ప్రధాన వార్తలు

సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసింది. వైఎస్ జగన్ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. అందుకోసం యావత్ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన డ్రైవర్గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు భిన్నంగా తాజాగా బీఎన్ఎస్ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.అడుగడుగునా భద్రతా వైఫల్యంమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్ జగన్ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్ మ్యాప్తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్ ప్లస్ భద్రత ప్రకారం వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేనే లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్ జగన్ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్పైకి ఎక్కి మరీ హల్ చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డి (ఏఆర్ కానిస్టేబుల్)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.అది జగన్ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రేమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్ జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్సీపీ సొంత నిధులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే ఉంది.జగన్కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులువైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. అందుకు ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్ జగన్ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. తాజాగా వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్ జగన్ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్!ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడైనట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ జగన్ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్ రాజకీయం అవసరమని గుర్తించారు. అందుకే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడుబాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. జూన్ 18 : వైఎస్ జగన్ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్లోని వాహనం కాదు. ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడు గొట్టిపాటి హరీశ్కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).జూన్ 22 : వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్ఎస్ 105(1), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్పై ఒత్తిడి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనానికి డ్రైవర్గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది.

నేడు వైఎస్సార్సీపీ ‘యువతపోరు’.. కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
వైఎస్సార్సీపీ ‘యువతపోరు’.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలుఅనంతరం కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయంఅధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అంటూ హామీఇప్పటికి ఏడాదైనా కనీసం జాబ్ కేలండర్ కూడా ప్రకటించని చంద్రబాబు సర్కార్నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వంనిరుద్యోగ భృతి రూపంలో ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయి2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని చంద్రబాబుచంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ఆందోళనలుకలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపుకృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.నో జాబ్స్..ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.

ట్రంప్కు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్.. చైనా, రష్యా, భారత్ పరిస్థితేంటి?
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో దాడులు చేసిన వారికి తప్పకుండా శిక్ష కొనసాగుతుంది అంటూ హెచ్చరించారు.ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీ మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఖమేనీ..‘ఇజ్రాయెల్, అమెరికాకు కఠినమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుంది. శిక్ష కొనసాగుతోంది. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశాడు. పెద్ద నేరం చేశాడు. దానిని శిక్షించాల్సిందే.. తప్పకుండా శిక్ష ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసి దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని విమర్శించారు. ఇరాన్ మిలిటరీ సరైన సమయంలో స్పందిస్తుందని అమెరికాను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.#همین_حالا مجازات ادامه دارددشمن صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی را مرتکب شده؛ باید مجازات بشود و دارد مجازات میشود؛ همین حالا دارد مجازات میشود.#الله_اکبر pic.twitter.com/wH6Wk9nNhJ— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 23, 2025రష్యా, చైనా వైఖరేంటి?ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటిందని’ చెప్పింది. ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించింది. మరోవైపు.. రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘రష్యా, చైనా ఇరాన్కు దౌత్యపరమైన మద్దతిస్తాయి. కానీ అవి సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇరాన్ కోసం ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగవు’ అని చైనాకు చెందిన కీలక నేత చెప్పుకొచ్చారు.ఇస్లామిక్ దేశాలు ఎటువైపు?ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం అని ఖతార్ హెచ్చరించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనం అని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే, దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే, అరబ్ దేశాల తాజా ప్రకటనలు చూస్తుంటే, ఈ ఘర్షణ మరింత పెద్దది కావడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది.ఆందోళనలో భారత్?భారత్కు ఇజ్రాయెల్, ఇరాన్తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్, ఇరాన్ రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్కు ఇరాన్ బలమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇక, ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో, రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాల్.

అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దీనిని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తూ, అక్కడ ‘అసాధారణ కార్యాచరణ’ సాగినట్లు వెల్లడించాయి. అమెరికా దాడి జరపకముందు, దాడి జరిపిన తరువాతకు సంబంధించిన చిత్రాలు అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నాయి.ఈ వాణిజ్య ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రం యూఎస్ దాడితో తీవ్రంగా దెబ్బతినడాన్ని చూపిస్తున్నాయి. బంకర్-బంకింగ్ బాంబులు పర్వతంలోకి చొచ్చుకుపోయినట్లున్న ఆరు రంధ్రాలు ఈ చిత్రాలలో కనిపిస్తున్నాయి. అలాగే దుమ్ముతో మూసుకుపోయిన భూమిని కూడా చూపిస్తున్నాయి. అమెరికా ఎంఓపీలతో దాడి చేసిందని ఇన్స్టిట్యూట్ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి నాయకత్వం వహిస్తున్న యూఎన్ మాజీ అణు తనిఖీదారు డేవిడ్ ఆల్బ్రైట్ తెలిపారు. ఉపగ్రహ చిత్రాలలో నైపుణ్యం కలిగిన పరిశోధకుడు డెక్కర్ ఎవెలెత్ మాట్లాడుతూ ఈ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అక్కడ జరిగిన నష్టం స్థాయిని అంచనా వేయడానికి తాము మరింతగా అధ్యయనం చేయాలన్నారు.ఇప్పటికైనా టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందని తాము భావిస్తున్నామని యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్లు పేర్కొన్నాయి. అయితే ఈ దాడికి ముందే ఇరాన్.. ఫోర్డో నుండి యురేనియం నిల్వలను తరలించి ఉండవచ్చని ఇజ్రాయెల్, అమెరికా, ఐక్యరాజ్యసమితి అణు తనిఖీదారులు అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహ చిత్రాలు మాక్సర్ టెక్నాలజీస్ నుండి వచ్చాయి. కాగా ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని గత కొంతకాలంగా చెబుతూవస్తోంది.ఇది కూడా చదవండి: Punjab: కారులో భీతావహ దృశ్యం.. స్థిరాస్థి వ్యాపారి ‘క్షణికావేశం’?

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు.. ఎవరీ యష్ వగాడియా?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ సైతం తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసి టీమిండియాకు ధీటైన సమాధానం ఇచ్చింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. గిల్ సేన ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచాలంటే నాలుగో రోజు మొత్తం భారత్ బ్యాటింగ్ చేయాల్సిందే. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్(6) ఉన్నారు.స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు..ఇక నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత రెండో ఇన్నింగ్స్ సందర్బంగా ఇంగ్లండ్ స్క్వాడ్లో లేని ఓ ఆటగాడు ఫీల్డింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సబ్స్ట్యూట్గా యార్క్షైర్ క్లబ్ ఆటగాడు యష్ వగాడియా మైదానంలో అడుగుపెట్టాడు.భారత సంతతికి చెందిన 21 ఏళ్ల వగాడియా రెండు ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. అయితే జట్టులో లేని ఆటగాడు ఫీల్డింగ్కు రావడమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా లీడ్స్ టెస్టు కోసం వగాడియాతో పాటు జవాద్ అక్తర్, నోహ్ కెల్లీను 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అంపైర్ అనుమతి తీసుకుని వగాడియా సబ్స్ట్యూట్గా బరిలోకి దిగాడు.ఎవరీ వగాడియా?21 ఏళ్ల యష్ వగాడియా.. దేశవాళీ క్రికెట్లో యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యష్కు బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ డర్హామ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. వగాడియా పదకొండేళ్ల వయసులోనే యార్క్షైర్ క్రికెట్ ఆకాడమీలో చేరాడు.అకాడమీ, అండర్-18 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. దీంతో తొలిసారి 2023 సంవత్సరంలో యార్క్షైర్ క్రికెట్ క్లబ్ ప్రొఫెషనల్ కాంట్రాక్టును పొందాడు. వగాడియా 2024లో వార్విక్షైర్పై తన లిస్ట్-ఎ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు రెండు లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన వగాడియా.. 22 పరుగులు చేశాడు.ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయనప్పటికీ, అతను యార్క్షైర్ సెకండ్ ఎలెవన్ మ్యాచ్లలో క్రమం తప్పకుండా ఆడుతాడు. కాగా వగాడియాకు గుజరాతీ మూలాలు ఉన్నాయి. వగాడియా మాత్రం ఇంగ్లండ్లోని న్యూకాజిల్లో జన్మించాడు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్

ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. విజయం ఎవరిది?
Four States Bypoll Results Updates..👉నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.👉పంజాబ్లో ఆప్ అభ్యర్ధి లీడింగ్..Ludhiana West (Punjab) Assembly by-election | As per official trends by Election Commission, AAP's Sanjeev Arora leading over Congress' Bharat Bhushan Ashu by 1269 votes in the first round of counting. BJP's Jiwan Gupta trailing in third position. pic.twitter.com/X1j2JQCuRe— ANI (@ANI) June 23, 2025 👉కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ..Nilambur (Kerala) Assembly by-election | As per official trends by Election Commission, UDF candidate - Congress' Aryadan Shoukath leading over LDF candidate - CPI(M)'s M. Swaraj by 419 votes in the first round of counting. pic.twitter.com/K7ro5uQ10w— ANI (@ANI) June 23, 2025👉జూన్ 19న ఎన్నికలు జరగ్గా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్లోని రెండు స్థానాలు విసావదర్, కాడి, పంజాబ్ (లూథియానా వెస్ట్), బెంగాల్ (కాలిగంజ్), కేరళ (నిలంబూర్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.గుజరాత్లో ఇలా.. గుజరాత్లోని కాదీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాజేంద్రకుమార్ దానేశ్వర్ చవడా, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్భాయ్ చావడ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణం కారణంగా ఉప ఎన్నికల జరగుతోంది. అలాగే, మరో స్థానం విసావదార్లో బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్, ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా మధ్య హోరాహోరీ ఉండే అవకాశం ఉంది.#WATCH | Gujarat: Counting of votes for Kadi Assembly by-elections begins. Postal ballots are being counted first. Voting was held on 19th June. Visuals from a counting centre in Mahesana. BJP's Rajendra Chavda, Congress' Ramesh Chavda and AAP's Jagdish Chavda are among the… pic.twitter.com/rwLXA5WJvk— ANI (@ANI) June 23, 2025 కేరళలో.. కేరళలోని నీలంబర్ సీటు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ స్థానం ఆమె వయనాడ్ నియోజకవర్గంలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఆమె ఈ ప్రాంతంలో రోడ్షో నిర్వహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓవి అన్వర్ గెలుస్తారా లేదా? అనేది తేలనుంది.VIDEO | Ludhiana West bypoll: Counting of votes to begin at 8 AM at Khalsa College; visuals of security arrangements from the counting centre.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6WJb9VmNuE— Press Trust of India (@PTI_News) June 23, 2025బెంగాల్ బైపోల్నాడియా జిల్లా పరిధిలోకి వచ్చే బెంగాల్లోని కలిగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ అధికార పార్టీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్ను నిలబెట్టగా, కాంగ్రెస్ CPI(M) మద్దతుతో కబిల్ ఉద్దీన్ షేక్ పోటీలో ఉన్నారుఉ. కలిగంజ్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్, బీజేపీ మధ్య కీలకంగా మారనుంది.పంజాబ్లో త్రిముఖ పోరు.. పంజాబ్లోని లూథియానా వెస్ట్ స్థానంలో ఆప్కు చెందిన సంజీవ్ అరోరా, బీజేపీ జీవన్ గుప్తా, కాంగ్రెస్ భరత్ భూషణ్ అషు మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. శిరోమణి అకాలీదళ్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా పరూప్కర్ సింగ్ ఘుమాన్ను నిలబెట్టింది.#WATCH | Punjab: Security has been tightened outside Ludhiana's Khalsa College for Women, the counting centre for the Ludhiana West bypoll; counting of votes will begin at 8 am.The AAP fielded Rajya Sabha MP Sanjeev Arora from the seat. The BJP fielded its leader Jiwan Gupta… pic.twitter.com/Lr9mZawi1o— ANI (@ANI) June 23, 2025

ఇరాన్లో అధికార మార్పు? ట్రంప్ పరోక్ష హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ, అమెరికా వారాంతంలో ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్లో పాలనా మార్పు జరిగే అవకాశంపై సూటిగా ప్రశ్నించారు.‘పాలనా మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు. కానీ ప్రస్తుతమున్న ఇరానియన్ పాలన.. ఇరాన్ దేశాన్ని గొప్పగా మార్చలేని పక్షంలో పాలనలో మార్పు ఎందుకు జరగకూడదు?’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రశ్నించారు. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా 30 వేల పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ప్రయోగించిన అనంతరం టెహ్రాన్(ఇరాన్) తమను తాము రక్షించుకోగలమని స్పష్టం చేసింది.ఇదిలావుండగా ఇరాన్- ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులను కొనసాగించాయి. పశ్చిమ ఇరాన్లో జరిగిన పేలుళ్లలో 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఇరాన్ క్షిపణుల ప్రయోగంతో పలువురు గాయపడ్డారు. టెల్ అవీవ్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్థానికులను లెబనాన్ విడిచి వెళ్లాలని ఆదేశించింది.ఈ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల పౌరులు ప్రయాణాలను పరిమిత చేసుకోవాలని సూచించింది. యునైటెడ్ స్టేట్స్ తమ దేశానికి పొంచివున్న ముప్పు కారణంగా ప్రధాన నగరాల్లో చట్ట అమలు గస్తీని ముమ్మరం చేసింది. మత, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించింది. ఇది కూడా చదవండి: క్షిపణులను తప్పించుకునేందుకు పరుగులు

స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్ స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – రాజ్దీప్మ్యూచువల్ ఫండ్స్లో 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్లోడ్ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. ఇదీ చదవండి: ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు.

ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ కానుంది. అలానే హిందీలో 'మా' అనే హారర్ మూవీ రాబోతుంది. ఇవి తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 18కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే ఈ లెక్క కనిపిస్తుంది. వీకెండ్ వచ్చేసరికి నంబర్ పెరగొచ్చు. (ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వారమే రైడ్ 2, ఒక పథకం ప్రకారం సినిమాలతో పాటు స్క్విడ్ గేమ్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 4, విరాటపాలెం సిరీస్లు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (జూన్ 23 నుంచి 29 వరకు)నెట్ఫ్లిక్స్స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24ద అల్టిమేటమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 25రైడ్ 2 (హిందీ సినిమా) - జూన్ 27స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 27అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 4 (హిందీ సిరీస్) - జూన్ 24హాట్స్టార్స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26మిస్త్రీ (హిందీ సిరీస్) - జూన్ 27జీ5విరాటపాలెం (తెలుగు సిరీస్) - జూన్ 27బిబీషణ్ (బెంగాలీ సిరీస్) - జూన్ 27అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) - జూన్ 28సన్ నెక్స్ట్అజాదీ (తమిళ సినిమా) - జూన్ 27ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) - జూన్ 27బుక్ మై షోఅల్ఫా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 24ద బ్రేకప్ క్లబ్ (డచ్ మూవీ) - జూన్ 24రక్తబీజ్ (గుజరాతీ సినిమా) - జూన్ 26ఆపిల్ ప్లస్ టీవీస్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 27(ఇదీ చదవండి: ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?)
‘వందే భారత్’లో విండో ఓపెన్ అవుతుందని..
ట్రంప్కు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్.. చైనా, రష్యా, భారత్ పరిస్థితేంటి?
స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు.. ఎవరీ యష్ వగాడియా?
అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలు
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
అంతుచూసిన అక్రమ సంబంధం
ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?
నేడు వైఎస్సార్సీపీ ‘యువతపోరు’.. కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తోడల్లుడు కావడమే అర్హతా?
మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్లారు..
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ పేటెంట్ హక్కు మీది కదా సార్!!
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన
‘వందే భారత్’లో విండో ఓపెన్ అవుతుందని..
ట్రంప్కు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్.. చైనా, రష్యా, భారత్ పరిస్థితేంటి?
స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు.. ఎవరీ యష్ వగాడియా?
అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలు
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
అంతుచూసిన అక్రమ సంబంధం
ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?
నేడు వైఎస్సార్సీపీ ‘యువతపోరు’.. కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తోడల్లుడు కావడమే అర్హతా?
మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్లారు..
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ పేటెంట్ హక్కు మీది కదా సార్!!
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన
సినిమా

మీనాక్షి ఇలా.. ట్రెండింగ్ బ్యూటీ ఇవానా అలా
టైట్ ఫిట్ డ్రస్సుతో రెచ్చగొట్టేస్తున్న మీనాక్షి చౌదరిక్యూట్ ఫేస్తో మాయ చేసేస్తున్న 'సింగిల్' ఇవానావర్షంలో తడిసి ముద్దయిపోతున్న యాంకర్ రష్మీవంటగది వీడియోతో రీతూ.. కానీ గ్లామర్ బోలెడంతహాట్ అందాలతో టెంపరేచ్ పెంచేస్తున్న రితికా సింగ్బెడ్పై వయ్యారాలు పోతున్న ఆషికా రంగనాథ్మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్న నటి సురేఖావాణి View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

ప్రభాస్ 'రాజాసాబ్' హీరోయిన్కి అవార్డ్
'రాజాసాబ్' బ్యూటీ, హీరోయిన్ మాళవిక మోహనన్ మరో అవార్డ్ దక్కించుకుంది. ముంబైలో జరిగిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కించుకుంది. ఓటీటీ, వెబ్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్గా ఈ సంస్థకు పేరుంది. ఈ ఈవెంట్లో రెడ్ కార్పెట్పై నడిచిన మాళవిక.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్)మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్లో మాళవిక స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంది. డిసెంబరులో రిలీజయ్యే ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్కు మరింత దగ్గర అవుతుందేమో చూడాలి.కేరళకు చెందిన మాళవిక.. 2013లో తొలుత మలయాళ సినిమాలతోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ, హిందీలోనూ పలు చిత్రాలు చేసింది. రజినీకాంత్ 'పేట' మూవీ ఈమెకు కాస్త గుర్తింపు తీసుకొచ్చింది. దళపతి విజయ్ 'మాస్టర్'తో మరో హిట్ అందుకుంది. గతేడాది 'యుద్రా' అనే హిందీ సినిమా చేసింది. ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో ప్రస్తుతం ఆశలన్నీ 'రాజాసాబ్'పైనే పెట్టుకుంది. ఇది కాకుండా సర్దార్ 2, హృదయపూర్వం అనే చిత్రాల్లో నటిస్తోంది.(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?
మంచు ఫ్యామిలీ తీసిన 'కన్నప్ప'.. ఈ వీకెండ్ (జూన్ 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో కాస్త జోరు పెంచారు. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. టీమ్ అంతా మూవీ కబుర్లు చెబుతూ సందడి చేశారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ చిత్ర దర్శకుడు కూడా కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఆయనెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు)గత కొన్నాళ్ల నుంచి 'కన్నప్ప' ప్రమోషన్లు చేస్తున్నారు. చాలావరకు హీరో కమ్ నిర్మాత అయిన మంచు విష్ణునే కనిపిస్తున్నాడు. చిత్ర సంగతులన్నీ చెప్పాడు. ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ మరిన్ని విషయాలు చెబుతూనే ఉన్నాడు. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ దగ్గరుందంటే దర్శకుడు కూడా ప్రమోషన్లలో కనిపిస్తారు. 'కన్నప్ప' విషయంలో సదరు డైరెక్టర్ తప్పితే అందరూ కనిపిస్తూ వచ్చారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈయన కనిపించారు.సడన్గా 'కన్నప్ప' దర్శకుడు ఎవరిని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే తొలి నుంచి విష్ణు, ప్రభాస్ లేదంటే మోహన్ లాల్ పేర్లు మాత్రమే ప్రమోషన్లలో వినిపించాయి. కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ కూడా మామూలోడు ఏం కాదు. ఎందుకంటే 2012లో రామాయణ్, 2013-14లో మహాభారత్ సీరియల్స్లో కొన్ని ఎపిసోడ్స్కి దర్శకత్వం వహించారు. వీటితో పాటు తెనాలి రామ, మేరే సాయి తదితర భక్తిరస సీరియల్స్ తీసిన అనుభవం ఈయన సొంతం. 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాకపోతే ఎక్కువశాతం సీరియల్స్కి మాత్రమే దర్శకత్వం వహించడంతో సినిమా ప్రేక్షకులకు ఈయన గురించి పెద్దగా తెలియలేదు.(ఇదీ చదవండి: ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు)అలా పీరియాడికల్, భక్తి సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతోనే ముకేశ్ కుమార్ సింగ్కి.. 'కన్నప్ప' దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ట్రైలర్ చూస్తే ఆయన పనితనం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఆయన వర్క్ ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ప్రమోషన్లలో ఆయనని ఎక్కువగా హైలైట్ చేయకపోవడానికి కూడా కారణమున్నట్లు కనిపిస్తుంది. స్వతహాగా ఆయనో హిందీ డైరెక్టర్. తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. అందుకేనేమో మంచు విష్ణు.. ప్రమోషన్ల బాధ్యతని తన నెత్తిన వేసుకున్నాడు. దర్శకుడిని పెద్దగా కష్టపెట్టలేదనిపిస్తుంది.మంచు విష్ణు హీరో కమ్ నిర్మాతగా తీసిన 'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, మధుబాల లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై తెలుగులో ఓ మాదిరి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు: బ్రహ్మనందం)

కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే సాధారణమైన విషయం ఏం కాదు. స్టార్ హీరోల వారసులైనా సరే సరైన మూవీస్ చేస్తేనే నిలబడతారు. లేదంటే మెల్లగా సైడ్ అయిపోతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే తెలుగులో యాంకర్గా టాప్లో ఉండే ప్రదీప్.. గత కొన్నేళ్లుగా తన ప్రొఫెషన్ని పక్కనబెట్టి హీరోగా ప్రయత్నాలు చేశాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడికే వచ్చేశాడు.యాంకర్గా ప్రదీప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్ల నుంచి ఛానల్తో డ్యాన్స్, కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ వచ్చాడు. ఇవి చేస్తూనే అత్తారింటికి దారేది, 100% లవ్ తదితర చిత్రాల్లో సహాయ పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల తర్వాత మంచి గుర్తింపు రావడంతో హీరోగా ప్రయత్నిద్దామని '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీలో ఒక్క పాట తప్పితే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే చిత్రంతో వచ్చాడు.(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?)కొన్ని నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కూడా ప్రదీప్కి హీరోగా అదృష్టం తీసుకురాలేకపోయింది. దీంతో ఆలోచనలో పడిపోయాడు. తనకు తెలిసిన యాంకరింగ్ మళ్లీ మొదలుపెట్టేశాడు. 'కుక్ విత్ జాతిరత్నాలు' పేరుతో ఈ వీకెండ్ నుంచి ప్రారంభం కాబోతున్న కామెడీ వంట షోకి యాంకరింగ్ చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు. తమిళంలో ఇదివరకే హిట్టయిన 'కుక్ విత్ కోమలి' అనే షో దీనికి స్పూర్తి. ఇందులో యష్మీ, సన్నీ, బాబా మాస్టర్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, దీక్షా పంత్, హరి, సీరియల్ నటుడు ప్రభాకర్, ముక్కు అవినాష్ ఉన్నారు.ప్రదీప్ మళ్లీ యాంకరింగ్ వైపు రావడం బట్టి చూస్తే హీరోగా పెద్దగా వర్కౌట్ కాలేదని రియలైజ్ అయినట్లు ఉన్నాడు. బహుశా అందుకే మళ్లీ షోలు చేయడం మొదలుపెట్టాడని అనిపిస్తోంది. ప్రదీప్ అనే కాదు సుడిగాలి సుధీర్ కూడా గతంలో ఇలానే రెండు మూడు సినిమాల్లో హీరోగా చేశాడు. కాకపోతే వీటిలో 'గాలోడు' అనే మూవీ తప్పితే మిగతావన్నీ ఆడలేదు. దీంతో ఎప్పటిలానే యాంకరింగ్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

అటా...ఇటా!
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనా... కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్గా 96 పరుగుల ముందంజలో ఉంది.రాహుల్తో పాటు కెపె్టన్ శుబ్మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్ కృష్ణ 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. జైస్వాల్ 4 పరుగులకే... తొలి ఇన్నింగ్స్లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్... రెండో ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్లో మూడు క్యాచ్లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్ వేసిన నాలుగో ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి భారంగా పెవిలియన్కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్తో కలిసి రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్పై రాహుల్ సంయమనం పాటించాడు. రాహుల్తో కలిసి రెండో వికెట్కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరగగా... కెపె్టన్ గిల్తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. బ్రూక్... పరుగు తేడాతో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై మూడో రోజు ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్ ఆర్డర్తో కలిసి హ్యారీ బ్రూక్ చెలరేగిపోయాడు. ధనాధన్ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు.తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయినా... ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయిన బ్రూక్కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బంతికి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కార్స్ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.అదే తంతు..ఈ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను పంత్ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జైస్వాల్ జారవిడిచాడు. ఒక ఎండ్లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్ బాల్స్తో వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్కు సాయపడ్డాడు.టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 106; రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దుల్ (బి) ప్రసిధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; జేమీ స్మిత్ (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.బౌలింగ్: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్ 27–0 –122–2; ప్రసిధ్ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్ 6–0–38–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.వికెట్ల పతనం: 1–16, 2–82.బౌలింగ్: వోక్స్ 6–2– 18–0; కార్స్ 5–0–27–1; టంగ్ 5–0–15–0; బషీర్ 2.5–1– 11–0; స్టోక్స్ 5–1–18–1.

Ind vs Eng: వర్షం వల్ల ముందే ముగిసిన ఆట.. పూర్తి వివరాలు
India vs England 1st Test Day 3 Report: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.భారత తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, గ్లౌసెస్టర్షైర్ దిగ్గజం డేవిడ్ వాలెంటైన్ లారెన్స్(61) కన్నుమూశారు. గత కొంత కాలంగా మోటార్ న్యూరోన్ వ్యాధితో బాధపడుతున్న లారెన్స్.. ఆదివారం తుది శ్వాస విడిచారు.1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్.. ఇంగ్లండ్ తరపున ఐదు టెస్టులు ఆడి 18 వికెట్లు సాధించారు. 1991లో ది ఓవల్లో వెస్టిండీస్పై అద్బుతమైన ఫైవ్ వికెట్ల హాల్ సాధించారు. ఆ సమయంలో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ను అవుట్ చేశారు.అయితే అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి మెకాలి గాయం కారణంగా 1992లో ఆయన్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడింది. పస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం ఆయన ఎన్నో ఘనతలను అందుకున్నారు. 185 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన లారెన్స్..515 వికెట్లు పడగొట్టారు. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా ఆయన పేరిట 155 వికెట్లు ఉన్నాయి.నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు..లారెన్స్ మృతి పట్ల భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ ఆటగాళ్లు చప్పట్లు కొట్టారు. అదేవిధంగా ఇంగ్లండ్-భారత్ ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాండ్లు కట్టుకుని బరిలోకి దిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది.ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..మూడో రోజు ఆటలో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 67 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. నాలుగో వికెట్గా సెంచూరియన్ ఓలీ పోప్(106) ఔట్ కాగా.. ఐదో వికెట్గా కెప్టెన్ బెన్ స్టోక్స్(20) పెవిలియన్కు చేరాడు.భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ ఇంకా టీమిండియా స్కోర్కు 189 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్(42), జేమీ స్మిత్(5) ఉన్నారు.

టీ20 ప్రపంచ కప్ 2026కు ఆర్హత సాధించిన కెనడా..
టీ20 ప్రపంచ కప్ 2026కు కెనడా జట్టు ఆర్హత సాధించింది. శనివారం కింగ్ సిటీ వేదికగా జరిగిన అమెరికాస్ క్వాలిఫైయర్లో బహామాస్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన కెనడా.. వరల్డ్కప్ బెర్త్ను ఖారారు చేసుకుంది. పొట్టి ప్రపంపకప్నకు కెనడా క్వాలిఫై కావడం ఇదే రెండో సారి.అమెరికాస్ క్వాలిఫైయర్లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లోనూ విజయం సాధించిన కెనడా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బహామాస్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.కెనడా బౌలర్లలో కలీం సానా, శివమ్ శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. అన్షూ పటేల్ రెండు వికెట్లు సాధించారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని కెనడా కేవలం 5.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. కెనడా బ్యాటర్లలో దిల్ప్రీత్ బజ్వా(36) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాడు.13వ జట్టుగా..2026 టీ 20 వరల్డ్ కప్లో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో భారత్, శ్రీలంక క్వాలిఫై కాగా.. టీ20 వరల్డ్కప్-2024 టాప్-8లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్ నేరుగా ఆర్హత సాధించాయి.గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అగ్రస్ధానంలో నిలిచినప్పటికి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ కూడా క్వాలిఫై అయ్యాయి. . మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి.అందులో ఇప్పుడు అమెరికాస్ క్వాలిఫైయర్స్ నుంచి 13వ జట్టుగా కెనడా ఆర్హత సాధించింది. యూరప్ క్వాలిఫైయర్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి రెండేసి జట్లు చొప్పున క్వాలిఫై కానున్నాయి. ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి.చదవండి: IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు
బిజినెస్

మార్కెట్లలో ఈ వారం బ్రేకవుట్!
సుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గత వారాంతాన సాంకేతికంగా పరివర్తన స్థాయి(25,112)కి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా 25,200 పాయింట్ల ఎగువకు చేరి నిలదొక్కుకుంటే సాంకేతికంగా బ్రేకవుట్కు వీలున్నట్లు అంచనా వేశారు. దీంతో సమీప కాలంలో 25,600–25,800 పాయింట్లను తాకవచ్చని విశ్లేíÙంచారు. ఇలాకాకుండా బలహీనపడితే సైడ్వేస్లో కదలవచ్చని పేర్కొన్నారు. పశి్చమాసియాలో యుద్ధం ముదిరితే మార్కెట్లు క్షీణించవచ్చని తెలియజేశారు. దీంతో గత వారం మాదిరే 24,700 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. రుతుపవనాలకు ప్రాధాన్యత దేశీయంగా నైరుతి రుతుపవన కదలికలు కీలకంగా మారనున్నాయి. మే నెలలోనే దేశంలోకి ప్రవేశించడం ద్వారా ఆశలు రేపినప్పటికీ తదుపరి మందగించిన సంగతి తెలిసిందే. అయితే రెండు, మూడు రోజుల్లో తిరిగి ఊపందుకుని పలు ఉత్తరాది రాష్ట్రాలలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో సెంటిమెంటు బలపడనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఇటీవల దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల పరిణామమని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ కొనసాగవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, వాటర్ఫీల్డ్ అడ్వయిజర్స్ లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ అభిప్రాయపడ్డారు. ఫెడ్పై చూపు గత వారం పాలసీ సమీక్షలో ఫెడరల్ ఓపెన్ మార్కెట్కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేట్లను యథాతథంగా అమలు చేసేందుకే ఓటేసింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన సమావేశమైన ఎఫ్వోఎంసీ వరుసగా నాలుగోసారి ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇంతక్రితం 2024 డిసెంబర్లో 0.25 శాతం వడ్డీ రేటును తగ్గించిన ఫెడ్ తదుపరి నిర్వహించిన సమావేశాలలో యథాతథ పాలసీ అమలుకే ఓటు వేస్తూ వస్తోంది. అయితే ఈ నిర్ణయాలతోపాటు.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలపై ఫెడ్ అభిప్రాయాలను పావెల్ కాంగ్రెస్కు వివరించనున్నారు. మంగళవారం(24న) ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమిటీముందు, బుధవారం(25న) సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు ఫెడ్ అంచనాలను వెల్లడించనున్నారు. మరోపక్క యూఎస్ క్యూ1 జీడీపీ తుది గణాంకాలు గురువారం(26న) వెల్లడికానున్నాయి. 2025 జనవరి–మార్చిలో యూఎస్ జీడీపీ 0.2 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.చమురు ధరలు కీలకం ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసే వీలున్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇది జరిగితే చమురు ధరలకు రెక్కలురానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తలెత్తిన వెంటనే బ్రెంట్ చమురు ధర ఒక్కో బ్యారల్కు 78 డాలర్ల గరిష్టానికి ఎగసిన విషయం విదితమే. ఫలితంగా యుద్ధ ప్రభావం ప్రధానంగా ముడిచమురు ధరలపై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా అధిక శాతం చమురు అవసరాలకు గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో యుద్ధ సెగలు దేశీ మార్కెట్లను దెబ్బతీయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారమిలా.. గత వారం(16–20) ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత క్షీణపథంలో ట్రేడయినప్పటికీ వారం చివర్లో జోరందుకున్నాయి. దీంతో నికరంగా బీఎస్ఈ సెన్సెక్స్ గత వారం 1,290 పాయింట్లు(1.6 శాతం) ఎగసింది. 82,408 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 394 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 25,112 వద్ద నిలిచింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లలో అమ్మకాలదే పైచేయి అయ్యింది. వెరసి బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ దాదాపు 2 శాతం పతనమైంది. – సాక్షి, బిజినెస్ డెస్క్

స్థిరమైన ఆదాయానికి.. ఎస్డబ్ల్యూపీ మంత్ర!
సంపాదనకు గుడ్బై చెప్పిన తర్వాత విశ్రాంత జీవనం సాఫీగా సాగిపోవాలంటే స్థిరమైన ఆదాయ వనరు తప్పనిసరి. అప్పటి వరకు చేసిన పెట్టుబడులు, రిటైరయ్యాక స్థిరమైన ఆదాయానికి దారి చూపాలి. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయ ప్రణాళిక విషయంలోనే గందరగోళానికి గురవుతుంటారు. ఈక్విటీల్లో లేదా డెట్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నది అంత సులభంగా తేల్చుకోలేరు. అప్పటి వరకు పొదుపుతో సమకూర్చుకున్న విలువైన వనరులను వివేకంగా వినియోగించుకోవడం ఎలానో తెలియని వారే ఎక్కువ. రిటైర్మెంట్ తర్వాత ఒకట్రెండు దశాబ్దాల పాటు జీవిత అవసరాలను గట్టెక్కడం అంత సులువేమీ కాదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరుగును’ అన్నట్టు.. కష్టార్జితంతో కూడబెట్టుకున్న నిధిని మిగిలిన జీవిత కాలం పాటు పొదుపుగా వాడేందుకు సమర్థవంతమైన ప్రణాళిక తప్పకుండా ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది చేసే తప్పు.. తమవద్దనున్న నిధులన్నింటినీ తీసుకెళ్లి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో, లేదా ఇతర డెట్ సాధనాల్లోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్థిరమైన రాబడి, భద్రత దృష్ట్యా ఇలా చేయడం గమనించొచ్చు. కానీ, వీటి నుంచి వచ్చే రాబడులు ద్రవ్యోల్బణాన్ని మించి ఏమంత గొప్పగా ఉండవు. దీర్ఘకాలంలో సగటు ద్రవ్యోల్బణం 6 శాతం అనుకుంటే, వీటిల్లో రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుంది. కనుక ఇలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవడం వల్ల.. అక్కడి నుంచి పదేళ్ల కాలంలో కరెన్సీ విలువ తగ్గిన మేర వారి పెట్టుబడి వృద్ధి చెందదు. అందుకే పెట్టుబడుల్లో ఈక్విటీలకూ చోటివ్వడం ఎంతో అవసరం. ఈక్విటీ ఫండ్స్లో నిరీ్ణత కాలానికోసారి పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఎలా అయితే ఉపకరిస్తుందో.. ఈక్విటీ పెట్టుబడుల నుంచి క్రమానుగతంగా కొద్ది మొత్తం చొప్పున ఉపసంహరించుకునేందుకు సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అనుకూలిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఈ మార్గంలో అందుకోవచ్చు. స్థిరమైన ఆదాయం పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుందన్నది నిపుణుల విశ్లేషణ. రిటైర్మెంట్ తర్వాత కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు. ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కనుక పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి. పెట్టుబడి కరగకూడదు.. పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం.. కచి్చతంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది. ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. కనుక ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటు లో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పన్ను ప్రయోజనాలు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. అదే ఈక్విటీ ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. డెట్ సాధనాలపై రాబడి వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి, ఏ శ్లాబు పరిధిలో వస్తే ఆ మేరకు పన్ను రేటు చెల్లించాలి. అదే ఈక్విటీ రాబడులపై పన్ను విడిగా ఉంటుంది. రూ.1.25 లక్షలు మించిన దీర్ఘకాల రాబడిపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే చాలు. కేవలం మొదటి ఏడాది ఉపసంహరణ మొత్తంలో రాబడిపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత నుంచి రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పరిధిలోకే వస్తుంది. నగదు ప్రవాహాలపై సౌలభ్యత ఎస్డబ్ల్యూపీతో నెలవారీ ఎంత అవసరమో అంతే వెనక్కి తీసుకోవచ్చు. తమ అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు. నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్ సంక్షోభాలను ఎదుర్కొంటుంటే..వాటి నుంచి ఉపసంహరణను గణనీయంగా తగ్గించుకోవడం లేదంటే తాత్కాలికంగా నిలిపివేసి.. డెట్ పెట్టుబడుల నుంచి ఉపసంహరణతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీలోనూ రకాలున్నాయి. కోరుకున్నంత స్థిరంగా ఉపసంహరించుకోవడం ఇందులో ఒకటి. క్యాపిటల్ అప్రీసియేషన్ ఎస్డబ్ల్యూపీలో అయితే.. పెట్టుబడుల వృద్ధి వరకు (రాబడి) వెనక్కి తీసుకోవచ్చు. అసలు పెట్టుబడి అలాగే కొనసాగుతుంది. అస్థిరతల్లో పరిష్కారం.. రాబడి ఒక్కటే కాదు పెట్టుబడిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈక్విటీలు దిద్దుబాటుకు గురైనప్పుడు అందులోని పెట్టుబడుల విలువ క్షీణిస్తుంటుంది. కనుక ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడుల నుంచి ఉపసంహరణ ఎప్పటి మాదిరిగా కొనసాగించకపోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఈక్విటీల్లో దిద్దుబాటు ముగిసే వరకు గట్టెక్కేందుకు డెట్ పెట్టుబడులను వినియోగించుకోవాలి. దీనివల్ల తిరిగి ఈక్విటీలు ర్యాలీ చేసిన సమయంలో పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందేందుకు వీలుంటుంది.డెట్ పెట్టుబడులూ అవసరమే విశ్రాంత జీవనంలో అవసరాలకు పూర్తిగా ఈక్విటీలపై ఆధారపడడం రిస్క్ నిర్వహణ పరంగా మెరుగైన నిర్ణయం కాబోదు. ఈక్విటీ, డెట్ కలబోతగా ఉండాలి. ఎస్డబ్ల్యూపీ కోసం ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ సాధనాలను ఎంపిక చేసుకున్నప్పటికీ అదే సమయంలో విడిగా డెట్ సాధనాలనూ పోర్ట్ఫోలియోలో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఈక్విటీ పతనాల్లో ఎస్డబ్ల్యూపీని తాత్కాలికంగా నిలిపివేయాల్సి రావచ్చు. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో బేరిష్ దశలోకి వెళ్లినప్పుడు డెట్ పెట్టుబడులు ఆదుకుంటాయి. రిస్క్ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది. ఇన్వెస్టర్ల వద్దనున్న మొత్తం పెట్టుబడి, ఆదాయ అవసరాలు, రాబడి అంచనాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ కేటాయింపులు ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. ఎవరికి అనుకూలం..? ఎస్డబ్ల్యూపీ రిటైర్మెంట్ తీసుకున్న వారికోసమే అనుకోవద్దు. పెట్టుబడిపై స్థిరమైన నగదు ప్రవాహాలు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ ప్లాన్ మెరుగైనదన్నది నిపుణుల సూచన. రిటైర్మెంట్ తీసుకున్న వారు, రిటైర్మెంట్ సమీపంలో ఉన్న వారు, అదనపు ఆదాయం కోరుకునే వారికి ఇది అనుకూలమని బంధన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సేల్స్ హెడ్ గౌరబ్ పరిజ తెలిపారు. ‘‘ఇప్పట్లో పదవీ విరమణ తీసుకోని వ్యక్తులు సైతం, జీవన అవసరాలకు వీలుగా అదనపు ఆదాయం కోసం ఎంపిక చేసుకోవచ్చు. జీవితంలోని వివిధ దశల్లో అదనపు ఆదాయం కోసం ఇదొక పరిష్కారం. కాకపోతే రిటైర్మెంట్ తీసుకున్న వారు ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు’’ అని వివరించారు. పొరపాట్లకు చోటివ్వొద్దు.. → ఎస్డబ్ల్యూపీ అన్నది చాలా శక్తివంతమైన సాధనం. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం లేదా నిపుణుల సూచన లేకుండా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. → అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోవద్దు. అతి రాబడుల అంచనాలు విశ్రాంత జీవనంలో బెడిసి కొడతాయి. ముఖ్యంగా మార్కెట్ ఆటుపోట్లలో మోస్తరు రాబడులకే పరిమితం కావాలి. → నిపుణుల సూచనకు మించి అధిక మొత్తాన్ని వెనక్కి తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడో ఓసారి తప్పిస్తే.. అవసరాలకు చాలడం లేదని ప్రణాళికకు మించి ఉపసంహరణ బాట పడితే పెట్టుబడి వేగంగా క్షీణిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడి విలువ ఏటా ఎంతో కొంత వృద్ధి చెందడమే కాదు.. అదే ద్రవ్యోల్బణం కారణంగా పెరిగే జీవన అవసరాలకు వీలుగా నగదు ఉపసంహరణ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. సరైన ప్రణా ళికతోనే ఇది సాధ్యమని గుర్తుంచుకోవాలి. సిప్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిప్ ద్వారా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. కాంపౌండింగ్ మహిమతో కొద్ది పెట్టుబడి దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గంత నిధిగా సమకూరుతుంది. 25 ఏళ్ల వయసు నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఈక్విటీ ఫండ్లో సిప్ ప్రారంభించి, 60 ఏళ్లు వచ్చే వరకు 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే.. 12% వార్షిక రాబడి అంచనా మేరకు చివర్లో సమకూరే మొత్తం రూ.5.51 కోట్లు. ఇందులో పెట్టుబడి రూ.42 లక్షలు కాగా, మిగిలినదంతా కాంపౌండింగ్తో వృద్ధి చెందిన సంపద. కొంచెం ఆలస్యంగా 30 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసినా 60 ఏళ్లకు రూ.3.08 కోట్లకు సమకూరుతుంది. ఎస్డబ్ల్యూపీ సిప్ ద్వారా ఈక్విటీల్లో చేసిన పెట్టుబడి 60 ఏళ్లకు పెద్ద మొత్తమే సమకూరుతుంది. వృద్ధాప్యానికి వచ్చామని చెప్పి ఈక్విటీ పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోనక్కర్లేదు. కనీసం 50–70 శాతం మేర ఈక్విటీల్లో అలాగే కొనసాగించి, ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా కావాల్సినంత ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడి ఇతర సాధనాల కంటే మెరుగ్గా వృద్ధి చెందుతుంది. రిటైర్మెంట్ అనంతరం అదే ఫండ్ నుంచి ప్రతి నెలా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడులు అన్నింటినీ విక్రయించడం వల్ల దీర్ఘకాల మూలధన లాభాలపై (రూ.1.25 లక్షలు దాటిన మొత్తంపై) 12.5% పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీని బదులు 50–70% ఈక్విటీల్లోనే కొనసాగిస్తే పన్ను భారం తగ్గుతుంది. ఎస్డబ్ల్యూపీ వ్యూహం→ రిటైర్మెంట్ ఫండ్ను మూడు భాగాలుగు చేసుకోవాలి. → ఇందులో కోర్ భాగం ఒకటి. దీర్ఘకాలం పాటు ఇది మెరుగ్గా వృద్ధి చెందేందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలిస్తాయి. → బఫర్ పేరుతో రెండో భాగంలో.. 3 నుంచి 5 ఏళ్ల పాటు ఆదాయ అవసరాలకు సరిపడా మొత్తాన్ని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. → లిక్విడ్ పేరుతో మరొక భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తక్షణ అవసరాల్లో వెనక్కి తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. → తమ పెట్టుబడిని ఇలా వేర్వేరు భాగాలు చేసుకోవడం ద్వారా రిస్క్ను వైవిధ్యం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్

ఇంటి గోడలు మెరుస్తాయ్..
సాక్షి, సిటీబ్యూరో: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంతరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇళ్లయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10*10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకు ఉంటుంది.త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1*1 సైజ్ నుంచి 20*20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది.

ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే ఆఫీస్ పని అవ్వదు భారం!
ఆఫీసు అంటేనే బోరింగ్గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్ కొలీగ్స్ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్ పని ఆటలాగా మారుతుంది.మ్యాజిక్ మౌస్!ఇప్పటి వరకు మౌస్ అంటే కేవలం క్లిక్లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్డాట్స్ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్ కాంబినేషన్. ఎయిర్ మౌస్, టచ్ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్ అన్నీ ఇదే! ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్ మారిపోతాయి. ఒక బటన్తో స్క్రీన్పై స్పాట్లైట్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్ ఏఐ సాయంతో రికార్డ్ చేసి, సింపుల్ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).ట్రిపుల్ ట్రీట్ చార్జ్!ఆఫీస్ అంటే ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్పాడ్స్ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోజూ ఫుల్ చార్జ్ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్లో మేనేజర్ కన్నా మనకే ఎక్కువ టెన్షన్! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్ ట్రిక్ ఎక్స్’. ఇది ఒక త్రీ ఇన్ వన్ చార్జర్. ఇది ఉంటే ఇక మీ డెస్క్ మీద ఒక్క కేబుల్ కూడా కనిపించదు. ఫోన్, వాచ్, ఎయిర్పాడ్స్ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ మిమ్మల్ని మరింత స్మార్ట్గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)డేటా గార్డ్ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్కి టికెట్ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్ సడన్గా క్రాష్ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో డిజిటల్ ఫైల్స్ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్లో పిల్లలకు కనిపించకుండా ఐస్క్రీమ్ దాచినంత కేర్ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్స్టన్ ఐరన్ కీ వాల్ట్ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్ కాదు, డేటాకు ఒక డిజిటల్ బౌన్సర్ లాంటిది. టచ్ స్క్రీన్తో, పాస్వర్డ్, పిన్లాంటి లాకింగ్ సిస్టమ్తో వస్తోంది.ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్ను మల్టిపుల్ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్వర్డ్ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్ ట్రై చేస్తే వెంటనే రిడ్–ఓన్లీ మోడ్ ఆన్ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422).
ఫ్యామిలీ

వావ్.. బాంబూ గ్రోవ్..
ప్రకృతి ప్రియులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం ‘అరాషియామా బాంబూ గ్రోవ్’. జపాన్లోని కియోటో నగరానికి పశ్చిమాన ఉన్న అందమైన వెదురు వనం ఇది. ఈ వనంలో వేలాది వెదురు మొక్కల మధ్య నుంచి కాలిబాట ఉంటుంది. ఆ దారిన నడిచి వెళ్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన వాతావరణానికి నిలయం. సన్నని వెదురు కాండాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎత్తుగా పెరిగి, పచ్చని గుడిసెలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. వెదురు ఆకుల గుండా ప్రసరించే సూర్యకాంతి భూమిని చేరే తీరు, తేలికపాటి గాలికి వెదురు కాండాలు ఒకదానికొకటి తాకుతూ సృష్టించే మృదువైన శబ్దం మనసుని మైమరపిస్తుంటాయి. ఈ మార్గంలో నడుస్తున్న కొద్దీ, వెదురు కాండాలు వివిధ కోణాల నుంచి కనిపిస్తాయి. ప్రతి మలుపులోనూ కొత్త దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..)

అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..!
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!)

అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కాని, ఒకచోట మాత్రం ఏడాది పొడవునా– ప్రతిరోజూ క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అదెక్కడి వింత ప్రదేశం అనుకుంటున్నారా? ఇక అసలు కథలోకి వచ్చేద్దాం.అదొక థీమ్ పార్కు. ఇంగ్లండ్లోని చెసింగ్టన్ పట్టణంలో ఉంది. ఏడాది పొడవునా– ప్రతిరోజూ జరిగే క్రిస్మస్ వేడుకలకు ఇదే కేంద్ర బిందువు. దీని పేరు ‘చెసింగ్టన్ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్స్’. ఈ థీమ్ పార్కులో కూడా మిగిలిన థీమ్ పార్కుల్లో మాదిరిగానే అన్ని రకాల క్రీడా వినోద విలాసాలన్నీ ఉంటాయి. రంగుల రాట్నాలు, ఇతర వినోద క్రీడా సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇదే పార్కు ప్రాంగణంలో ఒక ఫోర్స్టార్ సఫారీ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్లోని కొన్ని గదుల్లో నిత్యం క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి.ఈ హోటల్లోని ఓరియో, జుమాంజీ, గ్రఫాలో అనే ప్రత్యేక గదుల్లో ప్రతిరోజూ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ పండుగ రోజున ఇళ్లల్లో అలంకరించినట్లుగానే ఈ గదులు నిత్యం క్రిస్మస్ అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి. గదుల మూలల్లో క్రిస్మస్ ట్రీలు, గదుల్లో పైనుంచి వేలాడే రంగురంగుల బెలూన్లు, బంగారు రంగులో ధగధగలాడే నక్షత్రాలు, కిటికీలకు ఎర్రని కర్టెన్లు సహా కళ్లుచెదిరే రంగుల అలంకరణలతో ఈ గదుల్లోకి అడుగుపెడుతూనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. గదుల్లోని మంచాలపై ఎర్రని దుప్పట్లు, ‘మెర్రీ క్రిస్మస్’ అని రాసి ఉన్న దిండు గలీబులు పండుగ వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి. ఈ ఆకర్షణ కోసమే చాలా కుటుంబాలు పిల్లలతో కలసి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి, రోజుల తరబడి బస చేస్తుంటాయి. ఈ హోటల్ గదుల కారిడార్లో ప్రతి సాయంత్రం క్రిస్మస్ బ్యాండ్ సంగీతం అతిథులను ఉర్రూతలూపుతుంది. ఇక్కడ బసచేసే వారికి క్రిస్మస్ మెనూ వంటకాలనే వడ్డిస్తారు. పిల్లలకు ప్రత్యేకంగా చాక్లెట్లు, బాణసంచా, బెలూన్లు వంటివి పంచిపెడతారు. క్రిస్మస్ టోపీలు, పూలగుత్తులు వంటివి కూడా ఇస్తారు. శాంటాక్లాజ్ వేషధారులు పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చి, వారిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతారు. ఈ హోటల్లో నిత్యక్రిస్మస్ గదులను బుక్ చేసుకుంటే, ఉచితంగా థీమ్పార్కు టికెట్లు ఇస్తారు. (చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..
చిరునవ్వుతో ట్రెండ్ సెట్ చేయడమే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టయిలింగ్ టెక్నిక్! మేకప్ కాదు, ఫిట్నెస్, ఫన్ , ఫ్యాషన్ ఈ మూడింటి మిక్స్తో తన లుక్ని మెరిపిస్తుండటం ఆమె అలవాటు. అయితే, ఆమె లుక్లో అసలైన మెరుపు చిరునవ్వులోనే దాగి ఉందట!నేను ఫాలో అయ్యే స్టయిలింగ్ రూల్ ‘ఒకటి ఎక్కువ అయితే, మరొకటి తక్కువ’. అంటే, చెవిపోగులు హెవీగా ఉంటే, మెడలో జ్యూలరీ ఉండదు. డ్రెస్ హైలైట్ అయితే, మేకప్ మ్యూట్గా ఉంటుంది. ఇది నా ఫ్యాషన్ సీక్రెట్! కానీ ఇన్నాళ్ల ఫ్యాషన్ జర్నీలో నేర్చుకున్న అసలైన విషయం ఏంటంటే, ఏది ధరించినా హ్యాపీగా ఉంటే చాలు, అదే బ్యూటీ! అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్అందాన్ని రెట్టింపు చేయాలంటే ముందుగా చేతులనే ముస్తాబు చేయాలి! దానికి బెస్ట్ ఆప్షన్ ఈ ‘హాథ్ ఫూల్’ జ్యూలరీ. ఇది బ్రేస్లెట్ కాదు, రింగ్ కాదు... చేతి మణికట్టు నుంచి వేళ్ల చివరి వరకు సాగే ఒక గొలుసు. ఇది వేసుకున్నాక చూసే వాళ్లు చేతులను చూడకుండా ఉండలేరు. అంతలా అట్రాక్ట్ చేస్తుంది. పూర్వం రాజకుమార్తెలు, మహారాణులు వేసుకునే ఈ ఆభరణం, ఇప్పుడు మోడ్రన్ పెళ్లికూతుర్లకు, ఫ్యాషన్ లవర్స్కి ఫేవరెట్గా మారింది. అయితే, ఇది వేసుకున్నాక చేతులను చాలా జాగ్రత్తగా స్టయిలింగ్ చేసుకోవాలి. హాథ్ ఫూల్ పెద్దదైతే చేతిని వేరే ఏ జ్యూలరీతోనూ స్టయిల్ చేయొద్దు.లేదంటే మీ చెయ్యి ఒక డిజైనర్ షోరూమ్లా కనిపిస్తుంది. సింపుల్ మేకప్, లైట్ జ్యూలరీ, మల్లెపూల బన్ దీనికి బెస్ట్ కాంబినేషన్. అప్పుడు చీర, లెహంగా, అనార్కలీ డ్రెస్ ఏదైనా హాథ్ ఫూల్ వేసుకుంటే లుక్కే మారిపోతుంది. ముఖ్యంగా ఫొటో షూట్స్, మెహందీ ఫంక్షన్లు, సంగీత్ పార్టీల్లో ఇది ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ జాక్వెలిన్ ధరించిన జ్యూలరీ బ్రాండ్: కోహార్ బై కనికా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆమె ధరించిన చీర బ్రాండ్: ఎకయాధర: రూ. 40,075.(చదవండి: సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు)
ఫొటోలు
అంతర్జాతీయం

శాంతి నెలకొని ఒక దశాబ్దం.. సమైక్యతా సమయం
కొలంబియా రాజధాని బొగొటాలోని ప్రఖ్యాత శాంటా మారియా ప్లాజాలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది యోగ సాధకులు, ఔత్సాహికులు పాల్గొన్న ఈ వేడుకకు ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ స్వయంగా హాజరయ్యారు. సరిగ్గా ఒక దశాబ్దం కిందట కొలంబియా ప్రభుత్వం, తీవ్రవాద ఫార్క్ గెరిల్లా సంఘాలు శాంతి ఒప్పందం చేసుకోవటంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.ఆ విధంగా దశాబ్దాలపాటు కొనసాగిన తీవ్రవాద సాయుధ సంఘర్షణకు స్వస్తి చెప్పి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ సంవత్సరపు యోగా దినోత్సవ వేడుకలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది కొలంబియాలో శాంతి దశాబ్దానికి గుర్తుగా నిలిచింది.ఈ సందర్భంగా ప్రసంగించిన గురుదేవ్, యోగాను కేవలం శారీరక వ్యాయామంగా మాత్రమే అనుకోవద్దని, అది మన మానసిక స్థితిని సైతం మార్చగలదని గుర్తు చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన యోగా దినోత్సవపు కార్యాచరణను రూపొందించటం గురించి మాట్లాడుతూ, మొట్టమొదటి కామన్ యోగా ప్రోటోకాల్ ను రూపొందించిన కమిటీకి తానుఅధ్యక్షత వహించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. “ప్రపంచ జనాభాలో మూడు వంతులకు పైగా ప్రజలు ఈ ప్రోటోకాల్ను అనుసరిస్తుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మానసిక ఆరోగ్య రంగంలో మన పని ఇక్కడితో ఆగదు. ఇది వాస్తవానికి ఆరంభం మాత్రమే.” అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగోటా కల్చరల్ సెక్రటేరియట్కి చెందిన ఆబ్జర్వేటరీ ఆఫ్ కల్చర్ అండ్ కల్చరల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, “గత కొన్ని వారాలుగా దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది, ఆ ఉద్రిక్తతలను చల్లార్చి, సమతుల్యం తీసుకురావడానికి, బొగోటా దేశ ప్రజలందరికీ ఒక సానుకూల సందేశాన్ని ఇచ్చేందుకు ఈనాడు సరైన సమయం వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.2015వ సంవత్సరంలో, కొలంబియాలో శాంతిస్థాపన ఇక అసాధ్యమని చాలామంది అనుకున్న సమయంలో దానిని గురుదేవ్ సాధించారు. దాదాపు 50 సంవత్సరాల పాటు ఫార్క్ (FARC) తిరుగుబాటుదారులు, కొలంబియా ప్రభుత్వం మధ్య జరిగిన ఉద్రిక్తతలు, ఘర్షణలు కొనసాగాయి. అనేక శాంతి ఒప్పందాలు విఫలమై, అవిశ్వాసపు అగాధం ఇరువర్గాలలో నెలకొన్న ఆ తరుణంలో గురుదేవ్ ఫార్క్ కమాండర్లతో మూడు రోజుల మధ్యవర్తిత్వ చర్చలు నిర్వహించారు. అహింసను ఆయుధంగా స్వీకరించమని, దేశ భవిష్యత్తు కోసం విస్తృత దృక్పథంతో చర్చలను అంగీకరించమని వారిని కోరారు. ఆయన చొరవతో సంక్షోభానికి పరిష్కారం లభించింది. ఒక సంవత్సరం పాటు సంపూర్ణ కాల్పుల విరమణ ను ఫార్క్ ప్రకటించింది —అభూతపూర్వమైన ఈ చర్య తరువాతి శాంతి ఒప్పందానికి మార్గాన్ని సిద్ధం చేసింది.పది సంవత్సరాల తరువాత, ఈరోజున గురుదేవ్ మళ్లీ కొలంబియాను సందర్శించారు. కేవలం దశాబ్ది ఉత్సవాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాక, మరింత శాంతియుతంగా, ఐక్యతతో కూడిన దక్షిణ అమెరికాను సాధించే దిశగా వారు తమ దృష్టిని సారించారు. బొగోటా, మెడెలిన్, కార్టాజెనా వంటి నగరాల్లో, ఆయన కొలంబియా పార్లమెంట్ సభ్యులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలను కలుసుకుని, వారికి ధ్యానపు లోతైన అనుభూతిని పరిచయం చేశారు. కొలంబియా పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడుతూ గురుదేవ్, “కష్టాలనుండి విముక్తమైన ప్రపంచం, మరింత ప్రేమభరితమైన, ఆనందంగా, శాంతితో నిండిన ప్రపంచం అనేది ఇది ఊహా ప్రపంచంలా అనిపించవచ్చు. అది ఒక కలగానే ప్రారంభమవుతుంది. మనం ఈ కలను కనటం ప్రారంభిస్తే, దాన్ని తప్పక నిజం చేయగలమని నేను నమ్ముతున్నాను.” అని అన్నారు.అంతకు ముందు జూన్ 20వ తేదీన, సమాజ నిర్మాణంలో గురుదేవ్ చూపిన శ్రద్ధ, నిబద్ధత, ఇంకా స్ఫూర్తివంతమైన, నిరంతర సేవలకు గుర్తింపుగా కార్టాజెనా డే ఇండియాస్ నగర మేయర్ డుమెక్ టుర్బే పాజ్ శ్రీశ్రీ ని *బొలీవార్ గవర్నరేట్ మెడల్ తో సత్కరించి, ప్రపంచంలో శాంతి, ఆనందాలను ప్రోత్సహించడంలో గురుదేవుల పాత్రను శ్లాఘించారు.2016లో న్యూఢిల్లీలో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్ కల్చర్ ఫెస్టివల్కు హాజరైన చిత్రదర్శకురాలు మరియు ఫోటోగ్రాఫర్ లికా గవీష్ తన అనుభవాన్ని పంచుకుంటూ, “నా భాగస్వామి ఒక కేమెరామన్గా ఘర్షణ ప్రాంతాల్లో పనిచేశాడు. అక్కడి పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో నాకు బాగా తెలుసు. అటువంటి ప్రాంతానికి శాంతిని తీసుకురావడంలో గురుదేవ్ పాత్ర పోషించారన్న విషయం నన్ను బాగా కదిలించింది. ప్రపంచం ఆయనకు ఎంతో ఋణపడి ఉంటుంది.” అని ఉద్వేగ భరితంగా గుర్తుచేసుకున్నారు.

ఇరాన్ అన్నంత పని చేసింది.. ప్రపంచ దేశాలపై ప్రభావం!
టెహ్రాన్: గత కొన్ని రోజులు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్.. అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్.. ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది.భారత్పై చమురు దిగుమతుల ప్రభావంహార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపులో ఉండదు. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు చమురు కోసం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ.

అమెరికా దాడులు.. ఇరాన్కు అండగా రష్యా..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.రష్యాకు ఇరాన్ రక్షణమంత్రిఇజ్రాయిల్, అమెరికాలు.. ఇరాన్ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్ రక్షణమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం ఉంది.‘ఇరాన్కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ స్పష్టం చేశారు. ట్రంప్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. ఏదైనా జరగొచ్చు..ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణమంత్రితో జూన్ 23వ తేదీన పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు.

‘నోబెల్ శాంతి’కి నామినేట్ చేద్దామనుకుంటే.. ఇలా చేశారేంటి?
కరాచీ: ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తిన తర్వాతే రోజే ఇరాన్పై అగ్రరాజ్యం దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. నోబెల్ శాంతి పురస్కరానికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని పాక్ ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుబట్టింది. ఈ మేరకు ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ‘ఎక్స్’ లో పేర్కొంది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. 🔊PR No.1️⃣8️⃣2️⃣/2️⃣0️⃣2️⃣5️⃣Pakistan Condemns the US Attacks on the Nuclear Facilities of the Islamic Republic of Iran.🔗⬇️https://t.co/2qpo27WzVQ pic.twitter.com/ugtFomQ5HO— Ministry of Foreign Affairs - Pakistan (@ForeignOfficePk) June 22, 2025 డొనాల్డ్ ట్రంప్కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాల్సిందే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం(జూన్ 21వ తేదీ) వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. అయితే నాలుగురోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్హౌస్లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని తెలిపింది. మరి ఇప్పుడు అదే ట్రంప్.. ఇరాన్పై దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. కొన్ని దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ కారణమయ్యారని నిన్న, మొన్నటి దాకా భావించిన పాక్.. ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ఖండించింది. ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడని అనుకున్న వేళ.. ఆయన ఇరాన్పై యుద్ధానికి సిద్ధం కావడంతో ఇలా జరిగేందటనే భావనలో పడింది పాక్. తమకేదో సాయం చేశాడని నోబెల్కు సిఫార్సు చేద్దామనుకుంటే.. ట్రంప్ ఇలా చేశారేంటని అనుకోవడం ఇప్పుడు పాక్ వంతైంది. తాము ఓ అధికార ప్రకటన చేసిన రోజు వ్యవధిలోనే ట్రంప్ ‘ఎంత పని చేశారు’ అని తలలు పట్టుకోవడే తప్పితే ఏమీ చేసేది లేకుండా పోయినట్లైంది పాక్ పరిస్థితి. ఇదీ చదవండి:‘మీరు ఓకే అంటే నేను రంగంలోకి దిగుతా’.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
జాతీయం

‘సింధు ఒప్పందం’పై పాక్కు కంగుతినిపించిన అమిత్ షా
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మరోమారు ఈ విషయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారు.ఇస్లామాబాద్తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని హోంమంత్రి అమిత్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాశ్మీర్లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన అనంతరం సింధు నదీ వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని మూడు నదుల నీటిని పాకిస్తాన్లోని 80శాతం పొలాలకు అందించేందలా నాడు ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన అమిత్ షా.. ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్కు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఈ ఒప్పందంపై చర్చల కోసం తపిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయాలని ఇస్లామాబాద్ యోచిస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?

10–15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో నిబంధనను అమల్లోకి తేనున్నాయి. పదేళ్లు దాటిన వాహనాలకు బంక్ల్లో డీజిల్, పెట్రోల్ నిరాకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్తో నడిచే వాహనాలకు జూలై ఒకతో తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయవద్దంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ విధానం మిగతా ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమల్లోకి రానుందని సమాచారం. ఇందులో భాగంగా వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ (ఏఎన్పీఆర్) కెమెరాల నెట్వర్క్ను ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో ఏర్పాటయ్యాయి. వాహన డేటాబేస్తో అనుసంధానించిన ఈ వ్యవస్థలు, పాతబడిన, నిబంధనలను పాటించని వాహనాలను అప్పటికప్పుడు గుర్తిస్తాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ కెమెరాలు బంకుల్లోకి వచ్చే వాహనాలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. వాహన రిజి్రస్టేషన్ నంబర్ సాయంతో ఇతర వివరాలను తక్షణమే క్రాస్ చెక్ చేస్తాయి. వాహనం ఈఎల్వీ(ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్)గా గుర్తించినా లేదా చెల్లుబాటయ్యే పొల్యూషన్ సరి్టఫికెట్ లేకున్నా సిస్టమ్ ఆపరేటర్కు ఆడియో హెచ్చరికను జారీ చేస్తాయి. అక్టోబర్ 31 నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎన్సీఆర్ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అమలులోకి రానుంది. ఢిల్లీలో 10–15 ఏళ్లు దాటిన వాహనాలు 62 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది.

మేకిన్ ఇండియాతో చైనాకే లాభం.. మనకు నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’తో మన దేశానికి ఎలాంటి లాభం లేకపోగా చైనాయే ఎక్కువగా లాభపడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రంగా విమర్శించారు. 2014 తర్వాత భారత్లో తయారీ రంగం జీడీపీలో 14 శాతానికి పడిపోవడం, చైనా నుంచి దిగుమతులు రెట్టింపు కావడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో మాస్టర్ అని.. పరిష్కారాలు చూపడంలో కాదని రాహుల్ ఎద్దేవా చేశారు. శనివారం రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా పరిశ్రమల బూమ్కి మోదీ సర్కార్ హామీ ఇచి్చంది. అయితే తయారీరంగం ఎందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారింది? యువత అత్యధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. చైనా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. నినాదాలు ఇచ్చే కళలో మోదీ విపరీతమైన నైపుణ్యం సాధించారు. కానీ పరిష్కారాలు చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు’’అని రాహుల్ విమర్శించారు. అంతా అసెంబ్లింగ్ ఢిల్లీలో ప్రముఖమైన ఎల్రక్టానిక్స్ విక్రయ దుకాణ సముదాయం అయిన నెహ్రూ ప్లేస్ను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మొబైల్ రిపేర్ టెక్నీషియన్స్ అయిన సైఫ్, శివమ్లతో కొద్దిసేపు మాట్లాడారు. సంబంధిత వీడియోనూ ‘ఎక్స్’లో రాహుల్ షేర్చేశారు. ‘‘‘నిజం ఏంటంటే.. ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. వాటికి బిగించే అసెంబ్లింగ్ పనిచేస్తున్నాం. అంతేగానీ ఇక్కడ ఉత్పత్తిచేయట్లేము. అందుకే మన కారణంగా చైనా లాభపడుతోంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్రక్టానిక్ మార్కెట్గా వెలుగొందుతోంది. ఇంతపెద్ద మార్కెట్ మరేచోటా లేదు. మనం ఐఫోన్ విడిభాగాలను దిగుమతిచేసుకుని అసెంబ్లింగ్ చేస్తున్నాం. ఇది అతికొద్ది మంది పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో జరుగుతోంది. ఇకపై మనమే ఐఫోన్లను తయారుచేసే స్థాయికి ఎదుగుదాం. అప్పుడే ఈ పరిశ్రమ పురోగతి సాధిస్తుంది. ఇతర దేశాల వస్తువులకు భారత్ అనేది మార్కెట్గా ఉండకూడదు. స్థానికంగా ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేసే మార్కెట్గా భారత్ అవతరించాలి. ఇందుకోసం ప్రాథమికస్థాయిలోనే సంస్కరణలు రావాలి. లక్షల కొద్దీ తయారీదారులు తయారుకావాలి. ఇందుకు ఎంతో నిజాయతీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక దన్ను అవసరం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) ప్రయోజనాలనూ ప్రభుత్వం గుట్టుచప్పుడుకాకుండా నెమ్మదిగా ఉపసంహరించుకుంటోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే’అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విమర్శించిన బీజేపీ రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ‘‘దేశంలో భారీ సంస్కరణలు, దేశ పురోగతిని అందరూ కళ్లారా చూస్తున్నారు ఒక్క రాహుల్ తప్ప. దేశ ప్రగతిని తక్కువ అంచనా వేయంలో రాహుల్ బిజీగా మారారు. భారత స్వావలంభనకు ఆపరేషన్ సిందూర్ తాజా తార్కాణం. చైనా తయారీ డ్రోన్లను భారత తయారీ డ్రోన్లు నేలకూల్చాయి’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు.

భార్య పాస్పోర్ట్ దరఖాస్తుపై భర్త సంతకం అక్కర్లేదు
చెన్నై: పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు భర్త అనుమతి, వారి సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త సంతకం లేకుండా కొత్త పాస్పోర్ట్ జారీ చేసేలా అధికారులను ఆదేశించాలంటూ రేవతి అనే మహిళ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేశ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2023లో వివాహం కాగా, తన భర్త విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారని, అది పెండింగ్లో ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయం తెలిపిన తర్వాత కూడా రీజినల్ పాస్పోర్టు ఆఫీస్(ఆర్పీవో) భర్త అనుమతి, సంతకం తప్పనిసరని చెబుతున్నాన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు భర్త అనుమతి, సంతకం కావాలన్న వాదన పురుషాధిక్య ధోరణిని చాటుతోంది. భార్యను భర్త సొంత ఆస్తిగా సమాజం భావిస్తుండటం సరికాదు. వివాహంతో మహిళ తన వ్యక్తిత్వాన్ని కోల్పోదు. మహిళా సాధికారిత దిశగా అడుగు వేస్తున్న సమాజానికి ఈ ధోరణి మంచిది కాదు’అని పేర్కొన్నారు. పిటిíÙనర్ అర్హతలను పరిశీలించి, ఆమెకు నాలుగు వారాల్లోగా పాస్పోర్టును మంజూరు చేయాలని పీఆర్వోను న్యాయమూర్తి ఆదేశించారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

అశ్లీలం చూస్తే 'కటకటాలే '.. ఆచూకీ కనిపెడుతున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి కారణమైన చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఐఐటీ ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ సహా 15 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్తో పాటు సోషల్మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా నేరమే. నిఘా వేసి ఉంచే రెండు సంస్థలు..చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్సీఎంఈసీ చర్యలు ముమ్మరం అయ్యాయి. దీంతో పాటు ఇంటర్నేషనల్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ (ఐసీఎస్ఈ), గూగుల్కు సంబంధించిన సైబర్ టిప్లైన్ రిపోర్ట్స్ సీఎంఏఎంని గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతున్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా..తక్షణం గుర్తించే ఈ సాంకేతిక పరిజ్ఞానం వారు వినియోగించిన ఐపీ అడ్రస్లను రీడ్ చేస్తుంది. ఈ వివరాలను ఎన్సీఎంఈ, ఐసీఎస్ఈలకు చెందిన సర్వర్ అందిస్తుంది. వీటిని క్రోడీకరించి జాబితాలు రూపొందించి వీటిని ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. జాతీయ స్థాయిలో హోమ్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని ఐ4సీ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఇది తమకు అందిన వివరాలను ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. ఇలా గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది. నిందితుల్లో అన్ని రకాల వాళ్లూ... వీటిపై కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయడం సైబర్ బ్యూరో నిర్వర్తిస్తుంది. ఈ నిందితుల్లో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా ఉంటున్నారు. ఇటీవల అరెస్టు అయిన వారిలో వ్యాపారులు, చిరుద్యోగి కూడా ఉన్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్తో పాటే కొన్ని రకాలైన వైరస్లు కూడా ఉండే ప్రమాదం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ వెబ్సైట్ల ద్వారా ఆయా వైరస్లు పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్టాప్లు హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాలు వారికి చేరి పోర్నోగ్రఫీ బానిసలు అన్ని రకాలుగానూ నష్టపోవాల్సి వస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీనే కాదు..అన్ని రకాలైన అసభ్య, అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచి్చనప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంటే నిర్వాహకులు మరోటి తయారు చేస్తున్నారు. వీటిని హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉంటుండటంతో కఠిన చర్యలు సాధ్యం కావట్లేదని పోలీసులు చెబుతున్నారు.

అత్తింటి వేధింపులకు నవ వధువు బలి
హైదరాబాద్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు పూజిత (19)కు, జాటోతు శ్రీనుతో ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహమైంది. జాటోతు శ్రీను ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ మేనేజర్. కేపీహెచ్బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 3, టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఈఎస్డబ్ల్యూ 1140లో నివసిస్తున్నారు. పూజిత పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు సుమారు రూ.11 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేయసాగారు. అదనంగా రూ.10 లక్షల అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూజిత నానమ్మ మాలోతు భద్రమ్మ వచ్చే పంట విక్రయాల అనంతరం అదనపు కట్నం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు పూజిత నానమ్మకు శ్రీను ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు తాను పనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానని, ఇంతలో పూజిత చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నాడు. పూజిత తన సోదరులతో కలిసి కూల్డ్రింక్ తాగుతున్న ఫొటోలను హరి అనే వ్యక్తి శ్రీనుకి పంపించాడని, వాటిని చూపించి శ్రీను ఆమెను వేధిస్తున్నాడని, తన మనవరాలు మృతికి శ్రీను, అతని కుటుంబ సభ్యులే కారణమని పూజిత నానమ్మ కేపీహెచ్బీ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’
తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ అనే మహిళ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్యతో పాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలిసీ, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనితో మారీసుపేట, మల్లెపాడు గ్రామంలో కలకలం రేగింది.ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా వివరాల సేకరణతెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరాల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హత్యకు ప్లాన్ ఇలా..హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం.