ కుటుంబ సభ్యులు అందరూ జైపూర్ పింక్ పాంథర్స్ షర్టులు ధరించి వచ్చారు. యు ముంబా జట్టుతో జైపూర్ పింక్ పాంథర్స్ గట్టి పోటీనిచ్చింది. యు ముంబా జట్టును ఓడించడంతో, బచ్చన్ కుటుంబం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించిన ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ జట్టు 2014 నుంచి ప్రొ కబడ్డీ లీగ్లో పోటీ చేయడం ప్రారంభించింది. తాజాగా జరిగిన మ్యాచ్లో యు ముంబా జట్టుపై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. అభిషేక్, ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బచ్చన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పలు ప్రోగ్రామ్స్లో కలిసి కనిపిస్తూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అమితాబ్ ఇంటి నుంచి ఐశ్వర్య బయటకు వచ్చేసిందని దీనంతటికి కారణం తన అత్తగారు జయా బజ్చన్, అమితాబ్ బచ్చన్ అంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఒకే చోట కూర్చొని ఆనందంగా గడిపారు. ఇకనైన ఈ వార్తలకు చెక్ పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. .@SrBachchan, @juniorbachchan & #AishwaryaRaiBachchan were all in attendance to watch the #JaipurPinkPanthers win their 1st game of the Mumbai leg! 🤩 Tune-in to #PUNvCHE in #PKLOnStarSports Tomorrow, 7:30 PM onwards | Star Sports Network#HarSaansMeinKabaddi pic.twitter.com/lUE0ksnU8r — Star Sports (@StarSportsIndia) January 6, 2024 -
దుస్తులు ఫ్రీగా ఇచ్చేవారు కాదు, కొనుక్కునే స్థోమత లేక..
సంతోషమైనా, దుఃఖమైనా ఏదీ కలకాలం ఉండదు. పగలూరేయిలా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ పోతూనే ఉంటాయి. బిగ్బీ అమితాబ్ బచ్చన్ జీవితంలోనూ ఇదే జరిగింది. స్టార్ అన్న బిరుదు సంపాదించడానికి ముందు ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో సంపాదించినదంతా పోగొట్టుకుని ఉట్టి చేతులతో నిలబడ్డాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా మెరుపు వేగంతో మళ్లీ సంపాదించి నిలదొక్కుకున్నాడు. తాజాగా ఆనాటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు బిగ్బీ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్. సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో చాలా కష్టపడ్డాను. నటుడిని అవ్వాలన్న కోరిక నాలో బలంగా ఉండేది. కానీ రెండేళ్లపాటు చాలామంది డైరెక్టర్లు నాతో సినిమా చేయడానికి వెనుకడుగు వేశారు. అదే సమయంలో నాన్న(అమితాబ్ బచ్చన్) ఓ బిజినెస్ ప్రారంభించి ఉన్నదంతా పోగొట్టుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. నేను, నా స్నేహితుడు కలిసి సొంతంగా కథ రాసుకోవాలనుకున్నాం.. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీన పరిస్థితి.. ఒకరోజు నాన్న.. ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమానికి రమ్మన్నాడు. ఈవెంట్కు ఎలా రెడీ అయి వెళ్లాలని అందరూ కొన్ని నెలల ముందే ప్రిపేర్ అవుతుంటారు. పైగా 20 ఏళ్ల క్రితం ఎవరూ ఉచితంగా దుస్తులు ఇచ్చేవారు కాదు. కొనుక్కున్న వాటినే వేసుకుని వెళ్లాలి. సాయంత్రం షూటింగ్ లాంటివి పెట్టుకోకుండా ఇండస్ట్రీ అంతా సమయానికి అక్కడికి చేరుకుంటుంది. నేనేమో ఫంక్షన్కు ఏం వేసుకోవాలి? అని నాన్నను అడిగాను. ఇప్పుడిది మీకు విచిత్రంగా అనిపించవచ్చేమో కానీ ఆ సమయంలో మాత్రం పరిస్థితి అంత దారుణంగా ఉంది. నా దగ్గర సరైన బట్టలు లేవు. కొనుక్కునే స్థోమత లేదు ఆర్థిక కష్టాల వల్ల కొనుక్కునేంత స్థోమత కూడా లేకపోయింది. ఫార్మల్ డ్రెస్ లేదు, జీన్స్-టీషర్ట్ వేసుకుని వెళ్తే బాగోదు. మా సోదరి పెళ్లికి కొన్నేళ్ల క్రితం కొనుక్కున్న డ్రెస్ ఉంటే అదే వేసుకెళ్లాను' అని చెప్పుకొచ్చాడు అభిషేక్. కాగా ఈ ఫంక్షన్లో బార్డర్ సినిమాకుగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న జేపీ దత్తా.. అభిషేక్ను చూసి తనతో సినిమా తీయాలనుకున్నాడు. రిఫ్యూజీ మూవీతో అభిషేక్ను వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్కు సైతం ఇదే తొలి సినిమా! అభిషేక్ చివరగా ఘూమర్ సినిమాలో కనిపించాడు. చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి.. -
Aishwarya Rai: బచ్చన్ ఫ్యామిలీతో విభేదాలు.. ట్రెండింగ్లో ఐశ్వర్యరాయ్ (ఫోటోలు)
-
భర్త, మామతో ఈవెంట్కు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. కాకపోతే!
బాలీవుడ్ దంపతులు ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ఈ మధ్య ఎక్కువగా బయట కలిసి కనిపించడం లేదు. ఐశ్వర్య పుట్టినరోజున కూడా చాలా లేట్గా బర్త్డే విషెస్ తెలిపాడు అభిషేక్. అది కూడా ఏదో పైపైనే చెప్పినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు బచ్చన్ కుటుంబంలో ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఈ అనుమానాలు ఈమధ్య మొదలైనవి కాదు. కొన్నేళ్ల నుంచే వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సదరు పుకార్లను కొట్టిపారేశాడు అభిషేక్. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైన సమయంలోనూ ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్వీట్ చేశాడు. ఇంటి నుంచి బయటకు? అయినప్పటికీ ఈ రూమర్స్ ఆగిపోలేదు. పైకి ఏదో కవరింగ్ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరే ఉందని అనుమానిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఐశ్వర్య.. తన కూతురిని తీసుకుని బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తగారు జయాబచ్చన్తో చాలాఏళ్లుగా మాటలు లేవని, భర్తతోనూ విభేదాలు రావడంతో ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అభిషేక్- ఐశ్వర్య కలిసి కనిపించారు. వీరిద్దరూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్కు చెరో కారులో.. అయితే ఐశ్వర్య, తన తల్లి బృంద్య రాయ్తో కలిసి ఓ కారులో రాగా.. అభిషేక్, తన తండ్రి అమితాబ్ బచ్చన్తో కలిసి మరో కారులో ఈవెంట్కు హాజరయ్యారు. కారు దిగగానే ఐశ్వర్య.. బిగ్బీని పలకరించింది. అటు అభిషేక్.. భార్యపై చేయి వేసి ఆమెతో సరదాగా మాట్లాడుతూ లోనికి వెళ్లిపోయాడు. ఈవెంట్లోనూ బిగ్బీ, అభిషేక్, ఐశ్వర్య సరదాగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భర్తతో పాటు అదే కారులో వెళ్లింది ఐశ్వర్య. ఇది చూసిన జనాలు ఇదేం ట్విస్టు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by AISHVERSE 💌 (@theaishverse) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: అపర్ణకు కంగ్రాట్స్ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..? -
కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకొచ్చేసిన ఐశ్వర్య రాయ్
బాలీవుడ్లో అందరూ ఇష్టపడే జంటలలో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్లు ముందు వరసలో ఉంటారు. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ ప్రస్తుతం తమ వివాహ విషయంలో చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ విడిపోతున్నారని పలుమార్లు పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ, వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని ఆమె తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు అయిన జయా బచ్చన్తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం. ఇదే క్రమంలో భర్త అభిషేక్ బచ్చన్తో కూడా విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చిందట. ఇలాంటి గొడవల మధ్య తన కూతురును పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొద్దిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్ తన 50వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆమె తన తల్లి, కుమార్తెతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం తను ధరించడం లేదని తెలిసింది. దీంతో వారి అభిమానుల్లో కొంతమేరకు ఆందోళన మొదలైంది. -
విడిపోనున్న అభిషేక్, ఐశ్వర్యారాయ్...?
-
మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇండస్ట్రీలో అమితాబ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. గతంలో ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన పుట్టిన రోజున సియోన్లోని జీఎస్బీ సేవా మండల్లో క్యాన్సర్ పేషెంట్లతో కలిసి వేడుక చేసుకుంది. ఇందులో ఆమెతోపాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో భర్త అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడం ఫ్యాన్స్కు ఆశ్చర్య కలిగించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిషేక్పై నెటిజన్స్ మండిపడ్డారు. భార్య పుట్టినరోజున విషెస్ చెప్పిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా లేటుగా ఆమెకు విషెస్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆమె 50వ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుకుంటారని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. దీంతో అభిషేక్ వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. కాగా.. ఇటీవలే ముంబయిలో మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి బాష్లో ఐశ్వర్య సింగిల్గానే కనిపించింది. పార్టీలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ రాలేదు. దీంతో మరోసారి ఈ జంటపై విడాకుల రూమర్స్ తెరపైకొస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు వేడుకలకు భర్త దూరంగా ఉండడం, అంతే కాకుండా ఎప్పుడో అర్ధరాత్రి విష్ చేయడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి డైవర్స్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ జంటకు ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?
Abhishek Bachchan Politics: సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలకు దగ్గర సంబంధముంది. ఎంతలా అంటే నటీనటులుగా పేరు తెచ్చుకున్న చాలామంది.. పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ నుంచి త్వరలో పార్టీ పెట్టబోతున్న దళపతి విజయ్ వరకు ఈ లిస్ట్ పెద్దదే.ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ హీరో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ పేరు చెప్పగానే చాలామంది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. 50 ఏళ్ల నుంచి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి చాలా పేరు తెచ్చుకున్నారు. ఈయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా హీరోగా పలు సినిమాలు చేశాడు గానీ ఎందుకో తండ్రిలా హిట్స్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయని అభిషేక్.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. (ఇదీ చదవండి: ఆడిషన్స్కి వెళ్తే డ్రగ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత: ప్రముఖ నటి) ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీలోనే అభిషేక్ చేరబోతున్నాడట. అలానే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, 1984లో కాంగ్రెస్ తరఫున ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు కొడుకు అదే స్థానంలో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అమితాబ్ భార్య, అభిషేక్ కి తల్లి అయిన జయా బచ్చన్.. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మరి తల్లిదండ్రుల వారసత్వంగా అభిషేక్ రాజకీయాల్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలానే సినిమాల్లో రాణించలేకపోయిన అభిషేక్.. మరి పాలిటిక్స్ లో ఏం చేస్తారో చూడాలి. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
నువ్వు కూతుర్ని చూసుకో, ఐశ్వర్యను సినిమాలు చేయనివ్వు..
ఐశ్వర్యరాయ్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే! అప్పటికి, ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలోనూ తన అందంతో, హావభావాలతో అదరగొట్టింది. హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు ఐశ్వర్య భర్త, హీరో అభిషేక్ బచ్చన్. చిత్రయూనిట్ కృషి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కొనియాడాడు. ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్కు ఓ నెటిజన్్ స్పందిస్తూ.. 'ఇప్పటికైనా తెలిసిందిగా! నువ్వు ఆరాధ్యను చూసుకో, తనను మరిన్ని సినిమాలు చేయనివ్వు' అని కామెంట్ చేశాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. 'నేనేమైనా వద్దన్నానా? సర్, తను ఏది చేయాలనుకున్నా అందుకు నా అనుమతి అవసరం లేదు. అందులోనూ తనకు నచ్చిన పనులు చేయాలనుకుంటే నేనెందుకు వద్దంటాను' అని రిప్లై ఇచ్చాడు. అతడి సమాధానం విని సంతోషం వ్యక్తం చేసిన ఫ్యాన్స్.. 'చాలా బాగా చెప్పారు సర్, అలాగే మీరిద్దరు కూడా కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అభిషేక్, ఐశ్వర్య.. గురు, ధూమ్ 2, రావన్, ఉమ్రావో జాన్ వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరు 2007లో పెళ్లి చేసుకోగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. ఇటీవల అభిషేక్- ఐశ్వర్య విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఐశ్వర్య ఒక్కరే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతుండటంతో వీరిమధ్య దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. కానీ అదంతా వదంతి మాత్రమేనని కొట్టిపారేశాడు అభిషేక్. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్ అని ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో షేర్ చేయగా దీనిపై అభిషేక్ స్పందిస్తూ నాకు కూడా ఫేవరెట్ అని కామెంట్ చేశాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్కు చెక్ పడినట్లైంది. Let her sign??? Sir, she certainly doesn’t need my permission to do anything. Especially something she loves. — Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) April 29, 2023 చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే? -
ఐశ్వర్య రాయ్ తో విడాకులు ? అభిషేక్ బచ్చన్ షాకింగ్ రియాక్షన్
-
ఐశ్వర్యరాయ్తో విడాకులు? అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల వైవాహిక జీవితం గురించి కొద్దిరోజులుగా తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిమధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రస్తుతం బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్కు ఐష్ అభిషేక్ లేకుండా కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లడంతో వీరి విడాకుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొంతకాలంగా సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది. లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది. దీంతో ఐష్-అభిషేక్ల మధ్య పొసగడం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలను అభిషేక్ ఖండించారు. ఓ ఈవెంట్లో ఆరాధ్యతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్(My Fav People)అని పేర్కొనగా..దీనికి అభిషేక్ స్పందిస్తూ.. నాకు కూడా ఫేవరెట్(Mine Too) అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఐశ్వర్య-అభిషేక్ విడిపోనున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐష్-అభిషేక్లకు కూతురు ఆరాధ్య సంతానం. My fav people ❤️♥️ @juniorbachchan pic.twitter.com/hAoODtjuTD — Shruti (@Shrutibwb) April 1, 2023 -
బీటలు వారిన బంధం.. భర్తకు ఐశ్వర్య రాయ్ విడాకులు?
బాలీవుడ్లోని బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ జంట అగ్రస్థానంలో ఉంటుంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. చాలా కార్యక్రమాలకు, పార్టీలకు ఐశ్వర్య ఒంటరిగానో లేదంటే కూతురిని తీసుకునో వెళుతోంది. కానీ భర్త అభిషేక్తో మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్కు కూడా ఐశ్వర్య తన గారాలపట్టి ఆరాధ్యతో కలిసి వెళ్లింది. వీరి వెంట అభిషేక్ మాత్రం వెళ్లలేదు. కేవలం ఈ ఒక్క ప్రోగ్రామ్ అనే కాదు చాలా సందర్భాల్లో ఐశ్వర్య వెంట అభిషేక్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగి ఉండొచ్చని నెటిజన్లు సందేహిస్తున్నారు. వీరు విడాకులు తీసుకోబోతున్నారేమోనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీరు విడిపోతున్నారంటూ వార్తలు రావడం ఇదేం కొత్తేమీ కాదు. 2014లోనూ వీరిద్దరి బంధం చెడింది, విడాకులు తథ్యం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. ఓకే, నేను విడాకులు తీసుకుంటున్నానని నమ్ముతున్నాను. ఈ విషయం నాకు గుర్తుచేసినందుకు థ్యాంక్స్. పనిలో పనిగా నా రెండో పెళ్లి ఎప్పుడో కూడా మీరే చెప్పండి అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చి రూమర్స్కు చెక్ పెట్టాడు. కాగా ఐశ్వర్య, అభిషేక్ 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. -
ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సంతోషం పట్టలేక తన భార్య, నటి ఐశ్వర్యరాయ్ని హగ్ చేసుకున్ను వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా జరిగిన ప్రో కబడ్డి ఫినాలే మ్యాచ్ చూసేందుకు భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొన్నాడు అభిషేక్. ఈ 9వ సీజన్లో అభిషేక్ టీం జైపూర్ పింక్ పాంథర్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. తన టీం గెలవడంతో అభిషేక్ ఆనందంలో మునిగిపోయాడు. పట్టలేని సంతోషంలో ఉన్న అభిషేక్ పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చదవండి: రామ్ చరణ్పై ‘కింగ్ ఖాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నారని, వారి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా తరచూ వీరి విడాకుల రూమర్స్ బి-టౌన్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని అభిషేక్ భార్యతో షేర్ చేసుకోవడం.. ఐశ్వర్య కూడా భర్తను చీర్ చేసిన ఈ వీడియో వారి ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు విడాకుల గురించి వస్తున్న పుకార్లకు ఈ వీడియోతో చెక్ పడిందంటూ ఈ జంట ఫ్యాన్స్, ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రాయ్, అభిషేక్లు 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి రూమ్లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి: విరాట్ హోటల్ రూమ్ వీడియో లీక్పై అనుష్క తీవ్ర ఆగ్రహం) ఈ ఘటనపై కింగ్ కోహ్లీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రూమ్ వీడియోను హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ ఖండించారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అనైతికమైన చర్య అని బాలీవుడ్ ప్రముఖులు మండిపడ్డారు. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, ఊర్వశి రౌతేలా, కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఫైరయ్యారు. దీనికి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బాలీవుడ్ నటులు డిమాండ్ చేస్తున్నారు. -
తండ్రి బర్త్డేకు అభిషేక్ బచ్చన్ సర్ప్రైజ్ ప్లాన్, ఎమోషనల్ అయిన బిగ్ బి
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 11 ఆయన బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, భారత సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బర్త్డే నేపథ్యంలో బిగ్ బి హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్ను సర్ప్రైజ్ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కేబీసీ షోలో అడుగుపెట్టాడు. చదవండి: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి ఆయన షో నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగింది. ఆ తర్వాత షో అయిపోయిందా? అని అందరు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ బచ్చన్ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. తనయుడి రాకతో బిగ్ బి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం తండ్రిని హాట్ సీట్లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్లో తను కూర్చోని అమితాబ్ను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా బిగ్బి అభిషేక్కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పక్కనే ఉన్న ఆయన సతీమణి జయ బచ్చన్ అమితాబ్ను తట్టి ఓదారుస్తున్న వీడియో నెటిజన్లు ఆకట్టుకుంది. అనంతరం షోలోనే కేక్ కట్ చేయించి తండ్రికి ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించాడు అభిషేక్. చదవండి: బాలీవుడ్ దిగ్గజం.. ఆయనకు గుర్తింపు అంత ఈజీగా రాలేదు View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను అభిషేక్ షేర్ చేశాడు. ‘దీని వెనుక చాలా ప్రణాళిక, ఎన్నో రిహార్సల్, హార్డ్ వర్క్ ఉంది. చాలా గోప్యంగా ఇది సరిగ్గా చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇంత చేసిన ఆయనకు ఇది తక్కువే అనిపిస్తుంది. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్ ప్లేస్లో(కేబీసీ షో) జరుపడం సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇది భావోద్వేగానికి గురి చేసింది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్ బనేగా కరోడ్పతి టీంకు నా కృతజ్ఞతలు’ అంటూ అభిషేక్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
ఐశ్వర్యతో విడాకులా..రెండో పెళ్లి ఎప్పుడు?.. అభిషేక్ ట్వీట్ వైరల్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 2014లో ఐశ్యర్యరాయ్తో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో అప్పట్లో అభిషేక్ ఆసక్తికర ట్వీట్ చేశారు. వాటిపై స్పందిస్తూ 'నేను విడాకులు తీసుకుంటానని నమ్ముతున్నా. ఈ విషయం నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రెండో పెళ్లి విషయం కూడా మీరే చెప్పండి. థ్యాంక్స్ అంటూ ట్విటర్లో అభిషేక్ రాసుకొచ్చారు. (చదవండి: పొన్నియన్ సెల్వన్: అమ్మకానికి ఐశ్వర్య రాయ్, త్రిషల నగలు) కాగా... అభిషేక్, ఐశ్వర్యరాయ్ జంట 20 ఏప్రిల్ 2007లో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు అమ్మాయి పుట్టగా ఆరాధ్య అని పేరు పెట్టారు. అప్పట్లో 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నట్లు రూమర్లు పెద్దఎత్తున వ్యాపించాయి. గతంలో ఈ బాలీవుడ్ జంటపై వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ ప్రస్తావించారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. 'ఐశ్వర్యతో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి చెప్పేందుకు అంగీకరించను. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు.. ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు.' అని అన్నారు. Ok…. So I believe I’m getting divorced. Thanks for letting me know! Will you let me know when I’m getting re-married too? Thanks. #muppets — Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) May 16, 2014 -
‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’
స్టార్ కిడ్ అయిన దుల్కర్ సల్మాన్ సైతం ట్రోల్స్ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్షాట్స్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’. సెప్టెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా దుల్కర్ మీడియాతో మాట్లాడుతూ పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్పై స్పందించాడు. చదవండి: Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్ వదులుకున్నా ఈ మేరకు దుల్కర్ మాట్లాడుతూ.. ‘గతంలో అభిషేక్ బచ్చన్ గురించి ఓ వార్త విన్నాను. ఆయనను విమర్శిస్తు రాసిన ఆర్టికల్కు సంబంధించిన పేపర్ కట్టింగ్స్ను అద్దంపై అతికించుకుంటారట. వాటిని రోజు చదువుతారని విన్నాను. నా విషయానికి వస్తే నేను కూడా అలాగే చేస్తాను. నా ఫోన్ గ్యాలరీ చూస్తే మీకు అన్ని స్క్రీన్షాట్స్యే కనిపిస్తాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శల తాలుకు స్క్రిన్షాట్స్ అవి. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా అన్నింటి స్క్రీన్ షాట్స్ సేవ్ చేసి పెట్టుకుంటాను. వాటిని అప్పుడప్పుడు చూస్తుంటా. అందులో నన్ను పర్సనల్గా అటాక్ చేసిన ఐడీలు కూడా నాకు బాగా గుర్తున్నాయి’ అని చెప్పాడు. -
సెట్లో నుంచి హీరోయిన్ను ఎత్తుకెళ్లిపోయా: హీరో
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తాజాగా కేస్ తో బంతా హై అనే కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో హోస్ట్ రితేష్ దేశ్ముఖ్.. అభిషేక్ బచ్చన్ సెట్స్లో కొన్ని వస్తువులు దొంగతనం చేశాడని సరదాగా ఆరోపించాడు. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. అవును, గురు సెట్స్లో ఐశ్వర్య రాయ్ను ఎత్తుకెళ్లిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదిలా ఉంటే గురు సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. ఆ వెంటనే 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2012లో కూతురు ఆరాధ్య జన్మించింది. చదవండి: 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? మూడు రోజుల్లో సీతారామం ఎంత రాబట్టిందంటే? -
ద్యేవుడా.. ఆ హీరోయిన్ కింద పడితే సినిమా హిట్!
ఒకరి నమ్మకం.. ఇంకొకరికి పిచ్చిగా అనిపించొచ్చు. నవ్వులాటగానూ తోచొచ్చు. అలాంటి నమ్మకాలు సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్స్.. గిమ్మిక్స్ చేసే వాళ్లకు ఎక్కువ. అవి సెల్యూలాయిడ్ సెంటిమెంట్స్గానే మిగిలిపోవట్లేదు.. ఆ సెలెబ్రిటీ రియల్ లైఫ్లోనూ భాగమవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ వీళ్లే...! ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఈ ఊసుపోని కబుర్లను మేం పోగేసుకు రావట్లే మరి.. ఆ పిచ్చిలో పడి! ఎనిమిదే కావాలి.. బిహైండ్ ది స్క్రీన్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్బీర్ కపూర్! ఆ బాబుక్కూడా ఓ సెంట్మెంట్ ఉండండోయ్. అది వాళ్లమ్మ నీతూ సింగ్ జన్మదిన తేదీ. అది ఎనిమిది. తాను ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఎనిమిదో తేదీనే మొదలుపెడ్తాడు.. వెళ్తాడు. తన దగ్గరున్న కార్ల నంబర్ కూడా ఎనిమిది వచ్చేలానే చూసుకుంటాడు. అదీ ఆ అబ్బాయి సెంట్మెంట్! పడితేనే హిట్.. ..ఎక్కడండీ.. ఎవరండీ..? అని అంత ఆత్రం ఎందుకండీ..? ఎక్కడంటే మరి.. షూటింగుల్లోనే. ఎవరంటే మరి.. సోనమ్ కపూర్ అహూజా. షూటింగ్ అప్పుడు సెట్స్లో ఒక్కసారైనా ఆమె కిందపడితే ఆ సినిమా సూపర్ హిట్టే అట. అలా ఒకట్రెండు సినిమా సెట్స్లో ఆమె పడితే ఆ సినిమాలు హిట్ అయ్యాయని.. అప్పటి నుంచి ఆ నమ్మకాన్ని.. సెంట్మెంట్ను వానిటీ వ్యాన్లో పెట్టుకుని తిరుగుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు. ఓ నిమ్మకాయ.. నాలుగు మిరపకాయలు.... అది బెంగాలీ బ్యూటీ బిపాశా బసు సెంటిమెంట్. తన ఇంటి ప్రధాన గుమ్మాలు, కార్లు.. ఇలా పరుల దృష్టి పడుతుంది అని అనుమానమున్న ప్రతి చోటా అలా నిమ్మకాయలు, మిరపకాయలను ఓ ఇనుప వైరుకి గుచ్చి కడుతుందట బిపాశా. అవి దుష్టదృష్టి నుంచి తనను, తన ఇంటిని కాపాడుతాయనే గట్టి నమ్మకం ఆమెదని బిపాశా సన్నిహితుల చెప్పే మాట. దేవుడి దయ.... మీద కత్రీనా కైఫ్కు మహావిశ్వాసం. అందుకే ఆమె నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు విధిగా ముంబైలోని సిద్ధివినాయకుడి గుడి, మౌంట్ మేరీ చర్చ్, అజ్మీర్లోని షరీఫ్ దర్గా.. ఇలా మూడింటినీ దర్శించుకుని వస్తుందట. ఆ దర్శనాల వల్ల తన సినిమా హిట్ అవుతుందని ఆమె నమ్మకం. కూర్చుంటేనే వరిస్తుంది.. స్పోర్ట్స్ అంటే అభిషేక్ బచ్చన్ ప్రాణం పెడ్తాడని బాలీవుడ్కే కాదు.. భారతదేశంలోని అతని అభిమానులు అందరికీ తెలుసు. క్రికెట్ అంటే క్రేజ్ అతనికి. ఎంతంటే.. వెర్రి నమ్మకాలను క్రియేట్ చేసేంత! క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అతను గ్యాలరీలోనైనా.. ఇంట్లో అయినా.. కూర్చున్న చోట నుంచి కదలడట.. మ్యాచ్ అయిపోయేంత వరకు. ఏమట పాపం? అని అడక్కండి! తాను కదిలితే తన ఫేవరెట్ టీమ్ ఓడిపోతుందని భయమట పాఫం! దీనికి లాజిక్ కూడా చెప్తాడు ఆ హీరో.. అస్తమానం అటూ ఇటూ కదులుతూ.. తిరుగుతూ ఉంటే నెగెటివ్ ఎనర్జీ అన్ని దిక్కులకు పాకి అది టీమ్ మీద ప్రభావం చూపుతుంది అంటూ! ‘ఓహో.. తమరు అలా ఆ నెగెటివ్ ఎనర్జీని కుర్చీకి కట్టేస్తారన్నమాట’ అని అభిమానులు గాట్ హిజ్ పాయింట్ అన్నమాట. నాట్ ఆన్ థర్స్డేస్.. బాలీవుడ్ డాన్స్ కింగ్.. గోవిందా తెలుసు కదా! సెంటిమెంట్లలో అతనిదొక విధము. గురువారాలు గోవిందాకు అచ్చిరావుట. అదొక్క నమ్మకమే కాదు.. జ్యోతిష్యుడి సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేయడుట. ఆఖరుకు క్రాఫ్ చేయించుకోవాలన్నా.. హెయిర్ వీవింగ్ చేయించుకోవాలన్నా జ్యోతిష్యుడు వారం, వర్జ్యం చూసి ఘడియలు లెక్కబెట్టి ముహూర్తం నిర్ణయించాల్సిందే! అంతెందుకు షూటింగ్లో కెమెరా ముందు ఏ యాంగిల్లో నిలబడాలో గోవిందా సర్కు డైరెక్టర్ కాదు చెప్పాల్సింది.. సర్ ఫ్యామిలీ జ్యోతిష్యుడు చెప్పాలి. ఇదండీ ఇతని సంగతి! -
దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్ రెహమాన్ను ఏమార్చలేం: డైరెక్టర్
చెన్నై సినిమా: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాదంటే ఈ చిత్రం ఉండేది కాదని 'ఇరవిన్ నిళల్' (Iravin Nizhal) చిత్ర దర్శకుడు, కథానాయకుడు పార్తిపన్ (Parthiban) అన్నారు. ఈయన సింగిల్ షాట్లో తెరకెక్కించి గిన్నీస్ రికార్డు కెక్కిన ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలైపులి ఎస్. ధాను పొంది ఈ నెల 24వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్తిపన్ ఆదివారం రాత్రి స్థానిక ఐఐటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పార్క్ ఆవరణలో వైవిధ్యభరితంగా నిర్వహించారు. సంగీత దర్శకుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. పార్తిపన్ మాట్లాడుతూ వైవిధ్యభరిత కథా చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ అవసరం అయ్యిందని, ఆ సపోర్టే ఏఆర్ రెహమాన్ అని పేర్కొన్నారు. అయితే భగవంతుడినైనా అభిషేకంతో ఏమార్చవచ్చు గానీ మన ఏఆర్ రెహమాన్ను ఏమార్చలేమని అభిప్రాయపడ్డారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్..
Abhishek Bachchan On Pan India Movies Does not Believe In The Term: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల 'దస్వీ' చిత్రంతో నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చదువుకు ఉన్న ప్రాధాన్యత తెలుపుతూ తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా చిత్రాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అభిషేక్. పాన్ ఇండియా పదంపై తనకు నమ్మకం లేదన్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ లేదన్న వాదనను తిరస్కరించాడు. ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. 'పాన్ ఇండియా అనే పదంపై నాకు నమ్మకం లేదు. మరేదైనా ఇండస్ట్రీకి ఈ పదాన్ని వాడుతున్నామా ? లేదు కదా. కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు హిందీలో మంచి వసూళ్లు సాధించాయి. మంచి సినిమా హిట్ అవుతుంది. లేకుంటే ప్లాప్ ఎక్కడైనా ప్లాప్ అవుతుంది. బాలీవుడ్లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదనడం సరికాదు. గంగుబాయి కతియావాడి, సూర్యవంశీ మంచి హిట్ సాధించాయి. రీమేక్ అనేది ఎప్పుడూ జరిగేదే. అది ఒక చాయిస్ మాత్రమే. మన దగ్గర సినీ ప్రియులు ఎక్కవ. సినిమాకు భాషతో పనిలేదు. ఏ భాషలో వచ్చిన అంతిమంగా అది సినిమానే. వివిధ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే. ఏదిఏమైనా మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే.' అని అభిషేక్ బచ్చన్ తెలిపాడు. కాగా అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం 'బ్రీత్' వెబ్ సిరీస్ మూడో సీజన్లో నటిస్తున్నాడని సమాచారం. చదవండి: అభిషేక్ బచ్చన్ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్, బిజినెస్ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా అలరించారు కొందరు స్టార్ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్ భాయ్పాయ్, కెకె మీనన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్ యాక్టర్స్కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 1. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్: ఇన్టు ది షాడోస్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. 2. సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్ స్టార్లలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్ లుక్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా వచ్చింది. 3. అజయ్ దేవగణ్ 'ఆర్ఆర్ఆర్'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అజయ్ దేవగణ్ తాజాగా వెబ్ సిరీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' అనే వెబ్ సిరీస్లో అజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్లో టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించడం విశేషం. 4. వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ 'ప్రిన్స్'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్గా పేరొందిన ఈ హీరో రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషిస్తున్న వివేక్ 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్ చేసింది. 5. మాధవన్ విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మాధవన్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్' వెబ్ సిరీస్తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
అభిషేక్ బచ్చన్ అలరించిన ఓటీటీ చిత్రాలు ఇవే..
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో విభిన్న కథలను ఎంచుకుంటూ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల బిగ్ బుల్, బాబ్ బిస్వాస్ చిత్రంతో అలరించిన అభిషేక్ తాజాగా 'దస్వీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన తాజాగా నటించిన 'దస్వీ' మూవీ చదువు గొప్పతనం, పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నెల 7న నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ ఒక వెబ్ సిరీస్, 4 సినిమాల్లో నటించాడు. ఇవన్ని నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ కావడం విశేషం. కాగా అభిషేక్ తన నటనతో మెప్పించిన ఆ వెబ్ సిరీస్, సినిమాలేంటో చూసేద్దాం ! చదవండి: ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ 1. దస్వీ నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ 'దస్వీ'. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరక్షరాస్యుడైన గంగారామ్ చౌదరి పాత్రలో అభిషేక్ బచ్చన్ తన నటనతో మెప్పించాడు. అభిషేక్ బచ్చన్తోపాటు యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 7 నుంచి నెట్ఫ్లిక్స్, జియో సినిమాలలో స్ట్రీమింగ్ అవుతోంది. 2. బాబ్ బిస్వాస్ 2012లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ 'కహాని' డైరెక్టర్ సుజోయ్ ఘోష్ కథ అందించిన సీరియల్ కిల్లర్ క్రైమ్ డ్రామా చిత్రం 'బాబ్ బిస్వాస్'. ఈ సినిమాకు సుజోయ్ ఘోష్ కుమార్తె దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అభిషేక్ బచ్చన్.. బాబ్ బిస్వాస్ పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5లో డిసెంబర్ 3, 2021 నుంచి ప్రసారం అవుతోంది. 3. ది బిగ్ బుల్ ప్రముఖ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ 'ది బిగ్ బుల్'. ఇందులో హేమంత్ షా అనే లీడింగ్ రోల్లో అభిషేక్ బచ్చన్ నటించాడు. ఏప్రిల్ 8, 2021 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్షద్ మెహతా ఫైనాన్షియల్ కుంభకోణానికి ప్రేరణగా వచ్చిన 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఈ మూవీ వచ్చింది. 4. లూడో రాజ్ కుమార్ రావు, ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్లతోపాటు అభిషేక్ బచ్చన్ నటించిన డార్క్ క్రైమ్ కామెడీ చిత్రం 'లూడో'. ఈ మూవీకి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో నవంబర్ 12, 2020 నుంచి ప్రదర్శించబడుతున్న ఈ చిత్రంలో 'బటుకేశ్వర్ బిట్టు తివారీ' అనే గూండా పాత్రలో అలరించాడు అభిషేక్ బచ్చన్. 5. బ్రీత్: ఇన్టు ది షాడోస్ జూలై 10, 2020న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సైకలాజికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇన్టు ది షాడోస్'. ఈ వెబ్ సిరీస్తోనే అభిషేక్ బచ్చన్ ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు. ఇందులో అతి భయంకరమైన కిడ్నాపర్ నుంచి తన కుమార్తెను రక్షించడానికి ఎంతకైనా తెగించే డాక్టర్ అవినాష్ సబర్వాల్ పాత్రలో ఆకట్టుకున్నాడు అభిషేక్ బచ్చన్. ఇది 2018లో వచ్చిన 'బ్రీత్' సిరీస్కు సీక్వెల్గా తెరకెక్కింది. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ
టైటిల్: దస్వీ నటీనటులు: అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్ కథ: రామ్ బాజ్పాయ్ నిర్మాత: దినేష్ విజన్ దర్శకత్వం: తుషర్ జలోటా సంగీతం: సచిన్-జిగర్ ఓటీటీ: నెట్ఫ్లిక్స్, జియో సినిమా విడుదల తేది: ఏప్రిల్ 7, 2022 చదువు ప్రాముఖ్యత గురించి చెప్పిన చిత్రాలు రావడం చాలా అరుదు. 'ఈ ప్రంపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు' అని నెల్సన్ మండెలా చెప్పిన కొటేషన్తో చదువు గొప్పతనం గురించి వివరించిన హిందీ చిత్రం 'దస్వీ'. నిరాక్షరాస్యుడైన రాజకీయ నాయకుడు జైలు శిక్ష సమయంలో చదువుకున్న విలువ గురించి ఎలా తెలుసుకున్నాడేది పూర్తి వినోదభరితంగా చూపించిన మూవీ ఇది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. అధికారమనే రుచి మరిగితే భార్యాభర్తల నడుమ కూడా ఎలాంటి శత్రుత్వం, పోటీ వస్తుందో కామెడీ తరహాలో చూపించారు దర్శకుడు తుషర్ జలోటా. సొంత ఇంట్లోనే పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఇదివరకూ చాలానే సినిమాలు వచ్చాయి. కానీ దస్వీ మాత్రం అటు పాలిటిక్స్, ఇటు చదువు విలువను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కామెడీ, సెటైరికల్ జనర్లో రూపొందించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్. జియో సినిమా వేదికగా ఏప్రిల్ 7న విడుదలైన ఈ 'దస్వీ' చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 'దస్వీ' అంటే పదో తరగతి. జాట్ తెగకు చెందిన గంగారామ్ చౌదరి (అభిషేక్ బచ్చన్) హరిత ప్రదేశ్ (కల్పిత రాష్ట్రం)కు ముఖ్యమంత్రి. గంగారామ్ చౌదరి నిరాక్షరాస్యుడు, అవినీతి పరుడైన రాజకీయవేత్త. అనేక కుంభకోణాలు చేసిన ముఖ్యమంత్రిగా పేరుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ స్కామ్లో గంగారామ్ చౌదరిని దోషిగా తేల్చి జైలు శిక్ష విధిస్తారు. దీంతో తన భార్య భీమ్లా దేవి (నిమ్రత్ కౌర్)ని సీఎంగా ప్రకటిస్తాడు గంగారామ్ చౌదరి. జైలుకు వెళ్లిన గంగారామ్ చౌదరి మొదటగా వీఐపీ సౌకర్యాలు పొందుతాడు. కానీ తర్వాత ఆ జైలుకు స్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా జ్యోతి దేశ్వాల్ (యామీ గౌతమ్) ఎంటర్ అవుతుంది. దీంతో గంగారామ్ చౌదరి ఆటలు సాగవు. మిగతా ఖైదీల్లానే గంగారామ్ కూడా ఉండాలని హెచ్చరిస్తుంది జ్యోతి దేశ్వాల్. ఇది తట్టుకోలేక జైలులో పని తప్పించుకునేందుకు పదో తరగతి చదవాలని నిశ్చయించుకుంటాడు గంగారామ్ చౌదరి. అదే విషయం సూపరింటెండెంట్గా జ్యోతి దేశ్వాల్కు చెబుతాడు. తను 10వ తరగతి తప్పించుకునేందుకే అని గ్రహించిన జ్యోతి దేశ్వాల్ అందులో ఫెయిల్ అయితే మళ్లీ సీఎం పదవికి పోటీ చేయొద్దని షరతు విధిస్తుంది. కండిషన్కు ఒప్పుకున్న గంగారామ్ పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతాడు. మరీ గంగారామ్ పదో తరగతి పూర్తి చేశాడా ? అతనికి ఎవరు సహాయపడ్డారు ? అతను పదో తరగతి పూర్తి చేయకుండా ఎవరూ అడ్డుకున్నారు ? చివరికి గంగారామ్ చౌదరి తెలుసుకున్నదేంటీ ? పదో తరగతి తర్వాత గంగారామ్ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు ? అనేదే 'దస్వీ' కథ. విశ్లేషణ: చదువు నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువే అయినా రాజకీయాలకు, చదువుకు ముడిపెట్టి సెటైరికల్ డ్రామాగా 'దస్వీ'ని తెరకెక్కించారు డైరెక్టర్ తుషర్ జలోటా. 2007లో వచ్చిన 'షోబిజ్' సినిమాలో నటించిన తర్వాత తుషర్ జలోటా డైరెక్ట్ చేసిన తొలి చిత్రమిది. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న వివిధ ఛాలెంజ్ (గ్రీన్ ఛాలెంజ్, ఫిట్ ఛాలెంజ్)లను రాజకీయనాయకులు ఎలా తీసుకుంటారో వ్యంగంగా చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. అసలుకే చదువురాని, మోస్ట్ కరప్ట్డ్ సీఎంగా పేరొందిన హరిత ప్రదేశ్ ముఖ్యమంత్రి గంగారామ్ చౌదరికి టీచర్ పోస్టుల భర్తీ స్కామ్లో ఊహించని విధంగా కోర్టు తీర్పు వెలువడుతుంది. అయితే కథ దృష్ట్యా స్కామ్ ఎలా జరిగిందో అదేమి వివరించకుండా నేరుగా జైలు శిక్ష విధిస్తున్నట్లు సినిమాలో చూపించారు. ఇక జైలుకు వెళ్లిన గంగారామ్ చౌదరికి అక్కడ ఎదురయ్యే కష్టాలు అంతా ప్రభావంగా చూపించకపోయిన కామెడీ యాంగిల్లో చూపించారు. రాజకీయనాయకులు జైలులో ఉండి తమ పనులు తమ బంధువులతో ఎలా చేయగలరో ఈ సినిమాలో చూపించారు. అయితే జైలుకు కొత్త సూపరింటెండెంట్గా జ్యోతి దేశ్వాల్ రావడం, ఆమె రూల్స్ తట్టుకోలేక పదో తరగతి చదవాలని గంగారామ్ నిశ్చయించుకోవడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో గంగారామ్ చౌదరి పదో తరగతి చదువుకునే తీరు చాలా నవ్విస్తూ ఆకట్టుకుంటుంది. పదో తరగతిలోని ఒక్కో సబ్టెక్ట్ను జైలులో ఉన్న ఒక్కో ఖైదీ గంగారామ్కు నేర్పించడం చాలా సరదాగా ఆకట్టుకుంటుంది. ఈ సన్నివేశాలు సినిమాకు చాలా ప్లస్గా కూడా నిలిచాయి. ఇక చరిత్ర చదివేటప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ లాలా లజపతిరాయ్, మహాత్మ గాంధీజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులతో కలిసి గంగారామ్ చౌదరి ట్రావెల్ చేసినట్లు చూపించడం, వారి మధ్య సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. వారు తమ ప్రాణాలను ఎందుకు త్యాగం చేయాల్సివచ్చిందో చెప్పడం బాగా ఆకట్టుకున్నాయి. గంగారామ్ చౌదరి.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ నేర్చుకునే విధానం ఎంతో అలరిస్తుంది. అలాగే మరోవైపు గంగారామ్ చౌదరి భార్య భీమ్లా దేవి ముఖ్యమంత్రిగా రాణిస్తూ తన భర్తనే తొక్కేయ్యాలని చూసే సీన్లను కామెడీగా బాగా చూపించారు. గంగారామ్ చౌదరికి మళ్లీ సీఎం పదవి దక్కకుండా చేసే భీమ్లా దేవి ప్రయత్నాలు సైతం బాగున్నాయి. పొలిటిషియన్స్ తమను తాము ఎలా ప్రమోట్ చేసుకుంటారో సెటైరికల్గా చాలా బాగా చూపించారు డైరెక్టర్ తుషర్ జలోటా. ఎవరెలా చేశారంటే ? హరిత ప్రదేశ్ అవినీతి, నిరాక్షరాస్యుడైన ముఖ్యమంత్రి గంగారామ్ చౌదరిగా అభిషేక్ బచ్చన్ అద్భుతంగా నటించాడు. తన యాస, డైలాగ్ డెలీవరీ, నిరాక్షరాస్యుడిగా పలికే కొన్ని మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. రాజకీయ నాయకుడి వ్యవహార శైలీ, అహంకారం, కామెడీ టైమింగ్, హావాభావాలు ఎంతో మెచ్చుకునేలా ఉన్నాయి. గంగారామ్ చౌదరి భార్య భీమ్లా దేవిగా నిమ్రత్ కౌర్ తన నటనతో మెస్మరైజ్ చేసిందనే చెప్పవచ్చు. తన సెటైరికల్ ఎక్స్ప్రెషన్స్, హౌజ్ వైఫ్ నుంచి సీఎంగా మారిన తన ట్రాన్స్ఫార్మెషన్ తీరు చాలా బాగా ఆకట్టుకుంది. తన హ్యూమరస్ డైలాగ్లతో మంచి ఫన్ జెనరేట్ చేసింది. ముఖ్యమంత్రిగా, భర్తను తొక్కేసే భార్యగా, సెల్ఫీల పిచ్చి ఉన్నసెలబ్రిటీగా తన నటనతో చాలా వరకు అలరించిందనే చెప్పవచ్చు. ఇక జైలు సూపరింటెండెంట్ జ్యోతి దేశ్వాల్గా యామీ గౌతమ్ తనదైన నటనతో మెప్పించింది. పైఅధికారి హుందాతనం, అహంకారం నిండి ఉన్న పొలిటిషియన్ ఖైదీకి గుణపాఠం చెప్పే పోలీసు అధికారిగా ఆకట్టుకుంది. అప్పటిదాకా పూర్తి వినోదభరితంగా సాగి.. సినిమా క్లైమాక్స్లో మాత్రం అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టిపడేశాయి. ఈ మూవీకి సచిన్, జిగర్లు అందించిన నేపథ్యం సంగీతం చాలా ఆకట్టుకుంది. సన్నివేశాలకు తగిన బీజీఎంతో వావ్ అనిపించారు. ఓవరాల్గా 'దస్వీ' చిత్రం చదువు ప్రాముఖ్యతను తెలియజేసే పూర్తి వినోదభరితపు పొలిటికల్ సెటైరికల్ డ్రామా. -
ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి
అపర కుబేరులు అంబానీ ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగాయి. వ్యాపారవేత్త అనిల్ అంబానీ-టీనా అంబానిల పెద్ద కుమారుడు జై అన్మోల్ ప్రియురాలు క్రిషా షాతో ఏడడుగులు వేశాడు. ఆదివారం వీరి పెళ్లి వేడుక అంత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ మహోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ కుటుంబాలు సందడి చేశాయి. ఈ సందర్భంగా అన్మోల్-క్రిషాల పెళ్లి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ పెళ్లిలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు షెర్వాని ధరించి కనిపించారు. అలాగే అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ నందా, ముఖేశ్ అంబానీ భార్య నితా అంబానీ, ఇషాతో పాటు ప్రముఖ ఎంట్రప్రెన్యూర్, సోషల్ యాక్టివిస్ట్ పింకిరెడ్డిలు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాగా గతేడాది డిసెంబర్లో అన్మోల్, క్రిషాల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అన్మోల్ అంబానీ-క్రిషా షాల వెడ్డింగ్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలోని అంబానీ ఫ్యామిలీ హోమ్లో జరిగినట్టు సమాచారం. View this post on Instagram A post shared by Pinky Reddy (@pinkyreddyofficial) కేవలం సన్నిహిత వర్గాలు, దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే వీరి వేడుకకు హాజరయ్యారు. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా అన్మోల్, క్రిషాలతోపాటు, బచ్చన్ ఫ్యామిలీ, ముఖేశ్ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనలు పింకి రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు వైరల్గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇది సిక్సర్కు మించినది.. సెలబ్రిటీల ప్రశంసల జల్లు
Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation: క్రికెట్ ప్రియులకు ఆ ఆట అన్నా, ఆటపై వచ్చే సినిమాలన్న పిచ్చి ఇష్టం. వాటిపై సినిమాలు వస్తే ఇండియా వరల్డ్ కప్ గెలిచినంతగా ఆనందపడతారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఎంఎస్. ధోనీ చిత్రానికి ఎంత హిట్ ఇచ్చారో తెలిసిందే. అలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ, క్రికెట్ అభిమానుల కోసం తెరకెక్కిందే '83' చిత్రం. ఎంతగానో ఎదురు చూస్తున్న బాలీవుడ్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. గత క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనాతో ఆలస్యం అయింది. అశేష అభిమానుల ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రణ్వీర్ సింగ్ క్రికెట్ దిగ్గజం, ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్గా కనిపించిన 3 నిమిషాల 49 సెకన్ల ట్రైలర్ను అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం తెగ ఇష్టపడుతున్నారు. ఈ ట్రైలర్ను రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా గ్రామ్లో 'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంక్రెడబుల్ ట్రూ స్టోరీ #83 ట్రైలర్ హిందీ భాషలో వచ్చేసింది. డిసెంబర్ 24, 2021న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లోనే కాకుండా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' రాస్తూ షేర్ చేశాడు. ఈ పోస్ట్పై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ షేక్హ్యాండ్ ఎమోజీతో వ్యాఖ్యానిస్తే, 'వాట్ ఏ వావ్... ఇది సిక్సర్ని మించినది. మీరు చేయలేనిది అంటూ ఏముంది రణ్వీర్ సింగ్. గూస్బంప్స్ తెప్పించింది. ఇది కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేసింది. ఇషా డియోల్ 'ఔట్ స్టాండింగ్. రణ్వీర్ సింగ్ నిన్ను చూసి గర్వపడుతున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా నటించారు. అలాగే తాహీర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దిన్కర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, ఆదినాథ్ కూడా యాక్ట్ చేశారు. దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నదియడ్వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. -
బిగ్ బీ మనవడి బర్త్ డే.. అభిషేక్ బచ్చన్ ఎలా విష్ చేసాడో తెలుసా
Abhishek Bachchan Wishes To Agastya Nanda On His Birthday: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా మంగళవారం (నవంబర్ 23)న 21వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగస్త్యకు అతని సోదరి నవ్య నవేలి, మేనమామ అభిషేక్ బచ్చన్ బర్త్ డే విషెస్ తెలిపారు. పూజలో కూర్చున్న అగస్త్య చిన్ననాటి ఫొటోను తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేశారు అభిషేక్ బచ్చన్. అందులో '21వ హ్యాపీ బర్త్ డే అగస్త్య. దయ, ప్రేమ, కేరింగ్, బాధ్యాయుతమైన మనిషిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నువ్వు అధికారికంగా పెద్దవాడివి. దయచేసి ఇకనైనా ఈ మామ బట్టలు, షూ వేసుకోకు. నీవే సొంతగా కొనుక్కో. లవ్ యూ'. అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) అలాగే అగస్త్య సోదరి నవ్య నవేలి నందా తన సోదరుడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోను ఇన్స్టాలో పంచుకుంటూ ' 21 ఏళ్లుగా నువ్ నా గదిలోకి వచ్చి, నావైపు మౌనంగా చూసి వెళ్లి పోతావు'. రాసుకొచ్చింది. అలాగే అగస్త్య తల్లి శ్వేత బచ్చన్ కూడా తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఖుషీ కపూర్, సుహానా ఖాన్లతో జోయా అక్తర్ తర్వాతి చిత్రంలో అగస్త్య సినిమాల్లోకి అడుగుపెడతాడని గతంలో పుకార్లు వచ్చాయి. సెప్టెంబర్లో జోయా కార్యాలయం బయట ఈ ముగ్గురు కనిపించడం గమనార్హం. View this post on Instagram A post shared by Navya Naveli Nanda (@navyananda) View this post on Instagram A post shared by S (@shwetabachchan) -
నా కొడుకువైనందుకు గర్వంగా ఉంది: అమితాబ్
Amitabh Bachchan Showered Abhishek Bachchan: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తాజా చిత్రం 'బాబ్ బిస్వాస్'. ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. క్రైమ్ డ్రామాగా ఆసక్తిరేకేత్తించింది ఈ సినిమా ట్రైలర్. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ 'బాబ్ బిస్వాస్' ప్రయాణం గురించి సాగింది. ధీర్ఘకాలంగా ఉన్న కోమా నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అతనికి గుర్తు రాని వివరాలు ఏంటి? అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో మధ్యవయస్కుడైన హిట్మ్యాన్ బాబ్ బిస్వాస్ పాత్రలో అభిషేక్ నటించారు. బాబ్ బిస్వాస్ భార్య పాత్రలో చిత్రాంగద సింగ్ యాక్ట్ చేశారు. ఈ ట్రైలర్కు విశేస స్పందన లభించింది. అభిషేక్ బచ్చన్ అభిమానులను ఎంతగానే అలరించింది ఈ ట్రైలర్. అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ చిత్ర ట్రైలర్ను బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ వీక్షించారు. అది చూసి 'నువ్వు నా కొడుకువని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను' అని అభిషేక్ బచ్చన్పై ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'మాకు బాబ్ బిస్వాస్ వంటి అద్భుతమైన బృందం దొరికింది. బాబ్ పాత్రలో లీనమవుతూ నటించడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. నేను పని చేసిన మంచి చిత్రాల్లో ఇది ఒక్కటి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను' అంటూ అభిషేక్ చెప్పారు. T 4100 - I am proud to say you are my Son ! ... BYCMJBBN .. !! ❤️🙏🚩👏👏👏👏👏👏👏👏 https://t.co/yk3BIzJIEb — Amitabh Bachchan (@SrBachchan) November 19, 2021 ఈ చిత్రం కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ చుట్టూ తిరుగుతుంది. మొదట విద్యాబాలన్ నటించిన 'కహానీ' చిత్రంలో ఈ పాత్రను చిత్రీకరించారు. ఈ సినిమాకు దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహించిగా గౌరీ ఖాన్, సుజోయ్ ఘోష్, గౌరవ్ వర్మ నిర్మించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3, 2021న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
Aaradhya Birthday:ఆరాధ్య పదో బర్త్డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్
బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య ముగ్గురు మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. నవంబర్ 13న ఈ ముగ్గురు ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. అభిషేక్, ఐశ్వర్య నుదిటిపై తిలకంతో క్యాజువల్స్ వేర్స్లో కనిపించారు. బచ్చన్ వంశం కుటుంబ సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లినట్లు తెలిసిందే. ఈ దంపతుల కుమార్తె ఆరాధ్య నవంబర్ 16న 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అయితే కూతురు బర్త్డేను మాల్దీవుల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఐశ్వర్య రాయ్ మాల్దీవుల దీవుల్లో చిల్ అవుతున్న దృశ్యాన్ని ఇన్స్టా గ్రామ్లో పంచుకున్నారు. ఆ స్నాప్ను షేర్ చేసి, 'సన్ బ్రీజ్ అండ్ ప్యారడైజ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అభిషేక్ కూడా దీవుల నుంచి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ 'మేల్కొల్పడానికి చెడు దృశ్యం కాదు' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) గత సంవత్సరం, 2020లో, ఐశ్వర్య సోషల్ మీడియాలో ఆరాధ్యతో ఉన్న ఒక అందమైన స్నాప్ను షేర్ చేశారు. అందులో, " నా జీవితపు సంపూర్ణ ప్రేమ, నా ప్రియమైన దేవదూత ఆరాధ్యా.. నేను నిన్ను ఎప్పటికీ, నిత్యం, అనంతంగా ప్రేమిస్తాను. నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నీకోసమే అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ లవ్' అంటూ 9వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధ్య నవంబర్ 16, 2011లో జన్మించింది. -
రెండోసారి గర్భవతి అయిన ఐశ్వర్యరాయ్?వీడియోతో లీక్!
Is Aishwarya Rai Bachchan Pregnant For Second Time: అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? బచ్చన్ ఫ్యామిలీకి మరో వారసుడు రానున్నాడా అనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడింది. ఆ సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్బ్యాగ్ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. బెల్లీని చాలా వరకు దాచి ఉంచే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో ఐశ్వర్య రెండోసారి గర్భవతి అయ్యిందనే రూమర్స్కి బలం చేకూరినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లకు వివాహమైంది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐష్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
‘ధూమ్ 2’ నటుడు మృతి.. హన్సల్ మెహతా ఎమోషనల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, వెలరన్ యాక్టర్ యూసుఫ్ హుస్సేన్ అక్టోబర్ 30న మృతి చెందాడు. 73 ఏళ్ల వయస్సులో కరోనా కారణంగా లీలావతి హాస్పిటల్లో కన్నుమూశాడు. ఆయన ‘ధూమ్ 2’, ‘రాయిస్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ నటుడికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళి తెలిపారు. యూసుఫ్ అల్లుడు ‘స్కామ్ 1992’ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా ట్వీట్ చేసి నివాళి అర్పించాడు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ‘ధూమ్ 2’ మూవీలో ఆయనతో నటించిన అభిషేక్ బచ్చన్, ‘ఫ్యామీలీ మ్యాన్’ స్టార్ మనోజ్ బాజ్పాయ్, నటి పూజా భట్ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చదవండి: పునీత్ రాజ్కుమార్ మృతి, సినీ ప్రముఖుల నివాళి RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732 — Hansal Mehta (@mehtahansal) October 29, 2021 #RIP Yusuf ji. We worked together in several films starting with Kuch na kaho and lastly on Bob Biswas. He was gentle, kind and full of warmth. Condolences to his family. 🙏🏽 pic.twitter.com/6TwVnU0K8y — Abhishek Bachchan (@juniorbachchan) October 30, 2021 Sad News!!! Condolences to @safeenahusain @mehtahansal & the entire family!!! Rest in peace Yusuf saab🙏 https://t.co/q7CFbbEo95 — manoj bajpayee (@BajpayeeManoj) October 30, 2021 This brought tears to my eyes Hansal. Can’t begin to imagine what you’ll are feeling. My deepest condolences to all! 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 30, 2021 -
అద్దె రూపంలో భారీగా సంపాదిస్తున్న బచ్చన్ కుటుంబం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని జుహులో గల వారి వత్స, అమ్ము అనే రెండు బంగ్లా గ్రౌండ్ ఫ్లోర్ ను నెలకు రూ.18.9 లక్షల అద్దెతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాలుకు లీజుకు ఇచ్చినట్లు Zapkey.com పేర్కొంది. ఈ లీజు ఒప్పందాన్ని సెప్టెంబర్ 28, 2021న చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ బంగ్లాలు ప్రస్తుతం బచ్చన్ కుటుంబం నివసిస్తున్న పక్కనే ఉన్నాయి. ఎస్బిఐ అద్దెకు తీసుకున్న ఈ ఆస్తి 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్లు Zapkey పేర్కొంటుంది. అద్దె & డిపాజిట్ డాక్యుమెంట్ ప్రకారం, రెండు బంగ్లాలను నెలకు రూ.18.9 లక్షల అద్దెకు ఇచ్చారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు 25 శాతం అద్దె పెంచుకునే విధంగా ఒక నిబంధన కూడా చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత అద్దె రూ.23.6 లక్షలు, పదేళ్ల తర్వాత రూ.29.5 లక్షలుగా అద్దె ఉంటుందని డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి. 12 నెలల అద్దెకు సమానమైన రూ.2.26 కోట్ల డిపాజిట్ ను ఇప్పటికే బ్యాంకు చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్బిఐ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ స్పందించలేదు. ఈ ప్రాంగణాన్ని ఇంతకు ముందు సిటీ బ్యాంక్కు లీజుకు ఇచ్చినట్లు బ్రోకర్లు తెలిపారు.(చదవండి: చైనా కార్లా?.. టెస్లాకు భారత్ డెడ్లీవార్నింగ్) హెచ్ఎన్ఐ ప్రాంతం ఖాతాదారులకు సేవలందించే అనేక బ్యాంకులు హెచ్ఎన్ఐ ప్రాంతంలో ఉన్నాయని స్థానిక బ్రోకర్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చాలా మంది ప్రముఖులు, వ్యాపార టైకూన్లు నివసిస్తున్నారు. ఈ ప్రదేశంలో వాణిజ్య అద్దె చదరపు అడుగుకు రూ.450 నుంచి చదరపు అడుగుకు రూ.650 మధ్య ఉంటుంది. స్వతంత్ర బంగ్లాలు కొనాలంటే రూ.100 నుంచి 200 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాది మేలో అమితాబ్ బచ్చన్ ముంబైలో టైర్-2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ అభివృద్ధి చేసిన అట్లాంటిస్ అనే ప్రాజెక్టులో రూ.31 కోట్ల విలువైన 5,184 చదరపు అడుగుల గల ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 2020లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.(చదవండి: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్) -
అభిషేక్కు గాయాలు.. హాస్పిటల్కు రాని ఐశ్వర్యరాయ్?
ముంబై : ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట ఓ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి గాయమైంది. తాజాగా ఆ గాయం మరోసారి తిరగబడటంతో ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా కూతురు శ్వేతా బచ్చన్తో కలిసి అమితాబ్ బచ్చన్ లీలావతి హాస్పిటల్కు వెళ్లారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అభిషేక్ బచ్చన్ మరోవైపు అభిషేక్ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్కు రాకపోవడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆమె మణిరత్నం డైరెక్షన్లో పొన్నియన్ సెల్వం అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ఉన్న ఐశ్వర్య ఆదివారం రాత్రి ముంబైకి చేరుకుంది. కాగా ప్రస్తుతం అభిషేక్ బాబ్ బిస్వాస్, దాస్వి చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి: 'ఓ హీరోను టార్గెట్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు' షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి -
రాఖీ స్పెషల్: సెలబ్రిటీల అన్నాచెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లను చూశారా?
.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) View this post on Instagram A post shared by KTR (@ktrtrs) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by S (@shwetabachchan) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Tusshar Kapoor (@tusshark89) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
అభిషేక్ బచ్చన్ లగ్జరీ అపార్ట్మెంట్ అమ్మకం.. ధర ఎంతంటే?
ముంబై: అభిషేక్ బచ్చన్ ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో ఉన్న తన లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించాడు. దీని అమ్మకం ద్వారా ఆయనకు రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో ఒబెరాయ్ 360 అపార్టుమెంట్ పడమరలో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అభిషేక్ బచ్చన్ ఈ ఇంటిని 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా అదే బిల్డింగ్లో షాహిద్ తన అపార్ట్మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాకుండా రాణి ముఖర్జీ, దిశా పటానీ ఖార్ వెస్ట్ పరిసరాల్లో సముద్ర ముఖంగా ఉన్న గృహాలను కొనుగోలు చేశారు. రాణి ముఖర్జీ దీనికోసం రూ.7.12 కోట్లు ఖర్చు చేయగా.. దిశా పటానీ రూ.5.95 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా హన్సల్ మెహతా హిట్ సిరీస్తో పోల్చితే బాగా ఆడలేదనే చెప్పాలి. ఆయన తదుపరి రెండు చిత్రాలు నిమ్రత్ కౌర్తో దాస్వి, చిత్రాంగద సేన్తో బాబ్ బిశ్వాస్ సిమాలు విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా ఐశ్వర్య చివరిసారిగా అనిల్ కపూర్, రాజ్కుమార్ రావుతో కలిసి ఫన్నీ ఖాన్ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా తెరకెక్కనున్న పీరియడ్ ఇతిహాసం. -
ఐశ్వర్యా, అభిషేక్లను కలిసిన నటి వరలక్ష్మీ.. పోస్ట్ వైరల్
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఐశ్వర్యా రాయ్ని నటుడు శరత్కుమార్, ఆయన కుమార్తె, నటి వరలక్ష్మి కలిశారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, ఆనందం వ్యక్తం చేశారు వరలక్ష్మి. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
నువ్వే మా ప్రపంచం, హ్యాపీ బర్త్డే: ఐశ్వర్య రాయ్
అలనాటి అందాల హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇంట బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం (మే 23న) ఐశ్వర్య తల్లి వృందా రాయ్ 70వ వడిలోకి అడుగు పెట్టింది. కోవిడ్ వల్ల ఈ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంట్లోనే బర్త్డే పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఈ సెలబ్రేషన్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐశ్వర్య ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఇందులో వృంద ఎదురుగా మూడు బ్యూటిఫుల్ కేకులతో పాటు అందమైన పూలు పరుచుకుని ఉన్నాయి. 'డార్లింగ్ మమ్మీకి హ్యాపీ బర్త్డే. నువ్వే మా ప్రపంచం. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం.. ఆ భగవంతుడు మా దేవతను చల్లగా చూడాలి' అని ఐశ్వర్య క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన అమ్మమ్మను గాఢంగా హత్తుకున్న ఫొటోతో సహా భర్త అభిషేక్ బచ్చన్తో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పలువురూ ఐశ్వర్య తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్.. దూకి చస్తానని బెదిరించి.. ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. ఇప్పడు ఆమె ఓ స్టార్ యాంకర్ -
అభిషేక్ బచ్చన్ ట్వీట్: ఆయన కన్నా గొప్ప నటుడు ఎవరూ లేరు
ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటున పరంగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించి ఉన్నత స్థానంలో ఉండే నటులో అమితాబ్ బచ్చన్ ఒకరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన వారసుడిగా అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం గడిచినప్పటికీ అతని కెరీర్ అంత సాఫీగా సాగడం లేదనే చెప్పాలి. అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాల పరంగా ఎక్కువగా నెటిజన్ల ట్రోలింగ్కు గరైయ్యేవాడు కానీ ఈ సారి మాత్రం ప్రశంసలు అందుకున్నాడు. నటన పరంగా బిగ్ బి మించిన వారు లేరు స్టాక్ మార్కెట్ను గతంలో ఒక ఊపు ఊపిన హర్షద్ మెహతా జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘ది బిగ్ బుల్’ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రంలో నటించాడు. అందులో అభిషేక్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ అందరికి ఆశ్చర్యం కలిగించేలా ట్వీట్ చేశారు. ‘అభిషేక్.. మీ బిగ్ బుల్ చిత్రం చూశాను. ఇందులో మీ నటన మీ తండ్రి అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పగా ఉందంటూ’ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన అభిషేక్.. మీ ప్రశంసలకు ధన్యవాదాలు. ఆయన కన్నా గొప్ప నటులు ఎవరు లేరంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఎదో అడపాదడపా హిట్స్ తప్ప తండ్రికి ఉన్న స్టార్ ఇమేజ్ను అందుకోలేక పోతున్నాడని బాలీవుడ్లో అభిషేక్పై బహిరంగానే విమర్శలు వినిపించేవి. అదీ కాక ఆయన నటించిన సినిమాలు విజయాల కన్నా అపజయాలే ఎక్కువ ఉండడంతో నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ కూడా ఎక్కువగానే వచ్చేవి. ( చదవండి: ప్రియురాలితో ఎయిర్పోర్టులో రాహుల్.. ఫోటోలు వైరల్ ) Thank you very much for your compliment sir. But nobody, NOBODY can be better than him. 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) May 8, 2021 -
నిశ్చితార్థం రద్దు చేసుకున్న అభిషేక్, కరిష్మా!
అన్నీ అనుకున్నట్టే జరిగితే కరిష్మా కపూర్ జీవితం ఇంకోలా ఉండేది. అభిషేక్ బచ్చన్ జత అయ్యేవాడు. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. నిశ్చితార్థం జరిగింది! కానీ బ్రేక్ అయింది.. ఆ ఇద్దరి భవిష్యత్ పట్ల పెద్దవాళ్లకున్న అభద్రత అడ్డొచ్చి. దాంతో వాళ్లిద్దరూ తమ ప్రేమనూ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.. అసలా ప్రేమ్ కహానీ ఎక్కడ మొదలైంది? తనతోపాటు అజయ్ దేవ్గన్ రవీనాతోనూ లవ్ గేమ్ ఆడుతున్నాడని తెలిసి సైలెంట్గా అతణ్ణించి తప్పుకొని దృష్టంతా కెరీర్ మీదే పెట్టింది కరిష్మా. ఆ సమయంలోనే రాజ్కపూర్ కూతురి కొడుకు నిఖిల్ నందా పెళ్లి నిశ్చయమైంది అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్తో. అప్పుడే కరిష్మా, అభిషేక్ల మధ్య స్నేహం కుదిరింది. శ్వేత, నిఖిల్ నందా పెళ్లి (1997)లో అభిషేక్, కరిష్మాల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అప్పటికి బాలీవుడ్లో కరిష్మా పెద్ద స్టార్. అభిషేక్ ఇంకా కెరీరే మొదలుపెట్టలేదు. దాంతో తమ ప్రేమ వ్యవహారం బయటపడకుండా రహస్యంగా ఉంచడం వాళ్లకు తేలికైంది. అలా మూడేళ్లు గడిచిపోయాయి. రెఫ్యూజీ అభిషేక్ బచ్చన్ సినీరంగ ప్రవేశానికి(2000) ముహూర్తం సిద్ధమైంది రెఫ్యూజీ సినిమాతో. అందులో కథానాయిక కరిష్మా కపూర్ చెల్లెలు కరీనా కపూర్. అప్పుడు కరిష్మా, అభిషేక్ ప్రేమ సంగతి బయటపడింది. ఇటు అభిషేక్ బచ్చన్, అటు కరీనా కెరీర్ మీదే దృష్టి పెట్టిన ఆ రెండు కుటుంబాలూ కరిష్మా, అభిషేక్ లవ్ గురించి వినీవిననట్టే ఊరుకున్నాయి. 60 వ బర్త్డే.. మరో రెండేళ్లు దాటాయి. కరిష్మా, అభిషేక్లకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు పెద్దలు. అమితాబ్ బచ్చన్ 60వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిపించారు. అంతా బాగుంది.. పెళ్లవడమే తరువాయి అనుకున్నారంతా. ఆ ప్రేమ పక్షులూ పెళ్లి తర్వాత కలసి ఉండే జీవితం గురించి కలలు కనడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ రెండు కుటుంబాలు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేశాయి. ఇరు వర్గాల అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా షాక్. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆరా తీయడానికి మీడియా చాలా ప్రయత్నించింది. రెండు వైపుల వాళ్లు వ్యూహాత్మక మౌనం వహించారు. కరిష్మా, అభిషేక్ కూడా ఏ రోజూ పెదవి విప్పలేదు. ఇప్పటికీ ఆ కారణం బయటకు రాలేదు. గుసగుసలు.. కరిష్మా, అభిషేక్ల నిశ్చితార్థం తర్వాత కొన్నాళ్లకు బచ్చన్ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది. అప్పటికి అభిషేక్నూ సక్సెస్ వరించలేదు. ఇవన్నీ సింగిల్ పేరెంట్గా ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్దచేసిన కరిష్మా తల్లి బబితలో అభద్రతను కలిగించాయి. తనలా తన కూతురి పరిస్థితి కాకూడదనే భయంతో పెళ్లికి ముందే తండ్రి ఆస్తిలో నుంచి కొంత కొడుకు అభిషేక్ పేరు మీద రాయమని బబిత అమితాబ్ బచ్చన్ కోరిందని.. ఆమె అలా అడగడంతో జయ బచ్చన్ నొచ్చుకుందని.. తల్లి బాధపడ్డం అభిషేక్కు నచ్చలేదని.. అందుకే ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని బాలీవుడ్లో గుసగుసలు. అంతేకాదు భవిష్యత్లో ఎప్పుడూ కరిష్మా వంక కన్నెత్తి చూడనని అభిషేక్ తన తల్లికి మాటిచ్చాడనీ ఆ వినికిడి. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ బ్రేక్ అయింది. తర్వాత.. కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ను పెళ్లిచేసుకుంది. అది కలహాల కాపురంగానే ముగిసిపోయింది. ఇటు అభిషేక్.. రాణి ముఖర్జీ ప్రేమలో పడ్డాడు. పెళ్లిదాకా వెళతారనే అనుకున్నారంతా. కాని వెళ్లలేదు. కారణం.. జయ బచ్చన్. రాణీ ముఖర్జీ, జయ బచ్చన్ కలసి ‘లగా చునరీ మే దాగ్’ అనే సినిమాలో నటించారు. ఆ సెట్స్ మీద రాణీ, జయాకు గొడవ జరిగి రాణి కాస్త దురుసుగా మాట్లాడిందట. దాంతో జయ .. అభిషేక్తో రాణి సన్నిహితంగా మెలగడాన్ని ఇష్టపడలేదని.. అమ్మ అభీష్టాన్ని అభిషేక్ మన్నించక తప్పలేదని అందుకే రాణితోనూ బ్రేకప్ తప్పనిసరి అయిందని పేర్కొంటాయి బాలీవుడ్ వర్గాలు. నిజానికి రాణి ముఖర్జీని బచ్చన్ కుటుంబం చాలా ఇష్టపడింది. ముఖ్యంగా జయ. కారణం రాణి కూడా తనలాగే బెంగాలీ కావడం. అదీగాక ఆ అమ్మాయికి సహనమూ ఎక్కువేనని, అభిషేక్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనీ ఆ కుటుంబం ఆ ఇద్దరి ప్రేమను మనసారా అంగీకరించింది. ‘లగా చునరీ మే దాగ్’ ఆ అనుబంధాన్ని తెంచేసి మాయని మచ్చలా మిగిలిపోయింది. - ఎస్సార్ చదవండి: పెళ్లికి ముందు అజయ్ దేవ్గణ్ ఓ ప్లే బాయ్! -
మరోసారి లీడ్ రోల్స్లో అభిషేక్, నిత్యామీనన్
‘బ్రీత్’ వెబ్సిరీస్ మూడో సీజన్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘బ్రీత్’ తొలి భాగంలో మాధవన్ నటించగా, రెండో సీజన్ ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’లో అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ బ్రీత్ వెబ్ సిరీస్ మూడో సీజన్కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ‘‘బ్రీత్’ సిరీస్ డైరెక్టర్ మయాంక్ శర్మ థర్డ్ సీజన్ కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ను లాక్ చేశారు. సెకండ్ పార్టులో నటించిన అభిషేక్, నిత్యాయే ‘బ్రీత్ 3’లో కూడా నటిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘‘ఈ సిరీస్కు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ను ముంబయ్, ఢిల్లీలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని ప్రొడక్షన్ యూనిట్ పేర్కొంది. -
‘ఏం అర్హత ఉందని నీకు ఇంత అందమైన భార్య?’
సెలబ్రిటీలకు సోషల్ మీడయా చాలా ముఖ్యం. అభిమానులకు అందుబాటులో ఉండాలంటే ప్రస్తుతం సోషల్ మీడియానే బెస్ట్ ఆప్షన్. అయితే దీని వల్ల మేలు ఎంత ఉంటుందో ఒక్కోసారి చెడు కూడా అంతే జరుగుతుంది. సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్. కొందరు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే.. మరి కొందరు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తారు. ఈ జాబితాలో ప్రథమ వరుసలో ఉంటారు అభిషేక్ బచ్చన్. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యేవారిలో జూనియర్ బచ్చన్ ఒకరు. అయితే తనను విమర్శించేవారిని ఊరికే వదిలి పెట్టరు అభిషేక్. తగిన సమాధానం చెప్పి నోరు మూయిస్తారు. తాజాగా ట్విట్టర్ వేదికగా మరోసారి ట్రోలింగ్కు గురయ్యారు అభిషేక్ బచ్చన్. కొద్ది రోజుల క్రితం అభిషేక్ తన కొత్త సినిమా బిగ్ బుల్ ట్రైలర్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సమయంలో ఓ యూజర్.. ‘‘మీరు అన్ని విషయాల్లో చాలా బాగుంటారు. కానీ ఒక్క విషయంలో మిమ్మల్ని చూస్తే ఈర్ష కలుగుతుంది. అదేంటి అంటే మీకు చాలా అందమైన భార్య లభించింది. అంతటి సౌందర్యరాశిని భార్యగా పొందే అర్హత మీకు లేదు’’ అంటూ కామెంట్ చేశాడు సదరు యూజర్. ఇందుకు అభిషేక్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ‘‘మీ అభిప్రాయానికి థాంక్యూ బ్రదర్.. ఊరికే ఆసక్తి కొద్ది అడుగుతున్నాను.. నీవు ఇప్పుడు చాలా మంది పెళ్లి కాని వారిని ట్యాగ్ చేశావ్.. వీరిలో ఇలియాన, నిక్కి వీరంతా నాకు తెలుసు.. కానీ నువ్వెవరు.. అసలు నీ అర్హత ఏంటి’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై మిగతా నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అభిషేక్ ట్రోలర్స్ని మీరు హ్యాండిల్ చేసే తీరు సూపర్బ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. Ok. Thank you for your opinion. Just curious.. who are you referring to because you’ve tagged a whole load of people? I know Ileana & Niki aren’t married that leaves the rest of us (Ajay, Kookie, Sohum) soooo... P.S- will get back to you about @DisneyplusHSVIP ‘s marital status. — Abhishek Bachchan (@juniorbachchan) March 20, 2021 ప్రస్తుతం అభిషేక్ నటిస్తున్న బిగ్ బుల్ చిత్రం 1992లో జరిగిన స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న విడుదలవుతున్న ఈ చిత్రంలో అభిషేక్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇలియాన, నికితా దత్తా, మహేష్ మంజ్రేకర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
జాన్ అబ్రహాం, అభిషేక్ల మూవీకి డైరెక్టర్ ఫిక్స్
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా హిందీలో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించనున్నారు. మలయాళ వెర్షన్లో బిజూ మీనన్ చేసిన క్యారెక్టర్ను జాన్ అబ్రహాం, పృథ్వీరాజ్ చేసిన పాత్రను అభిషేక్ బచ్చన్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ‘మిషన్ మంగళ్’ సినిమాను డైరెక్ట్ చేసిన జగన్ శక్తి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ‘దస్వీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటు జాన్ అబ్రహాం కూడా ‘ఏక్ విలన్ రిటర్న్స్’, షారుక్ఖాన్ ‘పటాన్’ సినిమాలు చేస్తున్నారు. -
ది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్
హర్షద్ మెహతా మరణించి ఏ లోకాన ఉన్నాడో బాలీవుడ్కు నాలుగు డబ్బులు సంపాదించి పెడుతున్నాడు. ఆయన జీవించి ఉండగా చాలామందిని ముంచాడు. కానీ మరణించాక బాలీవుడ్కు తానొక కథా వస్తువై డబ్బు ఇస్తున్నాడు. అతని బయోపిక్ ‘ది బిగ్బుల్’ టీజర్ విడుదలైంది. షేర్ల కుంభకోణంతో దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహతాను ఇన్నాళ్ల తర్వాత బాలీవుడ్ వెంటవెంటనే తెర మీద చూపింది. ఇప్పటికే అతని మీద ‘సోని లివ్’లో ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ వచ్చి భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు సినిమా వంతు. ఇందులో హర్షద్గా అభిషేక్ బచ్చన్ నటిస్తే నిర్మాత అజయ్ దేవ్గణ్. కుకీ గులాటీ దీని దర్శకుడు. తాజా దీని టీజర్ విడుదలైంది. దాంతో పాటు విడుదల తేదీగా ఏప్రిల్ 8ని ప్రకటించారు. డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ కానుంది. డైరెక్ట్గా సినిమాలు ప్రస్తుతం రిలీజ్ అవుతూ ఉన్నా అజయ్ దీనిని ఓటీటి ద్వారానే రిలీజ్ చేస్తున్నాడు. ‘చిన్నవాళ్లను పెద్ద కలలు కనడానికి ప్రపంచం అడ్డుపడుతుంటుంది. అందువల్ల చిన్నవాళ్లు తమదైన ప్రపంచాన్ని నిర్మించుకుంటారు’ అని అజయ్ దేవగణ్ వ్యాఖ్యానంతో ఈ టీజర్ రిలీజైంది. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా క్యాప్షెన్ పెట్టారు. అభిషేక్ బచ్చన్కు సరైన హిట్ లేక చాలా కాలం అవుతోంది. ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. పెద్దగా కమర్షియల్ హంగామాకు వీలులేని ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. Introducing The Big Bull... The mother of all scams!!! Trailer out on 19th March. #TheBigBull releasing on 8th April only on @DisneyplusHSVIP, stay tuned! 📈#DisneyPlusHostarMultiplex @Ileana_Official @nikifyinglife @s0humshah @kookievgulati @ajaydevgn pic.twitter.com/U4v3S6odZj — Abhishek Bachchan (@juniorbachchan) March 16, 2021 -
గంగారామ్.. నువ్వు సూపర్!: అమితాబ్
‘‘సూపర్.. బాగుంది’’ అంటూ తనయుడు అభిషేక్ బచ్చన్కి కితాబులిచ్చారు అమితాబ్ బచ్చన్. ఇంతకీ కుమారుడిని బిగ్ బి ఎందుకు ప్రశంసించారంటే.. అభిషేక్ నటిస్తున్న తాజా చిత్రం ‘దస్వీ’ లుక్ విడుదలైంది. ఈ లుక్ బాగుందన్నారు అమితాబ్. ‘దస్వీ’ అంటే టెన్త్ గ్రేడ్. ఈ చిత్రంలో అభిషేక్ పదో తరగతి ఫెయిలవుతాడు. అయితే ముఖ్యమంత్రి అవుతాడు. క్యారెక్టర్ పేరు గంగారామ్ చౌదరి. తుషార్ జలోటా దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ సెటైరికల్ మూవీ ఇది. ఈ సినిమా తాజా ఫొటోను ‘దస్వీ కా దస్వా దిన్’ (దస్వీకి పదో రోజు) అంటూ అభిషేక్ రిలీజ్ చేశారు. తెల్ల కుర్తా–పైజామా, కోటు, తలపాగాతో సింహాసనం మీద దర్జాగా కూర్చుని ఉన్న గంగారామ్ లుక్కి బోలెడన్ని ప్రశంసలు లభించాయి. పది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందుకే ‘దస్వీ’ సెట్లో పదో రోజు అంటూ ఫొటోను విడుదల చేశారు. చదవండి: రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట! ఐస్క్రీమ్ తింటున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా? -
రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట!
అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘దస్వీ’. తుషార్ జొలాతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం ప్రారంభం అయింది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో టెన్త్ ఫెయిల్ అయిన గంగా రౌమ్ చౌదరి అనే రౌడీగా అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారు. అక్షరం ముక్క రాకపోయినా ముఖ్యమంత్రి అవ్వాలనే కలలు కనే పాత్ర అతనిదని బాలీవుడ్ టాక్. యామీ గౌతమ్ కథానాయిక. ఆమె పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఢిల్లీలోని ఆగ్రాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) చదవండి : బాయ్ ఫ్రెండ్తో శృతిహాసన్ మ్యూజిక్ వీడియో దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు -
అభిషేక్ బచ్చన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
ఐస్క్రీమ్ తింటున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా?
బిగ్బీ అమితాబ్ బచ్చన్ ముద్దుల తనయుడు అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు నేడు(ఫిబ్రవరి 5). ఈ రోజు ఆయన 45వ వడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా కొడుక్కు బర్త్డే విషెస్ చెప్పాడు బిగ్బీ. "చిన్నప్పుడు వాడి చేయి పట్టుకుని ముందుకు నడిపించాను. ఇప్పుడు వాడు నా చేయి పట్టుకుని ముందుకు తీసుకెళుతున్నాడు" అని ఎమోషనల్ అవుతూ ఒకేచోట చేర్చిన రెండు ఫొటోలను షేర్ చేశాడు. దీనికి అభిషేక్ 'థ్యాంక్ యూ పా' అని రిప్లై ఇచ్చాడు. మరి ఇప్పటి స్టార్ హీరో జూనియర్ బచ్చన్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో కింది ఫొటోల ద్వారా చూసేద్దాం.. తాష్కెంట్ షూటింగ్ సమయంలో తీసిన ఫొటో ఇది. ఇందులో అభిషేక్ తొలిసారి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ మధ్యే అమితాబ్ ఈ ఫొటోను షేర్ చేశాడు. ఆమధ్య తండ్రితో పాటు అభిషేక్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తొందరగానే నా మహమ్మారిని జయించి ఆయన క్షేమంగా ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా అతడి సోదరి శ్వేత నంద పట్టరాని సంతోషంతో అతడికి స్వాగతం చెప్తూ ఈ ఫొటో షేర్ చేసింది. కొడుకును భుజాలపై ఎక్కించుకుని ఆడించాలని ఎవరికి ఉండదు. తండ్రి మీద ఎక్కి తిరగాలని ఏ పిల్లోడికి ఉండదు. అందుకే కొడుకును భుజాన ఎక్కించుకుని ఆడిస్తున్నాడు అమితాబ్. ఈ ఫొటో చూస్తుంటే చాలామందికి వారి బాల్యం గుర్తుకురాక మానదు. ప్రేమను కురిపిస్తూ తల్లి జయా బచ్చన్ కొడుకు వంకే తదేకంగా చూస్తుంటే అభిషేక్ మాత్రం తననెవరో ఫొటో తీస్తున్నారంటూ కెమెరా వైపు చూస్తున్నాడు. ఈ తల్లీకొడుకుల ఫొటో చాలామంది అభిమానులకు ఫేవరెట్. అభిషేక్ కెమెరా ముందుకు రావాలంటే చాలా సిగ్గుపడేవాడు. ఈ విషయం పై ఫొటో చూస్తేనే తెలిసిపోతుంది. ఎంతో బిడియస్తుడులా దగ్గరకు ముడుచుకుపోయాడు. తల వాల్చి ఓరకన్నుతో చూస్తున్న ఈ ఫొటో క్యూట్గా ఉందంటున్నారు అభిమానులు. సినిమాల్లో ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం అమితాబ్ కూల్గా ఉండేటట్లు కనిపిస్తోంది. కొడుకుతో కలిసి పార్క్లో ఆడుకుంటున్నాడు అమితాబ్. తండ్రి చుట్టూ చేతులు వేసి సరదాగా నవ్వుతుంటే అతడి పప్పా మాత్రం కూతురు శ్వేత వైపు చూస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రిలా రెడీ అవడం మొదలు పెట్టినట్లున్నాడు అభిషేక్. తండ్రి సూటుబేటు వేస్తే అచ్చంగా అలాంటి సూటూబూటేసుకున్నాడీ హీరో. ఇంకా వారి ఆల్బమ్లో బోడెన్ని ఫొటోలున్నాయి. వాటన్నింటినీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: నాన్న కంటతడి పెట్టడం అదే ప్రథమం: సూపర్ స్టార్ -
ఆ వార్త వినగానే.. అభిషేక్ని గట్టిగా తిట్టేశా: అజయ్ దేవ్గణ్
కోవిడ్ మొదలయ్యి భయభ్రాంతం చేస్తున్న రోజుల్లో అమితాబ్ దాని బారిన పడి హాస్పిటల్లో తీవ్రంగా పోరాడాల్సి రావడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో అభిషేక్ కూడా కరోనా బారిన పడ్డాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటనతో దేశం అంతా అలెర్ట్ అయ్యింది. అమితాబ్కే వచ్చినప్పుడు మనక్కూడా రావచ్చని జాగ్రత్తలు పాటించింది. రెండు రోజుల క్రితం సోనీలో వచ్చిన ‘కామెడీ విత్ కపిల్’షోలో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవ్గణ్ పాల్గొని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘కోవిడ్ వార్త వెలువడగానే నేను అభిషేక్కు ఫోన్ చేశాను. గట్టిగా తిట్టేశాను.. జాగ్రత్తగా ఉండాలి కదా అని. ఎవరి వల్ల వచ్చింది అనంటే అభిషేక్ కంగారుగా నాన్న వల్లే వచ్చి ఉంటుందని అన్నాడు. అమితాబ్ గారు ఇల్లు కదలకుండా ఉంటే ఆయన వల్ల అంటావు మళ్లీ. నువ్వు బయట తిరుగుతున్నావు. నీ వల్లే ఆయన కు వచ్చి ఉంటుంది’ అని బాగా తిట్టాను అని అజయ్ దేవ్గణ్ అన్నాడు. అజయ్ దేవ్గణ్ అమితాబ్ కుటుంబానికి బాగా దగ్గర. అభిషేక్ను పెట్టి హర్షద్ మెహతా బయోపిక్ ‘బిగ్ బుల్’ తాజాగా నిర్మించాడు. దాని ప్రమోషన్లో భాగంగా ఈ షోలో పాల్గొని కోవిడ్ ఉదంతాన్ని పంచుకున్నారు ఇద్దరూ. అభిషేక్ చదువు మానేసి స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చి అజయ్ హీరోగా నటించిన ‘మేజర్ సాబ్’ యూనిట్లో స్పాట్బాయ్గా పని చేశాడు. ‘అప్పటి నుంచి అజయ్ నాకు అన్నగా మారాడు’ అని చెప్పాడు అభిషేక్. -
నాన్న కంటతడి పెట్టడం అదే ప్రథమం: సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. కుటుంబం, వర్క్కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంటారు. అప్పుడప్పుడు త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ.. దాని వెనక ఉన్న జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు బిగ్ బీ. తాజాగా ఇలాంటి ఫోటోని ఒకదాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు సీనియర్ బచ్చన్. దీనిలో అమితాబ్ తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ఆశీర్వాదం కోసం వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు. పక్కనే నిల్చున్న చిన్నారి జూనియర్ బచ్చన్ తండ్రిని ఆస్తకిగా గమనిస్తుండటం ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే తొలుత ఈ ఫోటోని ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేశారు. దాన్ని అమితాబ్ తన ఖాతాలో షేర్ చేస్తూ.. దీని వెనక గల కథను అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..) T 3777 - The caption informs of 45 million on Twitter .. thank you Jasmine, but the picture says a lot more .. Its the moment I came home surviving death after the 'Coolie' accident .. Its the first time ever I saw my Father breaking down ! A concerned little Abhishek looks on ! pic.twitter.com/vFC98UQCDE — Amitabh Bachchan (@SrBachchan) January 9, 2021 ఈ మేరకు అమితాబ్ ‘కూలీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నేను చావు అంచుల వరకు వెళ్లాను. అదృష్టవశాత్తు కోలుకుని ఇంటికి చేరుకున్నాను. ఆ సమయంలో మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం వంగి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆ సమయంలో నన్ను చూసి నాన్నగారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. నాన్నను అలా చూడటం నా జీవితంలో అదే మొదటిసారి. ఇక పక్కనే ఉన్న అభిషేక్ మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు’ అంటూ ఈ ఫోటో వెనక గల స్టోరిని ట్వీట్ చేశారు.. ఇక తాజాగా శనివారం బిగ్ బీ మరో రికార్డు సృష్టించారు. సీనియర్ బచ్చన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య శనివారం నాటికి 45 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఈ ఫోటోలో ఉన్న హీరోను గుర్తుపట్టగలరా?
కోల్కతా : అభిషేక్ బచ్చన్ నటిస్తోన్న థ్రిల్లర్ సినిమా బాబ్ బిస్వాస్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమయ్యింది. కహానీ చిత్రంలోని కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ పాత్రలో అభిషేక్ నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన కహానీ చిత్రంలోని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్గా బిస్వాస్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రముఖ బెంగాలీ నటుడు సస్వతా ఛటర్జీ పోషించిన ఈ పాత్రలో తాజగా అభిషేక్ నటించునున్నారు. ఇందుకోసం ఫుల్ స్లీవ్ చొక్కా, పెద్ద కళ్లజోడు, మిడ్ పార్టీషియన్ జుట్టుతో కనిపిస్తున్న అభిషేక్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.(కేజీఎఫ్.. ఛాప్టర్: 2: అధీరా రెడీ..) కోల్కతాలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుజోయ్ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్కి కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత అభిషేక్ సైతం కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు. అభిషేక్ సరసన చిత్రాంగఢ సింగ్ నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ అతికొద్దిమంది నటీనటులతో షూటింగ్ నిర్వహిస్తున్నారు. (నిర్భయపై వెబ్ సిరీస్కు అంతర్జాతీయ అవార్డ్) View this post on Instagram A post shared by Sangbad Pratidin (@sangbadpratidin) View this post on Instagram A post shared by @chitrangda -
‘మీరు సారీ చెప్తారా.. దేవుడి లీల’
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. తర్వాత ఒకరికొకరు క్షమాపణలు కొరతారు. కొన్ని సార్లు ఎవరు తప్పు చేస్తే వారే ముందుగా సారీ చెప్తారు. వివాహ బంధంలో ఇవన్నీ సహజం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. అయితే తమ మధ్య గొడవలు వస్తే ముందుగా తానే సారీ చెప్తాను అంటున్నారు అందాల నటి ఐశ్యర్య రాయ్. అభిషేక్తో గొడవపడితే తానే ముందుగా క్షమాపణలు కోరతానని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఇది పాత వీడియో. దీనిలో కపిల్ శర్మ, ఐశ్యర్య రాయ్, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. ఇక వీడియో విషయానికి వస్తే కపిల్ శర్మ, ఐశ్వర్యని ఉద్దేశించి.. ‘అభిషేక్తో గొడవపడితే.. ముందుగా ఎవరు క్షమాపణలు కోరతారు’ అని ప్రశ్నిస్తాడు. వీరి సంభాషణ పూర్తి కాకముందే నవజోత్ మధ్యలో కల్పించుకుని.. ‘అసలు ఇలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. అభిషేకే ముందుగా సారి చెప్తాడు’ అంటారు. (చదవండి: అందం, అణకువల కలబోత) View this post on Instagram A post shared by @aishwariarai_georgia on Oct 20, 2020 at 12:32am PDT దాంతో ఐశ్యర్య ‘అలా ఏం కాదు. తనతో గొడవపడితే ముందుగా నేనే సారీ చెప్తాను. గొడవను కొనసాగించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేనే క్షమాపణ చెప్తాను’ అని తెలిపారు. ఈ సమాధానం విని కపిల్ శర్మ ఒక్క నిమిషం స్టన్ అవుతాడు. ‘మీరు సారీ చెప్తారా.. ఇంత అందమైన భార్య క్షమాపణలు కోరడం అంటే నిజంగా దేవుడి లీలే’ అంటాడు. దాంతో ఐశ్వర్యతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు. అభిషేక్, ఐశ్వర్యల వివాహం 2007లో జరిగింది. వీరికి ఓ కుమార్తె ఆద్యా ఉన్నారు. ఇక తాజాగా ఐశ్యర్య పుట్టిన రోజు సందర్భంగా అభిషేక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీరిద్దరు గులాబ్జామూన్ అనే చిత్రంలో నటించనున్నారు. -
ఆస్పత్రిలో చేరిన అమితాబ్; కొడుకు క్లారిటీ:
తనపై సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ చేసినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. ట్రోల్స్పై ఆగ్రహానికి లోనవకుండా చాకచక్యంగా బదులిస్తారు. ఈ క్రమంలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల బిగ్బీ అనారోగ్యానికి గురయ్యారని, అమితాబ్ బచ్చన్కు గాయం అవ్వడం వల్ల ఆసుపత్రిలో చేరారని సోమవారం నాడు కొన్ని వార్తలు వెలువడ్డాయి. శనివారం నుంచి ఆస్పత్రిలోనే అక్కడే ఉన్నట్లు, ప్రస్తుతం వైద్యులచేత చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు కొంచెం కంగారు పడిపోయారు. అయితే బచ్చన్ కుంటుంబం నుంచి అయితే దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: సోషల్ మీడియా ట్రోల్స్: అభిషేక్ స్పందన తాజాగా తండ్రి ఆరోగ్యంపై ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. బిగ్బీ అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. అమితాబ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. నేను కూడా అడుగతాను. ఎందుకంటే నాన్న నా ముందే కూర్చొని ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నది ఖచ్చితంగా నాన్న డూప్లికేట్ అయ్యి ఉంటారు. అని పేర్కొన్నారు. కాగా జులైలో అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బిగ్బీతోపాటు, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కరోనా పాటిజివ్గా తేలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 20 రోజుల చికిత్స అనంతరం మెల్లమెల్లగా అందరూ కోలుకున్నారు. ఇక అభిషేక్ చివరగా బ్రీత్: ఇంటూ ది షాడోస్లో కనిపించారు. అదే విధంగా ఆయన నటించిన ‘బిగ్బుల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి: బిగ్బీ పోస్టుకు కత్రినా కైఫ్ ఫ్యాన్స్ ఫిదా! -
సోషల్ మీడియా ట్రోల్స్: అభిషేక్ స్పందన
ముంబై: సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. కొన్నిసార్లు కోట్లాది మంది అభిమానులను కలిగిన ఉన్న హీరోలు సైతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ను ఎదుర్కొక తప్పదు. కరోనా వైరస్ నేపథ్యంలో షూటింగ్లు, సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు అనుసరిస్తూ సినిమా షూటింగ్స్ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అన్లాక్-5 లాక్డౌన్ మార్గదర్శకాల్లో భాగంగా కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్లు కూడా ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ థియెటర్లలో 50 శాతం సీట్లను మాత్రమే కేటాయించాని పేర్కొంది. ప్రభుత్వం సినిమా హాల్స్కు ఇచ్చిన అనుమతుల సంబంధించిన ఓ వార్తను అభిషేక్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఈ వారానికి ఇదే అత్యంత గొప్ప వార్త’ అని కాప్షన్ కూడా జత చేశారు. ఆయన ట్విట్పై కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేశారు. నెటిజన్ల ట్రోలింగ్కు ఆయన తనదైన శైలిలో సుతిమెత్తగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అభిషేక్ ట్విటర్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మీరు ఇక నిరుద్యోగులుగా ఉండరు?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి వెంటనే అభిషేక్ స్పందిస్తూ.. ‘అయ్యో, అది మీ(ప్రేక్షకుల) చేతిలో ఉంది. మీకు మా పని నచ్చకపోతే మాకు మరో మూవీలో నటించే ఉద్యోగం లభించదు. కావున మా శక్తి సామర్థ్యాలకు తగినట్లు పని చేస్తాము. ఉత్తమనైన ఫలితాలు రావాలని కోరుకుంటూ, దేవున్ని ప్రార్థిస్తాము’ అని సమాధానం ఇచ్చారు. ఇక అభిషెక్ బచ్చన్ గతంలో కూడా ఇలాంటి సోషల్ మీడియలో ట్రోలింగ్స్పై చాలా చాకచక్యగా స్పందిచిన విషయం తెలిసిందే. ఇటీవల హీరోయిన్ ప్రాచి దేశాయ్ కంటే తనకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. దానికి కూడా అభిషెక్ సున్నితంగా సమాధానం ఇచ్చారు. ‘సోషల్ మీడియాలో ఎంత మంది అనుచరులు ఉన్నారనేది నటన, ప్రతిభకు కొలమానం కాదు. ప్రతిభావంతులైన నటులను గుర్తించడానికి సోషల్ మీడియాకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం లేదు’ అని ట్విట్ చేశారు. కరోనా బారిన పడిన అభిషేక్, తన తండ్రి అమితాబ్, భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్య ఇటీవల వైరస్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అభిషేక్ చివరగా బ్రీత్: ఇంటూ ది షాడోస్లో కనిపించారు. అదే విధంగా ఆయన నటించిన ‘బిగ్బుల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. That, alas, is in your (the audiences) hand. If you don’t like our work, we won’t get our next job. So we work to the best of our abilities and hope and pray for the best. 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) September 30, 2020 -
ది బిగ్ బుల్: ఇలియానా ఫస్ట్ లుక్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, నటి ఇలియానా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది బిగ్ బుల్’. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రం బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో అభిషేక్ బచ్చన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇది ‘ది బిగ్ బుల్’ సినిమాలోని ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్. భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న క్రైం డ్రామా చిత్రం. త్వరలో ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్లో విడుదల కానుంది’ అని క్యాప్షన్ జత చేశారు. ఈ ఫస్ట్ లుక్లో ఇలియానా ముఖంలో తీవ్రమైన ఎక్స్ప్రెషన్ కలిగి, నల్లని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. (చదవండి: నటి సెల్ఫీ: అస్సలు బాగోలేదంటున్న నెటిజన్లు) Here is the first look of Ileana D'Cruz from The Big Bull! #TheBigBull a crime drama that shook the financial fabric of India will unveil soon with #DisneyPlusHotstarMultiplex on @DisneyplusHSVIP!@ajaydevgn @Ileana_Official @s0humshah @nikifyinglife @kookievgulati pic.twitter.com/7RXKmfs7GF — Abhishek Bachchan (@juniorbachchan) August 18, 2020 ఇలియానా కూడా ‘ది బిగ్ బుల్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషపడుతున్నాను’ అని క్యాప్షన్ జత చేశారు. ది బిగ్ బుల్ సినిమా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్కు సంబంధించిన కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నికితా దత్తా, సోహుమ్ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ దేవ్గన్, ఆనంద్ పండిట్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల డిస్నీ, హాట్స్టార్ నిర్వహించిన వర్చువల్ విలేకరుల సమావేశంలో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ‘ది బిగ్ బుల్’ సినిమా 80, 90ల్లో ముంబైలో జరిగిన కథ అని అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. View this post on Instagram Excited to be a part of the world of The Big Bull: The Man who sold dreams to India. #TheBigBull a crime drama that shook the financial fabric of the country will unveil soon with #DisneyPlusHotstarMultiplex on @DisneyPlusHotstarVIP @ajaydevgn @bachchan @shah_sohum @nikifying @kookievgulati #ADFfilms @anandpandit @anandpanditmotionpictures @kumarmangatpathak @vickssharma @meenaiyerofficial A post shared by Ileana D'Cruz (@ileana_official) on Aug 17, 2020 at 9:32pm PDT -
నేను మాటంటే మాటే
‘‘నేను ఏదైనా మాట అంటే ఆ మాట మీద ఉంటాను’’ అంటున్నారు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. కరోనా పాజిటివ్తో అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్సానంతరం నెగటివ్ రావడంతో అమితాబ్, ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్ మాత్రం ఆస్పత్రిలో ఉండిపోయారు. శనివారం రిపోర్ట్లో ఆయనకు కూడా నెగటివ్ వచ్చింది. ‘‘ఫ్రెండ్స్.. నేను మీకు ముందే చెప్పాను కదా. కరోనాపై విజయం సాధిస్తానని. నేను మాటంటే మాటే. మీరు (అభిమానులు, శ్రేయోభిలాషులు) చేసిన ప్రార్థనల వల్లే నేను, మా ఫ్యామిలీ కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డాం. మాకు సేవ చేసిన నానావతి ఆస్పత్రి డాక్టర్లకు, అక్కడి నర్సింగ్ స్టాఫ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అన్నారు అభిషేక్. షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ చిత్రంలోని ‘యూహీ చలా చల్రాహి...’ పాటను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విన్నారట. ‘‘ఆ పాట నాకు స్ఫూర్తినిచ్చింది. ఎంతో నమ్మకం కలిగించింది’’ అని కూడా అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. -
కరోనాను జయించిన అభిషేక్
ముంబై: ఇటీవల కరోనా బారిన పడిని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ మహమ్మారిని జయించాడు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని తాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు అభిషేక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్! ఈ రోజు మధ్యాహ్నం చేసిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది. నేను కరోనాను జయిస్తానని చెప్పినట్టుగానే జయించాను. ఇది మీ ప్రార్థనలతోనే సాధ్యమైంది’ అంటూ రాసుకొచ్చారు. (చదవండి: నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్) ‘‘నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. అంతేగాక నానావతి ఆస్పత్రి డాక్టర్లకు, నర్సులకు నా ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ అభిషేక్ ట్వీట్ చేశారు. అభిషేక్, అమితాబ్లు ఒకేసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరి అనంతరం అభిషేక్ భార్య, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, కూతురు ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. మొదట ఐశ్వర్య, ఆరాధ్య ఆ తర్వాత బిగ్బీ కూడా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్బీ) -
సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్బీ
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని ఇటీవల ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అప్పటి నుంచి బిగ్బీ తరచూ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన రచనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి ‘అకెలెపాన్ కా బాల్’ అనే కవితను షేర్ చేస్తూ అది తన తండ్రి రాసినట్లుగా చెప్పారు. కానీ అది గేయ రచయిత ప్రసూన్ జోషీ రాశారు. వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకున్న బిగ్బీ గురువారం క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు. ‘సరిదిద్దుకున్నా: నిన్న నేను పంచుకున్న పద్యం మా నాన్న హరివంశ్ రాయ్ బచ్చన్ రాసినది కాదు. అది ప్రసూన్ జోషి రాసినది. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు. బిగ్ బీ తండ్రి హరివంశ్ బచ్చన్ ప్రసిద్ద సాహిత్య కవి. (చదవండి: నాపై గౌరవం పోయినా సరే, నేను ఇంతే) CORRECTION : कल T 3617 pe जो कविता छपी थी , उसके लेखक , बाबूजी नहीं हैं । वो ग़लत था । उसकी रचना , कवि प्रसून जोशी ने की है । इसके लिए मैं क्षमा प्रार्थी हूँ । 🙏🙏 उनकी कविता ये है - pic.twitter.com/hZwgRq32U9 — Amitabh Bachchan (@SrBachchan) August 6, 2020 ఆయన రాసిన సాహిత్య రచనలైన ‘అగ్నిపత్’, ‘అలాప్’, ‘సిల్సిలా’ పేరుతో వచ్చిన సినిమాల్లో అమితాబ్ నటించాడు. ప్రసూన్ జోషీ కవి, గేయ రచయిత, స్క్రీన్ రైటర్ కూడా. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తారే జమీన్ పర్’, ‘చిట్టాగ్యాంగ్’, ‘ఢిల్లీ 6’ సినిమాలకు కథను అందించారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చీఫ్గా ఉన్నారు.ఇటీవల బిగ్బీ, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, మనవరాలు అరాధ్య బచ్చన్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో మొదట ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు కోలుకోగా బిగ్బీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అభిషేక్ మాత్రం ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నాడు. (చదవండి: నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్) -
కరోనా నుంచి కోలుకున్న బిగ్ బి
కరోనా నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షలో కోవిడ్ నెగటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు అమితాబ్. ఈ విషయాన్ని అభిషేక్ తన ట్విట్టర్లో తెలిపారు. ‘నాన్నగారు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇక నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు. ఆయనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. నేను ఇంకా కోవిడ్ పాజిటివ్గానే ఉన్నాను. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కరోనాను జయించి ఆరోగ్యంగా బయటకు వస్తాను’’ అని అన్నారు అభిషేక్. అమితాబ్ మాట్లాడుతూ –’’ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశాను. దేవుడి దయ, నా ఆప్త మిత్రులు, స్నేహితులు, అభిమానుల ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆసుపత్రిలో వైద్య బృందం సహకారం వల్ల త్వరగా కోలుకోగలిగాను’’ అన్నారు. -
నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో అభిషేక్కు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు అభిషేక్ తెలిపారు. ‘ నాన్న అమితాబ్కు తాజా టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. ఇక ఇంటిలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. మీ అందరి ప్రార్థనలు ఫలించడంతో నాన్న కోలుకున్నారు. అందరికీ ధన్యవాదాలు’ అని అభిషేక్ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్న అమితాబ్) అదే సమయంలో తనకు మాత్రం మరోసారి జరిపిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని అభిషేక్ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ నా శరీరంలో ఇంకా కోవిడ్-19 అవశేషాలు ఉన్నాయి. ఆస్పత్రిలోనే మరికొన్ని రోజులు చికిత్స తీసుకోవాల్సి ఉంది. మా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ థాంక్స్. నేను త్వరలోనే కరోనాను జయిస్తా. ఆరోగ్యంగా తిరిగి వస్తా’ అని అభిషేక్ మరొక ట్వీట్లో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డ అమితాబ్, అభిషేక్లు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం అమితాబ్ కరోనాను గెలిచి ఇంటికి వెళ్లగా అభిషేక్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంది. అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే వీరిద్దరూ కోలుకున్న సంగతి తెలిసిందే.(వాళ్లకు భూమ్మీద బతికే అర్హత లేదు) I, Unfortunately due to some comorbidities remain Covid-19 positive and remain in hospital. Again, thank you all for your continued wishes and prayers for my family. Very humbled and indebted. 🙏🏽 I’ll beat this and come back healthier! Promise. 💪🏽 — Abhishek Bachchan (@juniorbachchan) August 2, 2020 🙏🏽 my father, thankfully, has tested negative on his latest Covid-19 test and has been discharged from the hospital. He will now be at home and rest. Thank you all for all your prayers and wishes for him. 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) August 2, 2020 -
ఓ అనామకుడా.. నీపై జాలి వేస్తోంది
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య కరోనా పాజిటివ్తో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆరాధ్యలకు చికిత్సానంతరం నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు అమితాబ్. బిగ్ బి కుటుంబానికి చాలామంది ధైర్యం చెబుతున్నారు. కొందరైతే పూజలు కూడా చేస్తున్నారు. కానీ ‘కరోనాతో చనిపోతావ్ అమితాబ్’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్కి అమితాబ్ స్పందిస్తూ – ‘‘మిస్టర్ అనామకుడా.. కరోనాతో నేను చనిపోతానని అంటున్నావు. నీ గురించి తెలియడానికి కనీసం నీ తండ్రి పేరు కూడా రాయలేదు.. ఎందుకంటే.. నీ తండ్రి ఎవరో నీకు తెలియదు. నేను బతకవచ్చు లేదా చనిపోవచ్చు. ఒకవేళ నేను చనిపోతే నన్ను దూషించడానికి నీకు పని దొరకదు. నాలాంటి ఓ ప్రముఖుని పేరుపై ఇలాంటి వార్తలు సృష్టించడం వల్ల నీపై జాలేస్తోంది. దేవుని దయ వల్ల నేను బతికితే.. 9 కోట్ల నా ఫాలోయర్ల ప్రేమతో నువ్వే తుడిచి పెట్టుకుపోతావు. నీ గురించి వారికింకా తెలియపరచలేదు. కానీ చెబుతాను. ఆ తర్వాత ప్రపంచం మొత్తంలో పశ్చిమం నుంచి తూర్పు వరకు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు నిన్ను వెతుకుతారు.. అడ్డుకుంటారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘టోక్ దో సాలే కో’ (వదిలేయండి వాణ్ణి) అన్నారు. -
వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్
సాక్షి,ముంబై: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన తన భార్య, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్-19 నిర్దారిత పరీక్షల్లొ నెగిటివ్ అని తేలడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. అయితే తన తండ్రి బిగ్బీ అమితాబ్ బచ్చన్, తాను మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. (ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య) కాగా అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు ఇటీవల కరోనా సోకడంతో హాస్పిటల్లో చేరారు. కరోనా పాజిటివ్ వచ్చి హోంక్వారంటైన్లో ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీనికిముందే సీనియర్ బచ్చన్, అభిషేక్కు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం నానావతి హాస్పిటల్లో చేరారు. అయితే అమితాబ్ భార్య, నటి జయాబచ్చన్, మిగతా కుటుంబ సభ్యులకు నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. (అది నకిలీ వార్త) Thank you all for your continued prayers and good wishes. Indebted forever. 🙏🏽 Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff. — Abhishek Bachchan (@juniorbachchan) July 27, 2020 -
అది నకిలీ వార్త
‘‘కరోనా పరీక్షల్లో నాకు నెగటివ్ వచ్చిందనే వార్తల్లో నిజం లేదు’’ అని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలు కరోనా బారిన పడి, చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమితాబ్కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని, కోవిడ్ 19 నుంచి ఆయన కోలుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా సంతోషించారు. దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ– ‘‘తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చిందనే వార్త తప్పు.. ఇది బాధ్యతారాహిత్యంతో కూడుకున్న ప్రచారం.. నకిలీ వార్త.. పూర్తిగా అబద్ధం’’ అని ట్వీట్ చేశారు. -
అభిషేక్.. గట్టి హగ్ ఇవ్వాలనుంది
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్తో పాటు ఆయన తండ్రి అమితాబ్ బచ్చన్, భార్య ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరు త్వరగా కోలుకోవాలంటూ "బ్రీత్" నటుడు అమిత్ సాధ్ ఆకాంక్షించారు. ఈమేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. "అన్నయ్య(అబిషేక్).. మిమ్మల్ని గురు, యువ, బంటీ, బబ్లీ.. ఇలా ఎన్నో సినిమాల నుంచి దగ్గరగా చూస్తున్నాను. ముందుగా నాకు సీనియర్గా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నన్ను మీతో సమానంగా చూశారు. మీరు ఎక్కువ, నేను తక్కువ అనే భావన నాకు రాకుండా చేశారు. మీరు లేకపోయుంటే బ్రీత్లో నా పాత్ర కబీర్ సావంత్ అసంపూర్తిగా మిగిలిపోయేది. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా బ్రీత్ విజయ వేడుకకు ఆరంభం, ముగింపు ఏదీ ఉండదు. నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండే మీతో కలిసి పనిచేసేందుకు నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను". (రణ్బీర్ జిరాక్స్ ఇక లేరు) మీరు, మీ కుటుంబం ఎంతో త్వరగా కరోనాను జయించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎంచక్కా మిమ్మల్ని కలుసుకోవచ్చు, మీకు గట్టిగా ఒక హగ్ కూడా ఇవ్వొచ్చు. అలా ఐతే నన్ను 2 వారాలు క్వారంటైన్లో ఉండమంటారేమో? రెండు వారాలేంటి, నెల రోజులైనా ఉంటాను. అంత ప్రేమ నాకు మీమీద! మిమ్మల్ని చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటా" అని రాసుకొచ్చారు. కాగా అభిషేక్ బచ్చన్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ "బ్రీత్: ఇన్టూ ది షాడోస్". ఇందులో నటుడు అమీర్ సాధి కబీర్గా, అభిషేక్ అవినాష్గా నటించారు. (‘బిగ్బి, అభిషేక్లకు చికిత్స అవసరం లేదు’) -
వారం తర్వాత ఇంటికి..
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ కరోనా పాజిటివ్తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్ వచ్చినా, ఇద్దరూ ఇంటి వద్దే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అమితాబ్, అభిషేక్ చికిత్సకు చక్కగా సహకరిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని, మరో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు పేర్కొన్నారట. కాగా బిగ్ బి కుటుంబం త్వరగా కోలుకోవాలని పలువురు సినిమా తారలు, అభిమానులు పూజలు చేస్తున్నారు. ‘‘మీ ప్రేమాభిమానాల వరదలో తడిసి ముద్దవుతున్నాను. మీ ప్రేమకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి నేను చీకటిలో ఉన్నాను. మీ అందరి అభిమానానికి తలవంచి నమస్కరిస్తున్నాను’’ అని ఆస్పత్రిలో చేరాక అమితాబ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. -
చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి..
సాక్షి, చెన్నై: సినిమాలో నటించాలన్న వ్యామోహం ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసింది. ఆశ నెరవేరకపోవడంతో మతితప్పిన స్థితిలో రోడ్డుపాలైంది ఆమె జీవితం. మానవత్వం మూర్తీభవించిన మహిళా ఇన్స్పెక్టర్ కంటబడి సురక్షితంగా శరణాలయానికి చేరింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. సడలింపులకు తావులేని సంపూర్ణ లాక్డౌన్ ఆదివారాలతో రాష్ట్రమంతా నిర్మానుష్యంగా మారిపోతోంది. చెన్నై మాధవరం కూడా అదే తీరులో బోసిపోయింది. ఆదివారం (12వ తేదీ) ఉదయం 7.30 గంటల సమయంలో చెన్నై సచివాలయ ఉద్యోగుల క్వార్టర్ పోలీస్స్టేషన్లో పనిచేసే మహిళా ఇన్స్పెక్టర్ రాజేశ్వరీ జీపులో గస్తీ తిరుగుతుండగా రోడ్డువారగా ఉన్న కుప్పతొట్టి వైపు దృష్టి మరలింది. వెంటనే మురుగన్ జీపు ఆపు, కొద్దిగా వెనక్కుపోనీ అంటూ డ్రైవర్ను ఆదేశించింది. కుప్పతొట్టి పక్కనే చింపిరి జుట్టు, పూర్తిగా నలిగి మాసి, చిరిగిపోయిన చుడీదార్ దుస్తుల్లో కూర్చుని ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూసి ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయింది. జీపు నుంచి దిగి దగ్గరకు వెళ్లి చేయిపట్టుకుని నిలబెట్టింది. నీవు ఎవరు, ఇక్కడెందుకు ఉన్నావని ప్రశ్నించగా మీరు పోలీసా..నాకు ఆకలి వేస్తోంది.. ఏమైనా కొనిపెడతారా అని అడిగింది. ఇన్స్పెక్టర్ కంటితో సైగచేయగానే డ్రైవర్ జీపులోని ఫ్లాస్క్ నుంచి టీని కప్పులో పోసి తీసుకురాగా ఆ యువతి ఆత్రంగా తాగేసింది. వెంటనే పరుగు పరుగున మరలా కుప్పతొట్టి వద్దకు వెళ్లి తన బ్యాగును చేతిలోకి తీసుకుంది. ఆ యువతిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టించింది. పోలీస్స్టేషన్లోని బాత్రూములో మహిళా కానిస్టేబుళ్లు స్నానం చేయించి, డ్రైవర్ చేత కొత్త దుస్తులను తెప్పించి తొడిగారు. ఆ తరువాత ఇన్స్పెక్టర్ రాజేశ్వరి మెల్లమెల్లగా మాటలు కలుపుతూ ఆ యువతి వివరాలను సేకరించడం ప్రారంభించింది. (తమిళనాడు : రవాణాకు బ్రేక్..లాక్డౌన్ పొడిగింపు) అభిషేక్ బచ్చన్ కోసం అయినవారిని విడిచి ఆ యువతి పేరు భారతి. ఆమె తండ్రి చెన్నై శాస్త్రీభవన్లో ఉద్యోగం చేసి ఉద్యోగ విమరణపొందారు. తల్లిదండ్రులు మరణించగా, చెన్నై పులియంతోపులో అత్త ఉన్నట్లు చెప్పింది. పోలీసులు సుమారు గంటపాటు వెతికి అత్తను కనుగొని స్టేషన్కు తీసుకొచ్చారు. భారతిని అప్పగించే ప్రయత్నం చేయగా అత్త నిరాకరించింది. ఆవడిలో ఉన్న ఆ యువతి చెల్లి ఇంటికి తీసుకెళ్లారు. భారతి గురించి ఆమె పోలీసులకు వివరించింది. ‘మేము మొదట్లో కొడుంగయ్యూరులో ఉండేవారము. మా పెద్ద అక్కకు క్రికెట్ అన్నా, సచిన్ టెండూల్కర్ అన్నా మహా పిచ్చి. అతడినే పెళ్లి చేసుకుంటానని మొండికేసేది. అతనికి పెళ్లయిందని వారించాం. ఆ తరువాత యువరాజ్సింగ్పై మోజు పెంచుకుని పెళ్లాడుతానని చెప్పేంది. 2008లో యువరాజ్సింగ్కు నిశ్చితార్థం జరగడంతో అదే రోజున ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మా కుటుంబాన్ని కుంగదీసింది. 2016లో రిటైరైన మా నాన్న కొద్ది కాలానికి మరణించారు. ఆ తరువాత అమ్మ కూడా చనిపోయింది. ఇదిలా ఉండగా, భారతి అక్క చెన్నైలోని ఒక కాలేజీలో బీఎస్సీ పూర్తిచేసింది. కాలేజీలో చదివే రోజుల్లోనే సినిమా వ్యామోహం ఎక్కువ. అభిషేక్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టం. పెళ్లి సంబంధాలు చూస్తుండగా చేసుకుంటే అభిషేక్ బచ్చన్నే చేసుకుంటానని మొండికేసి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేది. క్రమేణా పిచ్చిదానిలా మారిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది, మీ అక్కను ఇక్కడే వదిలిపెడతామని ఇన్స్పెక్టర్ చెప్పగా ‘అయ్యో ఇది ఇంట్లో ఒక్క నిమిషం ఉండదు, దీన్ని గమనించుకోవడం నా వల్ల కాదు’ అని నిరాకరించింది. ఈ పరిణామంతో భారతిని మరలా పోలీస్స్టేషన్కు చేర్చి అనాథ శరణాలయానికి ఫోన్ చేయగా ‘సారీ మేడమ్ కరోనా కారణంగా కొత్తవారిని చేర్చుకోవడం లేదు’ అని నిరాకరించారు. చెన్నై కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలోని తన స్నేహితురాలైన మహిళా సబ్ఇన్స్పెక్టర్ మోహనప్రియకు ఫోన్ చేసి భారతి దయనీయ పరిస్థితిని వివరించగా అంగీకరించింది. కరోనా పరీక్షలు చేసి ఏదో ఒక శరణాలయానికి పంపుతానని మోహన ప్రియ తెలిపింది. కార్పొరేషన్ కార్యాలయానికి పంపేందుకు జీపు ఎక్కిస్తుండగా, ‘అమ్మా అందరూ నాకు పిచ్చి అంటున్నారు.. నిజంగా నాకు పిచ్చి ఉందా’ అంటూ భారతి అమాయకంగా ప్రశ్నించగా, నీకు పిచ్చా ఎవరు చెప్పారు, పిచ్చిలేదు ఏమీ లేదు, పోయిరా అంటూ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి సాగనంపింది. మతిస్థిమితం కోల్పోయినపుడు ఆసుపత్రిలో చేర్పించవచ్చుకదా అని తోబుట్టువు, బంధువులను ప్రశ్నించగా చాలా ఖర్చవుతుందని చెప్పడం బాధాకరమని రాజేశ్వరి అన్నారు. ఎంతో అందంగా ఉన్న ఈ అమ్మాయి దుర్మార్గుల చేతిలో చిక్కి ఉంటే.. తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల్లో కఠినాత్ములే కాదు జాలి, దయ గలిగిన మానవతా మూర్తులు కూడా ఉంటారని నిరూపించిన ఇన్స్పెక్టర్ రాజేశ్వరిని అందరూ పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. -
‘బిగ్బి, అభిషేక్లకు చికిత్స అవసరం లేదు’
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ల ఆరోగ్యం స్థిమితంగా ఉందని ముంబై నానావతి హాస్పిటల్ వైద్యులు సోమవారం వెల్లడించారు. బిగ్బి, అభిషేక్లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (చదవండి: కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్) తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు బిగ్బీ శనివారం(జులై 11) సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా తనకు కోరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్వీట్ చేస్తూ..‘నాకు, నా తండ్రి అమితాబ్ బచ్చన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. మాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాము’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం అభిషేక్ మరో ట్వీట్ చేస్తూ తన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్లకు కూడా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించాడు. (చదవండి: అమితాబ్కు కరోనా.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్) -
కరోనా టెన్షన్
-
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్
ముంబై : బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, నేడు ఆయన కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు పాజిటివ్గా తేలింది. మరోవైపు బిగ్బీ సతీమణి జయబచ్చన్కు మాత్రమే కరోనా నెగిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని నానావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిపై అభిషేక్ ట్విటర్ వేదికగా స్పందించారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్) ‘ఐశ్వర్య, ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. వారిద్దరు ప్రస్తుతం ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. బీఎంసీ వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంది. నా తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్గా తేలింది. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్యులు నిర్ణయం తీసుకునేవరకు నేను, నా తండ్రి ఆస్పత్రిలోనే ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా, క్షేమంగా ఉండండి. అన్ని నియమాలు పాటించండి’ అని అభిషేక్ కోరారు. (నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా) Aishwarya and Aaradhya have also tested COVID-19 positive. They will be self quarantining at home. The BMC has been updated of their situation and are doing the needful.The rest of the family including my Mother have tested negative. Thank you all for your wishes and prayers 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) July 12, 2020 My father and I remain in hospital till the doctors decide otherwise. Everyone please remain cautious and safe. Please follow all rules! — Abhishek Bachchan (@juniorbachchan) July 12, 2020 -
బిగ్బి ఇంట్లో కరోనా కలకలం
-
అమితాబ్కు కరోనా.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. శనివారం సాయంత్రం అమితాబ్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్ యూనిట్లో చేరారు. అంతకు ముందు అమితాబ్ ట్విట్టర్లో.. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి అధికారులు నాతోపాటు మా కుటుంబ సభ్యులు, సిబ్బందికి కూడా పరీక్షలు చేయించారు. వారికి సంబం ధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది’ అని అందులో వివరించారు. ‘గత 10 రోజులుగా నాతో సన్నిహి తంగా మెలిగిన వారిని కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’ అని అందులో తెలిపారు. కోవిడ్ లక్షణా లతో అమితాబ్ ఆస్పత్రిలో చేరారనీ, అంతకు ముందు నుంచే అమితాబ్ తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్నారనీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మార్చి 25న మొదలైన దేశవ్యాప్త లాక్డౌన్ సమయం నుంచి ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. ఇటీవల తన ఇంట్లోనే కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ప్రమోషనల్ కాంటెంట్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ద్వారానే ఆయనకు కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్కు కూడా తనకు కోవిడ్–19 పాజిటివ్గా నిర్థారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాసేపటికే అభిషేక్ (44) కూడా తనకు పాజిటివ్ అని ధ్రువీకరించారు. ‘మా ఇద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ సమాచారమం దించాం. అభిమానులెవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరుతున్నాను.. ధన్యవాదాలు’ అని అభిషేక్ వెల్లడించారు. కాగా, జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్లకు కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో అమితాబ్ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కాస్త ఊరట చెందారు. వైద్యులేమంటున్నారు... శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న అమితాబ్ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చి, కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్ష ఫలితం శనివారం సాయంత్రం అందింది. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్ను అమర్చలేదు. కోవిడ్ పాజిటివ్గా తేలిన విషయం ఆయనే స్వయంగా అభిమానులకు తెలుపుతానన్నారు. అందుకే మేం ఈ విషయమై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అమితాబ్ విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి ఆయన వయస్సు. రెండోది, ఆయన కాలేయ, ఉదర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుండటం. అయితే, సరైన వైద్య, చికిత్సలతో ఆయన త్వరగా కోలుకుంటారని విశ్వాసం ఉంది. 1982లో ‘కూలీ’ చిత్ర షూటింగ్ సమయంలో తీవ్ర ప్రమాదానికి గురైన అమితాబ్.. అప్పటి నుంచి కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణ, సూచనలకు అనుగుణంగా ఆయన రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన చెహరే, బ్రహ్మాస్త్, ఝండ్ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అమితాబ్ చివరగా షూజిత్ సిర్కార్ కామెడీ సినిమా ‘గులాబో సితాబో’లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించారు. ఈ సినిమా కోవిడ్–19 ఆంక్షల దృష్ట్యా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది కూడా. వీటితోపాటు కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం 12వ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. కాగా, అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ బాలీవుడ్కు చెందిన పలువురు ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు. T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited .. All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested ! — Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020 Earlier today both my father and I tested positive for COVID 19. Both of us having mild symptoms have been admitted to hospital. We have informed all the required authorities and our family and staff are all being tested. I request all to stay calm and not panic. Thank you. 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) July 11, 2020 -
‘20 ఏళ్లయిందంటే నమ్మలేకపోతున్నా’
‘‘ఆ రోజు నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి నటించటం కోసం ఎంతగా ఎదురు చూడాల్సి వచ్చిందో! మేకప్ వేసుకున్న 16 గంటల తర్వాత కెమెరా ముందుకు వెళ్లాను. అప్పుడు టైమ్ ఉదయం నాలుగు గంటలైంది’’ అన్నారు కరీనా కపూర్. హీరోయిన్గా కరీనా పరిచయమైన ‘రెఫ్యూజీ’ విడుదలై 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా కరీనా చెప్పిన విశేషాలు. ♦రాజ్కపూర్ మనవరాలిగా, కరిష్మా కపూర్ చెల్లెలిగా సినిమా పరిశ్రమలోకి వచ్చాను. వారసురాలిగా వచ్చినా నాకు నేనుగా ప్రేక్షకులకు గుర్తుండాలని కోరుకున్నాను నా టాలెంట్తోనే 20 ఏళ్ల కెరీర్ను లాక్కొచ్చాను. నా 20వ ఏట నేను నటించిన మొదటి సినిమా ‘రెఫ్యూజీ’ విడుదలైంది (జూన్ 30). అప్పుడే ఇరవై ఏళ్లయిందంటే నమ్మలేకపోతున్నాను. దాదాపు 60కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించాను. అందులో ఎన్నో జయాపజయాలు, గొప్ప అనుభూతులను మిగిల్చిన సినిమాలు ఉన్నాయి. ♦వాస్తవానికి హృతిక్ రోషన్ మొదటి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో నేను హీరోయిన్గా పరిచయం కావాల్సింది. అయితే ‘రెఫ్యూజీ’ ద్వారా తెరపైకి వచ్చాను. హీరోగా అభిషేక్ బచ్చన్కి కూడా అది మొదటి సినిమా. ‘కహో నా ప్యార్ హై’ పెద్ద విజయం సాధించిఉండవచ్చు, ‘రెఫ్యూజీ’ అంతగా విజయం సాధించకపోవచ్చు. కానీ. ఇప్పటికీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకుంటున్నాను. ♦ఇక ‘రెఫ్యూజీ’కి సంబంధించిన మీడియా సమావేశాలకు వెళ్లినప్పుడు, సినిమా ప్రమోషన్లలో పాల్గొనేటప్పుడు కాళ్లకు కూడా చెమటలు పట్టేది. నేను, అభి (అభిషేక్) అంత నెర్వస్గా ఫీలయ్యేవాళ్లం. ‘కహో నా ప్యార్హై’ సినిమాని మిస్సయినా తర్వాత నేను, హృతిక్ కలిసి 4 సినిమాల్లో నటించాం. నేను నంబర్ గేమ్ ట్రాప్లో పడను. ఐదారేళ్లే ఆ నంబర్ గేమ్లో ఉంటాం. ఇప్పుడున్న క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనే నేను ఫీలవుతాను. అందుకే ఈ కాంపిటీషన్ ఉచ్చులో నేనెప్పుడూ పడలేదు. -
‘అందువల్లే రొమాంటిక్ సీన్లలో నటించలేను’
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తండ్రయ్యాక సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. సినిమాకు సైన్ చేసేముందు దర్శకనిర్మాతలకు కండిషన్స్ కూడా పెడుతున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. అతడు తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ "బ్రీత్: ఇంటు ద షాడోస్" చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఎనిమిదేళ్ల కూతురు ఆరాధ్య తనను ఎంతగానో మార్చివేసిందంటున్నాడు. "రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి నేను ఇబ్బందిపడుతున్నాను. ఎందుకంటే అలాంటి సీన్లలో నన్ను చూసేందుకు నా కూతురు ఇబ్బందిపడటం ఇష్టం లేదు. (ఏంటా సర్ప్రైజ్ ? ఐష్ మళ్లీ తల్లి కాబోతున్నారా?) వాటి గురించి తాను అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. కాబట్టి ఏదైనా సినిమా ఒప్పుకునేముందు అందులో శారీరక సంబంధం, రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే ముందే ఆ చిత్రం నుంచి తప్పుకుంటాను. అలా ఎన్నో సినిమాలు వదులుకున్నాను. కానీ దీని గురించి ఎప్పుడూ బాధపడలేదు" అని తెలిపాడు. కాగా అభిషేక్ నటించిన లూడో, బాబ్ బిస్వాస్, ద బిగ్ బుల్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా మరో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేశాడు. (‘పెట్రో’ మంట; వైరలవుతున్న బిగ్బీ ట్వీట్) -
తను నీడలో ఉంది
‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నిత్యా మీనన్. అంతేకాదు.. తన నటనతో మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్తో కలిసి ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. మాధవన్, అమిత్ సాధ్ నటించిన సూపర్ హిట్ ‘బ్రీత్’ వెబ్ సిరీస్కి ఇది రెండవ సీజన్. రెండో సీజన్లో అమిత్ సాధ్ కూడా కీలక పాత్రలో నటించారు. జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ ప్రసారం కానుంది. కాగా అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్లకు ఇది తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ‘తను నీడలో ఉంది... కనుగొనబడటానికి వేచి చూస్తోంది’ అంటూ ఈ సిరీస్ తొలి పోస్టర్ని విడుదల చేశారు. -
ఆనందంలో బచ్చన్ ఫ్యామిలీ
బిగ్బీ అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా పట్టభద్రురాలైంది. న్యూయార్క్లోని ఫోర్డ్హమ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మనువరాలు పట్టభద్రరాలైన సందర్భంగా బిగ్బీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. "నవ్య..ప్రతీ విద్యార్థి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు గ్రాడ్యుయేషన్ డే. లాక్డౌన్ కారణంగా ఈవెంట్ క్యాన్సల్ అయిపోయింది. కానీ బాధపడకు. నిన్ను సంతోషపెట్టేందుకు మేమందరం నీతో పాటే ఉన్నాం. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం. గాడ్ బ్లస్ యూ నవ్య "..అంటూ పోస్ట్ చేశారు. (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్ ) View this post on Instagram Grand daughter Navya .. the most important day in the life of a young student - Graduation Day .. ! She graduated from College in New York, but ceremony and presence got cancelled because of Corona and lockdown .. she could not go .. we too had all planned to be with her on this important occasion .. BUT .. she though wanted to wear that Graduation gown and Cap .. so staff stitched her an impromptu gown and cap .. and she wore it and celebrated at home in Jalsa .. So proud of you NAVYA .. god bless .. such a positive and happy attitude .. LOVE YOU💕💕💕💕 A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 6, 2020 at 7:22am PDT దీంతో పలువరు ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక మేనకోడలు గ్రాడ్యుయేట్ కావడం పట్ల అభిషేక్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. కంగ్రాట్స్ నవ్య అంటూ పోస్ట్ చేశారు. ఇక లాక్డౌన్ కారణంగా గ్రాడ్యేయేషన్ వేడుకకు వెళ్లలేని కారణంగా మనువరాలు నవ్య కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్లో నవ్య ఫోటోలకు ఫోజులిస్తూ ఆనందంగా కనిపించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ నందా, శ్వేతా బచ్చన్ నందా మొదటి సంతానమే నవ్య నందా. -
ఆరోజు మళ్లీ తిరిగొస్తే బాగుండు : తాప్సీ
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్లు వాయిదా పడడంతో ఇంటికే పరిమితమైన సినీ నటులు సరదాగా గడుపుతున్నారు. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన తాప్సీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. తాజాగా 2018లో తాప్సీ నటించిన హిందీ చిత్రం 'మన్మారిజియన్' షూటింగ్ లోకేషన్లో తీసిన ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలో తాప్సీ ఒక వైట్ స్కూటీపై కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఆమె వెనకాల కెమెరామెన్ షూటింగ్కు సంబందించి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.(అనుష్క శర్మ వెబ్ సిరీస్ టీజర్ విడుదల) 'ఈ ఫోటో నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది.. ఎందుకంటే ఆరోజు షూటింగ్ లొకేషన్లో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. బైక్పై ఉన్న నేను నా వెనకాల అసలు ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. నేను ఆలోచిస్తూ కూర్చుంటే.. కెమెరామెన్లు మాత్రం నా బైక్పై కెమెరాలు పెట్టి వారి పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో నేను నా భావోద్వేగంతో పాటు బండి బరువును కూడా బ్యాలెన్స్ చేసుకున్నానా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నాకు ఆ గందరగోళం మళ్లీ తిరిగి వస్తే బాగుంటుందనిపించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ ఉన్నంతవరకు తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటా అని తప్సీ తెలిపింది. కాగా 2018లో విడుదలైన మన్మారిజియన్ సినిమాను అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌషల్లు హీరోలుగా నటించారు. -
అమాయకత్వం ఏమాత్రం తగ్గలేదు: బిగ్బీ
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ నేడు 44వ వడిలోకి అడుగుపెట్టాడు. తల్లిదండ్రులు బిగ్బీ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, భార్య ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్యల సమక్షంలో అభిషేక్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఇక అభిషేక్కు ఇష్టమైన వాటి నమూనాతో ప్రత్యేక కేక్ను తయారు చేయించింది అందాల సుందరి ఐశ్వర్య. ‘హ్యాపీ బర్త్డే బేబీ.. ప్రేమతో’ అంటూ నవ్వులు చిందిస్తున్న ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అతని సోదరి శ్వేతా బచ్చన్ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ వాళ్లిద్దరూ కలిసి చిన్నప్పుడు సైకిల్తో ఆడుకున్న ఫొటోలను పంచుకుంటూ బర్త్డే గ్రీటింగ్స్ తెలిపింది. ఇది అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. (అమితాబ్కు బిగ్ ఫ్యాన్ని) ఇక అమితాబ్ బచ్చన్ పుట్టినరోజును పురస్కరించుకుని భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘ఆరోజు ఫిబ్రవరి 5. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ రోజంతా వాడి రాకకోసం ఎంతో ఆదుర్దాగా ఎదురు చూశాను. ఎట్టకేలకు వాడు జన్మించాడు. అభిషేక్ ఈ లోకంలోకి అడుగుపెట్టడంతో అందరం ఆనందంలో తేలియాడుతూ సంబరాలు జరుపుకున్నాం’ అని ఎమోషనల్ అయ్యాడు. పిల్లలు ఎంత ఎదిగినా కన్నవాళ్ల కంటికి ఇంకా చిన్నపిల్లల్లాగే కనబడుతారనేది అమితాబ్ విషయంలో మరోసారి నిరూపితమైంది. ‘నేటితో అతనికి 44 సంవత్సరాలు. కానీ నా కంటికి ఇంకా చిన్నపిల్లోడే. చిన్ననాటి అమాయకత్వం అభిషేక్కు ఇప్పటికీ పోలేదు. బహుశా పోదేమో కూడా’ అని రాసుకొచ్చాడు. చదవండి: ముద్దు మురిపాలు -
సర్ప్రైజ్? ఐష్ మళ్లీ తల్లి కాబోతున్నారా?
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఫ్యాన్స్ను తీవ్ర గందరగోళంలో పడేశారు. సర్ప్రైజ్ అంటూ చేసిన ఒక్క ట్వీట్తో ఆయన అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఆయన శుక్రవారం చేసిన ట్వీట్ నెటిజన్లను కూడా ఆలోచనలో పడేసింది. ‘హాయ్! మీ అందరికి ఒక సర్ప్రైజ్.. వేచి చూస్తూ ఉండండి’ అని అభిషేక్ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా అందరిలోనూ ఉత్సుకత మొదలైంది. ఏమై ఉంటుందబ్బా అని కొందరు మెదడుకు పదును పెడుతోంటే.. మరికొందరు ఉండబట్టలేక సందేహాలు గుప్పిస్తున్నారు. ‘మరో జునియర్ బచ్చన్ రాబోతున్నారా.. మాజీ విశ్వసుందరి మరోసారి తల్లి కాబోతున్నారా?, అరాధ్యాకు చెల్లి లేక తమ్ముడు రాబోతున్నారా’ అంటూ ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెన్సీపై కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా అభిషేక్ ‘ధూమ్-5’ చిత్రం గురించి ఏదైనా చెప్పబోతున్నారా, లేక ఆయన సినీ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అంటూ ఎవరికి తోచినట్టుగా వారు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్కి ఏమైందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. బిగ్బీ హోస్ట్గా వ్యవహరిస్తున్న కేబీసీ (కౌన్ బనేగా కరోడ్పతి)కి ఇకనుంచి అభిషేక్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారా అని ట్వీట్ చేశారు. అయితే అసలు విషయం ఎంటన్నది మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఈ సందేహాలకు, ఆందోళనకు తెరపడాలంటే అభిషేక్ మరో సర్ప్రైజ్ ట్వీట్ కోసం వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నటిస్తున్న ‘బాబ్ బిస్వాస్’ చిత్రం షూటింగ్ను ప్రారంభించినట్లు సమాచారం. Hey guys! Have a surprise for all of you. Stay tuned!! 😁 — Abhishek Bachchan (@juniorbachchan) January 21, 2020 -
నమస్కార్.. బాబ్ బిస్వాస్ మొదలైంది
ఎనిమిదేళ్ల క్రితం సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘కహానీ’. ఈ సినిమాలో సస్వతా చటర్జీ చేసిన ‘బాబ్ బిస్వాస్’ అనే కాంట్రాక్ట్ కిల్లర్ పాత్ర హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ఆ పాత్ర పేరుతో హిందీలో తెరకెక్కుతోన్న సినిమాలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దియా ఎ. ఘోష్ దర్శకురాలు. చిత్రాంగదా సింగ్ కథానాయికగా నటిస్తారట. షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ (షారుక్ ఖాన్ భార్య), సుజోయ్ ఘోష్, గౌరవ్ వర్మ ఈ చిత్రానికి నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా చిత్రీకరణ కోల్కతాలో మొదలైంది. ‘‘లైట్స్... కెమెరా.. నమస్కార్.. ‘బాబ్ బిస్వాస్’ షూటింగ్లో తొలి రోజు పాల్గొన్నాను’’ అన్నారు అభిషేక్ బచ్చన్. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
'నాన్నా మీరే నాకు స్పూర్తి.. వీ ఆర్ సో ప్రౌడ్'
న్యూఢిల్లీ: సినీరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అందుకున్న నేపథ్యంలో.. తనయుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ తన భావోద్వేగాలను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న నా తండ్రికి శుభాకాంక్షలు. View this post on Instagram A memory to cherish. #dadasahebphalkeaward #theparentals A post shared by Abhishek Bachchan (@bachchan) on Dec 29, 2019 at 10:35am PST 'నాకు మీరే స్ఫూర్తి అంటూనే మై హీరో.. కంగ్రాచ్యులేషన్స్ పా.. వీ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యు.. ఐ లవ్ యు' అంటూ వ్యాఖ్యానించారు. ఇక అమితాబ్ కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా అవార్డు అందుకున్నప్పటి ఫోటోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 23న జరిగింది. అయితే, అనారోగ్యం కారణంగా తాను రాలేకపోతున్నట్లు అమితాబ్ ముందుగా నిర్వాహకులకు చెప్పడంతో.. ఆదివారం ప్రత్యేకంగా ఈ అవార్డును రాష్టపతి ఆయనకు అందించారు. T 3592/3/4/5 - .. my immense gratitude and respect for this moment ..🙏 pic.twitter.com/WavW3Hwkjw — Amitabh Bachchan (@SrBachchan) December 29, 2019 -
ముద్దు మురిపాలు
తల్లిదండ్రుల కళ్లకు పిల్లలు ఎప్పటికీ చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. వారి వయసు ఐదు పదులు నిండినా, ఐదేళ్ల పసిపిల్లల్లాగే అనిపిస్తారు. అందుకే వాళ్ల చిన్నప్పటి ఫొటోలు చూసుకుని మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. బిగ్ బీ కూడా ఈ విషయంలో ఒక తండ్రిగానే కనిపిస్తారు. ఏడు పదులు దాటిన బిగ్ బి అమితాబ్ బచ్చన్... అభిషేక్ బచ్చన్, శ్వేత బచ్చన్ బాల్యస్మృతులను గుర్తుచేసుకుంటూ, వారి చిన్నప్పటి ఫొటోలను ట్విటర్లో పోస్టు చేసి మురిసిపోతున్నారు. ‘‘బాల్యంలో ఉండే అమాయకత్వంలో దైవత్వం కనిపిస్తుంది. చిన్న నాటి ఫొటోలు చూసినప్పుడల్లా పిల్లలు ఎంత స్వచ్ఛమైనవారో గుర్తుకు వస్తుంది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. తనకు అభిషేక్ బచ్చన్ రాసిన ఒక లేఖను కూడా ఇటీవలే ట్విటర్లో పోస్టు చేశారు అమితాబ్. ఎంత సెలబ్రిటీలయినా పిల్లలకు తల్లిదండ్రులే, పిల్లల ఆప్యాయతలకు బానిసలే. పిల్లల మురిపాలకు దాసులే. -
అభిషేక్ లేఖను పంచుకున్న బిగ్బీ!
ముంబై: తన కుమారుడు, హీరో అభిషేక్ బచ్చన్ గతంలో రాసిన ఒక లేఖను బిగ్బీ అమితాబ్ బచ్చన్ శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేస్తూ తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను లాంగ్ అవుట్డోర్ షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో అభిషేక్ తనకు రాసిన లేఖను ఈ సందర్భంగా తన అభిమానులతో పంచుకున్నారు. 'డార్లింగ్ పాపా, మీరు ఎలా ఉన్నారు? మేమంతా క్షేమంగానే ఉన్నాము. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. పాపా, మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే ఇంటికి వస్తారని ఆకాంక్షిస్తున్నాను. నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను, దేవుడు మన ప్రార్థనలను వింటున్నాడు. పాపా మీరేం బెంగపెట్టుకోవద్దు.. అమ్మను(జయా) బాగా చూసుకుంటాను' అనేది ఆ లేఖ సారాంశం. అయితే లేఖ రాసినప్పుడు అభిషేక్ వయస్సు ఎంత ఉంటుందనే విషయాన్ని బిగ్బీ వెల్లడించలేదు. T 3549 - Abhishek in his glory .. a letter to me when I was away on a long outdoor schedule .. पूत सपूत तो क्यूँ धन संचय ; पूत कपूत तो क्यूँ धन संचय pic.twitter.com/Tatw1VU1oj — Amitabh Bachchan (@SrBachchan) November 14, 2019 బిగ్బి, అభిషేక్లు కలిసి పా, సర్కార్, సర్కార్ రాజ్, బంటీ ఔర్ బబ్లీ, కబీ అల్విదా నా కెహనా సహా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అమితాబ్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి గులాబో సీతాబో చిత్ర షూటింగ్ను పూర్తిచేసుకోగా.. ఇమ్రాన్ హాష్మీతో నటించిన చెహ్రే విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలానే క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోర్పతి సీజన్11కు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిషేక్ ది బిగ్ బుల్తో పాటు బ్రీత్ సీజన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
దీపికా, అలియాలతో విజయ్ దేవరకొండ సందడి
‘అర్జున్రెడ్డి’ సక్సెస్తో టాలీవుడ్లో క్రేజీ హీరో అయ్యాడు విజయ్దేవరకొండ. సినిమాలలో, అడియో రిలీజ్ ఫంక్షన్లతో పాటు పలు సినిమా కార్యక్రమాలలో తనదైన రీతి మాట్లాడుతూ తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో వరస విజయాలతో దూసుకుపోతూ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు ఈ ‘గీత గోవిందం’ హీరో. ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్జోహర్ అర్జున్రెడ్డిని హీందీలో రీమేక్లో నటించమని అడగడంతో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే ఇటీవల విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ను కూడా కరణ్ హీందీలో రీమేక్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్కి టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్కు కూడా సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలో ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరోకి బాలీవుడ్లో ఆఫర్లు కూడా వస్తున్నాయంటా. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో బీజీగా ఉండటంతో బీటౌన్కి వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని చెపుకొస్తున్నాడు రౌడీ. తాజాగా ఇంటర్నేషనల్ సింగర్ ‘క్యాటీ పెర్రి’ మ్యుజిక్ షో కోసం ముంబాయిలోని వన్ప్లేస్ హోటల్లో ఏర్పాటు చేసిని పార్టీకి నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్గా వ్యవహరించాడు. ఈ పార్టీకి విజయ్ దేవరకొండకు కూడా ఆహ్వనం అందింది. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, కైరా అద్వానీ, దీపికా పదుకోన్, జాక్వేలిన్ ఫేర్నాండేస్, హీరో రణ్వీర్ సింగ్ తమిళ హీరో విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్, సిధ్దార్థ చతుర్వేది, అభిషేక్ బచ్చన్లతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్ను అలియా భట్ హాయ్ అంటూ పలకరించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా ప్రేమకథగా తెరకెక్కుతున్న రౌడీ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram Vijay deverakonda ❣️ Vijay ❤️ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫_______________ Turn on Post Notification 🔔 _______________⏫_______________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫______________ #arjunreddyfever #arjunreddy😎 #arjunreddy #arjunreddymania #shalinipandey #vijay #vijayfans #vijaydeverakonda # #rowdywear #kajal #rowdies #rowdy #rowdyclub #geethagovindam #NOTA # #ajith #tamil #taxiwaala #teluguactress rajini #dearcomrade #alluarjun #prabhas #samantha #bollywoodactress #tamilactress #kollywoodcinema #thedeverakondafc _________________________________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf @thedeverakonda A post shared by Vijay Deverakonda🔵 (@thedeverakondaf) on Nov 15, 2019 at 12:57am PST -
ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..
ముంబై : లెజెండరీ నటుడు, బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ దశాబ్దాల తరబడి సినీ ప్రియులను అలరిస్తూ హిందీ సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్ధానాన్ని పూర్తిచేసుకున్నారు. 1969లో సాథ్ హిందుస్తానీ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టిన అమితాబ్ తన నటనతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించారు. భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ అమితాబ్ నటనకు సినీ ప్రియులు నీరాజనాలు పలికారు. సుదీర్ఘ సినీ పయనంలో పలు బ్లాక్బస్టర్లు అందించిన అమితాబ్ తన నట ప్రస్ధానం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ సినిమాల్లో అమితాబ్ ఎంట్రీ సీన్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందంటే అతిశయోక్తి కాదు. బిగ్బీ తొలి మూవీ సాథ్ హిందుస్తానీ 1969 నవంబర్ 7న విడుదలై 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఐదు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న అమితాబ్ తన నటవారసునిగా అభిషేక బచ్చన్ను పరిశ్రమకు అందించారు. అమితాబ్ 50 ఏళ్ల సినీ ప్రస్ధానం సందర్భంగా ఆయన కుమారుడు అభిషేక్ తన తండ్రి హీరోగా ఎదిగిన తొలినాళ్ల ఫోటోను పోస్ట్ చేశారు. కేవలం కుమారుడిగానే కాదు..నటుడిగా..ఓ అభిమానిగా మేమంతా మీ ఔన్నత్యానికి సాక్షులుగా నిలిచామని అభిషేక్ రాసుకొచ్చారు. సినీ అభిమానులంతా తాము బచ్చన్ తరంలో జీవించామని గర్వంగా చెప్పుకుంటారని, 50 ఏళ్లు సినీ జీవితంలో కొనసాగినందుకు అభినందనలు తెలిపారు. మరో 50 ఏళ్ల కోసం తాము నిరీక్షిస్తామని అభిషేక్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. -
‘నిరుద్యోగి’ కామెంట్పై ఆ హీరో అద్భుత రిప్లై..
ముంబై : బిగ్స్ర్కీన్కు విరామం ఇస్తూ తనకిష్టమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్న అభిషేక్ బచ్చన్ ఎక్కువసమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. జూనియర్ బచ్చన్ ఇటీవల ట్విటర్లో చేసిన పోస్ట్పై ఓ నెటిజన్ ఆయనను ట్రోల్ చేయగా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి ఆకట్టుకున్నారు. తనపై వచ్చిన ట్రోల్ను హుందాగా స్వీకరిస్తూ జూనియర్ బచ్చన్ ఇచ్చిన సమాధానం గొప్పగా ఉందనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక లక్ష్యం..ఆశయంతో పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని ఓ కోట్ను అభిషేక్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్పై ఓ నెటిజన్ జూనియర్ బచన్ను నిరుద్యోగిగా పేర్కొంటూ కామెంట్ చేశారు. ఓ వ్యక్తి సోమవారం కూడా విశ్రాంతి తీసుకుంటే అతడిని నిరుద్యోగి అనే పిలుస్తారని కామెంట్ చేశారు. దీనికి బదులిచ్చిన అభిషేక్..‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను.. కొందరు వారు ఏ పనిచేసినా దాన్ని ప్రేమిస్తార’ని హుందాగా స్పందించారు. ఇక తన తదుపరి చిత్రంలో అనురాగ్ బసు నిర్ధేశకత్వంలో అభిషేక్ వెండితెరపై సందడి చేయనున్నారు. -
జిమ్లో కష్టపడి ఈ కండలు పెంచాను!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు, మాజీ మిస్ వరల్డ్ ఐశ్యర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్.. నిజానికి బిగ్ బీ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అభిషేక్ హిట్ కాలేకపోయారు. ఎన్ని సినిమాలు తీసినా ఆయనకు సరైన విజయం దక్కలేదు. హిరోగా నిలదొక్కుకోలేకపోయారు. సైడ్ హీరో క్యారెక్టర్లు వేసినా.. మంచి పేరైతే రాలేదు. ఈ నేపథ్యంలో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ మధ్య చాలావరకు జూనియర్ బచ్చన్ సినిమాల్లో కనిపించలేదు. ఇక, సోషల్ మీడియా జూనియర్ బచ్చన్ మీద అప్పుడప్పుడు జోకులు పేలుతూనే ఉంటాయి. తన మీద వచ్చే కూల్ జోక్స్ మీద అభిషేక్ కూడా హుందాగా స్పందిస్తూ ఉంటారు. త్వరలో విడుదల కానున్న ‘మర్జావాన్’ సినిమా ట్రైలర్లోని ఓ వ్యక్తి జూనియర్ బచ్చన్ను పోలి ఉండటంతో.. చాలాకాలం తర్వాత సినిమాల్లో అభిషేక్ను చూడటం ఆనందంగా ఉందంటూ ఓ నెటిజన్ మీమ్ను పోస్ట్ చేశారు. ఈ మీమ్పై అభిషేక్ సరదాగా స్పందిస్తూ.. ‘థాంక్యూ.. జిమ్లో పొద్దస్తమానం కష్టపడి ఈ కండలు సాధించాను...ఇక జోక్స్ పక్కనబెడితే.. అది నేను కాదు. ‘మర్జావాన్’ చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్’ అంటూ స్పందించారు. రితేశ్ దేశ్ముఖ్, సిద్ధార్థ మల్హోత్రా, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన మర్జావాన్ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. Thank you! Went full #beastmode in the gym for this one. 😂 Jokes apart. That’s not me! But wish the entire team of #Marjaavaan all the best. Looking great. @Riteishd @SidMalhotra @zmilap @nikkhiladvani https://t.co/YIySCIt7hJ — Abhishek Bachchan (@juniorbachchan) September 27, 2019 -
ది బిగ్ బుల్
సెన్సెక్స్, స్టాక్ ఎక్సేంజ్, స్టాక్ బ్రోకింగ్ గురించి నాలెడ్జ్ సంపాదించి బాంబే స్టాక్ ఎక్సేంజ్లో వర్క్ స్టార్ట్ చేశారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. కానీ అభిషేక్ ఈ పని చేస్తోంది మాత్రం ‘ది బిగ్ బుల్’ సినిమా కోసమే. అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నారు. 2012లో ‘బోల్ బచ్చన్ ’సినిమా కోసం అభిషేక్, అజయ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ది బిగ్ బుల్’ సినిమాకు కూకై గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించనున్నారని తెలిసింది. చిత్రీకరణ ప్రారంభమైంది. ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్న ముంబై ప్రముఖ స్టాక్ బ్రోకర్ హార్షద్ మెహతా (1954–2001) జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని బాలీవుడ్ సమాచారం. -
సచిన్ గల్లీ క్రికెట్; షాకైన అభిషేక్, వరుణ్
-
సచిన్ గల్లీ క్రికెట్; షాకైన అభిషేక్, వరుణ్
ముంబై : మైదానంలోనే కాదు బయట కూడా స్ఫూర్తిమంతంగా వ్యవహరించడం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నైజం. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ కార్యక్రమానికి సచిన్ మద్దతు పలికాడు. ఈ క్రమంలో గురువారం గల్లీలో క్రికెట్ ఆడాడు. అయితే, తనతో పాటు క్రికెట్ ఆడతారా అని బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మెహబూబా స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సచిన్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. తొలుత సచిన్ బ్యాటింగ్ చేయగా.. వరుణ్, అభిషేక్ బంతులేశారు. అనంతరం వారిద్దరికీ బౌలింగ్ చేసిన లిటిల్ మాస్టర్ అక్కడే ఉన్న జియా అనే మహిళా యువ క్రికెటర్ను ఎంకరేజ్ చేశాడు. ఆమెతో వరుణ్, అభిషేక్కి బౌలింగ్ చేయించాడు. ‘స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్’, ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ హాష్టాగ్లను జత చేస్తూ.. సచిన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. గల్లీలో క్రికెట్ ఆడటం ఆనందం ఉందని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చేసే పనిలో ఆటల్ని భాగం చేసుకోవాలని సూచించాడు. కాగా, ఈ ట్వీట్పై వరుణ్ స్పందించాడు. క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్ అంటూ ప్రశంసించాడు. మీతో క్రికెట్ ఆటడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. -
ఏడేళ్ల తర్వాత?
అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ ఏడేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 1990–2000 మధ్య కాలంలో దేశ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు తోడు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హిందీలో కూకై గులాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాలో అజయ్, అభిషేక్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. హీరోయిన్గా ఇలియానా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అజయ్ దేవగన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందనుందని సమాచారం. చివరి సారిగా అజయ్, అభిషేక్ కలిసి 2012లో వచ్చిన ‘బోల్ బచ్చన్’ సినిమాలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘జమీన్’ (2003), ‘యువ’ (2004) (హిందీ వెర్షన్) సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు. -
పాడె మోసిన మెగాస్టార్.. వైరల్ ఫోటో
సినీ దిగ్గజాలలో ఒకరైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసే మానవతా సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవల రైతుల రుణాలను కట్టి వార్తల్లో నిలవగా, పుల్వామా దాడిలో చనిపోయిన సైనికులకు కూడా ఆర్థిక సాయం చేశారు. ప్రతీ సందర్భంలోనూ తనలోని మానవాత్వాన్ని పేద, ధనిక అనే తేడాలు లేకుండా చూపెడుతున్న అమితాబ్ బచ్చన్ లేటెస్ట్గా చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అమితాబ్ బచ్చన్ దగ్గర సుదీర్ఘకాలంపాటు సెక్రటరీగా పనిచేసిన 77 ఏళ్ల శీతల్ జైన్ అనే వ్యక్తి ఇటీవల కన్నుమూశారు. 40 ఏళ్లపాటు అమితాబ్కు సెక్రెటరీగా పనిచేసిన శీతల్ జైన్ మరణించడంతో అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్లు తమ దగ్గర పని చేసిన వ్యక్తికి గౌరవంగా అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా అతని పాడెను కూడా మోశారు. అమితాబ్, అభిషేక్ పాడెను మోసి గొప్ప మనసు చాటుకోగా.. జూన్ మొదటి వారంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'అమితాబ్ వద్ద గత 40 ఏళ్లుగా పని చేసిన సర్వెంట్ ఇటీవల మరణించారని, ఇంతకాలం అతడు తనకు చేసిన సేవలకు కృతజ్ఞతగా అతడి పాడె మోసిన అమితాబ్ గ్రేట్ మ్యాన్... డబ్బు అందరి దగ్గర ఉంటుంది, హ్యూమానిటీ అనేది కొందరి వద్ద మాత్రమే ఉంటుంది, హాట్సఫ్ అమితాబ్' అంటూ ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే అమితాబ్ పాడెమోసింది సర్వెంట్ది కాదని, ఆయన సెక్రటరీ శీతల్ జైన్ అంత్యక్రియల్లో అని తేలింది. -
పెద్ద మనసు చాటుకున్న మెగాస్టార్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రైతు సమస్యలపై స్పందిస్తూ.. వారికి అండగా ఉండే ఈ మెగాస్టార్ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా బిహార్లో ఏకంగా 2100 మంది రైతుల రుణాలు తీర్చి రైతు బాంధవుడిగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకన్నా అంటూ ఈ విషయం గురించి అమితాబ్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఈ మేరకు...‘ బిహార్లోని 2100 మంది రైతుల రుణాలు కట్టాను. ఒకే దఫాలో బ్యాంకుకు పడ్డ బాకీని తీర్చేసాం. శ్వేత, అభిషేక్ కొంతమంది రైతులకు నేరుగా చెక్కులు అందించారు. మిగతా వాళ్లకు రైతు నాయకుల ద్వారా అందజేసాం. మాట ఇచ్చాను. ఈరోజు దానిని నిలబెట్టుకున్నా అని బ్లాగులో రాసుకొచ్చారు. కాగా అమితాబ్ గతంలో కూడా వందలాది మంది రైతులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రైతుల బాకీలు తీర్చిన 76 ఏళ్ల ఈ మెగాస్టార్ వారి హృదయాల్లో స్థానం సంపాదించాడు. -
భలే ప్లాన్
గాల్లో బెలూన్లు ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు నిత్యామీనన్. ‘బ్రీత్’ వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్ పూర్తికావడమే ఈ ఆనందానికి కారణం. ‘‘బ్రీత్’ షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేశాం. ఒకరినొకరం బాగా మిస్ అవబోతున్నాం అని చెప్పడానికి బాధగా ఉంది. ఇప్పటివరకు యాక్టింగ్లో నా బెస్ట్ టైమ్ ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు నిత్యా. ‘బ్రీత్’ సెకండ్ సీజన్లో అభిషేక్ బచ్చన్ నటించారు. ఫస్ట్ సీజన్లో మాధవన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అన్నట్లు .. ఇంకో విషయం ఏంటంటే వెబ్సిరీస్లో నిత్యా నటించడం ఇదే తొలిసారి. డిజిటల్ ప్లాట్ఫామ్వైపు మళ్లిన నిత్యాకు చేతిలో సినిమాలు లేవనుకుంటే మాత్రం పొరపాటే. ‘మిషన్ మంగళ్’ సినిమాతో ఈ ఏడాదే బాలీవుడ్ డోర్ కొట్టిన ఈ బ్యూటీ సౌత్లోనూ మస్త్ బిజీగా ఉన్నారు. తమిళంలో సైకో, ది ఐరన్లేడీ (జయలలిత బయోపిక్) సినిమాలతో పాటు కొన్ని మలయాళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్లో నటించడానికి కథలు వింటున్నారట. ఇలా సినిమాలు, డిజిటల్ సెక్టార్ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ను భలేగా ప్లాన్ చేసుకుంటున్నారు నిత్యామీనన్. -
మంచిగైంది
ఐశ్వర్యకు పెళ్లయిపోయాక కూడా వివేక్ ఒబేరాయ్కి ఆమెపై ప్రేమ ఇంకా పోనట్లుంది. పోకపోతే పోయింది.. ఆమె పరువు తీసి, తన పరువూ తీసేసుకున్నాడు! దేశమంతా ఎగ్జిట్ పోల్స్ మూడ్లో ఉన్నప్పుడు ఈయన ఒక్కడు ఐశ్వర్య మూడ్లోకి వెళ్లిపోయాడు. ఐశ్వర్య, సల్మాన్ ఉన్న పాత ఫొటో ఒకటి సంపాదించి, దానికి ‘ఒపీనియన్ పోల్’ అని కాప్షన్ పెట్టాడు. ఐశ్వర్యతో తను ఉన్న ఫొటోను ఆల్బమ్లోంచి బయటికి లాగి, దానికి ‘ఎగ్జిట్ పోల్’ అని కాప్షన్ పెట్టాడు. ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్, వారి పాప ఆరాధ్య కలిసి ఉన్న ఫొటో వెదికి తీసి, దాని కింద ‘రిజల్ట్’ అని కాప్షన్ పెట్టాడు. ఈ మూడు ఫొటోలను జాయింట్ చేసి ట్విట్టర్లో పెట్టాడు! వెంటనే నెటిజన్లు ‘ఇదేం తలతిక్క పని ఒబెరాయ్’ అంటూ ట్వీట్ చేశారు. సోనమ్ కపూర్ ‘క్లాస్లెస్’ అన్నారు.నేలబారు పని అని! ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్మన్ స్వాతీ మలీవాల్ ‘డిస్టేస్ట్ఫుల్’ అన్నారు. చవకబారు పని! నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ‘డిస్గస్టింగ్’ అన్నారు. చీదర పని అని! మహారాష్ట్ర ఉమెన్ కమిషన్ కూడా ఒబెరాయ్ ట్వీట్పై తీవ్రంగా స్పందించబోతోంది. ఇప్పటికే నేషనల్ కమిషన్ ఆయన్ని వివరణ అడిగింది. ఢిల్లీ కమిషన్ ఆపాలజీ అడిగింది. ఆ ట్వీట్ ఫొటోలో మైనర్ బాలికను (ఆరాధ్య) ను చూపించడం కూడా ఇప్పుడు పెద్ద అఫెన్స్ కాబోతోంది. ఏం పని ఇది వివేక్! ఐశ్వర్యకే కాదు. నీకూ పెళ్లయింది కదా. ఇప్పుడు భార్యకు ముఖమెలా చూపిస్తావ్?! -
చల్లగా.. చిల్గా..
సమ్మర్ స్టార్ట్ అయ్యింది. ఎండ తీవ్రత పెరిగింది. దీంతో బాలీవుడ్ తారలు కొందరు వెకేషన్ కోసం మ్యాప్ను ముందు వేసుకుని నచ్చిన ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసి ఎయిర్పోర్టుకు దారి వెతుక్కుంటున్నారు. సూట్కేస్లు సర్దుకుని చల్లని ప్రదేశాల్లో ల్యాండైపోతున్నారు. కొందరు విదేశాలను చుట్టొచ్చేశారు. కొందరు అక్కడ చిల్ అవుతున్నారు. ఐశ్వర్యారాయ్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్, సారా అలీఖాన్లు ఆల్రెడీ సర్దుకున్న సూట్కేసులను ఫారిన్లో ఓపెన్ చేసి, చిల్ అయి వచ్చేశారు. మరి.. వీళ్లంతా ఎక్కడెక్కడి వెళ్లారో తెలుసుకోవాలంటే మాత్రం మ్యాటర్ కంటిన్యూ చేయండి. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులు వెళ్లారు ఐశ్వర్యారాయ్. అక్కడికే వెళ్లొచ్చారు కత్రినాకైఫ్, కృతీసనన్, మలైకా అరోరాఖాన్. ‘గుడ్న్యూస్’ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసిన గుడ్మూడ్లో లండన్ తిరిగొచ్చారు కరీనాకపూర్. భార్య మీరా కపూర్తో కలిసి షాహిద్ కపూర్ స్పెయిన్లో హాలీడే టైమ్ ఎంజాయ్ చేశారు. జార్జియాలో జాలీగా గడిపొచ్చిన కొత్త దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీ టైమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ లేటెస్ట్ లవ్బర్డ్స్ ఫర్హాన్అక్తర్, షిబాని దండేకర్ మెక్సికోలో చిల్ అయ్యారు. మాజీ మిస్ ఇండియా సుస్మితాసేన్ తన బాయ్ఫ్రెండ్ (బాలీవుడ్ మీడియా అలానే చెబుతోంది) రోహ్మన్తో కలిసి న్యూయార్క్లో ప్రేమ పరుగు తీశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ న్యూయార్క్లో వాలిపోయారు. స్నేహితులతో కలిసి న్యూయార్క్ని రౌండప్ చేసే పనిలో ఉన్నారు. మరి కొందరు హీరోయిన్లు తమ సినిమాల షూటింగ్ డేట్స్ను చూసుకుని ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి.. ఇంకా ఎంతమంది స్టార్స్ చల్లని ప్రదేశాల్లో చిల్ కావడానికి వెళతారో చూడాలి. సారా అలీఖాన్, స్నేహితులతో కరీనా -
ఆ ముగ్గురి హగ్.. నెటిజన్ల మనసు దోచుకుంది
సోషల్ మీడియాలో నిత్యం బాలీవుడ్ కపుల్స్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఐశ్వరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్యల హగ్ నెటిజన్ల మనసును దోచుకుంటోంది. మన సెలబ్రిటీలు ఏదో ఒక ఆట ఆడి వాటి వల్ల వచ్చిన డబ్బును చారిటీకి ఇస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్లో కూడా ఇలాంటి ఓ కార్యక్రమే ఇటీవల జరిగింది. ఓ స్వచ్చంద సంస్థ కోసం బాలీవుడ్ తారల్లో కొందరు ఫుట్బాల్ ఆడారు. ఈ ఆటలో అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్, ఇషాన్ ఖట్టర్, రణ్బీర్ కపూర్ లాంటి హీరోలు పాల్గొన్నారు. ఫుట్బాల్ ఆడుతుండగా.. మధ్యలో ఆరాధ్య తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోగా.. తనను పైకి ఎత్తుకునే సన్నివేశం.. ఆ వెనువెంటనే ఐశ్వరాయ్ కూడా రావడం ముగ్గురు కలిసి హగ్ చేసుకోవడం అందరి మనసుల్ని ఆకట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆ ముగ్గురి హగ్.. నెటిజన్ల మనసు దోచుకుంది
-
పోజు ప్లీజ్!
బాలీవుడ్లో వన్నాఫ్ ది బెస్ట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మాల్దీవుల్లో మస్త్గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్తో పాటు పెళ్లి రోజు సంబరాల్ని కూడా అక్కడే జరుపుకున్నారీ దంపతులు. అప్పుడు ఆరాధ్య పోజు ప్లీజ్ అంటే, కూతురి కెమెరాకి ఇద్దరూ పోజు ఇచ్చినట్లున్నారు. ‘‘ఈ ఫొటోను మా జీవితాల వెలుగు దివ్వె అయిన ఆరాధ్య తీసింది’’ అంటూ పైన ఉన్న ఫొటోను షేర్ చేశారు ఐశ్వర్యారాయ్. ఇది అభిషేక్ అండ్ ఐశ్వర్యాల 12వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. న్యూయార్క్లో జరిగిన ‘గురు’ ప్రీమియర్ షో సమయంలో ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు అభిషేక్. ఆ తర్వాత 2007 ఏప్రిల్ 20న వీరిద్దరి వివాహం జరిగింది. 2011 నవంబరులో ఆరాధ్యకు జన్మనిచ్చారు ఐశ్వర్య. ‘గురు’ సినిమాకు ముందు ‘టాయి అక్షర్ ప్రేమ్ కే’ (2000), ‘కుచ్ నా కహో’ (2003) చిత్రాల్లో కలిసి నటించారు ఐశ్వర్య అండ్ అభిషేక్. ఇప్పుడు ‘గులాబ్ జామ్’ అనే చిత్రంలో జంటగా నటించనున్నారు. -
ప్రేమరాగం పాడతారా?
కవి, గేయ రచయితగా మారనున్నారట బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రముఖ కవి, గేయ రచయిత సాహిర్ లుధియాన్వీ బయోపిక్ను తెరెకెక్కించాలని భన్సాలీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్యర్యా రాయ్, దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్ఖాన్... తారాగణంగా ఇలా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బయోపిక్లో అభిషేక్ బచ్చన్, తాప్సీల పేర్లు హీరోహీరోయిన్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరికీ ఈ సినిమా కథను నరేట్ చేశారట భన్సాలీ. సాహిర్గా అభిషేక్ బచ్చన్, ఆయన ప్రేయసి అమ్రితా ప్రీతమ్గా తాప్సీ కనిపిస్తారని లేటెస్ట్ బాలీవుడ్ ఖబర్. సాహిర్, అమ్రితా చాలా ఘాటు ప్రేమ అట. ఈ లవ్స్టోరీకి రచయిత జస్మీత్ రీన్ దర్శకత్వం వహిస్తారట. ఈ సంగతి ఇలా ఉంచితే... అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘మన్మర్జియాన్’ చిత్రంలో తాప్సీ, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. మరి.. రెండోసారి కూడా వీరి జోడి కుదిరేనా? ప్రేమరాగం పాడేనా? లెటజ్ వెయిట్ అండ్ సీ! -
ఇక చాలు.. ఆపేయండి!
బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, అబ్రామ్ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మిషా కపూర్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అందుకే ఈ చోటా సెలబ్రిటీలు కనబడగానే క్షణం ఆలస్యం చేయకుండా ఫొటోగ్రాఫర్లు కెమెరా కన్నును క్లిక్మనిపిస్తారు . ఇక పేరెంట్స్తో కలిసి బుల్లి స్టార్స్ కనబడితే పండుగ చేసుకునే పాపరాజీలు వివిధ భంగిమల్లో వారిని ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ తతంగమంతా బచ్చన్ల రాజకుమారి ఆరాధ్యకు విసుగు తెప్పించింది. మాటిమాటికీ ఫోజులివ్వమని అడగటమే కాకుండా వెనుక నుంచి కూడా తనను ఫొటోలు తీయడానికి ప్రయత్నించడంతో ఫొటోగ్రాఫర్లకు క్యూట్ కౌంటర్ ఇచ్చింది. అసలు విషమయేమిటంటే.. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతాల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు సహా దాదాపు బాలీవుడ్ తారగణమంతా తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి రిసెప్షన్ వేడుకకు తల్లిదండ్రులు ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్లతో కలిసి ఆరాధ్య బచ్చన్ కూడా హాజరైంది. ఇందులో భాగంగా ఫొటోలు దిగే క్రమంలో నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే పదే పదే సేమ్ పొజిషన్లో ఉండాలని చెప్పడం, స్టేజ్ దిగుతున్న క్రమంలో కూడా ఫొటోలు తీయడంతో చిర్రెత్తుకొచ్చిన ఆరాధ్య.. ‘ఇక చాలు.. ఆపేయండి’ అంటూ ఫొటోగ్రాఫర్లకు స్వీట్ షాక్ ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. View this post on Instagram #Bachchan Family at #AkashAmbani Shloka Mehta’s Wedding Reception . . . #Aishwarya #aishwaryarai #aishwaryaraibachchan #abhishekbachchan #amitabhbachchan #ranbirkapoor #anushkasharma #deepikapadukone #priyankachopra #katrinakaif #sonamkapoor #jacquelinefernandez #salmankhan #aliabhatt #shahrukhkhan #shraddhakapoor #longines #ranveersingh #bollywood #magezine #pinkvilla #bollywoodstyle #TBWORLD2018 #بالیوود #بالیوود_ایران #تبلیغات #بالیوود_پارس #آیشواریا_رای A post shared by Aishwarya Rai Queen (@aishwarya_rai_queen) on Mar 10, 2019 at 12:02pm PDT -
‘హ్యాపీ బర్త్ డే.. మై బేబీ’
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నేడు 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడి సతీమణి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. అభిషేక్ చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన ఐశ్వర్య.. ‘హ్యాపీ బర్త్ డే మై బేబీ’ అంటూ క్యాప్షన్ జత చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మూడున్నర లక్షలకు పైగా లైకులు రావడంతో పాటు అభిషేక్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అభిషేక్ సోదరి శ్వేతా నందా కూడా అభిషేక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లిద్దరి చిన్ననాటి ఫొటో షేర్ చేశారు. కాగా బిగ్ బీ అమితాబ్- జయా బచ్చన్ల కుమారుడైన అభిషేక్ ‘రెఫ్యూజీ’ సినిమాతో 2000వ సంవత్సరంలో తెరంగేట్రం చేశాడు. హీరోగా కొనసాగుతూనే సపోర్టింగ్ రోల్స్తో ఆకట్టుకునే అభిషేక్.. వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. ప్రో కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు యజమానిగా, ఇండియన్ సూపర్ లీగ్లో చెన్నైయాన్ ఎఫ్సీ జట్టు సహయజమానిగా కొనసాగుతున్నాడు. ఇక అభిషేక్ బచ్చన్ 2007లో ఐశ్వర్య రాయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. View this post on Instagram 🥰always...My Baby😘HAPPY HAPPY BIRTHDAY BAAABYYY💖✨🤗💝⭐️ A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Feb 4, 2019 at 11:18am PST View this post on Instagram Love you beyond words and reason ♥️ A post shared by S (@shwetabachchan) on Feb 4, 2019 at 11:00am PST -
అందుకే ఆ సినిమా వదులుకున్న : షారుక్
దర్శకుడు మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటుడు కోరుకుంటాడు. అలాంటి తనకు మరోసారి అవకాశం వచ్చినప్పటికి వదులుకున్నాను అంటున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విక్రమ్ ప్రధాన పాత్రల్లో 2010లో ‘రావణ్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత అభిషేక్ పాత్రకు షారుఖ్ ఖాన్ను తీసుకోవాలనుకున్నారట దర్శకుడు మణిరత్నం. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మణిరత్నంతో పని చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. తనతో సినిమా చేయడం చాలా సరదాగా ఉంటుంది. రావణ్ సినిమాలో నన్ను తీసుకోవాలని మణిరత్నం భావించారు. కానీ అప్పుడు నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. అదికాక ‘రావణ్’ రెండు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పారు. దాంతో ఈ సినిమా చేయడం కష్టమని భావించాను. అందుకే వదులుకున్నాన’ని తెలిపారు షారుక్ ఖాన్. అయితే షారుక్ ఖాన్, మణిరత్నం, మనిషా కోయిరాల కాంబినేషన్లో 1998లో ‘దిల్సే’ చిత్రం వచ్చింన సంగతి తెలిసిందే.