Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

How Chandrababu Nara Lokesh Target Peddireddy Family1
టార్గెట్‌ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్‌ పాలిటిక్స్‌ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్‌ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.● రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్‌ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్‌ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్‌ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.జలయజ్ఞంపై బాబు విషంకృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.ఇప్పుడు తప్పుడు కేసులో..తాజాగా లిక్కర్‌ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.– భరత్‌, ఎమ్మెల్సీ, కుప్పంకుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదుపెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్‌ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.-నూకతోటి రాజేష్‌, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్‌ కేసులో గతంలోనే సిట్‌ ముందు ఎంపీ మిథున్‌రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్‌ఆర్‌ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్‌ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్‌ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.– వెంకటేగౌడ, పలమనేరు మాజీ ఎమ్మెల్యేప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులుఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.– కృపాలక్ష్మి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కక్షగట్టి అరెస్ట్‌ చేశారుమాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్‌ మె యిల్‌ చేసి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తలోకేష్‌ నీకు చిప్పకూడే గతికూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్‌ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.– వీ.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిసాక్షి టాస్క్‌ఫోర్స్‌

Shashi Tharoor Row: Thiruvananthapuram Congress rift deepens2
‘శశిథరూర్‌ మాతో లేరు.. మీటింగ్‌లకు పిలవం’

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ వ్యవహార శైలిపై సొంత పార్టీలో.. అదీ సొంత రాష్ట్రంలోనే తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ తాజాగా పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై థరూర్‌ తన వైఖరిని మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదన్నారు మాజీ ఎంపీ కే మురళీధరన్. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్‌ వ్యాఖ్యానించిన వేళ.. కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే మురళీధరన్‌ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శశిథరూర్‌ తన తీరును మార్చుకునే వరకు.. తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోం. ఆయన మాతో కలిసి లేరు. కాబట్టి.. ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే పుట్టదు. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని మురళీధరన్ అన్నారు. ఇదిలా ఉంటే.. కే మురళి శశిథరూర్‌పై మండిపడ్డడం ఇదే తొలికాదు. ఎమర్జెన్సీ రోజులపై థరూర్‌ రాసిన వ్యాసంపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆయనకు(శశిథరూర్‌ పేరును ప్రస్తావించకుండా) ఏమైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే.. స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు కేరళలోని యూడీఎఫ్‌ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్‌ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్‌ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్‌ అధిష్టానాకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి శశిథరూర్‌ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరేమనుకున్నా తాను బీజేపీలో చేరేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ థరూర్‌ చెబుతూ వస్తున్నారు.

Tamanna Bhatia Breakup With Vijay Varma3
ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది: తమన్నా

పాన్‌ ఇండియా రేంజ్‌లో అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నటి తమన్నా ఐటెం సాంగ్స్‌తో మరింత పాపులర్‌ అయ్యారని చెప్పవచ్చు. రీసెంట్‌గా ఆమె నటించిన ఐటెం సాంగ్స్‌ అంతగా అభిమానుల్లో ప్రభావం చూపాయి. అలాంటి పాటలకు తమన్నా పారితోషికం కూడా బాగానే డిమాండ్‌ చేస్తారనే టాక్‌ ఉంది. ఏకంగా ఒక్కో పాటకు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటారని టాక్‌ ఉంది. 18 ఏళ్ల వయసులోనే నటిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా రాణించిన ఈ ఉత్తరాది భామకు సమీప కాలంలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం కూడా స్వయం కృతాపరాధమే అని చెప్పవచ్చు. కెరీర్లో పెద్దగా వదంతులను ఎదుర్కొనని తమన్నా ఈమధ్య అలాంటి వాటిని ఎదుర్కోవడం గమనార్హం. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమాయణం సాగించిన తరువాతే ఈ మిల్కీ బ్యూటీపై ట్రోలింగ్స్‌ ఎక్కువయ్యాయి. విందుకు వినోదాలకు ఈ జంట కలిసి తిరగడమే ఇందుకు కారణం. అయితే, చాలామంది నటిమణులు ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు తమన్నా కూడా ఎదుర్కొంటున్నారు. తను ప్రేమించిన విజయ్‌వర్మ నుంచి విడిపోవడం వంటి వార్తలు ఇందుకు కారణం. వారిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారని సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఆపై వారు జంటగా ఈ మధ్య ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అనే సంకేతాన్ని ఇస్తున్నాయి.కాగా ఇటీవల ఈమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో కొన్ని ఫొటోలను, వీడియోలను పోస్ట్‌ చేసి వేదాంతపు వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రతి తప్పు పాఠాన్ని నేర్పిస్తుంది. మెరిసే ప్రతి వస్తువు వెనుక ఒక మెరవని కార్యం ఉంది. నిర్ణయాలు, సంతోషాలు ఇవే ఆ కార్యాలు. అంటూ చెప్పిన ఈ బ్యూటీ మరోసారి ఇలా చెప్పింది 'జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దని ఆమె కోరారు. దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలి' అన్నారు. మొత్తం మీద ఈమెకు ఏదో ఒక అనుభవం పెద్ద పాఠాన్నే నేర్పించిందని అర్థమవుతోంది. అది ప్రేమలో విఫలం కావడమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద తమన్న ఆమధ్య కొంచెం బరువెక్కి ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా తయారైంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో తెలుగులో ఒక చిత్రం ,హిందీలో ఒక చిత్రం, మరో వెబ్‌ సిరీస్‌ ఉన్నాయి.

Key changes in H 1B visa rules: Visas issued based on salary and status4
హెచ్‌–1బీ వీసాకు కొలువుతో లింకు!

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్‌ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్‌ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్‌–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు. ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్‌ సర్కార్‌ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్‌ సర్కార్‌ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్‌ ఆధారంగా హెచ్‌–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ ఫర్‌ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్‌–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్‌–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్‌ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్‌ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సరీ్వసెస్‌ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్‌ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్‌–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు.

Chandrababu govt Conspiracy exposed in illegal liquor case Mithun Reddy5
బాబు కుతంత్రం..‘అప్రూవర్‌’ తంత్రం

భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్‌షీట్, రిమాండ్‌ రిపోర్ట్‌లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్‌ ఇన్వాయిస్‌లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్‌ టవర్‌ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్‌ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్‌ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కేసులో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్‌ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సిట్‌ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. ఆ ఇద్దరూ సిట్‌ చీఫ్‌తో భేటీరాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్‌ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్‌ దిగ్గజ సంస్థ వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్‌(ఏ3)­లను బెదిరించి, అప్రూవర్‌లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్‌ కార్యాలయానికి వెళ్లారు. సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజ­శేఖర్‌బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశ­మయ్యారు. అనంతరం కొందరు సిట్‌ అధికారు­ల­తో కలసి న్యాయస్థానంలో అప్రూవర్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగ­డగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్‌ పిటిషన్‌ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నాటకం వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌ అప్రూవర్‌ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్‌ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్‌ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్‌ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభు­త్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరి­ణా­­మా­లు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్‌బుక్‌ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల­పైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.⇒ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితో­పాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్‌ అధికారులు వేధించారు. సిట్‌ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్‌ ముగిసినా రిలీవ్‌ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్‌ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్‌ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్‌ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్‌ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్‌ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌ రెడ్డిపై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్‌ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు కూడా.⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్‌ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.అబద్ధాలూ.. వక్రీకరణలే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్, ఎంపీ మిథున్‌ రెడ్డి రిమాండ్‌ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్‌ యత్నిస్తోందని ఎంపీ మిథున్‌ రెడ్డి రిమాండ్‌ నివేదిక వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్‌ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్‌ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్‌ రిమాండ్‌ నివేదికలో పేర్కొంది. అందుకు సిట్‌ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్‌టవర్‌ లొకేషన్‌! హైదరాబాద్‌లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్‌ రెడ్డి, ఇతర నిందితుల సెల్‌ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్‌ టవర్‌ లొకేషన్‌ ద్వారా తెలుసుకున్నామని సిట్‌ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సెల్‌ టవర్‌ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్‌ వంటి కాంక్రీట్‌ జంగిల్‌ వంటి మహానగరంలో వేలాది సెల్‌ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా? ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?ఎంపీ మిథున్‌ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్‌ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్‌ అధికారులు రిమాండ్‌ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్‌ అధికారులు సెల్‌ టవర్‌ లొకేషన్, కాల్‌ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్‌షీట్‌ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్‌ ఇన్వాయిస్‌లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్‌ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అవి ఫేక్‌ ఇన్వాయిస్‌లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్‌ ఇన్వాయిస్‌లనీ సిట్‌ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్‌ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది.

Telugu actor Arvind Krishna received the Vegan Voice of the Year award6
వెండితెర యాక్టర్‌.. వీగన్‌ అంబాసిడర్‌..

క్రీడల్లో రాణించాలని సాధన చేస్తున్నాం కదా.. గుడ్లు, పాలు తినాలి.. లేకపోతే బలం ఎలా వస్తుంది? జిమ్‌కి వెళ్తున్నాం.. మటన్, చికెన్‌ తినాల్సిందే.. లేకపోతే వర్కవుట్‌ ఏం చేస్తాం? మజిల్‌ ఎలా బిల్డ్‌ చేస్తాం? అని భావిస్తాం. అయితే ఇవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తున్నారు సినీహీరో అరవింద్‌ కృష్ణ. అంతేకాదు గట్టిగా వాదిస్తున్నారు కూడా.. ఆ గట్టితనమే ఆయనకు వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే ఒక సినిమా నటుడిగా మరోవైపు బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌గా తనను నిలబెట్టిన వీగన్‌ అంతకు మించిన లాభాలే తనకు అందించిందంటున్న అరవింద్‌ కృష్ణ ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘టీనేజ్‌ చదువు మొత్తం అమెరికాలోనే సాగింది. అదే సమయంలో నేను బాస్కెట్‌ బాల్‌ కూడా ఆడేవాడిని. అప్పుడు నేను కూడా చాలా మందిలాగే స్పోర్ట్స్‌లో రాణించాలంటే మటన్, చికెన్, ఎగ్స్‌ తప్పక తినాలని భావించే నాన్‌ వెజిటేరియన్‌నే’. స్లాటర్‌ హౌస్‌ తెచ్చిన ఛేంజ్‌.. నాకు 17ఏళ్ల వయసులో అనుకోకుండా స్లాటర్‌ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులు చూశాక, మూగజీవుల విలాపం.. నాలో అనూహ్య మార్పుకు దారితీసింది. నన్ను పూర్తి వెజిటేరియన్‌గా మార్చేసింది. విచిత్రం ఏమిటంటే.. నాన్‌ వెజ్‌ తిన్నప్పటి కంటే ఆ తర్వాతే నేను ఆటగాడిగా రాణిస్తున్నాననేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి శాఖాహారం వైపు ఆకర్షితుడినయ్యాను. వీగన్‌.. విన్‌ విన్‌.. వీగన్‌ శైలి ఆహారం పరిచయం తర్వాత నా జీవితమే మారిపోయింది. 33 ఏళ్ల వయసులో వీగన్‌గా మారాను. పాలు సహా జంతు సంబంధ ఉత్పత్తులన్నీ మానేశాక.. నా ఆరోగ్యం మెరుగుపడింది. గ్లూటెన్‌కు శరీరంలో చోటు ఇవ్వకపోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. తద్వారా శారీరక సామర్థ్యం పెరిగింది. చర్మం మరింత కాంతివంతగా మారింది.ఆలోచనల్లో వేగం, పదను పెరిగింది. ఇది క్రీడా జీవితానికి బాగా ఉపకరించింది. దీంతో వీగన్యురీ అంబాసిడర్‌ బాధ్యతలు ఆనందంగా స్వీకరించాను. గతేడాది భారత్‌లోనే అతిపెద్ద వీగన్‌ థీమ్‌ సదస్సు జరిగిన వీగన్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం అందుకున్నా. డబుల్‌ రోల్‌లో సక్సెస్‌ఫుల్‌గా.. నటుడిగా రామారావు ఆన్‌ డ్యూటీ, ఏ మాస్టర్‌పీస్, రైజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో వంటి సినిమాలతో పాటు త్వరలో రానున్న అండర్‌ వరల్డ్‌ బిలియనీర్‌ వంటి వెబ్‌సిరీస్‌లతోనూ తగినంత గుర్తింపుతో సంతృప్తిగా ఉన్నాను. దేశంలోనే ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా ఉన్న ఏకైక నటుడిని కూడా. ఇప్పటికీ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటా. నా ఫిజిక్‌ చూసి వీగన్‌ ఫుడ్‌తో ఎలా సాధ్యం అని అడుగుతుంటారు. అయితే ఆ ఫుడ్‌ కాబట్టే ఇలాంటి ఒరిజినల్‌ ఫిట్‌నెస్‌ సాధ్యమైందని చెబుతుంటా. ‘అంతర్జాతీయ బాస్కెట్‌బాల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఐపీఎల్‌ తరహాలో బాస్కెట్‌బాల్‌ పోటీ 3 బీఎల్‌లో పాల్గొన్నా. ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఏకైక భారతీయుడిని కావడం విశేషం. హైదరాబాద్‌ 3 బీఎల్‌ జట్టుకు నాయకత్వం వహించాను. ఇందులో ఇతర దేశాల ఆటగాళ్లు ఉన్నారు. జీవితంలో విజయానికి క్రమశిక్షణ కీలకం. అవి క్రీడలే నాకు నేర్పించాయి. నా క్రీడా నేపథ్యం నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దింది’ అని అరవింద్‌ చెప్పుకొచ్చారు. (చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!)

A huge scam by TDP leaders in nellore7
‘కుబేర’ తరహాలో టీడీపీ నేతల భారీ స్కామ్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కొందరు టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఓ జర్నలిస్టు కలిసి గిరిజనులను అడ్డం పెట్టుకుని ప్రైవేటు బ్యాంకు నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకుని మోసగించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల విడుదలైన కుబేర సినిమాను తలపించే రీతిలో ఈ భారీ స్కామ్‌ జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన 56 మంది గిరిజనుల పేరిట రూ.10.60 కోట్లను టీడీపీ నేతలు కాజేసినట్టు వెలుగులోకి రాగా.. ఈ మొత్తం దాదాపు రూ.20 కోట్లపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నెల్లూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌ ద్వారా జరిగిన ఈ కుంభకోణంలో బ్యాంక్‌ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల్ని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా చూపి.. యాక్సిస్‌ బ్యాంక్‌కు నెల్లూరు, ముత్తుకూరులో బ్రాంచ్‌లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వారిని, కూలి పనులు చేసుకునే వారిని, పశువుల కాపరులను టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఓ జర్నలిస్టు జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్, తదితరులు కలిసి బ్యాంక్‌ రుణాలు ఇప్పిస్తామని నమ్మించారు. వారి నుంచి ఆధార్‌ కార్డులు, ఫొటోలు తీసుకుని బ్యాంక్‌లో ఖాతాలు తెరిపించారు. ఇలా 100 మంది నిరక్షరాస్యులు, అమాయకుల రికార్డులు సేకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు నెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఎంఆర్‌ ఇన్‌ఫ్రా లైన్, గ్లోబల్‌ సొల్యుషన్, క్యాపిటల్‌ ట్రీ సాఫ్ట్‌వేర్‌ పేర్లతో నకిలీ కంపెనీలను సృష్టించారు. కూలీలను, పశువుల కాపరులను ఆ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా చూపించారు. వీళ్లంతా గిరిజనులే. ఒక్కొక్కరికి రూ.75 వేల నుంచి రూ.లక్షకు పైగా జీతాలు ఇస్తున్నట్లు రికార్డులు, పే స్లిప్పులు తయారు చేశారు. వారందరికీ 6 నెలల పాటు జీతాలు చెల్లించినట్టు బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు కూడా సృష్టించారు. వీటిని యాక్సిస్‌ బ్యాంక్‌కు సమర్పించి ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల చొప్పున బ్యాంక్‌ నుంచి రుణం పొందారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్‌ సిబ్బంది ఏ ఒక్క లబ్ధిదారుడితోను నేరుగా మాట్లాడడం, కలవడం, రికార్డులు పరిశీలించడం వంటివేమీ లేకుండానే రుణాలిచ్చేశారు. ఈ విషయాలేవీ లబ్దిదారులకు తెలియకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. 4 నెలల పాటు బ్యాంక్‌ వాయిదాలు చెల్లించిన నకిలీ కంపెనీలు ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేశాయి. రుణం వస్తుందని ఎదురుచూస్తున్న నిజమైన లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు అందడంతో వారు దిగ్బ్రాంతి కి గురయ్యారు. 8 నెలల క్రితమే ఫిర్యాదు అందినా.. ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో నెల్లూరు యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మదన్‌మోహన్‌రావు 2024 డిసెంబర్‌ 12న ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ బ్యాంక్‌లో 56 మంది పేరిట రూ.10.60 కోట్లు రుణాలు పొందినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బ్యాంక్‌ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై బ్యాంక్‌ ఇంతవరకు విచారణ జరపలేదు. 56 మంది పేరిట రూ.10.60 కోట్ల రుణం కాజేసినట్టు ప్రాథమికంగా బయటకు వచ్చినా.. నిందితులు 100 మంది పేరిట రూ.20 కోట్లకు పైగా కాజేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అసలు పాత్రధారులెవరో బయటకు పొక్కనివ్వకుండా టీడీపీ పెద్దలు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. మీడియా ముందుకొచ్చిన బాధితులు మోసపోయిన బాధిత గిరిజనులు ఆదివారం మీడియా ముందుకొచ్చారు. సుమారు 60 మంది తమకు జరిగిన మోసాన్ని యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలయ్య, జిల్లా సంఘం చైర్మన్‌ రాపూరు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు మానికల మురళి, ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర, మహిళ అధ్యక్షురాలు చెంబేటి ఉషతో కలిసి మీడియాకు వివరించారు. పైసా కూడా తీసుకోలేదు నాకు బ్యాంకుల సంగతి తెలియదు. ఇప్పుడు లోన్‌ కట్టాలని బ్యాంకు వాళ్లు చెన్నై నుంచి లాయర్‌ నోటీసులు పంపించారు. కొన్ని నెలల కిందట కొందరు వ్యక్తులు మాకు రుణాలు ఇప్పి­స్తామని ఆధార్‌ కార్డులు తీసుకున్నారు. కానీ, ఏమైందో తెలియదు. ఏనాడూ బ్యాంక్‌కు వెళ్లలేదు. ఇప్పుడు రూ.15 లక్షలు రుణం తీసుకున్నారంటూ మాకు నోటీసులు పంపారు. – చలంచర్ల లక్ష్మీనారాయణ, గిరిజనుడు, చౌకిచర్ల, విడవలూరు మండలం కఠిన చర్యలు తీసుకోవాలి యాక్సిస్‌ బ్యాంక్‌ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. మా జాతి ప్రజలను మోసం చేసిన జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్‌లను వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఫేక్‌ కంపెనీలను సృష్టించి ఎస్సీ, ఎస్టీలను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా చూపించి మోసం చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు మోసగాళ్లను పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేయాలి. బాధితులకు న్యాయం చేయాలి. – కేసీ పెంచలయ్య, అధ్యక్షుడు, యానాదుల సంక్షేమ సంఘం

Rasi Phalalu: Daily Horoscope On 21-07-2025 In Telugu8
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.8.36 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: రోహిణి రా.9.04 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.1.34 నుండి 3.04 వరకు, తదుపరి రా.2.21 నుండి 3.51 వరకు, దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: సా.6.04 నుండి 7.35 వరకు, మతత్రయ ఏకాదశి; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 6.33. మేషం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. సోదరులు,సోదరీలతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ.వృషభం... సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. గృహయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.మిథునం.. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నిరాశ తప్పదు.కర్కాటకం.... ఉద్యోగ, విద్యాయత్నాలు అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు. ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి..వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.సింహం.... వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు లక్షా్యలు సాధిస్తారు. పనులు సక్రమంగా సాగుతాయి. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. దూరప్రయాణాలు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.కన్య.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలునత్తనడకన సాగుతాయి.తుల.... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.వృశ్చికం... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు.వాహనయోగం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభవార్తలు.ధనుస్సు... పలుకుబడి పెంచుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం......ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.కుంభం...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు సంభవం.మీనం..ఆకస్మిక ధనలాభం. మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Nitish Kumar Reddy ruled out of Test series due to injury9
నితీశ్‌ రెడ్డి అవుట్‌!

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు గాయాల సమస్య ఎదురైంది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆదివారం జిమ్‌లో ట్రైనింగ్‌ చేస్తుండగా అతను గాయపడ్డాడు. పరీక్షల అనంతరం అతని గాయం తీవ్రత తెలిసింది. సిరీస్‌లో రెండో, మూడో టెస్టు ఆడిన నితీశ్‌ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. లార్డ్స్‌ టెస్టులో 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తం 43 పరుగులు చేశాడు. తొలి టెస్టులో శార్దుల్‌ ఠాకూర్‌ బరిలోకి దిగగా, అతని వైఫల్యంతో అదే తరహా ఆల్‌రౌండర్‌ అయిన నితీశ్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇదే కూర్పుతో తుది జట్టును ఎంపిక చేస్తే మళ్లీ శార్దుల్‌ ఆడే అవకాశం ఉంది. మరోవైపు పేసర్లు ఆకాశ్‌దీప్, అర్ష్ దీప్ సింగ్‌ కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఆకాశ్‌దీప్‌ తొడ కండరాల గాయంతో బాధపడుతుండగా, అర్ష్ దీప్ ఎడమ చేతికి గాయమైంది. రెండో టెస్టులో 10 వికెట్లతో భారత్‌ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌దీప్‌ లార్డ్స్‌ టెస్టులో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో లయను అందుకోలేక ఇబ్బంది పడిన అతను నాలుగో రోజు మధ్యాహ్నమే చికిత్స కోసం మైదానం వీడాడు. బెకెన్‌హామ్‌లో జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొన్నప్పుడు ఆకాశ్‌దీప్‌ అసలు బౌలింగ్‌కే దిగలేదు. మరోవైపు ఇంకా అరంగేట్రం చేయని అర్ష్ దీప్ సింగ్‌ నాలుగో టెస్టుకు దూరం కానున్నాడు. ఆకాశ్‌దీప్‌ ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ బరిలోకి దిగేవాడు. అయితే అతను కూడా అనూహ్యంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలింగ్‌ చేస్తున్న సమయంలో సాయి సుదర్శన్‌ కొట్టిన షాట్‌ను ఫాలో త్రూలో ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతికి గట్టి దెబ్బ తగిలింది. లెఫ్టార్మ్‌ పేసర్‌ అయిన అర్ష్ దీప్ ఆపై చేతికి కట్టుతో వెనుదిరిగాడు. అతని చేతికి కుట్లు వేసినట్లు సమాచారం. ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు... ప్రధాన బౌలర్లు గాయాలబారిన పడటంతో ముందు జాగ్రత్తగా సెలక్టర్లు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అన్షుల్‌ కంబోజ్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందు అన్షుల్‌ భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున రెండు అనధికారిక టెస్టులు ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హరియాణాకు చెందిన అన్షుల్‌ 24 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 79 వికెట్లు తీసి 486 పరుగులు చేశాడు. గత రంజీ ట్రోఫీలో సీజన్‌లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌ పది వికెట్లు (10/49) పడగొట్టి సంచలనం సృష్టించిన అతను...రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

YS Jagan Manohan Reddy condemns illegal arrest of MP Mithun Reddy10
ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్‌ రెడ్డి అక్రమ అరెస్టును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. జరగని లిక్కర్‌ స్కామ్‌ జరిగినట్లు చిత్రీకరిస్తూ.. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నా­రని మండిపడ్డారు. 2014–19 మధ్య జరిగిన అనేక కుంభకోణాల్లో.. తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నా­రని గుర్తు చేశారు. ఆ కేసుల్లో ఆయనతో పాటు ఆయన సన్నిహితులపై దర్యాప్తు నిలిపేయించుకున్న చంద్రబాబు.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మద్యం అంశానికి సంబంధించి వాస్తవాలతో కూడిన సమ­గ్ర నివేదికను జత చేస్తూ ‘ఎక్స్‌’లో ఆదివారం పోస్టు చేశా­రు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారనేది తిరుగులేని సాక్ష్యం ‘వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరఫున పోరాడేవారి గొంతు నొక్కేయడానికి రూపొందించిన కుట్ర తప్ప మరొకటి కాదు. వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిథున్‌ రెడ్డిని బెదిరించి బలవంతంగా సేకరించిన అబద్ధపు వాంగ్మూలాలతో కేసులో అక్రమంగా ఇరికించారు. టీడీపీ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. జరగని మద్యం స్కామ్‌ను జరిగినట్లుగా చిత్రీకరించడం కేవలం మీడియా నాటకాల కోసం.. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు. ఈ కుంభకోణం మొత్తం కేసు ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్‌–డిగ్రీ హింస, లంచాలు, ప్రలోభాలాల ద్వారా సేకరించిన తప్పుడు వాంగ్మూలాలపై సృష్టించిందే. 2014–19 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి అక్రమాలపై కేసులో చంద్రబాబు స్వయంగా బెయిల్‌పై ఉన్నాడనే వాస్తవం.. ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడనేదానికి తిరుగులేని సాక్ష్యం. 2014–19 మధ్య కాలంలో ఆయనపై నమోదైన మద్యం కుంభకోణం కేసును రద్దు చేసుకోవడానికి.. ఇప్పుడు 2024–29 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారన్నది వాస్తవం. ఇలాంటి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నాం వైఎస్సార్‌సీపీని అణచి వేయడానికి ఇలాంటి కుట్రలు జరిగిన ప్రతిసారి మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. ప్రజలతో నిలబడి వారి పక్షాన ప్రశ్నిచడం, పోరాడటం ద్వారా మేము ఎదిగాము. అన్యాయాలపై రాజీలేని పోరాటాలు చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. పైన వివరించిన విధంగా టీడీపీ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై జరిగిన నేరపూరిత దాడి కంటే తక్కువ కాదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా, వైఎస్సార్‌సీపీ ప్రజలతో నిలుస్తుందని, వారి గొంతుకగా, కవచంగా ఉంటుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. మద్యం అంశానికి సంబంధించి సమగ్ర నివేదికను మీ పరిశీలన కోసం జత చేస్తున్నాను.’ గత ప్రభుత్వ విజయాలు అపహాస్యం మద్యం కుంభకోణం విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే.. ప్రస్తుత టీడీపీ కూటమి సర్కార్‌ వైఎస్సార్‌సీపీ రద్దు చేసిన మద్యం అవినీతి పద్ధతులను పునరుద్ధరిస్తోంది. బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌ల పేరుతో మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయి. వేలాది బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను మూసి వేయడం, మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించడం వంటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తుత కూటమి సర్కార్‌ అపహాస్యం చేస్తూ మళ్లీ పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌ షాపులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బ్యాక్‌ డోర్‌ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మద్యం నియంత్రణను బలహీన పరుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌లలో మళ్లీ అవినీతి, మాఫియా ప్రవేశించాయి. ఎంపిక చేసిన డిస్టిలరీలకు ఆర్డర్‌లు ఇవ్వడం ద్వారా 2019లో మేము అమలులోకి తెచ్చిన పారదర్శక ప్రభుత్వ దుకాణాల వ్యవస్థను రద్దు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుచంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్య­లకు రాష్ట్ర సంస్థలను, ఎల్లో మీడి­యా­ను దుర్వినియో­గం చేస్తున్నారు. అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్‌పై ఉన్న కేసుల్లో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మధ్యం కుంభకోణం కూడా ఉంది. అప్పట్లో మద్యం సిండికేటు మాఫియాను పెంచి పోషించి అవినీతిని వ్యవస్థీకరించారు. అధికారంలోకి వచ్చాక, చంద్రబాబునాయుడు తనపై, తన సన్నిహితులపై ఉన్న ఆ తీవ్రమైన అవినీతి కేసుల దర్యాప్తును నిలిపి వేశారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ప్రేరేపితమైన మద్యం కేసును రూపొందించడానికి చంద్రబాబు కుట్ర పన్నాడు. ప్రజల హృదయాల్లో పాతుకుపోతున్నారని..టీడీపీ నిజమైన ఎజెండా ఇప్పుడు స్పష్టంగా ఉంది. దర్యాప్తు ముసుగులో వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేయడానికి, వారిని నిరవధికంగా జైలులో ఉంచడానికి చట్టపరమైన ప్రక్రియను లాగడానికి వారు సిట్‌ను ఉపయోగించాలనుకుంటున్నారు. కానీ.. విచారణ ప్రారంభమైన తర్వాత అసలు నిజం బయట పడుతుంది. ఇది పూర్తిగా చట్టపరమైన అర్హత లేని నిరాధారమైన, రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నది వారు దోషులు కాబట్టి కాదు.. ప్రజల హృదయాల్లో లోతుగా పాతుకుపోతున్నారు కాబట్టి. ఇది చట్టపరమైన ప్రక్రియ కాదు. ఇది బలమైన ప్రతిపక్షాన్ని అస్థిర పరచడానికి ఉద్దేశించి సాగిస్తున్న రాజకీయ వేట.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement