ఏడేళ్ల వరుస కరువుతో పంట, పాడి పోయి పల్లెలన్నీ కన్నీరు పెడుతున్న రోజులవి.. కరెంటు బిల్లు కట్టలేదని రైతుల్ని లాక్కెళ్లి జైల్లో పెడుతున్న భయంకరమైన పాలనది.. కష్టజీవులు పొట్టచేత పట్టుకొని వలసపోగా ఊళ్లన్నీ గొల్లుమంటున్న కాలమది.. అది చంద్రబాబు జమానా.. జనం ఆశలన్నీ మోడువారిన సమయమది. అప్పుడు.. ‘నేనున్నానంటూ..’ అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.