Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YS Jagan Palnadu Rentapalla Visit Updates1
Updates: నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

పల్నాడు పర్యటనకు వైఎస్‌ జగన్‌.. అప్‌డేట్స్‌నాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్‌ జగన్‌రెంటపాళ్లలో వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు విన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌కూటమి అరాచక పాలనలో బలైన తొలి వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావుపోలీసులు, టీడీపీ నేతలతో బలవన్మరణానికి పాల్పడ్డ నాగమల్లేశ్వరరావుబాధిత కుటుంబానికి జగన్‌ పరామర్శఇసకేస్తే రాలనంత..జగన్‌ రాక నేపథ్యంలో జనసంద్రమైన రెంటపాళ్లభారీ గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులురెంటపాళ్లలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌మరికాసేపట్లో నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శరెంటపాళ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌పోటెత్తిన అభిమానుల నడుమ ఆరు గంటల ఆలస్యంగా పర్యటనపోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో కిందటి ఏడాది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్‌నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్‌ పరామర్శజగన్‌ పర్యటన నేపథ్యంలో పచ్చదండు విష ప్రచారంబెట్టింగ్‌ వల్ల చనిపోయాడంటూ నాగమల్లేశ్వరరావు మీద పోస్టులు, వీడియోలు పూర్తి కథనం కోసం 👉నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లిపరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రిఆంక్షల నడుమే రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులుసత్తెనపల్లి గడియారం సెంటర్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్ సత్తెనపల్లి గడియారం సెంటర్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్ వెల్లువులా వచ్చిన ప్రజలు.. జనసంద్రంలా మారిన సత్తెనపల్లివైఎస్‌ జగన్‌కు గజమాలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులుజన ప్రభంజనమైన సత్తెనపల్లికిలోమీటర్ల పొడవునా జనం.. జనంఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనంబైకులు, కార్లలో భారీగా వచ్చిన వైఎస్సార్ సీపీ కేడర్జగన్‌ను చూసేందుకు రోడ్డు పక్కన బిల్డింగులు ఎక్కిన జనంజగన్‌పై అభిమానాన్ని అడ్డుకోలేక పోయిన ప్రభుత్వ ఆంక్షలుపోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు కదులుతున్న జనంఇప్పటికే వేలాదిమందితో నిండిపోయిన రెంటపాళ్లసత్తెనపల్లి నుండి రెంటపాళ్ల వరకు జనమే జనం మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం:మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదంపల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారీకేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు వాహనాలు,కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని కోరిన అంబటి రాంబాబు బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల ఓవరాక్షన్‌ అంబటి రాంబాబుతో వ్వాగాదానికి దిగిన పోలీసులు పల్నాడు..పల్నాడు జిల్లాలోకి వైఎస్‌ జగన్ప్రభంజనంగా మారిన పల్నాడు ఎంట్రన్స్కంటెపూడి వద్ద జనసందోహంవైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన పల్నాడు ప్రాంత మాజీ ఎమ్మెల్యేలుగోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ స్వాగతం..పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కంటెపూడి మేడికొండూరు చేరుకున్న వైఎస్ జగన్భారీగా తరలివచ్చిన తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలుమండుతున్న ఎండలోనూ జగన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వృద్దులుభారీ బైకు ర్యాలీతో జగన్ కాన్వాయ్ ని తీసుకెళ్తున్న యూత్పల్నాడు..పల్నాడు జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్పేరేచర్ల జంక్షన్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్భారీ జనసందోహంతో కిటకిటలాడుతున్న పేరేచర్లజై జగన్, జైజై జగన్ నినాదాలతో మార్మోగుతున్న జంక్షన్అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్జగన్ పర్యటనలో కనపడని పోలీసులు!వైఎస్‌ జగన్‌ పల్నాడు రెంటపాళ్ల పర్యటనపోలీసులమయంగా సత్తెనపల్లి నియోజకవర్గంఆంక్షల పేరుతో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన పోలీసులుకానీ.. జగన్‌ పర్యటనలో కనబడని పోలీసులుజగన్‌ కాన్వాయ్‌కు రోడ్ క్లియర్ చేయని పోలీసులుమాజీ సీఎం హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్జగన్ కాన్వాయ్ కి ముందు కనపడని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీకాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనపడని ఖాకీలుజగన్ కాన్వాయ్‌కి ముందు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేస్తున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని గుంటూరు శివారు నల్లపాడు చేరుకున్న వైఎస్ జగన్జైజగన్ నినాదాలతో మార్మోగుతున్న నల్లపాడుమహిళలు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న నల్లపాడు మిర్చి మార్కెట్ యార్డు దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్న కేడర్జనసంద్రం నడుమ నెమ్మదిగా..కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లుఅడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రంచుట్టుగుంట సెంటర్‌లో జగన్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్‌ జగన్‌ కాన్వాయ్వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్‌పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్మహిళలు, పార్టీ కేడర్‌తో రోడ్లన్నీ ఫుల్రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులుపల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండజగన్‌ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలువైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంఅయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులుపోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలుజగన్‌ వెంటే జనం అని మరోసారి రుజువుచంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్‌కాదు: ఆర్కే రోజాజగన్‌ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందనసీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్నగతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవాల‌ని చూడ‌డం ఏ మాత్రం క‌రెక్టు కాదు మీ ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, ఆయ‌న కుటుంబాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్య‌ర్త‌లు చ‌నిపోయిన‌ప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాల‌ను ప‌రామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్‌సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు జగన్‌ కాన్వాయ్‌ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులుబైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులుపోలీసులతో పార్టీ కేడర్‌ వాగ్వాదంగుంటూరులో జగన్‌కు ఘన స్వాగతంగుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతంభారీగా బైక్ ర్యాలీతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలుజై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్‌పురం రోడ్డుఅడుగడుగునా ఆంక్షలు, అయినా..సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతిజగన్‌ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలునరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలురెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులుఆధార్‌ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనంగ్రామస్తులకు సైతం ఆధార్‌ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులుఅయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానంజగన్‌ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులుకాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నంప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్‌కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ కేడర్సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్‌దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులుమధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేతదారిపొడవునా అభిమానమే.. వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటనగుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్అడుగడుగునా అపూర్వ స్వాగంపార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీభారీగా తరలివచ్చిన కార్యకర్తలుదారిపొడవునా జై జగన్‌.. జైజై జగన్‌ నినాదాలుఏ రోడ్డు చూసినా జగన్‌కు ఉప్పొంగిన అభిమానందారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనంమార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్‌మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్‌ జగన్‌వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటనపోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగన్‌జగన్‌ పర్యటనపై పచ్చ కుట్రలుపర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావుమా బంధువులను కూడా అడ్డుకుంటున్నారుపరామర్శకు అనుమతి తీసుకున్నారుమీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండిఆంక్షలను లెక్కచేయకుంలడా.. జగన్‌ కోసం జనంపల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులుపోలీస్‌ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనంపొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపుఆధార్‌ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడిరెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్‌పోస్టులు పెట్టారు. ప్రతీ రెండు కిలోమీటర్‌కు ఓ చెక్‌పోస్టుపోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌జగన్‌ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం పోలీస్‌మయంగా మారిపోయిన పల్నాడుపల్నాడులో ఇవాళ వైఎస్‌ జగన్‌ పర్యటనసత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్‌సీపీ అధినేత పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావుబాధిత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శజగన్‌ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలుపోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లాసత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులువైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఆంక్షలుజగన్‌ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలుజగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Nagamalleshwara Rao passed away, here what happened that day2
నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..

