ప్రధాన వార్తలు

వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. సొంత డబ్బులతో వైఎస్ జగన్ కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ వాహనాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి తరలించారు. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను గాలికొదిలేసింది. ఈ క్రమంలోనే డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్కు కేటాయించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేదు. దాంతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తానే కొనుగోలు చేసుకున్నారు. ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో ఏపీ 26 సీఈ 0001 నంబర్ గల సఫారీ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.

లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చేసిన మోసంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకులు చేపట్టిన ‘యువత పోరు’ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా విజయవంతం కావడంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న(సోమవారం) నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్.లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?‘నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఫీజు రీయింబర్స్మెంట్ మాట ఏమైంది?మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.ఇకనైనా తప్పులు సరిదిద్దుకోండి..చంద్రబాబుగారూ మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు..@ncbn గారి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని… pic.twitter.com/TIp3bv8rOm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025

Ind vs Eng 1st Test: ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియాకు పరాభవం
Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదంఅహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.ప్రమాదం ఎలా జరిగింది?- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.- విమానం మేఘాణి నగర్ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ను ఢీకొట్టింది.- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కారణాలు ఏమిటి?- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది- బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.ఒకే ఒక్కడు ఎలా బతికాడు?విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి భారీ ఊరట
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి క్యాట్లో భారీ ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో.. గత ఏడాది అక్టోబర్లో ఆమ్రపాలి ఏపీకి వెళ్లారు. తనను తెలంగాణకే కేటాయించాలని ఆమె క్యాట్లో పిటిషన్ వేశారు. తాజాగా ఆమ్రపాలికి అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ నిర్ణయంతో ఆమె తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆ అదృశ్య యుద్ధ విమానం వెనుక భారతీయ మేధావి!
వార్ టెక్నాలజీలో అత్యద్భుతం.. నార్త్రోప్ B-2 స్పిరిట్ బాంబర్. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ప్రయోగించడంతో వీటి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాల రూపకల్పనలో భారతీయ మూలాలున్న మేధావి కూడా ఉన్నారు. కాలక్రమంలో.. గూఢచర్యం ఆరోపణలతో ఆయన జైలు పాలు కావడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం.నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia).. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1944లో జన్మించారీయన. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్ను రూపకల్పన చేయడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే..దశాబ్దంన్నర తర్వాత.. అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో DARPAతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయ్లోని విల్లాపై దాడి చేసిన ఎఫ్బీఐ డబ్బుతో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయన్ని అదే తేదీన అరెస్ట్ చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలిజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాలకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి కనీసం $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో హోనోలులు కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలా ఒక మేధావి జీవితం.. గూఢచారిగా కటకటాల పాలైంది. కీలకంగా గోవాడియానే.. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ (ఇప్పటి నార్త్రోప్ గ్రుమన్) రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా హాల్ మార్కేరియన్ (Hal Markarian),నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia) గురించి చెప్పుకోవాలి. మార్కేరియన్.. 1979లో B-2 బాంబర్కు సంబంధించిన తొలి డిజైన్ స్కెచ్లు రూపొందించారు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారు. విమానం యొక్క ప్రాథమిక ఆకృతికి బీజం వేశారు. అయితే.. భారతీయ మూలాలున్న ఇంజినీర్ గోవాడియా B-2 బాంబర్లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, విమానం ఎగ్జాస్ట్ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది. వీళ్లిద్దరితో పాటు ఇర్వ్ వాలాండ్, జాన్ కాషెన్, హాన్స్ గ్రెల్మాన్ వంటి స్టెల్త్ టెక్నాలజీ నిపుణులు కూడా భాగస్వాములయ్యారు.వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో అమెరికా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించేందుకు నోషిర్ గోవాడియా నేతృత్వంలో.. ‘స్టెల్త్’ సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. ‘బ్లూబెర్రీ మిల్క్షేక్’ అనే కోడ్ నేమ్తో సాగిన గోప్యమైన ప్రాజెక్టులో గోవాడియా కీలకపాత్ర వహించారు. బాంబర్ ఇంజిన్ ఎగ్జాస్ట్ను రాడార్, హీట్ సెన్సర్లకు దృశ్యమవకుండా చేయడం ఆయన ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించారు. B-2 బాంబర్ ప్రత్యేకతలుబీ2 బాంబర్.. దట్టమైన యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్లలోకి చొచ్చుకుపోవడానికి తక్కువ-పరిశీలించదగిన స్టీల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్టెల్త్ బాంబర్ అని పిలుస్తారు. స్టెల్త్ డిజైన్: ఇది ఫ్లయింగ్-వింగ్ ఆకృతిలో ఉండి, రాడార్కు కనిపించకుండా ఉండేలా రూపొందించబడింది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ ఒక చిన్న పక్షి స్థాయిలో మాత్రమే ఉంటుంది.ఇన్ఫ్రారెడ్ & హీట్ సిగ్నేచర్ తగ్గింపు: ఎగ్జాస్ట్ సిస్టమ్ను ప్రత్యేకంగా రూపొందించి, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేస్తుంది.అత్యధిక పరిధి: ఒకసారి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్తో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.అత్యంత ఖచ్చితమైన దాడులు: 40,000 పౌండ్ల బాంబులు మోసే సామర్థ్యం ఉంది, అందులో న్యూక్లియర్ బాంబులు కూడా ఉంటాయి.క్రూ సౌకర్యాలు: దీన్ని “ఫ్లయింగ్ హోటల్” అని కూడా పిలుస్తారు—ఇందులో బెడ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిషన్లు 40 గంటలపాటు సాగుతాయి.తయారీ ఖర్చుబీ2 బాంబర్ ఖర్చు: సుమారు $2.1 నుండి $2.2 బిలియన్ (2025 నాటికి ₹17,000 కోట్లకు పైగా).మొత్తం ప్రోగ్రాం వ్యయం: అభివృద్ధి, పరీక్షలు, ఉత్పత్తి కలిపి $79 బిలియన్ ఖర్చయింది.ప్రతి మిషన్ ఖర్చు: ఒక B-2 మిషన్కు సగటున $3–4 మిలియన్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఒక్క గంట ఫ్లైట్ ఖర్చే $150,000 ఉంటుంది.చైనా డ్రోన్ నిజంగా B-2ని పోలి ఉందా?అవును.. 2025 మేలో చైనాలోని మలాన్ టెస్ట్ బేస్ వద్ద శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన స్టెల్త్ డ్రోన్ B-2 స్పిరిట్ను పోలి ఉంది. దీని వింగ్స్పాన్(సుమారు 52 మీటర్లు), టెయిల్లెస్ ఫ్లయింగ్-వింగ్ డిజైన్, ఇన్ఫ్రారెడ్-సిగ్నేచర్ తగ్గింపు లక్షణాలు.. ఇవి అన్నీ B-2 లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చైనా యొక్క H-20 ప్రాజెక్ట్ లేదా కొత్త హై-ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ కావచ్చు. అయితే ఈ డ్రోన్ రూపకల్పనకు నోషిర్ గోవాడియా అందించిన గోప్య సమాచారం ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరాన్ కంటే ముందు.. అమెరికా దీనిని ప్రయోగించిన సందర్భాలు🕊️ 1999 – కొసోవో యుద్ధం (Operation Allied Force)- B-2 బాంబర్లు తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న సందర్భం.- మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి నేరుగా సెర్బియాకు వెళ్లి, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన బాంబింగ్ చేశారు.- ఒక్కో మిషన్ 30 గంటలకు పైగా సాగింది. 🏔️ 2001–2002 – ఆఫ్ఘానిస్తాన్ (Operation Enduring Freedom)- తాలిబాన్ స్థావరాలు, శిక్షణ శిబిరాలు, గుహలపై దాడులు.- అమెరికా నుంచి నేరుగా ఎగిరి, మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్తో లక్ష్యాలను చేరుకున్నారు. 🏜️ 2003 – ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)- ప్రారంభ దాడుల్లో భాగంగా సద్దాం హుస్సేన్కు చెందిన కమాండ్ సెంటర్లు, మిస్సైల్ సదుపాయాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి. 🌍 2011 – లిబియా (Operation Odyssey Dawn)- మూడు B-2 బాంబర్లు లిబియాలోని ఎయిర్ఫీల్డ్స్, ఫోర్టిఫైడ్ షెల్టర్లపై దాడి చేసి, నో-ఫ్లై జోన్ అమలు ప్రారంభానికి దోహదం చేశాయి. ⚔️ 2017 – సిరియా (అధికారికంగా నిర్ధారణ కాలేదు)- ఐసిస్ స్థావరాలపై B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయని నివేదికలు ఉన్నాయి. 🚀 2024 – యెమెన్- హౌతీ తిరుగుబాటుదారులపై దాడి. ఈ మిషన్ ద్వారా బీ-2 బాంబర్ సామర్థ్యాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 🌑 2025 – ఇరాన్ (Operation Midnight Hammer)- 7 B-2 బాంబర్లు 37 గంటల పాటు ఎగిరి, ఇరాన్లోని Fordow, Natanz, Isfahan న్యూక్లియర్ కేంద్రాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి.

ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

రూ. 27 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన శివమ్ దూబే
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఓషివరాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. స్క్వేర్యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర రూ. 27.50 కోట్లని తెలుస్తుంది. ఈ రెండు అపార్ట్మెంట్లు DLH ఎన్క్లేవ్ అనే నివాస ప్రాజెక్ట్లోని 17 మరియు 18వ అంతస్తులలో ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 9,603 చదరపు అడుగులు (నివాస ప్రాంతం 4,200, బాల్కనీ 3,800 చదరపు అడుగులు).అపార్ట్మెంట్లతో పాటు మూడు పార్కింగ్ స్థలాలను దూబే దేవ్ ల్యాండ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీ జూన్ 20, 2025న నమోదు చేయబడింది. దీనికి మొత్తం రూ. 1.65 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించబడ్డాయి. DLH ఎన్క్లేవ్లో ఇదివరకే పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. బాలీవుడ్ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయకుడు మికా సింగ్, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం ఇక్కడే నివాసముంటుంది.31 ఏళ్ల శివం దూబే (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్) భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. దేశీయ క్రికెట్లో అతను ముంబైకి ఆడతాడు. 2019 నవంబర్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దూబే ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 వన్డేలు, 35 టీ20లు ఆడి 574 పరుగులు చేశాడు. అలాగే 14 వికెట్లు పడగొట్టాడు. దూబే ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 10 హాఫ్ సెంచరీల సాయంతో 1859 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు.

ఈపీఎఫ్వో కీలక ప్రకటన
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అడ్వాన్స్ క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీలు, పిల్లల పెళ్లిల్లు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరితగతిన ఆర్థిక వెసులుబాటు అందించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన సిబ్బందికి సకాలంలో డబ్బు అందేలా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.‘కార్మికులకు నిరంతరాయంగా, సకాలంలో ఆర్థికంగా వెసులుబాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల సభ్యులు అవసరమైన సమయాల్లో పెద్ద మొత్తంలో వేగంగా డబ్బు పొందవచ్చు’ అని మాండవీయ పేర్కొన్నారు. ఆటో సెటిల్మెంట్ సదుపాయం కొవిడ్-19 మహమ్మారి కాలం నుంచే అందుబాటులో ఉంది.ఏమిటీ ఆటో సెటిల్మెంట్?క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్లోని కొంత భాగాన్ని అడ్వాన్స్గా పొందడానికి అనుమతించే విధానం. కొవిడ్ సమయంలో రూ.1లక్ష వరకు ఇలా ఆటో సెటిల్మెంట్కు ఈపీఎఫ్ఓ అవకాశం ఇచ్చింది. ఇక నుంచి దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్యా ఖర్చులు, ఇంటి రెన్యూవేషన్, పిల్లల పెళ్లి వంటి తక్షణ అవసరాలకు ఇలా పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఈ విధానంలో నిధులు మ్యానువల్గా కాకుండా ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతాయి.ఈ సర్వీసు పొందేందుకు చందాదారులు తమ ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ సమాచారం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణకు ముందు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ పూర్తి ఉపసంహరణ అనుమతించబడనప్పటికీ పిల్లల వివాహం, విద్య లేదా ఇంటి పునరుద్ధరణ వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా విత్డ్రా చేసేందుకు అనుమతించారు. దీనివల్ల సభ్యులు తమ నిధులను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాప్యం లేకుండా పొందవచ్చు.ఆటో సెటిల్మెంట్ కోసం అర్హతలువైద్య అత్యవసర పరిస్థితులు: చందాదారులు లేదా తమపై ఆధారపడినవారు ఆసుపత్రిలో చేరడం, పెద్ద శస్త్రచికిత్సలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండడం.ఉన్నత విద్య: చందాదారులు లేదా తమ పిల్లల ఉన్న విద్య కోసం.వివాహ ఖర్చులు: చందాదారు పెళ్లి లేదా పిల్లలు లేదా తోబుట్టువుల పెళ్లి ఖర్చులకు.ఇంటి పునరుద్ధరణ లేదా నిర్మాణం: ఇల్లు కొనడం లేదా ఇప్పటికే ఉన్న ఇంటి మరమ్మతుల కోసం.ఈపీఎఫ్ స్కీమ్ రూల్స్ 68జే, 68కే, 68బీ ద్వారా పై కేటగిరీలోని అవసరాల నిమిత్తం పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయవచ్చు. చందాదారు క్లెయిమ్ ఈపీఎఫ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మానవ ప్రమేయం లేకుండా ప్రాసెస్ అవుతుంది. అందుకు సాధారణంగా 72 గంటలు సమయం పడుతుంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలుకావాల్సినవి..చందాదారులు తప్పనిసరిగా ఫుల్ కేవైసీని అప్డేట్ చేయాలి. అందుకు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్లను ఈపీఎఫ్ అకౌంట్తో లింక్ చేయాలి.యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) యాక్టివ్గా ఉండాలి. దాన్ని వెరిఫై చేయాలి.

ప్రియుడితో కయ్యం.. ప్రేమ పిచ్చి దెయ్యం.. జైలు పాలైన వైనం
చెన్నై: నేటి తరం యువత ప్రేమ, వ్యామోహంతో క్షణికావేశంలో నిండు జీవితాల్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మేఘాలయాలో సోనమ్ రఘువంశీ, అనంతరంపురంలో శిరీష,హైదరాబాద్ జీడిమెట్ల తేజశ్రీ.. తాజాగా చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. ఇలాంటివి రోజుకు ఎన్నో కథలు.. వ్యథలు.చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్లో సీనియర్ రోబోటిక్స్లో కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఓ ప్రాజెక్ట్ సందర్భంగా బెంగళూరులో డివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే, ప్రేమ,దోమ ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషిల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మనసు ముక్కలైంది. దీంతో డివిజ్ ప్రభాకర్ఫై ప్రతీకారానికి దిగింది. ప్రేమ పిచ్చితో అతగాడికి మనశాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది. బాంబు బెదిరింపులతో దేశవ్యాప్తంగా అలజడిఅ తర్వాత డివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూల్స్,ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపింది. ఒక్క అహ్మదాబాద్లోనే 21 ప్రదేశాలకు బెదిరింపులు పంపింది. మోతేరా నరేంద్ర మోదీ స్టేడియం, సర్కేజ్లోని జెనీవా లిబరల్ స్కూల్, సివిల్ హాస్పిటల్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఇలా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బెదిరింపులు కలకలం రేపాయి.రీసెంట్గా ఎయిరిండియా విమాన ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానం టేకాఫ్ తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీకి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో ‘మీకు మా దెబ్బ రుచి చూపించాం. మేమే విమానాన్ని కూల్చాం. ఇప్పుడు మీకు అర్థమైందేమో’ అని పేర్కొంది. ఈ బెదిరింపు మెయిల్ను రెనే జోషిల్డా పంపినట్లు పోలీసులు గుర్తించారు.ఒక చిన్న తప్పిదమే ఆమెను పట్టించేసింది టెక్నాలజీలో నిపుణురాలైన రెనే జోషిల్డా టోర్ బ్రౌజర్, డార్క్ వెబ్, వర్చువల్ నంబర్లను ఉపయోగించి తన డిజిటల్ ట్రేస్ను దాచింది. కానీ ఆరు నెలల క్రితం ఆమె ఓ చిన్న తప్పు చేసింది. అదే ఆమెను పట్టించేసింది. ఒకసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్స్ను ఓపెన్ చేసింది. బెదిరింపు కాల్స్తో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనే జోషిల్డా ఐపీ అడ్రస్ను గుర్తించారు. అమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
కన్నప్పలో ప్రభాస్ రోల్.. ఎంతసేపు కనిపిస్తారంటే?
Vande Bharat: ఏసీ కోచ్లో లీకైన నీళ్లు.. ఇక నా డబ్బులో నాకివ్వండి!
మిర్యాలగూడలో బిగ్బాస్ దివి.. విదేశాల్లో మెహరీన్ చిల్!
Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి భారీ ఊరట
IND VS ENG 1st Test Day 5: రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్
ట్రంప్ సహనం కోల్పోయిన వేళ.. అంత మాట అనేశారేంటి?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
రూ. 27 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన శివమ్ దూబే
ఓటీటీకి అజయ్ దేవ్గణ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
విశాఖపట్నం : వల నిండింది.. పంట పండింది (ఫొటోలు)
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రిషికేశ ఈజ్ బ్యాక్
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
ఇరుకున పడ్డ ఇరాన్!
కన్నప్పలో ప్రభాస్ రోల్.. ఎంతసేపు కనిపిస్తారంటే?
Vande Bharat: ఏసీ కోచ్లో లీకైన నీళ్లు.. ఇక నా డబ్బులో నాకివ్వండి!
మిర్యాలగూడలో బిగ్బాస్ దివి.. విదేశాల్లో మెహరీన్ చిల్!
Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి భారీ ఊరట
IND VS ENG 1st Test Day 5: రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్
ట్రంప్ సహనం కోల్పోయిన వేళ.. అంత మాట అనేశారేంటి?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
రూ. 27 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన శివమ్ దూబే
ఓటీటీకి అజయ్ దేవ్గణ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
బల ప్రయోగంతోనే శాంతి నిరూపించిన డోనాల్డ్ ట్రంప్ - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
రిషికేశ ఈజ్ బ్యాక్
బిగ్ ట్విస్ట్.. ముగిసిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు.. ఒక్క ఆయనకు మాత్రమే: చిరంజీవి
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
ఇరుకున పడ్డ ఇరాన్!
యుద్దాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి -ఐక్యరాజ్యసమితి
సినిమా

స్టార్ హీరోతో రిలేషన్ .. ప్రేమపై త్రిష పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొంతకాలంగా అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యేక్షంగా స్పందించకపోవడం.. కెరీర్ పరంగా బీజీ కావడంతో ఇటీవల అలాంటి పుకార్లు పెద్దగా రాలేదు.కానీ తాజాగా విజయ్ బర్త్డే రోజు త్రిష అతని ఫోటో షేర్ చేస్తూ విషెస్ చెప్పడం.. అదే ఫోటోకి త్రిష తల్లి లవ్ సింబల్ జోడించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త మరోసారి వైరల్ అయింది.తాజాగా ఈ పుకార్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే..అది కొందరిని తిగమక చేస్తుంది’ అనే కొటేషన్ని త్రిష తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. విజయ్తో ప్రేమను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా త్రిష వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. ఆమె పెళ్లిపై గతంలోనూ పలు రూమర్స్ వచ్చినా.. త్రిష వాటిని కొట్టి పారేసింది. మొత్తానికి 42 ఏళ్ల తర్వాత తన ప్రేమ విషయాన్ని చెప్పేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.త్రిష కెరీర్ విషయానికొస్తే. ఇటీవల థగ్లైఫ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్కి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. సూర్య ‘కరుప్పు’ చిత్రంలో కూడా త్రిషనే హీరోయిన్గా తీసుకున్నారు. విజయ్ విషయానికొస్తే.. తన చివరి చిత్రం ‘జననాయకుడు’ (జన నాయగన్)తో ప్రేక్షకులను అలరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ విజయ్ జన్మదినం రోజున విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)

అజిత్ కుమార్ న్యూ లుక్.. షాకవుతున్న ఫ్యాన్స్!
ఈ ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించింది.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అజిత్కు కారు రేసింగ్ అంటే ప్రాణం. ఇప్పటికే తన టీమ్తో కలిసి విదేశాల్లో టైటిల్స్ కూడా సాధించారు. సినిమాలకు కాస్తా విరామం దొరకడంతో కార్ రేసింగ్లో బిజీ అయిపోయారు. అజిత్ కుమార్ ప్రస్తుతం బెల్జియంలో తన జీటీ4 యూరోపియన్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ వీకెండ్లో ఈ కార్ రేసింగ్ జరగనుంది.అయితే తాజాగా అజిత్ కుమార్ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. రేసింగ్ ట్రాక్పై సైకిల్ తొక్కుతూ కనిపించారు. అయితే ఈ ఫోటోల్లో అజిత్ కుమార్ గుండు చేయించుకుని కొత్త లుక్తో దర్శనమిచ్చారు. తాజా లుక్ను చూసిన అజిత్ కుమార్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఏడాది 'విదాముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో మెప్పించి అజిత్ కుమార్ ప్రస్తుతం ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. AK at Spa Francochamps circuit, Belgium preparing for the 3rd round of GT4 European series coming weekend#ajithkumar #ajithkumarracing #akracing #GT4 #europeanseries #weekendracing #racing pic.twitter.com/nXksEJZUdc— Ajithkumar Racing (@Akracingoffl) June 24, 2025

అంజనా దేవికి అస్వస్థత.. నాగబాబు ఏమన్నారంటే?
తన మాృతమూర్తి అంజనాదేవి అనారోగ్యంపై తనయుడు నాగబాబు స్పందించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని అభిమానులను కోరారు. మా అమ్మ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. వాటిని ఎవరు కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.కాగా.. ఇవాళ ఉదయం అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారంటూ రూమర్స్ వచ్చాయి. ఆమె తీవ్ర అస్వస్థత గురయ్యారంటూ కథనాలు రావడంతో నాగబాబు స్పందించారు. అంతేకాకుండా ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చారని రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సైతం షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు.అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025

జూనియర్ ఎన్టీఆర్కు పెద్ద అభిమానిని: పొలిమేర హీరోయిన్
పొలిమేర సినిమాలతో ఆడియన్స్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఆమె షో టైమ్ అనే మూవీలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది.తాను జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానినని కామాక్షి భాస్కర్ల అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్గా అరవింద సమేత సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లి.. నవీన్ చంద్ర అభిమానిగా బయటికొచ్చానని తెలిపింది. పొలిమేర-2 చూసిన తర్వాత నవీన్ చంద్ర వ్యక్తిగతంగా నన్ను అభినందించారు. ఈ సినిమాలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.. ఈ విషయంలో నవీన్ చంద్రతో పాటు డైరెక్టర్కు నా ధన్యవాదాలు.. మా సినిమాలను ఓటీటీలో కాకుండా థియేటర్లకు వచ్చి చూడాలని ఆడియన్స్కు విజ్ఞప్తి చేసింది కామాక్షి భాస్కర్ల.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

IND VS ENG 1st Test Day 5: వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్
వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్వర్షం పాక్షిక అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. రెండో ఓవర్లోనే ప్రసిద్ద్ కృష్ణ జాక్ క్రాలేను (65) ఔట్ చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు ఇంకా 183 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. రెండో సెషన్లో వర్షం మొదలైంది. వర్షం మొదలయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. బెన్ డకెట్ (105) సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ జాక్ క్రాలే (59) బాధ్యతాయుతంగా ఆడుతూ క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతున్న వేల వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 190 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 105 నాటౌట్, క్రాలే 59 నాటౌట్)

ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. ? వైరలవుతున్న సోనీ స్పోర్ట్స్ పోస్టర్
ఈ ఏడాది చివర్లో భారత్లో జరగాల్సిన ఆసియా కప్-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం లేకపోవడం సోషల్మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్ సిందూర్) భారత్, పాక్ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్ పాక్తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్కు సంబంధించి ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్ పాక్తో మ్యాచ్లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్లో కూడా భారత్ పాక్తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్కు చెందిన మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఉండటంతో భారత్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.మరికొన్ని నివేదికలేమో భారత్ తమ దేశ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్నే ఆసియా కప్ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ స్పోర్ట్స్ పాక్ ప్రాతినిథ్యం లేని పోస్టర్ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్ భారత్, పాక్ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.కాగా, ఆసియా కప్ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది.

గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం!
ఇంగ్లండ్తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్ (Leeds)లో భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి ఇలా..దీంతో.. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుబ్మన్ గిల్ అసంతృప్తిఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్ను అవుట్ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్లకు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.కెప్టెన్ గిల్ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.జడ్డూ చర్య వైరల్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా అంపైర్ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది.ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏భారత్కు ఆరు పరుగుల ఆధిక్యం🏏భారత్ రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 21/0 (6) 🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 117/0.చదవండి: వసీం అక్రం, షేన్ వార్న్ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ.@imjadeja is all fired up as the umpire allows #TeamIndia a ball change! 🔄💥Is a breakthrough around the corner? Will the next two sessions bring the wickets India needs? 👀#ENGvIND 1st Test Day 5 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/qKMYKc6gDl— Star Sports (@StarSportsIndia) June 24, 2025

IND VS ENG 1st Test, Day 5: తొలి సెషన్ వారిదే.. లక్ష్యం దిశగా సాగుతున్న ఇంగ్లండ్
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసపట్టులో సాగుతోంది. 350 పరుగుల లక్ష్య ఛేదనలో చేతిలో 10 వికెట్లు పెట్టుకొని చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్ (64 నాటౌట్), జాక్ క్రాలే (42 నాటౌట్) అద్బుతమైన పోరాటపటిమ కనబరుస్తూ తొలి సెషన్లో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ ఇద్దరు తొలి సెషన్లో అజేయమైన 96 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన డకెట్ ఈ ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. క్రాలేతో పోలిస్తే డకెట్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. క్రాలే బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నాడు. చివరి రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో రెండు సెషన్లలో 254 పరుగులు చేయాల్సి ఉంది. అదే భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సి ఉంటుంది. మొత్తానికి భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.వాతావరణ ముందస్తు హెచ్చరికలో ఇవాళ వర్షం పడే అవకాశముందని తెలిపింది. అయితే వరుణుడు తొలి సెషన్లో ఎలాంటి బ్రేకులు వేయలేదు. మ్యాచ్ సజావుగా సాగుతుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఒక్కో పరుగును పేరుస్తూ.. తమ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. తొలి సెషన్లో భారత బౌలర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సెషన్ ముగియడానికి ముందు బంతి మార్పిడి జరిగింది. కొత్త బంతితో కూడా భారత బౌలర్లకు ఎలాంటి ఫలితం రాలేదు. వరుణుడి నుంచి ఎలాంటి ఆటంకం ఉండకపోతే తదుపరి రెండు సెషన్లలో భారత బౌలర్లు 66 ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది.స్కోర్ వివరాలు..భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 64 నాటౌట్, క్రాలే 42 నాటౌట్)
బిజినెస్

టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభం
ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ టెస్లా టెక్సాస్లోని ఆస్టిన్లో తన మొట్టమొదటి ఫుల్ డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. భవిష్యత్తులో రవాణా విభాగంలో కొత్త ట్రెండ్ సృష్టించాలని భావించి కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) సాఫ్ట్వేర్తో నడిచే మోడిఫైడ్ మోడల్ వై ఎస్యూవీలను తయారు చేశారు.ప్రాథమికంగా కొంతకాలం కస్టమర్లలో నమ్మకం కలిగేంతవరకు ఈ ఎస్యూవీల పర్యవేక్షణ కోసం ప్యాసింజర్లతోపాటు టెస్లా ఉద్యోగులు సైతం అందులో ప్రయాణించనున్నారు. ముందుగా దక్షిణ ఆస్టిన్ వీధుల్లో టెస్లా ఈ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 20 వాహనాలను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద సెట్అప్ చేశారు. ప్రాథమికంగా దక్షిణ ఆస్టిన్ జియోఫెన్సింగ్ విభాగాన్ని కవర్ చేసే పరిమిత సర్వీసులను కంపెనీ అందిస్తుంది. క్రమంగా ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సర్వీసులను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ డైవర్లెస్ కారు రైడ్లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని టెస్లా పేర్కొంది. అయితే ప్రతికూల వాతావరణంలో మాత్రం నిలిపేస్తామని ముందే స్పష్టతనిచ్చింది.రైడ్ ధర 4.20 డాలర్లుప్రతి రోబోటాక్సీ రైడ్ ఖరీదు 4.20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఈ ధర నిర్ణయించినప్పటికీ కస్టమర్ల నుంచి నెలకొనే డిమాండ్, రెగ్యులేటరీ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!నో లైడార్, నో రాడార్ ఓన్లీ కెమెరా..ఇప్పటికే స్థానికంగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వేమో, జూక్స్ వంటి ప్రత్యర్థి కంపెనీలు వాటి కార్లలో ఉపయోగించినట్లు లైడార్ లేదా రాడార్ వ్యవస్థలను టెస్లా వినియోగించలేదని స్పష్టం చేసింది. అందుకు బదులుగా పూర్తి కెమెరాలు, అంతర్గత ఏఐ చిప్లతోనే డ్రైవింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పింది. అటానమస్ వాహనాలకు పర్మిట్లు తప్పనిసరి చేసే కొత్త టెక్సాస్ చట్టం సెప్టెంబర్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు కొందరు చెబుతున్నారు.

పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!
పెరుగుతున్న ఇంధన డిమాండ్కి తగ్గట్లుగా సరఫరా సామర్థ్యాలను పెంచుకునే దిశగా రూ.844 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ గెయిల్ ఇండియా వెల్లడించింది. దహేజ్–ఉరన్–దభోల్–పాన్వెల్ సహజ వాయువు పైప్లైన్పై ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం దీని సామర్థ్యం రోజుకు 19.9 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉండగా వచ్చే మూడేళ్లలో దీన్ని 22.5 ఎంసీఎండీకి పెంచుకోనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు గెయిల్ తెలియజేసింది.ఇదీ చదవండి: రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బమరోవైపు, 1,702 కిలోమీటర్ల ముంబై–నాగ్పూర్–ఝర్సుగూడ పైప్లైన్ ప్రాజెక్టును పూర్తి చేసే గడువు తేదీని ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30కి పెంచినట్లు వివరించింది. దీనికి అదనంగా రూ. 411.12 కోట్లు అవసరమవుతాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం ముందుగా అంచనా వేసిన రూ.7,844.25 కోట్ల కన్నా అధికంగా రూ.8,255.37 కోట్లకు చేరుతుందని గెయిల్ పేర్కొంది. అటు 774 కిలోమీటర్ల శ్రీకాకుళం–అంగుల్ పైప్లైన్ ప్రాజెక్టు గడువును కూడా 2025 జూన్ నుంచి డిసెంబర్కి సవరించినట్లు వివరించింది. అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం కారణంగా పైప్లైన్ పనుల పురోగతిపై ప్రభావం పడినట్లు పేర్కొంది.

రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ
రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో దేశీయంగా ఈ ప్రభావం ఆటోమొబైల్సహా పలు రంగాలపై కనిపించనుంది. ఈ ప్రభావంతో ఆడియో ఎల్రక్టానిక్స్ పరిశ్రమలో 21,000 ఉద్యోగాలు రిస్క్లో పడనున్నట్లు ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సమాఖ్య ఎల్సినా.. ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్లో టెర్బియం, డిస్ప్రోజియం తదితర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలకు తెరతీసింది.వీటిలో అధిక నాణ్యతగల (హైపెర్ఫార్మెన్స్) ఎన్డీఎఫ్ఈబీ(నియోడైమియం–ఐరన్–బోరన్) మ్యాగ్నెట్లు తదితరాలున్నాయి. ఇవి ప్రధానంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో వినియోగించే కీలక ముడిసరుకులు కావడంతో ఈ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. వీటి సరఫరాలకు విఘాతం కలగడంతో దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వాచీలు, వినికిడి సంబంధిత(ఇయర్ ఫోన్స్, బడ్స్) ఎల్రక్టానిక్ వస్తువుల తయారీ దెబ్బతింటున్నట్లు ఎల్సినా పేర్కొంది. దీంతో పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్ మాడ్యూల్స్ను చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఎలక్ట్రానిక్ వస్తు తయారీకి విఘాతం కలగడమేకాకుండా దిగుమతులపై అధికంగా ఆధారపడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వివరించింది. ఫలితంగా స్పీకర్, ఆడియో విడిభాగాల పరిశ్రమపై ఆధారపడిన 5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలకుతోడు పరోక్షంగా 15,000మంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు నోయిడాలో ఉపాధి కల్పన దెబ్బతినే వీలున్నట్లు పేర్కొంది.

డిక్సన్ టెక్నాలజీస్లో వాటా విక్రయం
ఎల్రక్టానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) ప్రమోటర్ సునీల్ వాచని కంపెనీలో 2.77 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 13,301.47 సగటు ధరలో 16.7 లక్షల షేర్లను అమ్మివేశారు. తద్వారా రూ. 2,221 కోట్లకుపైగా అందుకున్నారు. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం కంపెనీ చైర్పర్శన్ సునీల్ వాటా దీంతో డిక్సన్లో 5.34 శాతం నుంచి 2.57 శాతానికి క్షీణించింది. మొత్తం ప్రమోటర్ల వాటా 32.27 శాతం నుంచి 29.5 శాతానికి దిగివచ్చింది.మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్ రెండు దశలలో 2.39 శాతం వాటాకు సమానమైన 14.45 లక్షల డిక్సన్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 13,308 సగటు ధరలో ఇందుకు రూ. 1,924 కోట్లు వెచ్చించింది. ఈ లావాదేవీ తదుపరి డిక్సన్ టెక్నాలజీస్లో మోతీలాల్ ఎంఎఫ్ వాటా 2.24 శాతం నుంచి 4.63 శాతానికి ఎగసింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ నికర లాభం రూ. 97 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఇందుకు కన్సాలిడేటెడ్ ఆదాయం రెట్టింపునకుపైగా జంప్చేసి రూ. 10,293 కోట్లకు చేరడం సహకరించింది. 2023–24లో రూ. 4,658 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. పూర్తి ఏడాదికి(2024–25) ఆదాయం రూ. 17,691 కోట్ల నుంచి రూ. 38,860 కోట్లకు బలపడగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 375 కోట్ల నుంచి రూ. 1,233 కోట్లకు ఎగసింది.
ఫ్యామిలీ

అది బైకా.. లేక ఇంకేమన్నానా! మారండిరా బాబూ!!
ప్రమాదమని తెలిసినా కొంతమంది కుర్రకారు రెచ్చిపోతూనే ఉన్నారు. పిచ్చి పిచ్చి చేష్టల కారణంగా కళ్ల ముందే నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వీరి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఒక వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు తిట్టిపోస్తున్నారు. మరోవైపు అనేక సామాజిక అంశాలపై సోషల్మీడియాలో స్పందించే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Vishwanath Channappa Sajjanar) కూడా ఈవీడియోపై అగ్రహం వ్యక్తం చేశారు. జరగరానికి జరిగితే, ఆ తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎంతటి క్షోభ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జనార్ ట్వీట్లో ఎమన్నారంటే..అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి. జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు టీనేజర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్లకే తెలియాలి!!అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి.జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/dmXUQ8BWz4— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 24, 2025అటు ఇకనైనా మారండిరా బాబూ, సోషల్మీడియా పిచ్చి ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకండి.. మీరు బాగానే పోతారు.. మీ వెనక అమ్మనాన్న పరిస్థితి ఏంటి? మీలో ఎవరైనా శాశ్వత వికలాంగులుగా మారిపోతే ఎలా? ఎపుడైనా ఆలోచించారా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తగినవిధంగా శక్షించాలి అని కొందరు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఒక కంట గమనిస్తూ తమ బిడ్డలను మందలించాలని మరికొందరు సూచిస్తున్నారు. చదవండి: అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్

సేంద్రియ బియ్యంతో జగన్నాథునికి అమృతాన్న భోగం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దైనందిన భోగాల నివేదనలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది రథ యాత్ర మొదలుకొని స్వామి వారికి అమృత అన్న భోగం నివేదన ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా రథ యాత్ర నుంచి గుండిచా మందిరం అడపా మండపంలో కొఠొ భోగ సమయంలో మహా ప్రభువుకు అమృత అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బొడు సువార్, సువార్ మహాసువార్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సువార్ మహాసువార్ భోగ మండపంలో అమృత అన్నం ఉపయోగించాలని ప్రతిపాదించారు. మహా ప్రభువు భోగం తయారీలో అమత అన్నాన్ని ఉపయోగించడం గురించి గతంలో చర్చించి ప్రయోగాత్మకంగా ఈ చర్యని అమలు చేశారు. కొరాపుట్ ప్రగతి ఇనిస్టిట్యూట్ అమృత అన్నం బియ్యం సరఫరాకు మద్దతు ప్రకటించిందని సీఏఓ తెలిపారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రియ బియ్యంతో ప్రసాదం తయారీ.. మందిరంలో జగన్నాథుని అన్న ప్రసాదాలు మహా ప్రసాదంగా ప్రతీతి. ఈ ప్రసాదం సేంద్రియ బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయాలని పాలక వర్గం నిర్ణయించడం ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి నిత్య అన్న ప్రసాదాల తయారీలో సేంద్రియ బియ్యం వినియోగిస్తారు. ఈ బియ్యంతో వండిన ప్రసాదాల్ని అమృత్ అన్నం అనే ప్రత్యేక పేరుతో వ్యవహరిస్తారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా సహజమైన ఎరువులను ఉపయోగించి సాగు చేసిన బియ్యం మాత్రమే వినియోగిస్తారు. తొలి దశలో స్వామికి నివేదించే కొఠొ భోగ సేవలో మాత్రమే వినియోగిస్తారు. తదుపరి దశలో ఇతర అన్ని వంటకాల్లో ఈ బియ్యం వినియోగం బలపరుస్తారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న కొళాజీర, పింపుడిబాసొ, యువరాజ్ మొదలైన సేంద్రియ బియ్యాన్ని అమృత అన్న మహా ప్రసాదంలో ఉపయోగిస్తారు. మందిరంలో రోజుకు 50 నుండి 55 క్వింటాళ్ల బియ్యంతో స్వామి మహా ప్రసాదం వంటకం అవుతుంది. ప్రత్యేక ఉత్సవాలు, పండగపబ్బాల సందర్భంగా రోజుకు 100 నుండి 200 క్వింటాళ్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అదనంగా కొఠొ భోగం కోసం ప్రతి రోజూ 100 కిలోల బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్న మహా ప్రసాదానికి అధిక నాణ్యత గల బియ్యం వినియోగానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. పిండి వంటల ప్రసాదాల తయారీలో మసూరి బియ్యం కొనసాగుతుంది. క్రమంగా వీటి స్థానంలో అమృత్ అన్నం బియ్యం వినియోగించే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారం మందిరం అన్న ప్రసాదాల తయారీలో కొరత లేకుండా అమృత అన్నం బియ్యం సరఫరా చేసేందుకు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమిలో సేంద్రియ వరి సాగు అవసరం అని అనుభవజ్ఞుల వర్గం పేర్కొంది. మందిరం పాలక వర్గం ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా కొనసాగిస్తుంది.ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత

స్కిన్ కేర్ 'ఏజ్ నో బార్'..!
కాలం ఎవరికోసమూ ఆగదు. కాలం గడుస్తున్న కొద్దీ అది ప్రతి అంశం మీదా ఏదో ఒక ప్రభావం చూపుతుంది.అలాగే మన చర్మం మీద కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుండటంతో చర్మానికి వచ్చే సమస్యలు, వ్యాధులొచ్చే అవకాశాలూ పెరుగుతాయి. అందుకే వయసు పెరుగుతున్న ప్రతి ఒక్కరూ...వారు ఏ వయసు వారైనప్పటికీ...తమ చర్మానికి వచ్చే కొన్ని సమస్యలను తెలుసుకుని తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. కాలాన్నైతే ఆపలేం గానీ... దాని ప్రభావం వల్ల చర్మంపై వచ్చే మార్పులను ఆలస్యంగా వచ్చేలా చేసుకుని చాలాకాలం పాటు యౌవనంగా కనిపించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేమార్పులు...సమయం గడుస్తున్న కొద్దీ చర్మానికి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్ వంటి సాధారణ సమస్యలు మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్ప్యూరా, హిమటోమా వరకు... ఎండకు పగుళ్లుబారినట్లు కనిపించే సోలార్ ఎలాస్టోసిస్ మొదలుకొని... కొన్ని రకాల క్యాన్సర్స్ వరకు చాలా సమస్యలు రావచ్చు. అలాంటి సమస్యలేమిటన్నది చూద్దాం. చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటి పొరను ఎపిడర్మిస్, మధ్యపొరను డర్మిస్ అంటారు. దానికింద సబ్క్యుటేనియస్ టిష్యూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మూడు పొరల్లో చాలా మార్పులు వస్తాయి. ఎపిడర్మిస్ పొర: ఈ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలో చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల్లోని చర్మం చాలావరకు పారదర్శకంగా మారి... లోపలు ఉండే రక్తనాళాలు కొంతవరకు బాగా కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. డర్మిస్ పొర : ఇందులో చర్మ కణాలను గట్టిగా పట్టి ఉంచే కొలాజెన్, ఎలస్టిన్ అనే కనెక్టివ్ కణజాలాలు ఉంటాయి. వీటి వల్ల చర్మానికి సాగే గుణం, బలం సమకూరుతాయి. ఈ కణాలు బలంగా ఉన్నప్పుడు చర్మం బిగుతుగా ఉంటుంది. యౌవనంలో కొలాజెన్, ఎలాస్టిన్ కణజాలం బలంగా ఉంటుంది కాబట్టి చర్మం బిగుతుగా ఉంటుంది. వయసు పైబడుతున్నకొద్దీ ఈ బలం తగ్గుతుండటంతో చర్మం సాగినట్లుగా, వదులవుతున్నట్లుగా కనిపిస్తుంది. దాంతోపాటు డర్మిస్లో ఉండే రక్తనాళాలు సైతం బలహీనంగా అవుతాయి. దాంతో వయసు పెరిగిన వారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. సబ్క్యుటేనియస్ పొర : ఇందులో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోతూ ఉండటం కారణంగా చర్మం మునుపటిలా మందంగా ఉండదు. పలచబారి΄ోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులూ, అలాగే చర్మంపై నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్ గ్రంథులూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు కూడా తగ్గుతూ ఉంటుంది. దాంతో చెమట పట్టే సామర్థ్యం కూడా తగ్గిపోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. తన స్వాభావికమైన నునుపుదనాన్నీ కోల్పోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పైన చెప్పిన అన్ని సమస్యల కారణంగా చర్మం తన పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవుతుంది. చర్మంపై ముడుతలు (రింకిల్స్) కూడా వస్తాయి. కాలంతో వచ్చే ఈ మార్పులు రాకుండా చేయడానికిగానీ లేదా ఆపడం గానీ పూర్తిగా సాధ్యం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ మార్పులు చాలా వేగంగా జరగవచ్చు. అందుకు కారణమయ్యే అంశాలివి...తొలి ప్రభావం ఇలా... చర్మం పొడిబారిపోవడం, పాలిపోవడం, సాగేగుణం (ఎలాస్టిసిటీ) కోల్పోవడం, ముడుతలు, వేలాడినట్లుగా కావడం... ఈ గుణాలన్నీ తొలుత ముఖం, చేతుల చర్మంపై ఎక్కువగా కనిపిస్తాయి. ముఖంలోనూ ముక్కుకు ఇరువైపులా, నోటి చుట్టూ, దవడపైన ఉండే చర్మం, గవదల దగ్గరా ఎక్కువగా కనిపిస్తాయి. చేతుల విషయానికి వస్తే ముంజేతులు, కాళ్ల వద్ద ఉన్న చర్మంలో తొలుత మార్పులు వస్తాయి. ఆ తర్వాత శరీరంలోని మిగతా చర్మంపై అంతటా ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. ముడతలు పడటం ఇలా : చర్మంపై వచ్చే ముడతల్లోనూ రెండు రకాలుగా చెప్పవచ్చు. తొలుత కాస్త స్పష్టంగా కనిపించే ముడతలను ‘ఫైన్ రింకిల్స్’ అంటారు. ఇవే ముడతలు మరింత లోతుగా, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే వాటిని ‘డీప్ రింకిల్స్’ అంటారు. ఇవి నలభై ఏళ్లు దాటాక మొదట్లో ముడతలు కాస్త కనిపించీ కనిపించనట్లుగా ఉంటూ, ఆ తర్వాత క్రమంగా మరింత లోతుగా మారుతుంటాయి. తొలుత కనిపించీ కనిపించని సమయంలోనే చర్మంపై శ్రద్ధ తీసుకోకపోతే త్వరగానే డీప్ రింకిల్స్గా మారతాయి. జీరోసిస్ లేదా ఏస్టిటోటిక్ డర్మటైటిస్ : ఈ సమస్యనే మామూలు వాడుక భాషలో పొడి చర్మంగా చెప్పవచ్చు. ఈ సమస్య ముందుగా కాళ్లలోని మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. దుస్తులు కప్పని భాగాల్లో ఈ సమస్య కొంత స్పష్టంగా కనిపిస్తుంది. ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ : చర్మానికి రంగును ఇచ్చే కణాలు మెలనోసైట్స్ తగ్గడం వల్ల ఒంటి రంగు పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్స్పాట్స్ లేదా సోలార్ లెంటిజీన్స్ అంటారు. చర్మం సూర్యరశ్మికి ఎక్స్΄ోజ్ అయ్యేచోట ఇవి ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ ఎలాస్టోసిస్ : సూర్యరశ్మి నేరుగా తగిలే భాగాల్లో చర్మం కాస్త మందంగా మారినట్లుగా (లెదరీగా) ఉండటం, పగుళ్లువారినట్లుగా కనిపించడం జరుగుతుంది. ఈ సమస్య ఎండలో పనిచేసే వారిలో అంటే రైతులు, ఎండలో పనిచేసే కార్మికులు, నావికుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సెబోరిక్ కెరటోసిస్ : చర్మంపై కందిగింజ పరిమాణంలో (ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన) గోధుమరంగు (బ్రౌన్)లో మచ్చలు వస్తాయి. వాటినే సెబోరిక్ కెరటోసిస్ అంటారు. హైపోథెర్మియా : హైపోథెర్మియా అనే కండిషన్లో సబ్ క్యుటేనియస్ పొరలో ఓ మార్పు వస్తుంది. స్వేదగ్రంథుల సామర్థ్యం తగ్గిపోతుంది. చర్మం మందం కోల్పోయి పలచబారుతుంది. దాంతో ‘హై΄ోథెర్మియా’ కండిషన్ ఉన్నవారు – వాతావరణంలో చలి ఎక్కువగా ఉంటే సాధారణ వ్యక్తుల కంటే చలిని చాలా ఎక్కువగా ఫీలవుతారు. అలాగే ఉష్ణోగ్రత కొద్దిపాటి పెరిగినా వెంటనే ఎండదెబ్బకు గురవుతారు. స్కిన్ ట్యాగ్స్ లేదా యాక్రోకార్డాన్స్ : చర్మం వదులుగా మారి – మెడలు, బాహుమూలాల వద్ద పులిపిర్లలా కాయల్లా కనిపిస్తాయి. తొడల వద్ద కూడా కనిపిస్తాయి. అదనపు చర్మంలా ΄÷డుచుకు వచ్చినట్లుగా పులిపిర్ల (ఔట్గ్రోత్స్) లాగా కనిపిస్తాయి. ఎయిర్బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ : వయసు పైబడుతున్న కొద్దీ చర్మానికి అలర్జీలు వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. అంతేకాదు అలర్జీలు చాలా తేలిగ్గా కూడా వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా (పార్థీనియం వంటివి) చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు. పర్ప్యూరా అండ్ హిమటోమాస్ : చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారడం వల్ల (ఫ్రాజైల్గా మారడం వల్ల) అవి తేలిగ్గా చిట్లవచ్చు. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా చర్మం లోంచి బయటకు కనిపిస్తుంది. దాన్ని ‘సెనైల్ పర్ప్యూరా’ అంటారు. రక్తం పేరుకు΄ోవడంతో అక్కడ చర్మం కాస్త ఉబ్బుగా కనిపిస్తుంటే దాన్ని హిమటోమా అని అంటారు. కెరటో ఆకాంథోమా : వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో క్యాన్సర్కాని కొన్ని కాయలు (నాన్ క్యాన్సరస్ స్కిన్ గ్రోత్స్) కనిపిస్తాయి. అవి చాలా పెద్దగా ఉండి, చుట్టూ ఎత్తుగా ఉన్నా మధ్యలో గుంటలా ఉంటాయి. న్యూరోడర్మటైటిస్ : ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉండే లక్షణాలతో వ్యక్తమయ్యే సమస్య ఇది.చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్లువయసు పైబడుతున్నకొద్దీ చర్మం ఇన్ఫెక్షన్స్కు తేలిగ్గా గురవుతుంది. ఆ ఇన్ఫెక్షన్లు ఇవి...బ్యార్టీరియా వల్ల –ఫాలికులైటిస్, సెల్యులైటిస్ ఫంగస్ వల్ల–క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్ ఇన్ఫెక్షన్స్ వైరస్ వల్ల–జోస్టర్ఇన్ఫెస్టేషన్స్ వల్ల–గజ్జి (స్కేబిస్) వంటివి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు తమలోని వ్యాధి నిరోధక వ్యవస్థ తమ సొంత కణాలనే శత్రుకణాలుగా భావించడం వల్ల వచ్చే వ్యాధులనే ఆటో ఇమ్యూన్ వ్యాధులుగా చెబుతారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఒక ఉదాహరణగా సోరియాసిస్ను చెప్పవచ్చు. సోరియాసిస్ : వయసు పెరుగుతున్న కొద్దీ సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి మొదట పొడిగా ఆ తర్వాత వెండిరంగు ΄÷ట్టు రాలుతున్నట్లుగా లక్షణాలు కనిపిస్తాయి. చర్మ కేన్సర్లు : చర్మ క్యాన్సర్లు కాస్త అరుదుగా వచ్చేవే అయినప్పటికీ... పెరుగుతున్న వయసు వాటికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి క్యాన్సర్ వచ్చే అవకాశాలూ పెరుగుతాయి. వయసు పెరుగుతున్న వారిలో బేసల్ సెల్ ఎపిథిలియోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా వంటి క్యాన్సర్స్లు కనిపించవచ్చు. జాగ్రత్తలువయసును ఆపలేకపోయినా... కొన్ని జాగ్రత్తలతోనూ, సూచనలతో పాటు మంచి పోషకాహారం, వ్యాయామాలతో... వయసుతో పాటు వచ్చే దుష్ప్రభావాలను చాలావరకు ఆపవచ్చు. వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలాకాలం పాటు చర్మాన్ని ఏజింగ్ తాలూకు లక్షణాల నుంచి సంరక్షించుకోవచ్చు. అవి... బాగా సుగంధభరితమైన సబ్బులు వాడకపోవడం. మైల్డ్ సోప్స్ మాత్రమే వాడటం బాత్ ఆయిల్స్ను వాడకపోవడం. బాత్ ఆయిల్స్తో, సుగంధభరితమైన సబ్బులతో అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఎండలోకి వెళ్లేప్పుడు తగినంత ఎస్పీఎఫ్ ఉన్న సస్స్క్రీన్ లోషన్స్ వాడటం. (చలికాలంలోనూ వీటిని వాడటం మానుకోకూడదు) మాయిశ్చరైజేషన్ లోషన్స్తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవడం శరీరాన్ని దాదాపుగా కప్పి ఉంచే మంచి సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం అవసరాన్ని బట్టి క్యాప్ లేదా బ్రిమ్డ్ హ్యాట్ వంటివి వాడటం అన్ని రకాల పోషకాలూ ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవడం. పెరుగుతున్న వయసుతో చర్మంపై ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం చాలాకాలం ఆరోగ్యంగా, ఏజింగ్కు గురికాకుండా ఉంటుంది. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి ఆహారంతోపాటు తగినంత ద్రవాహారం తీసుకుంటూ శరీరంలోని లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్కు గురికాకుండా) చూసుకోవడం పొగతాగే అలవాటును తక్షణం మానేయడం. (ఈ అలవాటు వల్ల కాలం గడిచేకొద్దీ ఏజింగ్ వల్ల చర్మంపై వచ్చే దుష్ప్రభావాలు చాలా వేగంగా వస్తాయి) గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం. (స్నానం చేసే విషయంలో గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మనం స్నానానికి వాడే నీటి ఉష్ణోగ్రత... మన శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉండటం మంచిది) ∙చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్కు వెంటనే చికిత్స తీసుకోవడం. (నిర్లక్ష్యం చేస్తే అవి మరిన్ని ఇతర సమస్యలకు దారితీయవచ్చు) డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం ద్వారా పెరిగే వయసుకు అతీతంగా చాలాకాలం పాటు యంగ్గా కనిపించవచ్చు.డాక్టర్ కొప్పిశెట్టి సత్య నాగ రవితేజ, సీనియర్ డర్మటాలజిస్ట్ (చదవండి: ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులవైపు యువత అడుగులు..)

అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్
భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్ చేసి ఎయిరిండియా ఇమేజ్ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫొటోలు
అంతర్జాతీయం

శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. నాసా కీలక ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్రకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్లో భాగంగా జూన్25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. శుభాంషు శుక్లా రోదసీ యాత్ర ఇప్పటివరకు ఐదు సార్లు వాయిదా పడింది. మొదట ఇది మే 29న జరగాల్సి ఉండగా, ఆ తర్వాత జూన్ 8, జూన్ 10, జూన్ 11, మరియు జూన్ 19 తేదీలకు మారింది. జూన్ 11న జరగాల్సిన ప్రయోగానికి ముందు ఫాల్కన్-9 రాకెట్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజీ కారణంగా మళ్లీ వాయిదా పడింది.ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల అనంతరం ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 14 రోజుల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్తవేత్తలు ఈ నలుగురు వ్యోమగాములతో సంభాషించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే విజయవంతమైతే, శుభాంషు శుక్లా ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోతారు. భారత్కు ఏం ప్రయోజనమంటే.. గగన్యాన్ ప్రాజెక్టుకు పునాదిఈ మిషన్ ద్వారా శుభాంషు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) 14 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. ఇవి భారత గగన్యాన్ మిషన్కు అవసరమైన అనుభవాన్ని ఇస్తాయి. ఇస్రోకు అంతర్జాతీయ అనుభవంనాసా, యాక్సియమ్ స్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఇస్రోకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ సహకారానికి దారితీస్తుంది. శాస్త్రీయ ప్రయోగాలుశుభాంషు నిర్వహించే ప్రయోగాలు మైక్రోగ్రావిటీలో కండరాల నష్టం, పంటల సాగు, టార్డిగ్రేడ్స్ (వాటర్ బేర్స్) జీవన విధానం, కంప్యూటర్ స్క్రీన్ల ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెడతాయి. ఇవి ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం రంగాల్లో కొత్త అవగాహనను తీసుకురాగలవు. భారత యువతకు ప్రేరణ1984లో రాకేశ్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.. భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయం కూడా.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన

సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించిన కొద్దిపేపటికే టెహ్రాన్ దానిని ఖండించింది. దీనిపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని పేర్కొంది. అయితే తమ సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్ సంధి దిశగా మొగ్గుచూపుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయిని విశ్లేషకులు అంటున్నారు.ఇరాన్ మంత్రి అరఘ్చి ఒక ప్రత్యేక పోస్ట్లో ఇజ్రాయెల్పై టెహ్రాన్ తన సైనిక కార్యకలాపాలను ముగించిందని అన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఢీకొడుతూ తమ శక్తివంతమైన సాయుధ దళాల సైనిక కార్యకలాపాలు చివరి నిమిషం వరకు, అంటే ఉదయం 4 గంటల వరకు కొనసాగాయన్నారు. ఇరానియన్లందరితో కలిసి, దేశాన్ని రక్షించుకునేందుకు సైన్యం చివరి వరకూ పోరాడిందని, శత్రువుల దాడిని చివరి నిమిషం వరకు తిప్పికొట్టిన దళాలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.ట్రంప్ తాజాగా 12 రోజుల ఘర్షణల అనంతరం ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించారు. ఈ కాల్పుల విరమణ ఉదయం 9:30 (ఐఎస్టీ) నుండి ప్రారంభమై 24 గంటల పాటు దశల వారీ ప్రక్రియగా ఉంటుందని, ఇరాన్ ఏకపక్షంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా అదే బాటలో నడుస్తుందని ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ ఇంకా ఈ కాల్పుల విరమణ వాదనలపై స్పందించలేదు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో జతకట్టిన అమెరికా.. ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలను ధ్వంసం చేసిన దరిమిలా ఈ యుద్ధంలో వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణను ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై మండిపడింది. అయితే ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఇరాన్ వైపు నుంచి జరగలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.అయితే ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ ప్రజలపై తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను ఉదయం నాలుగు గంటలలోపు ఆపితే, ఆ తర్వాత మా ప్రతిస్పందనను కొనసాగించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని మిస్టర్ అరఘ్చి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?

యుద్ధం ముగిసింది.. ఇరాన్-ఇజ్రాయెల్ వార్పై ట్రంప్ కీలక ప్రకటన
కాల్పుల విరమణను ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజలు యుద్ధానికి ఇది ముగింపు.. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయన్న ట్రంప్.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు.కాగా, కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది.
జాతీయం

ప్రతిపక్షాన్ని చులకన చేస్తే ప్రజలు సహించరు
రాయిచూర్: ప్రతిపక్ష పార్టీలను అల్పంగా భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరిని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏర్పాటైన అఖిలపక్ష భేటీకి రెండు సందర్భాల్లోనూ ప్రధాని మోదీ రాకపోవడం ప్రతిపక్షాలంటే ఆయనకున్న గౌరవం ఏపాటిదో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న నాయకులంతా రాగా, ప్రధాని మోదీ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. బదులుగా బిహార్లో ఎన్నికల ప్రచార ర్యాలీకి వెళ్లారని ఎత్తి చూపారు. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించరని, ముఖ్యంగా దేశ యువత సహించబోదని ఆయన హెచ్చరించారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని రాయిచూర్లో సోమవారం జరిగిన బహిరంగం సభలో ఖర్గే ప్రసంగించారు. ‘కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. ప్రతీకారంగా మన సైన్యం పాక్ భూభాగంపై దాడి జరిపి ఉగ్రవాదులను ఏరిపారేసింది. యావత్తూ దేశం, సైనిక బలగాలు ఏకమై దేశానికి రక్షణగా నిలవగా, కొందరు వ్యక్తులు మాత్రం ఇదంతా తమ ఘనతేనని చెప్పుకుంటున్నారు’అని ఖర్గే పేర్కొన్నారు. ఆ వ్యక్తులు ఆర్మీలో కెపె్టన్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన వారైతే దేశం కోసం పోరాడినందుకు గాను మనం ప్రశంసించి ఉండేవారం. కానీ, అలాంటిదేమీ లేకుండానే గొప్పలు పోతున్నారు’అని మోదీ సర్కారుపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. మళ్లీ ట్రంపే అమెరికా అధ్యక్షుడిగా రావాలంటూ అమెరికాలో నినదించిన ప్రధాని మోదీ..మన వస్తు వులపై భారీగా ట్యాక్సులు విధించినా ఒక్క మాటకూడా మాట్లాడలేదని ఆరోపించారు.

గడ్డి తినిపించారు..
బరంపురం: పశువులను దొంగతనంగా రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు దళితులను తీవ్రంగా కొట్టి, సగం గుండు గీయించి, మోకాళ్లపై నడిపించడంతోపాటు గడ్డి తినిపించారు. ఈ దారుణం ఒడిశాలోని గంజాం జిల్లా ధారకొటే పోలీస్స్టేషన్ పరిధిలోని ఖారిగుమ్మ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సింగిపూర్కు చెందిన బాబులా నాయక్(54), బులు నాయక్(42)లు హరియూర్ గ్రామం నుంచి ఒక ఆటోలో రెండు ఆవులు, ఆవుదూడను తీసుకువస్తున్నారు. వీరిని ఖారిగుమ్మ గ్రామానికి చెందిన ‘గో పరిరక్షకులు’కొందరు అడ్డుకున్నారు. వాటిని తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని బాబులా చెప్పగా కొట్టిపారేశారు. దొంగతనం చేశారంటూ వారిపై నెపం వేశారు. రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితులు తిరస్కరించారు. దీంతో, వారిని తీవ్రంగా కొడుతూ నానా దుర్భాషలాడారు. సెలూన్కు తీసుకెళ్లి సగం జుత్తు గొరిగించారు. కిలోమీటర్ల దూరం వారిని మోకాళ్ల మీద నడిపించారు. మురుగు కాల్వలో నీటిని తాపించారు. గడ్డి తినిపించారు. కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నామని ఎస్పీ సువేందు కుమార్ పాత్ర తెలిపారు. వారు గో పరిరక్షకులు కాదు, బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు మాత్రమేనని ఆయన అన్నారు.

అధిక బరువును మోస్తున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో స్థూలకాలయం పెను సమస్యగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలను అధిక బరువు, ఊబకాయం పట్టిపీడిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్(ఎన్సీఐసీపీఆర్) సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబంలోని వయోజనులంతా అధిక బరువుతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. దాదాపు 20 శాతం కుటుంబాలకు అధిక బరువు సమస్యగా పరిణమించింది. 10 శాతం మంది స్థూలకాయంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అధ్యయనం నివేదించింది. మణిపూర్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లోని 30శాతం కంటే ఎక్కువ కుటుంబాల్లో దాదాపు పెద్దలందరూ అధిక బరువుతో ఉన్నారు. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రతి ఐదింట రెండు కుటుంబాల్లో పెద్దలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవల తమిళనాడు హెల్త్ జర్నల్లో సంబంధిత అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల్లో అధిక బరువు, ఊబకాయం సమస్యల వివరాలను అధ్యయనం వెల్లడించింది. సంపన్న ప్రాంతాలలో ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగ వర్గాలలో 12.2 శాతం వరకు ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. పట్టణ కుటుంబాల్లో దాదాపు 15 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 8 శాతంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణ రాష్ట్రాలు స్థూలకాయానికి సంబంధించి హాట్స్పాట్లుగా అవతరించాయి. పట్టణ ప్రాంతాల్లో 30 శాతం కంటే ఎక్కువ పెద్దలు అధిక బరువు కలిగి ఉన్నారని అధ్యయనంలో గుర్తించారు. తమిళనాడులో 24.4 శాతం, పంజాబ్లో 23.5 శాతం కుటుంబాల్లోని పెద్దలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో అత్యధికంగా పుదుచ్చేరిలోని 25.2 శాతం కుటుంబాల్లో పెద్దలందరిలో ఊబకాయం పెద్ద విపత్తుగా తయారైంది. ధనిక వర్గాలు, నగర ప్రాంతాలు, ఆధునిక జీవన విధానం ఉన్న రాష్ట్రాలు ఎక్కువ ఒబెసిటీ, అధిక బరువు సమస్యకు ప్రభావితమవుతున్నాయి. ఈ ధోరణి మారుతున్న జీవనశైలికి కారణమని అధ్యయనం పేర్కొంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉండడం, ఆహార శైలి మార్పు, శారీరక శ్రమ లేకపోవడం, ఆధునిక జీవనశైలి వంటి అంశాలు అధిక బరువు, ఊబకాయానికి ప్రధాన హేతువులవుతున్నాయి. ప్రతీ నాలుగు ధనవంతుల కుటుంబాల్లో ఒక కుటుంబంలోని వారందరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. దేశంలోని 17.3 శాతం సంపన్న కుటుంబాల్లో ఊబకాయం ఇబ్బంది పెడుతోంది. షెడ్యూల్డ్ జాతుల (ఎస్టీ) వారిలో ఊబకాయం అత్యల్పంగా 4.2 శాతం మాత్రమే నమోదైంది.

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ కీలక పురోగతి
షిల్లాంగ్: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో పురోగతి సాధించారు. పెళ్లైన 11 రోజులకే తన భర్త రాజా రఘు వంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీ పాటు ఇతర నిందితుల సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిట్ దర్యాప్తులో సోనమ్కు సహకరించిన ప్లాటు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత నిందితులు ఇండోర్లో ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్ యజమాని ఓ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ యజమాని లోకేంద్ర తోమర్. అయితే, సోనమ్ ఉండేందుకు అద్దె ఇల్లు చూపించిన ప్రాపర్టీ డీలర్ సలోమ్ జేమ్స్ను పోలీసులు ప్రశ్నించడంతో లోకేంద్ర తోమర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల దర్యాప్తులో సోనమ్ అద్దెకు ఉన్న ఇంటి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, ఆమె ఫోన్, రాజా నగలు, ఐదు లక్షల రూపాయల నగదును తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.అంతేకాదు, జేమ్స్ చెప్పిన వివరాల మేరకు.. సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కొద్ది సేపటికే తోమర్.. జేమ్స్కు ఫోన్ చేశారు. సోనమ్ అద్దెకు ఉన్న ప్లాట్లో ఓ బ్యాగ్ ఉందని, వెంటనే దాన్ని తీసేయాలని కోరాడు. కానీ జేమ్స్ ఆ బ్యాగ్ను తీయించలేదు. అందుకే తమర్ ఆ బ్యాగ్ను తీసుకున్నాడు.తన ఫ్లాట్ సమీపంలోని కార్ షోరూమ్లోని సీసీటీవీ ఫుటేజ్ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇండోర్లో అతని ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని వర్గాలు తెలిపాయి. Just take a look at this wedding video of Sonam and Raja Raghuvanshi and you will agree that Sonam was clearly not happy with this marriage. Raja Raghuvanshi would have been alive if Sonam had said No to the marriage. She had the courage to hire contract killers but didn't had… pic.twitter.com/NbHlQQWzXK— Incognito (@Incognito_qfs) June 9, 2025
ఎన్ఆర్ఐ

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్)

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.
క్రైమ్

నా భర్త భాస్కర్ వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నాడు..!
నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్కి చెందిన చాపల భాస్కర్ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్ మోస్ట్ వాంటెడ్గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్నగర్ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్పై కేసులు నమోదు కావడంతో భాస్కర్ను మహబూబ్నగర్ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.⇒ వికారాబాద్ పోలీస్స్టేషన్ నుంచి చాపలి భాస్కర్ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్ను ఓ ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..స్పృహలో లేని భాస్కర్ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్ మృతదేహాన్ని వికారాబాద్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చాపలి భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్ అయినప్పటికీ భాస్కర్ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది.

కుటుంబం ఆత్మాహుతికి యత్నం
హుస్నాబాద్ రూరల్: తండ్రి పెడుతున్న మానసిక క్షోభతో ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన హుస్నాబాద్ మండలం కిషన్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. జాగిరి సాయి దంపతులు కిషన్నగర్లో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా సాయి దగ్గరే ఉంటున్నారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకొని హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. తమ తండ్రి తమకు తెలియకుండానే ఇంటి స్థలం మరొకరికి విక్రయించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నాడు. తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందారు. హోటల్పై పెట్రోల్ పోసి నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉండి నిప్పు పెట్టుకున్నారు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి వారిని కాపాడారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగి్నమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. దీనిపై ఎస్సై మహేశ్ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్ రాకపోకలపై నిఘా పెట్టి దారుణహత్యకు భార్య సహస్రనే పూర్తి పథకం రచించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే తెలియగా, సహస్రను తేజేశ్వర్ మందలించినట్టు తెలిసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బ్యాంకు ఉద్యోగికి జరిగిన విషయం చేరవేసింది. ఆయన సూచన మేరకు భర్త బైక్కు జీపీఎస్ ట్రాకర్ను తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది. సుపారీ తీసుకున్న ముఠా సభ్యులు గద్వాలలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా తేజేశ్వర్పై నిఘా పెట్టారు. జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి మూడు దఫాలుగా గద్వాల శివారులో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర, ఆ బ్యాంకు ఉద్యోగి ముఠా సభ్యులను ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్ను ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని పడేశారు. కేసు విచారణ వేగవంతంతేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిందెవరు..ఎంతమంది వచ్చారు.. వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనం.. అసలు తేజేశ్వర్ను వారికి పరిచయం చేసిందెవరు.. ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్తేజేశ్వర్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన, ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ ప్రక్రియను సోమవారం సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్కుమార్, మల్లేశ్, శ్రీకాంత్ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచి పూడూరు, ఇటిక్యాల, మొగిల్రావుల చెరువు శివారు, పెబ్బేర్, బీచుపల్లి ఫ్లై ఓవర్, తుంగభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి కారు డిక్కీలో పెట్టి ఎవరూ లేనిచోట పడేయాలని భావించినట్టు తెలిసింది. అయితే అలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం శివారులో అర్ధరాత్రి పడేసి కారులోంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. హత్యకు ముందే పరిచయం.. తేజేశ్వర్ భార్య సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్ కాగా, కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహం అనంతరం కల్లూరుకు వెళ్లారు. సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగి, చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతం సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తన తల్లితో కలిసి జమిచేడ్కు వచి్చన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంకు ఉద్యోగికి ఈ విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వర్తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగికి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసింది. ఆ తర్వాత సహస్ర.. తేజేశ్వర్ను మళ్లీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసుల అదుపులో అనుమానితులు?పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో సహస్ర, సుజాత, బ్యాంకు ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్ఫార్మర్ ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీనుతో మాట్లాడగా.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని వివరించారు. తాజాగా రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండల శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.