సాక్షి, పల్నాడు: సత్యం ఊపందుకోకముందే ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం దూరం ప్రయాణించగలదు. అలాంటి ప్రచారాలు ఎల్లో బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మీడియా సంస్థలను, సోషల్‌ మీడియాను మేనేజ్‌ చేయగలిగే వాళ్లు.. ఇప్పుడు జగన్‌ పల్నాడు పర్యటన నేపథ్యంతోనూ తప్పుడు రాతలు, ప్రచారాలతో చెలరేగిపోతున్నారు. ఏడాది కిందట.. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్సార్‌సీపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. అంతే.. పచ్చదండు విషపు రాతలతో రెచ్చిపోసాగింది. బెట్టింగ్‌ యాప్‌ వల్ల చనిపోయాడంటూ సైకో ప్రచారం కొనసాగించింది. ఇది రెంటపాళ్ల గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఆనాడు ఏ జరిగిందంటే.. 2024 జూన్‌ 4న.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. ఆ కాసేపటికే ఆయన్ని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా.. జూన్‌ 5 రాత్రి 10గంటల వరకు పోలీసులు నిర్భంధించారు. అయితే స్టేషన్‌లో ఏం జరిగిందంటే.. ‘‘మన ఇంటిపై దాడి చేస్తున్నారు నాన్నా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఆయన కుమార్తె ఫోన్‌ చేశారు. కుమార్తెతో మాట్లాడుతుండగా ఫోన్‌ లాక్కుని.. నాగమల్లేశ్వరరావును పోలీసులు దుర్భాషలాడారు. గ్రామంలోకి వెళ్ల కూడదని బెదిరించారు. ఒకవేళ తమను కాదని గ్రామంలోకి వెళ్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. గ్రామంలో ఉండకూడదు’’ అని నాగమల్లేశ్వరరావును పోలీసులు భయపెట్టారు. గ్రామంలో ఉంటే కాల్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఆపై జైలు నుంచి బయటకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. తనను పోలీస్‌ స్టేషన్‌లో తీవ్రంగా అవమానించి.. కొట్టారంటూ తండ్రికి ఫోన్‌ చేసి వాపోయారు. ఇలా రెడ్‌బుక్‌ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్‌సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లారు. మరోవైపు.. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగంతో అన్నివిధాల ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం.. చివరకు ఇలా ‘బెట్టింగ్‌ యాప్‌ వల్ల చనిపోయాడంటూ’’ ఐటీడీపీ అండ్‌ కో ద్వారా విషప్రచారానికి దిగజారిపోయింది.

Chevireddy Bhaskar Reddy Angry On Police Behavior3
నోటిసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్‌ చేశారు: చెవిరెడ్డి

సాక్షి, విజయవాడ: పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిస్‌ ఇవ్వకుండానే తనను అరెస్ట్‌ చేశారంటూ మండిపడ్డారు. నిన్న(మంగళవారం) ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది.‘‘నిన్నటి వరకు నాపై ఎఫ్‌ఐఆర్‌ కూడా లేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పా. లుకౌట్‌ నోటీసులు ఎందుకిచ్చారో తెలియదు. విచారణలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. తప్పుడు కేసులను ఎదుర్కొంటా’’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు.కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం...మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు.కాగా.. నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్‌ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా ప్రశ్నించారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్‌ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రాజ్‌ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?. అది నిజం కాదు కనకే కదా? అంటూ ఆయన ప్రశ్నించారు.

Rk Roja Comments On Ys Jagan Rentapalla Tour4
గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వనిస్తోంది : రోజా

సాక్షి,గుంటూరు: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్నారు. కాసేపట్లో రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.అయితే, వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. భారీ కేడ్లు, చెక్‌ పోస్టులతో వైఎస్‌ జగన్‌ అభిమానుల్ని, వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్‌పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు.తమ అభిమాన నాయకుడు రెంటపాళ్లకు వస్తున్నారనే సమాచారంతో సత్తెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు రెంటపాళ్లవైపు కదిలారు. జనప్రభంజనంలా తరలివచ్చారు. వెల్లువలా వచ్చిన ప్రజలతో సత్తెనపల్లి నియోజకవర్గం జనసంద్రంలా మారింది. ప్రభుత్వం ఆంక్షలు సైతం వైఎస్ జగన్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్‌ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైఎస్‌ జగన్‌ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు.“రోడ్లు మూసేశారా? మాకేం!”“పోలీసులు అడ్డుపడుతున్నారా? మాకేం!”మన గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వని మారుతోంది.మన నరాల్లో ప్రవహించే రక్తం, జననేతను ఒక్కసారి చూడాలనే తపనతో ఉప్పొంగుతోంది.అందుకే..పొలాల గట్లే రోడ్లయ్యాయి,పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి,ముళ్ల దారులే హైవేలయ్యాయి.అభిమానులు పోటెత్తారు!“తగ్గేదేలే!” అంటూజగన్‌ను ఒక్క చూపైనా చూడాలన్న ఆశతోఇలా బయలుదేరారు… వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ @ysjagan అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన… pic.twitter.com/StMxCxf2az— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025

Here Is Full Details About Irans Hypersonic Missile Israel Striker Fattah 15
ఇజ్రాయెల్‌-స్ట్రైకర్‌.. ఇరాన్‌ ఫతా ఎంత డేంజరో తెలుసా?

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ ‌సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్‌సోనిక్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ కూడా‌ ‘ఫతా-1 మిస్సైల్స్‌’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. ఫతా(Fattah) హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్‌సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్‌ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్‌సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్‌ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్‌ మీదకు ఫతా హైపర్‌సోనిక్‌ మిస్సైల్స్‌ను ఇరాన్‌ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటు ఇరాన్‌, అటు ఇజ్రాయెల్‌ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్‌ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. హైపర్‌సోనిక్‌ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. ఫతాను 2003లో ఇరాన్‌ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్‌ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట. ఇది హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్‌ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్‌ డోమ్‌, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్‌కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్‌ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్‌-స్ట్రైకర్‌ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్‌ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్‌ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్‌ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ కారణం.

Women T20 World Cup 2026 Schedule announced Ind vs Pak on This Date6
టీ20 ప్రపంచకప్‌-2026 షెడ్యూల్‌ విడుదల

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 (ICC Women's T20 World Cup) షెడ్యూల్‌ విడుదలైంది. ఇంగ్లండ్‌ వేదికగా ఈ ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్‌ 12న తెర లేవనుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.ఈ మెగా ఈవెంట్లో పన్నెండు జట్లు భాగం కానున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు.. గ్లోబల్‌ క్వాలిఫయర్స్‌ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి.ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు.. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీమ్‌లు పోటీపడనున్నాయి.డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్‌కాగా చివరగా 2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి.కాగా ఎడ్జ్‌బాస్టన్‌, హాంప్‌షైర్‌ బౌల్‌, హెడ్డింగ్లీ, ఓల్డ్‌ ట్రఫోర్డ్‌, ది ఓవల్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌, లార్డ్స్‌ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లండ్‌- శ్రీలంక మధ్య మ్యాచ్‌తో జూన్‌ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌తో ముగియనుంది.భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ అప్పుడే..ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. జూన్‌ 14న ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం గ్లోబ్‌ క్వాలిఫయర్‌ నుంచి వచ్చిన టీమ్‌తో జూన్‌ 17న భారత్‌ తలపడుతుంది.ఆ తర్వాత జూన్‌ 21న సౌతాఫ్రికాతో, జూన్‌ 25న క్వాలిఫయర్‌ జట్టుతో, జూన్‌ 28న పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 పూర్తి షెడ్యూల్‌జూన్‌ 12- శుక్రవారం- ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక, ఎడ్జ్‌బాస్టన్‌జూన్ 13- శనివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 13- శనివారం: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 13- శనివారం: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్జూన్‌ 14- ఆదివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఎడ్జ్‌బాస్టన్‌జూన్‌ 14- ఆదివారం: ఇండియా vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్జూన్‌ 16- మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్జూన్‌ 16- మంగళవారం: ఇంగ్లండ్‌ vs క్వాలిఫయర్‌, హాంప్‌షైర్‌బౌల్‌జూన్‌ 17- బుధవారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీజూన్‌ 17- బుధవారం: ఇండియా vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీజూన్‌ 17- బుధవారం: సౌతాఫ్రికా vs పాకిస్తాన్‌, ఎడ్జ్‌బాస్టన్‌జూన్‌ 18- గురువారం: వెస్టిండీస్‌ vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీజూన్‌ 19- శుక్రవారం: న్యూజిలాండ్‌ vs క్వాలిఫయర్‌, హాంప్‌షైర్‌ బౌల్‌జూన్‌ 20- శనివారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్‌, హాంప్‌షైర్‌ బౌల్‌జూన్‌ 20- శనివారం: ఇంగ్లండ్‌ vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీజూన్‌ 21- ఆదివారం: వెస్టిండీస్‌ vs శ్రీలంక, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌జూన్‌ 23- మంగళవారం: న్యూజిలాండ్‌ vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌జూన్‌ 23- మంగళవారం: శ్రీలంక vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌జూన్‌ 23- మంగళవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్‌, హెడ్డింగ్లీజూన్‌ 24- బుధవారం: ఇంగ్లండ్‌ vs వెస్టిండీస్‌, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌జూన్‌ 25- గురువారం: ఇండియా vs క్వాలిఫయర్‌, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 25- గురువారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌జూన్‌ 26- శుక్రవారం: శ్రీలంక vs క్వాలిఫయర్‌, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 27- శనివారం: పాకిస్తాన్‌ vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌జూన్‌ 27- శనివారం: వెస్టిండీస్‌ vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌జూన్‌ 27- శనివారం: ఇంగ్లండ్‌ vs న్యూజిలాండ్‌, ది ఓవల్‌జూన్‌ 28- ఆదివారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్‌, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌.జూన్‌ 28- ఆదివారం: ఆస్ట్రేలియా vs ఇండియా, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌.జూన్‌ 30- మంగళవారం: సెమీ ఫైనల్‌ 1- ది ఓవల్‌జూలై 2- గురువారం: సెమీ ఫైనల్‌ 2- ది ఓవల్‌జూలై 5- ఆదివారం: ఫైనల్‌, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌.చదవండి: గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో

UP Father And Son Selected Constable Job Viral Story Details7
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్‌ జాబ్‌ కొట్టాడు

అతనికి పోలీస్‌ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్‌ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్‌లో) 60 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. ఆ పరీక్షలో యశ్‌పాల్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్‌లో ఆయన కొడుకు శేఖర్‌(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్‌. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్‌పాల్‌ స్వస్థలం హపూర్‌ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్‌పూర్‌ ఉదయ్‌రాంపూర్‌ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్‌ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాడు. రెండు అటెంప్ట్‌లలో జాబ్‌ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్‌ తర్వాత వలంటీర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ విడుదలదైంది. అప్పటికి ఇంటర్‌ పూర్తి చేసిన యశ్‌ పాల్‌ పెద్ద కొడుకు శేఖర్‌ ఈ పరీక్షకు ప్రిపేర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్‌ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్‌ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్‌పాల్‌ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్‌ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్‌ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్‌పాల్‌కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్‌ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృ‍త్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్‌, న్యూమరికల్‌ రీజనింగ్‌ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యారు. లోకల్‌గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్‌తో.. యూపీ కానిస్టేబుల్‌ పరీక్షతో పాటు సీడీఎస్‌, ఎస్సై ఎగ్జామ్‌లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్‌లీక్‌ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్‌ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్‌ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్‌ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్‌ 15వ తేదీన) జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో అమిత్‌షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్‌జహాన్‌పూర్‌కు యశ్‌పాల్‌, బరేలీకి శేఖర్‌ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్‌పాల్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

govt introduced FASTag based Annual Pass priced at Rs 30008
Fastag: వార్షిక టోల్‌ పాస్‌ను ప్రకటించిన కేంద్రం

టోల్‌ గేట్‌ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటివరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా, ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. పాస్‌ యాక్టివేషన్, రెన్యువల్‌ కోసం ప్రత్యేక లింక్‌ను త్వరలో రాజ్‌గార్‌ యాత్ర యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్‌టీహెచ్‌ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు.Important Announcement 📢 🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025ఇదీ చదవండి: ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపదఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. పరిమిత కాలంపాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్‌ గేట్ల వద్ద వెయిటింగ్‌ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది.

MLC Kavitha Chitchat with Media9
‘రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?

సాక్షి,తెలంగాణ: రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్‌18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఒరిగేదేమీ లేదు. డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్‌ ఏసీబీ విచారణ అంతా టైంపాస్‌నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్‌ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్‌ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్‌లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.కేటీఆర్‌పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు.

Mahesh Babu Greets Naga Chaitanya, Sobhita Dhulipala in Akhil Reception10
చై-శోభితను పట్టించుకోని మహేశ్‌? వీడియోతో ఆన్సర్‌ దొరికేసింది!

ఇంట్లో పెళ్లంటే ఆ సందడే వేరుంటుంది. పనులన్నీ ఒక ఎత్తయితే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో రకంగా రెడీ కావడం మరో ఎత్తు. సెలబ్రిటీలు తమ ఇంట జరిగే ఫంక్షన్స్‌లో మరింత స్పెషల్‌గా కనిపించేలా జాగ్రత్తపడతారు. అందరికంటే భిన్నంగా, గ్రాండ్‌గా రెడీ అవ్వాలని తహతహలాడతారు. కానీ అక్కినేని ఇంట్లో మాత్రం అందరూ సింప్లిసిటీ, సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అఖిల్‌- జైనబ్‌ వివాహంలో నాగార్జున (Nagarjuna Akkineni)-అమల, నాగచైతన్య- శోభిత ధూళిపాళ ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారు. శోభితను పట్టించుకోని మహేశ్‌?అయితే రిసెప్షన్‌లో మాత్రం అందరూ ఎవరి టేస్ట్‌కు తగ్గట్లుగా వారు గ్రాండ్‌గానే కనిపించారు. ఈ వేడుకకకు మహేశ్‌బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. మహేశ్‌ మాత్రం సాదాసీదాగా టీషర్ట్‌తో వచ్చేశాడు. అయితే రిసెప్షన్‌ వేడుకలో మహేశ్‌ (Mahesh Babu).. చై-శోభితను పలకరించకుండా ముందుకుసాగిపోయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు.. మహేశ్‌కు సమంత మంచి స్నేహితురాలు అని, ఆమె స్థానంలోకి వచ్చిన శోభిత (Sobhita Dhulipala)తో మాట్లాడటం ఇష్టం లేకే వారిని చూసీచూడనట్లు వెళ్లిపోయాడని ఎవరికి తోచినట్లు వారు కథలు అల్లేశారు.వీడియోతో క్లారిటీకానీ, అసలు విషయమేంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అఖిల్‌ రిసెప్షన్‌కు సంబంధించి తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మహేశ్‌ సతీమణి నమ్రత, సితార.. చై దంపతుల్ని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మహేశ్‌ కూడా.. చైకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి హత్తుకున్నాడు. అనంతరం శోభితను కూడా నవ్వుతూ పలకరించి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. శోభితపై మహేశ్‌ ద్వేషం పెంచుకున్నాడని కామెంట్లు చేసినవారికి ఈ వీడియో చెంపపెట్టు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లినాగచైతన్య - సమంత విషయానికి వస్తే వీరిది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో వీరి పెళ్లి జరిగింది. కలకాలం కలిసుంటారనుకుంటే నాలుగేళ్లకే విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం చై.. గతేడాది డిసెంబర్‌లో శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. అటు సామ్‌ కూడా దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి. కాగా అఖిల్‌- జైనబ్‌.. జూన్‌ 6న పెళ్లి చేసుకోగా జూన్‌ 8న రిసెప్షన్‌ జరిగింది. View this post on Instagram A post shared by Radhika (@the_mahi_dhfm2.0) The adorable glimpse of Yuvasamrat @chay_akkineni & #Sobhita garu shares the warm greetings with Superstar @urstrulyMahesh and #Namratha garu ✨A charming moment at #AkhilZainabReception ❤️#NagaChaitanya #Dhullakotteyala #NC24 pic.twitter.com/LSsmzcZnLw— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) June 17, 2025 చదవండి: అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్‌ హీరోయిన్లకూ అదే దుస్థితి తప్పలేదా?

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement