ప్రధాన వార్తలు

బాబు అరాచకం.. సిట్ గూండాయిజం
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరు. దర్యాప్తు ముసుగులో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్ దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ను కొన్ని రోజులపాటు సిట్ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా చేసిన ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్ రుచి చూపించారు. సిట్ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్రెడ్డి ఆసుపత్రిలో చేరారు. సిట్ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతోసహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్పై ఆంధ్రప్రదేశ్కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడావుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్రగిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందుకోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవిరెడ్డి్డపై ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసుల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మద్యం అక్రమ కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం ఆయన వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూలం కోసం బలవంతం చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, ఆయన సతీమణిని సిట్ అధికారులు విచారణ పేరిట హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్ఫోర్స్: లిక్కర్ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వనందుకు మదన్రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్ కాదా..?⇒ ‘‘సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్ చేయడం లేదు’’ అని సిట్లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.

మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో భర్త అప్పు చెల్లించలేదనే కారణంతో ఒక మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకుల దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు బలైపోతున్నారని మండిపడ్డారు. మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించిన ఫొటోను ట్యాగ్ చేస్తూ మంగళారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘చంద్రబాబూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మ గౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించిన ఘటన.. మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపి విడిచి పెట్టలేదు. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.

G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..
న్యూఢిల్లీ: భారత్-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేందర్ మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలుసుకున్నారు. గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక సమావేశాలతో బలోపేతమవుతాయని భారత్ భావిస్తోంది.ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్న సమయంలో ప్రధాని మోదీ భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవం అని కార్నీ అన్నారు. ఇంధన భద్రత, ఏఐ భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసిపోరాడాలని కెనడా ప్రధాని అన్నారు.ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆల్బెర్టాకు వెళ్లారు. భారతదేశానికి జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ఆహ్వనం మేరకు హాజరయ్యింది. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు బహుళ రంగాలలో కొనసాగుతున్న భాగస్వామ్యాలను తిరిగి గాడిలో పెట్టేందుకు కెనడా.. భారత్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్తో కెనడా సంబంధాలు మరింత దిగజారాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ కెనడాకు వెళ్లడం ఇదే తొలిసారి.నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు కెనడాలో బలోపేతం అయ్యేందుకు అనుమతించిందని ఆరోపించింది. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ఆర్థికవేత్త కార్నీ, ఏప్రిల్లో జస్టిన్ ట్రూడో స్థానంలో ప్రధానిగా అత్యున్నత పదవి చేపట్టారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వాలు పెరుగుతున్న నేపథ్యంలో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనిలో జీ 7 దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ చర్యలను ఖండించాయి.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్తో పాటు ప్రియుడు..

‘ఇరాన్’ పని ఖతం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా కూడా ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్.. ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్కు ట్రంప్ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.ఇరాన్కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు.

సంచలనం.. 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ స్నేహితుడు
భారత క్రికెట్కు మరో చిచ్చరపిడుగు పరిచయమయ్యాడు. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన 13 ఏళ్ల అయన్ రాజ్ కేవలం 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ 30 ఓవర్ల మ్యాచ్లో సంస్కృతి క్రికెట్ అకాడమీకి ప్రాతినిథ్యం వహించిన అయన్.. 134 బంతుల్లో 22 సిక్సర్లు, 41 ఫోర్ల సాయంతో 327 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయన్ బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే 220.89 స్ట్రయిర్రేట్తో 296 పరుగులు చేయడం మరో విశేషం.అయన్ రాజ్ భారత యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దగ్గరి మిత్రుడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు. ఇంకా చిన్న వయసులో ఇద్దరు కలిసి ఆడారు. అయన్ వైభవ్ను ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయన్ను దగ్గరగా చూసిన వారు అతన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు.రికార్డు ట్రిపుల్ సెంచరీ తర్వాత ఎన్డీటీవీ స్పోర్ట్స్తో మాట్లాడిన అయన్ స్నేహితుడు వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని అశాభావం వ్యక్తం చేశాడు. వైభవ్తో మాట్లాడిన ప్రతిసారి ప్రేరణతో కూడిన గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపాడు. వైభవ్ను చూసి ఫోకస్డ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నానని అన్నాడు. వైభవ్ అడుగుజాడల్లో నడిచి తాను కూడా గొప్ప పేరు తెచ్చుకుంటానని తెలిపాడు.తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని..!అయన్ తండ్రి ఓ మాజీ క్రికెటర్ (లోకల్). టీమిండియాకు ఆడాలని అతను కలలు కన్నాడు. అయితే అతని విషయంలో అది నెరవేరలేదు. కొడుకుతోనైనా తన కలను సాకారం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ దిశగా అయన్ను రాటుదేలుస్తున్నాడు. అయన్ కూడా తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తండ్రితో పాటు తల్లి మద్దతుతో కేవలం క్రికెట్పైనే దృష్టి కేంద్రీకరించాడు.వైభవ్ విషయానికొస్తే.. అయన్ కన్నా ఏడాది పెద్దవాడైన వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోని అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఐపీఎల్లో తన మూడో మ్యాచ్లోనే రికార్డు బ్రేకింగ్ సెంచరీ చేసి హేమాహేమీల రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్పై వైభవ్ చేసిన 35 బంతుల శతకం ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం. అలాగే ఐపీఎల్లో భారత ఆటగాడు చేసిన వేగవంతమైన శతకం. ఐపీఎల్ 2025కు ముందు వైభవ్ కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతని స్నేహితుడు అయన్ రాజ్ కూడా అతి చిన్నవయసులోనే పెద్దల క్రికెట్ ఆడే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయన్ ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడటం కొనసాగిస్తే.. భారత క్రికెట్లో వైభవ్ తర్వాత మరో సంచలనం అవుతాడు.

ఈ యుద్ధం.. ప్రపంచానికి పెనుభారం
సాక్షి, నేషనల్ డెస్క్: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో అగ్రశ్రేణి దేశాల్లో ఒకటైన ఇరాన్ నేడు యుద్ధభూమిగా మారింది. పశ్చిమాసియాలో బలీయమైన సైనిక శక్తి కలిగిన రెండు దేశాలు ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. ఈ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, వైమానిక రంగంతోపాటు కీలక రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. భారీగా సంపద హరించుకుపోయింది. సోమవా రం కొంతవరకు కోలుకున్నాయి. మరోవైపు ఆయుధ తయారీ సంస్థలతోపాటు చమురు కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ మారెŠక్ట్ను నమ్ముకోవడం తెలివైన పని కాదన్న ఆలోచనతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు దృష్టి పెట్టారు. వారు తమ సొమ్మును బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. 100 డాలర్లకు ముడి చమురు? ఇరాన్లో ఎప్పుడు యుద్ధం జరిగినా తక్షణమే ప్రభావితమయ్యేది చమురు రంగమే. బ్యారెల్(158.98 లీటర్లు) ముడి చమురు ధర సోమవారం 74.60 డాలర్లకు చేరుకుంది. గురువారంతో పోలిస్తే 7 శాతం పెరిగింది. ఒకవేళ యుద్ధం మరింత ఉధృతంగా మారి, హొర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటేస్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ గోల్డ్మాన్ సాచ్స్ తేల్చి చెప్పింది. ప్రపంచంలో సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో మూడింట ఒకవంతు హొర్మూజ్ జలసంధి గుండానే జరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది.ఇరాన్, గల్ఫ్ దేశాలను వేరుచేసే అతిసన్నని సముద్ర మార్గమైన హొర్మూజ్పై ఆధిపత్యం ఇరాన్దే. ఇజ్రాయెల్తో యుద్ధం తీవ్రస్థాయికి చేరితే హొర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే భారత్, జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాలకు చమురు కష్టాలు తప్పవు. 1980వ దశకంలో ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో హొర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదు. ఈసారి కూడా మూసివేసే పరిస్థితి ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ముడి చమురు ఎగుమతులు ఆగిపోతే ఇరాన్ ఆర్థికగా నష్టపోవడం ఖాయం. పొంచి ఉన్న ద్రవ్యోల్బణ ముప్పు చమురు ధరలు పెరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంతిమంగా ఆ భారం భరించాల్సింది వినియోగదారులే. చమురు కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. వృద్ధిరేటు తగ్గిపోతుంది. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. జీ7 దేశాల్లో కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. విమానయానం మరింత ప్రియం యుద్ధం వల్ల పశ్చిమాసియాలో చాలా దేశాలు ముందు జాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో విమానయాన సంస్థలు తమ విమానాలను కూడా రద్దు చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నాయి. దీంతో వ్యయం పెరుగుతోంది. విమానయానం మరింత ఖరీదుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్వేస్ తదితర సంస్థలు ఇరాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా వంటి దేశాల నుంచి తమ విమానాలు నడపడం లేదు. తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తమ గగనతలం పూర్తిగా మూసి ఉంటుందని ఇరాన్ అధికార వర్గాలు ప్రకటించాయి.

రంగారెడ్డిలో ఎక్కువ.. నిజామాబాద్లో తక్కువ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు దీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (డీలిమిటేషన్) పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్–డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సగటు జనాభా ప్రామాణికంగా...ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పునర్విభజనను జాప్యం చేస్తున్నారంటూ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమాధానమిస్తూ.. కొత్త జనాభా లెక్కలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. కోర్టు కేసుతో సంబంధం లేకుండానే 2027 తర్వాత దేశమంతా పునర్విభజన చేస్తుండటంతో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అనివార్యం కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు 2011 జనాభా లెక్కలతోపాటు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తాజా అంచనాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 9 శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. అవన్నీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న శివారు ప్రాంతాల్లోనే కావటం విశేషం. జాతీయ సగటును మించి, విద్య, ఉపాధి, ఐటీ, ఫార్మా, సినిమా, ఇతర అవకాశాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కు పెరిగిన వలసల తాకిడి కారణంగా నగరంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్లో కనీసం పది అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కోర్సిటీ (హైదరాబాద్ జిల్లా)లో రెండు, గ్రేటర్ హైదరాబాద్లో భాగమైన శివార్లలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కొత్తగా 9 కొత్త నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి.ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్ధితిడీలిమిటేషన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 27,97,370. అయితే, ఆ జిల్లా నుంచి 5 మండలాలు ఏపీలో విలీనం కావటం, కొన్ని మండలాలు ములుగు జిల్లాల్లోకి వెళ్లటంతో జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అయినా, ఆదివాసీ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ జిల్లాలో శాసనసభ స్థానాలు తగ్గించకుండా అదనంగా రెండుస్థానాలు పెంచే అవకాశం ఉంది.డీలిమిటేషన్ ఇలా..– దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటయ్యే కమిషన్ రాజకీయ పక్షాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల మేరకు ఒక మండలం ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లాలో ఉండే విధంగా భౌగోళిక మార్పులు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో కూడా ఉండగా, వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తారు.– రాష్ట్ర మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్న గత కమిషన్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 2,30,064 సగటు జనాభాగా నిర్దారించింది. అయితే ఈ సగటుకు 10 శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువైనా ఉండొచ్చు.– 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాను సగటుగా తీసుకుని డీలిమిటేషన్ చేయటంతో తెలంగాణలో అంతకు ముందు 107 ఉన్న అంసెబ్లీ స్థానాలు 119కి పెరిగాయి. 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయాయి.– డీలిమిటేషన్లో కొండప్రాంతాలు, గిరిజనులు, ఇతర ప్రత్యేక కారణాలను కూడా పరిగణనలోకి తీసుకుని నియోకజవర్గాలు ఏర్పాటు చేస్తారు. కొండలతో, విసిరేసినట్లు ఉండే హిమాచల్ప్రదేశ్లోని లాహోల్ – స్పితి అసెంబ్లీ నియోజకవర్గం 25 వేల జనాభాతోనే ఏర్పాటైంది. సిక్కింలోని సాంగ్మో అసెంబ్లీ స్థానం సైతం తక్కువ జనాభాతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 6,98,000 మందితో అత్యధిక జనాభా కలిగిన శాసనసభ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి రికార్డుకెక్కింది. ఢిల్లీలోని చాందినీచౌక్, యూపీలోని ఘజియాబాద్లు సైతం జనాభా పరంగా అదిపెద్ద నియోజకవర్గాలే.

కొత్త ఆరంభానికి సిద్ధం
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 19 సిరీస్లు ఆడితే 14 సిరీస్లలో పరాజయమే పలకరించింది. రెండు సిరీస్లు సమంగా ముగియగా మూడుసార్లు భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే పాత రికార్డుల్లోకి వెళ్లకుండా గత మూడు సిరీస్లనే చూసుకుంటే టీమిండియా ప్రదర్శనలో అక్కడక్కడ చెప్పుకోదగ్గ మెరుపులు ఉన్నాయి. చివరిసారిగా 2021–22లో పర్యటించిన సమయంలో ఐదు టెస్టుల సిరీస్ను 2–2తో ‘డ్రా’ చేసుకోవడం మన జట్టు మెరుగైన ప్రదర్శనకు సూచిక.అంతకుముందు రెండు పర్యటనల్లో రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచిన రికార్డు అంకెల్లో కనిపిస్తున్నా... భారత్ చాలా సందర్భాల్లో పైచేయి సాధించింది. దురదృష్టవశాత్తూ కీలక క్షణాల్లో పట్టు తప్పడంతో మ్యాచ్లు చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్లో శుబ్మన్ గిల్ బృందం పట్టుదలను, పోరాటపటిమను ప్రదర్శిస్తే ఇంగ్లండ్తో గట్టి పోటీనివ్వడం ఖాయం. అంచనాలకు అనుగుణంగా రాణిస్తే సిరీస్ ఏకపక్షంగా సాగకుండా ఇంగ్లండ్ను టీమిండియా నిలువరించవచ్చు. –సాక్షి క్రీడా విభాగం ప్రస్తుతం సిరీస్కు సిద్ధమైన జట్టులో ఇంగ్లండ్ గడ్డపై అనుభవంరీత్యా చూస్తే రవీంద్ర జడేజాఅందరి కంటే సీనియర్. గత మూడు సిరీస్లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరమైన స్థితిలో జడేజా అనుభవం జట్టుకు కీలకం కానుంది. కేఎల్ రాహుల్, బుమ్రా, రిషభ్ పంత్ ఇంగ్లండ్లో గత రెండు సిరీస్లు ఆడగా... కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్లకు కూడా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో ఆడటాన్ని పక్కన పెడితే మిగతా ప్లేయర్లంతా అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి ఇంగ్లండ్లో బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడున్న జట్టును చూస్తే స్టార్ అంటూ ఎవరూ లేరు. మున్ముందు సిరీస్లో ఇదే భారత్కు సానుకూలాంశం కూడా కావచ్చు. ఒక్కొక్కరి వ్యక్తిగత ఆటపై కాకుండా టీమిండియా సమష్టి ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా ఈ సిరీస్ సవాల్గా నిలవనుంది. బ్యాటర్గా ఇంగ్లండ్ గడ్డపై పేలవమైన రికార్డు (5 టెస్టుల్లో కలిపి 127 పరుగులు) ఉన్న గంభీర్ కోచ్గా తన వ్యూహాలకు పదును పెట్టి జట్టుకు ఎలా మార్గనిర్దేశం చేస్తాడనేది ఆసక్తికరం. బ్యాటర్లకు సవాల్... మబ్బు పట్టిన వాతావరణంలో బంతి అనూహ్యంగా స్వింగ్ కావడం... డ్రైవ్ కోసం ప్రయతి్నస్తే చాలు బంతి బ్యాట్ అంచులను తాకి స్లిప్స్లోకి దూసుకుపోవడం... ఇంగ్లండ్లో జరిగే టెస్టు సిరీస్లలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలాంటి స్థితిని దాటి బ్యాటర్లు రాణించాలంటే ఎంతో పట్టుదల, ఓపిక కనబర్చాల్సి ఉంటుంది. తమ బ్యాటింగ్ స్టాన్స్లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లది ప్రధాన పాత్ర కానుంది. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయడం ఖాయమే. జైస్వాల్ 19 మ్యాచ్ల స్వల్ప కెరీర్ను చూస్తే ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్లపై ఆకట్టుకున్న అతను దక్షిణాఫ్రికాలో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్లో అతను సత్తా చాటాల్సిన సమయం వచి్చంది. తొలి సిరీస్లోనే సుదర్శన్ నుంచి అతిగా ఆశించలేం. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ రెండు ఫైనల్లను వదిలేస్తే గిల్ ఇంగ్లండ్లో ఒకే ఒక టెస్టు ఆడాడు. కెప్టెన్గా అదనపు బాధ్యతతో అతను ఎంత బాగా ఆడతాడనేది కీలకం. గణాంకాల పరంగా చూస్తే మరో ప్రధాన బ్యాటర్ రాహుల్కు ఇంగ్లండ్లో మంచి రికార్డు ఉంది. ఇప్పుడు తన స్థానంపై సందేహాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడగలడు. ఇక మిడిలార్డర్లో కరుణ్ నాయర్పై అందరి దృష్టీ ఉంది. నాయర్కు చోటు దక్కడంలో దేశవాళీ ప్రదర్శనతో పాటు నార్తాంప్టన్షైర్ అనుభవం కీలకపాత్ర పోషించింది. కాబట్టి అతను తనపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టుకునేందుకు ఏమాత్రం శ్రమిస్తాడనేది ఆసక్తికరం. ఇక పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా ఆట దిశను మార్చగల పంత్పై కూడా జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. మెల్బోర్న్ టెస్టు తర్వాత నిలకడ చూపించలేకపోయిన నితీశ్ రెడ్డి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది.బుమ్రా, సిరాజ్ చెలరేగితే...ఈ సిరీస్ ఫలితాన్ని ప్రభావితం చేయగల ఏకైక ప్లేయర్లా జస్ప్రీత్ బుమ్రా కనిపిస్తున్నాడు. పని భారంతో అతను గరిష్టంగా మూడు టెస్టులే ఆడవచ్చని మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పింది. ఆ మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లకు ‘నరకం’ కనిపించడం ఖాయం. ఇటీవల ఆ్రస్టేలియాకు ఈ అనుభవం ఏమిటో బాగా తెలిసింది. కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్నెస్తో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం. ఎరుపు బంతితో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కూడా చాలా పదునెక్కింది. అక్కడి పరిస్థితుల్లో సిరాజ్ బౌలింగ్ ప్రత్యర్థి పాలిట ప్రమాదకరంగా మారడం ఖాయం. గత సిరీస్లో సిరాజ్ 5 టెస్టులూ ఆడి 18 వికెట్లు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ అనుభవం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. సిడ్నీ టెస్టులో ఆకట్టు కున్న ప్రసిధ్ కృష్ణ మూడో పేసర్గా బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ సిరీస్ కాబట్టి అర్ష్ దీప్కు ఏదో ఒకదశలో అవకాశం దక్కవచ్చు కానీ ఏమాత్రం ప్రభావం చూపగలడో సందేహమే. అశ్విన్ రిటైర్మెంట్తో ఇప్పుడు కుల్దీప్కు తొలిసారి ప్రధాన స్పిన్నర్గా చోటు ఖాయం. 2018లో ఇక్కడ ఆడిన ఏకైక మ్యాచ్లో విఫలమైన అతను పెద్ద బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ముఖ్యం. కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా ఆల్రౌండర్గా రాణించడం ముఖ్యం. సీమ్ బౌలర్ శార్దుల్ శైలితో ఇక్కడ మంచి ఫలితం రాబట్టవచ్చు కాబట్టి మేనేజ్మెంట్ మొగ్గు శార్దుల్ వైపు ఉంది.

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.సప్తమి ప.10.38 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.03 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.27 వరకు, అమృతఘడియలు: ప.2.16 నుండి 3.50 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32. మేషం... అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.వృషభం... సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.మిథునం... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో కొంత నిరాశ. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.కర్కాటకం... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో బాధ్యతలు అధికం.సింహం.... కొత వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. భూములు, వాహనాలు కొంటారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కన్య..... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.తుల... మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు. శ్రమధిక్యం. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.వృశ్చికం... పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.ధనుస్సు... చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.మకరం...... ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.కుంభం... సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు.మీనం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ఇంకా బాల కార్మికులా?
ఇప్పటికీ వెట్టి చాకిరీ వలలో చిక్కుకు పోయిన బాల కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇళ్ళలో పని చేస్తున్న నిస్సహాయ బాలల ఆర్తనాదాలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి రక్షించిన వందలాది మంది బాలలు 1998లో నా చుట్టూ అల్లు కున్న సంగతి గుర్తుకొస్తోంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 103 దేశాలను చుట్టి వచ్చిన గ్లోబల్ మార్చ్లో నా వెంట వచ్చిన బాలలు నిర్భయంగా చేసిన నినాదాలు కూడా గుర్తున్నాయి. యాత్ర ముగింపులో జెనీవా లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రధాన కార్యాలయంలో ప్రసంగించవలసిందిగా మమ్మల్ని కోరారు. అక్కడ మేం తక్షణం అమలుపరచవలసిన సరళమైన డిమాండును వినిపించాం: ‘‘చిట్టి చేతుల్లో ఇక ఎంతమాత్రం పనిముట్లు ఉండకూడదు. మాకు పుస్త కాలు, బొమ్మలు కావాలి!’’ నెరవేరని లక్ష్యంఆ యాత్ర చరిత్ర సృష్టించింది. ఫలితంగా, ఐఎల్ఓ 1999లో (182వ) తీర్మానాన్ని ఆమోదించింది. అది బానిసత్వం, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వచ్చిన మొదటి అంతర్జా తీయ చట్టం. ఆ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి 16 ఏళ్ళలో గణనీయమైన ప్రగతి కనిపించడంతో ఎన్నో ఆశలు చిగురించాయి. బాల కార్మికుల సంఖ్య 2000–2016 సంవత్సరాల మధ్యలో గణనీయంగా 25 కోట్ల నుంచి 15 కోట్ల 20 లక్షలకు తగ్గింది. దాంతో మార్పు తేగలం అనిపించింది. కానీ, అది సరిపోదు. బాలల విష యంలో ప్రతి క్షణమూ విలువైనదే. స్కూలుకు వెళ్ళలేకపోయిన ప్రతి రోజూ ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే లెక్క. ఒక్క నిమిషం బాని సత్వంలో మగ్గినా బాల్యాన్ని కోల్పోయినట్లే లెక్క.ఐరాస 2016లో సతత వికాస లక్ష్యా (ఎస్.డి.జి.)లను నిర్దేశించుకున్నపుడు ఉద్యమాన్ని పునర్జీవింపజేసే అవకాశం వచ్చింది. బాల కార్మికుల నిర్మూలనను ఒక ఎస్.డి.జి.గా చేర్చేట్లు చూసేందుకు మేం ఉద్యమాన్ని చేపట్టాం. అంతర్జాతీయ అభివృద్ధి అజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చితే ఎంతో ఊతం లభిస్తుందని భావించాం. మా కృషి ఫలించింది. ప్రపంచం 2025 కల్లా బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ లేకుండా చూస్తామని వాగ్దానం చేసింది.గ్లోబల్ మార్చ్లో పాల్గొన్నవారిలో పిన్న వయస్కుడు బసు రాయ్. ఆ ఎనిమిదేళ్ళ పిల్లాడిని నా భుజాల మీదకు ఎక్కించుకుని నడిచాను. వాడిది కంచు కంఠం. ‘‘బాల కార్మికులను ఎవరు నిరో ధిస్తారు? మేమే’’ అని నినదించేవాడు. మనం పెట్టుకున్న 2025 గడువు ఇంక కొద్ది నెలల్లో ముగుస్తుందనగా, బసు లాంటి లక్షలాది మంది నుంచి అదే రకమైన గొంతు ఇప్పటికీ వినిపిస్తోందని బరువెక్కిన హృదయంతో చెప్పాల్సి వస్తోంది.ఎస్.డి.జి.లు చేపట్టిన మొదటి నాలుగేళ్ళలో, 2020 వరకు బాల కార్మికుల సంఖ్య 16 కోట్లకు పెరిగింది. అప్పటికి 20 ఏళ్ళలో బాల కార్మికుల సంఖ్య పెరగడం అదే మొదటిసారి. ఒక్క ఆఫ్రికాలోనే రోజూ 10,000 మంది బాలలు బలవంతపు చాకిరీలోకి దిగు తున్నారు. అదే కాలంలో, ప్రపంచం 10 ట్రిలియన్ డాలర్లకు సంప దను పెంచుకుంది. మరో రకంగా చెప్పాలంటే, కనీసం వారానికొక కోటీశ్వరుడు తయారయ్యాడు. ఇది దయారాహిత్యానికి సంకేతం. దీన్ని నిజంగా మనం అభివృద్ధి అనగలమా? కొన్నేళ్ళ క్రితం నేను ఐరాసలో మాట్లాడుతూ, 2025 నాటికి ప్రపంచంలో బాల కార్మికులు లేకుండా చూడగలమని చెప్పాను. కానీ, ‘‘అయ్యా! బాల కార్మిక వ్యవస్థకు అంతం ఎన్నడు?’’ అని ఈ మధ్య ఎవరో నన్ను అడిగి నపుడు నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అది హక్కుల సమస్యబాల కార్మికులు లేకుండా చేసే ఉద్యమాన్ని ప్రభావవంతంగా ఎలా మలచాలనే విషయంలో 2016కు ముందు మనం కొన్ని విలు వైన పాఠాలు నేర్చుకున్నాం. ప్రజా ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ సంకల్ప బలంతో కూడిన నైతిక నాయకత్వం ప్రగతిని సాధించేందుకు తోడ్పడ్డాయి. చాలా దేశాలు విద్యా రంగంపై భారీగా పెట్టుబ డులు పెట్టాయి. నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన బ్రెజిల్, భారత్, కెన్యా, దక్షిణాఫ్రికా సత్ఫలితాలు చూశాయి. ఎక్కడి నుంచి కూడా బాల కార్మికులు వ్యవస్థలోకి రాకుండా చూడాలని రాజ కీయంగా బలమైన వాణి (ముఖ్యంగా యూరప్, అమెరికా నుంచి) వినిపించడంతో పరిశ్రమలు కూడా తలొగ్గక తప్పలేదు.నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆ రకమైన ఉద్యమ స్ఫూర్తి కొరవడింది. మనం కూడా బాల కార్మికులను ఒక ఉప అంశంగా చూడటం మొదలెట్టాం. దాన్నొక కార్మిక సమస్యగా పరిగణిస్తున్నాం తప్పించి న్యాయాన్ని, మానవ హక్కులను కాలరాస్తున్న సంక్షోభంగా చూడటం లేదు. లోతైన సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అనేక పేద దేశాలు (ముఖ్యంగా ఆఫ్రికాలోనివి) అసమంజస పన్నుల వ్యవస్థల్లో, కునారి ల్లజేస్తున్న అప్పుల ఊబిలో, అవినీతి, అవకతవకల పాలనలో, వివిధ వర్గాల మధ్య ఘర్షణల్లో చిక్కుకుపోయాయి. దాంతో ఈ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మరో ప్రమాదకరమైన ధోరణిని గమనించాను. అమెరికాలో 30కి పైగా రాష్ట్రాలు బాల కార్మికుల సంరక్షణ చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త సవరణలు తీసుకొచ్చాయి. సభ్యులుగా ఉన్న దేశాల నుంచి నిరసన ఎదురవడంతో, బాల కార్మి కులకు కంపెనీలను బాధ్యులను చేసే చట్టాన్ని యూరోపియన్ యూనియన్ సడలింపజేసింది. బ్రెజిల్లోనూ ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. మన పిల్లలు అనుకుంటేనే!అయితే, చిన్నవే అయినా, కొన్ని అర్థవంతమైన చర్యలూ కని పించకపోలేదు. ‘యునిసెఫ్’ ఇటీవల ప్రపంచ బాలల సంరక్షక నిధిని ఏర్పాటు చేసింది. కానీ, ఆ సాయం సరిపోదు. లక్ష్యంలో సుమారు 30 శాతాన్నే ఆ నిధి అందుకోగలిగింది. ప్రపంచ దేశాలు కూడా మునుపెన్నడూ లేనంత ఘర్షణలను చూస్తున్నాయి. యుద్ధ మండలాల్లో జీవిస్తున్న బాలల శాతం 1990ల నుంచి రెండింతలైంది. నేనిది రాస్తున్న సమయానికి 47 కోట్ల 30 లక్షల మంది బాలలు ఘర్షణలు సాగుతున్న చోట్ల నలిగిపోతున్నారు. వాతావరణ సంక్షోభం బడుగు వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇది బాల కార్మి కుల సంఖ్యను పెంచుతూ, పేదరిక, అన్యాయాల వలయాన్ని కొనసాగిస్తోంది. చాలా దేశాలు బాల కార్మికుల సంఖ్యను తగ్గించు కోగలగడం ఒక్కటే ఆశలు మోడువారకుండా చూస్తోంది. బాల కార్మి కులకు వ్యతిరేకంగా ప్రజా గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించగల సత్తా భారత్కు ఉంది. మనకు పటిష్ఠమైన చట్టాలు, చక్కని సంక్షేమ పథకాలు, రాజ కీయంగా ఏకాభిప్రాయం ఉన్నాయి. పరిశ్రమల నుంచి కూడా ప్రతి ఘటన నామమాత్రంగానే ఉంది. అన్నీ అనువైన పరిస్థితులున్నాయి. కనుక, సత్వర కార్యాచరణకు నడుం బిగించాలి. మొదట చట్టాలను అమలుపరచాలి. కాగితాలకు మాత్రమే పరిమితమైన చట్టాల వల్ల ఉపయోగం లేదు. బాల కార్మికులను వివిధ (విద్య, ఆరోగ్యం, పేదరికం) రంగాలతో ముడిపడిన సమస్యగా చూడాలి. అలాగే, విద్యా రంగంలో పెట్టుబడులు కీలకం. ప్రమాణాలతో కూడిన పాఠ శాల విద్య బాల కార్మికులను చాకిరీ నుంచి విముక్తులను చేయ గలదు. అన్నింటికన్నా ముఖ్యంగా బాల కార్మికులుగా పని చేస్తున్న వారందరూ మన పిల్లలేననే భావన అంకురించాలి. అప్పుడే సమస్య పరిష్కారానికి త్వరపడగలుగుతాం. బాలలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.కైలాశ్ సత్యార్థి వ్యాసకర్త నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక కార్యకర్త (‘హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో)
శభాష్... ప్రవల్లిక..!
'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం
భాషల ఆధారంగా దేశాన్ని విభజించలేం: ఉపరాష్ట్రపతి
సంచలనం.. 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ స్నేహితుడు
ఈ యుద్ధం.. ప్రపంచానికి పెనుభారం
టాలీవుడ్లో 19 ఏళ్ల హీరోయిన్.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..
‘ఇరాన్’ పని ఖతం.. ట్రంప్ సంచలన నిర్ణయం
చెవిరెడ్డి పేరు చెప్పాలని ‘సిట్’ చిత్ర హింసలు
ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు
‘తండ్రి’కి వందనం
శ్రీవారి సేవలో అలనాటి టాలీవుడ్ హీరోయిన్లు (ఫొటోలు)
‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్’
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
అఖిల్ పెళ్లి బరాత్ జ్ఞాపకాలతో శోభిత (ఫొటోలు)
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ..ఆకాశమంత ఆనందం! (ఫొటోలు)
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
అలాగే గాజాకు, పాలస్తీనాకు, ఇరాన్కు.. మొత్తం ప్రపంచానికే క్షమాపణలు చెప్పాలి సార్!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్?
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. బెంబేలెత్తిపోయిన ప్రత్యర్ధి బౌలర్లు
కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
చంద్రబాబు ఇలాకా కుప్పంలో దారుణం
సీమలోనూ సీను సితారే!
శభాష్... ప్రవల్లిక..!
'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం
భాషల ఆధారంగా దేశాన్ని విభజించలేం: ఉపరాష్ట్రపతి
సంచలనం.. 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ స్నేహితుడు
ఈ యుద్ధం.. ప్రపంచానికి పెనుభారం
టాలీవుడ్లో 19 ఏళ్ల హీరోయిన్.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..
‘ఇరాన్’ పని ఖతం.. ట్రంప్ సంచలన నిర్ణయం
చెవిరెడ్డి పేరు చెప్పాలని ‘సిట్’ చిత్ర హింసలు
ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు
‘తండ్రి’కి వందనం
‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్’
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభం
అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
అలాగే గాజాకు, పాలస్తీనాకు, ఇరాన్కు.. మొత్తం ప్రపంచానికే క్షమాపణలు చెప్పాలి సార్!
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్?
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. బెంబేలెత్తిపోయిన ప్రత్యర్ధి బౌలర్లు
కీర్తి సురేశ్ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
సీమలోనూ సీను సితారే!
ఇరాన్కు ‘అణు’ సాయం.. నాలుక మడతేసిన పాక్
125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్?
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
సినిమా

అనుష్కతో పోటీ పడనున్న సుహాస్.. ఓ భామ అయ్యో రామ రిలీజ్ ఎప్పుడంటే?
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యే రామ'. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్లో హరీశ్ నల్లా నిర్మించారు. దాదాపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు.ఈ విభిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీని జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. అదే రోజు అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఘాటి విడుదలవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావనిముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు.

మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేస్తే..?
కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి దగ్గరకు వెళ్తుంది. ఊహించని బ్లాక్బస్టర్ అయితే.. అరె ఈ మూవీ మా హీరో చేసుంటే బాగుండేదేమో అని అభిమానులు బాధపడుతుంటారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల లేనిదాన్ని కూడా సృష్టించేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' సినిమా చేసుంటే ఎలా ఉండేదా అని ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: కాంచీవరం చీరలో పూజా.. పేపర్ డ్రస్సులో అషు) 'వన్: నేనొక్కడినే' సినిమా తర్వాత మహేశ్ బాబు.. సుకుమార్తో మరో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో కాంబో సెట్ కాలేదు. అయితే అప్పుడు మహేశ్కి 'పుష్ప' కథే చెప్పారని, కానీ తనకు సెట్ కాదనే ఉద్దేశంతో వదులుకున్నారనే రూమర్స్ వచ్చాయి. తర్వాత సుక్కు.. అల్లు అర్జున్తో 'పుష్ప' చేయడం, ఇది పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇప్పుడు మరి ఎవరు చేశారో గానీ మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేసుంటే ఎలా ఉండేదో అని చెబుతూ ఓ ఏఐ వీడియోని సృష్టించారు. ఇందులో పలు హిట్ సీన్స్ని రీ క్రియేట్ చేయడం బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మహేశ్ సినిమాల విషయానికొస్తే చివరగా 'గుంటూరు కారం'తో పలకరించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఇదివరకే షూటింగ్ మొదలైంది కూడా. ఇందులో మహేశ్ సాహసికుడిగా కనిపించబోతున్నారు. 2027లో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అప్పటివరకు మహేశ్ ఫ్యాన్స్కి వెయిటింగ్ తప్పదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')What if pushpa did by MB.. ?" Mahesh Babu " pic.twitter.com/HcbRuNAnU8— Sᴜʀʏᴀ.. 🐦🔥 (@Wolverine9121) June 16, 2025

ఏ మాయ చేశావే రీ రిలీజ్.. రూమర్స్పై స్పందించిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుగు వెండితెరకు పరిచయమై ఇప్పటికే దాదాపు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. టాలీవుడ్లో ఏ మాయ చేశావే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఈ మూవీలో అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. ఈ మూవీ రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కోసం ఏ మాయ చేశావే చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్పై రిలీజ్ చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వచ్చేనెల 18న రీ రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మరోసారి చైతూ, సమంత ఓకే వేదికపై కనిపిస్తారంటూ వార్తలొస్తున్నాయి. విడాకుల తర్వాత వీరిద్దరిని జంటగా ఎక్కడా చూడలేదు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం వీరిద్దరు కలిస్తే ఫ్యాన్స్ చూడాలని కోరుకుంటున్నారు. దీంతో సామ్- చైతూ ఏ మాయ చేశావే ప్రమోషన్లలో కలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా వీటిపై హీరోయిన్ సమంత స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూసేయండి.తాజాగా సమంత ఈ వార్తలను కొట్టిపారేసింది. నేను ఏ మాయ చేసావే సినిమాను ప్రమోట్ చేయడం లేదని చెప్పింది. ఈ సినిమాను నేను అస్సలు ప్రమోట్ చేయడం లేదు.. అయితే ఈ టాక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఈ సినిమాలోని జంటను కలిసి చూడాలని అభిమానులు ఇష్టపడొచ్చని.. కానీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేము జీవించలేము కదా అంటూ సామ్ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరిని కలిసి చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.తాను నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే కాదని.. రాహుల్ రవీంద్రన్ నటించిన తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరీ అని సమంత వెల్లడించింది. అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలో చాలా గ్యాప్ రావడంతో ఎవరికీ ఆ సినిమా గుర్తులేదని చెప్పుకొచ్చింది. నేను నటించిన రెండో చిత్రం ఏ మాయ చేశావే.. ఈ సినిమాలోని ప్రతి షాట్ తనకు గుర్తుందని తెలిపింది. దీంతో సమంత, నాగ చైతన్య ఏ మాయ చేసావే ప్రమోషన్ల కోసం కలవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

కాంచీవరం చీరలో పూజా.. పేపర్ డ్రస్సులో అషు
న్యూస్ పేపర్ డ్రస్సులో హాట్ బ్యూటీ అషూరెడ్డికాంచీవరం పట్టుచీరలో మెరిసిపోతున్న పూజా హెగ్డేముంబై పూలమార్కెట్లో రాశీఖన్నా సందడిస్విమ్ వేర్లో కేక పుట్టిస్తున్న షెర్లీ షెటియాబ్లర్రీ పోజుల్లో అందంతో ధగధగలాడిస్తున్న కేతిక శర్మనాభి అందాలతో రెచ్చగొట్టేస్తున్న షాలినీ పాండేడిజైనర్ శారీలో వయ్యారంగా మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shirley (@shirleysetia) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

నేనే కెప్టెన్సీ వద్దన్నాను: బుమ్రా
లండన్: రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపిక చేసినప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ సాగింది. అనుభవజ్ఞుడు, జట్టు ప్రధాన బలమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాకుండా గిల్ను సారథిగా ఎంపిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. దీనిపై ఇప్పుడు బుమ్రా స్పష్టత ఇచ్చాడు. తన గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా కెప్టెన్సీవంటి అదనపు భారం మోయలేనని, నాయకుడిగా తన పేరును పరిశీలించవద్దని బీసీసీఐకి తానే చెప్పినట్లు అతను వెల్లడించాడు. ‘నన్ను కెప్టెన్గా ఎంపిక చేయడం వెనక ఎలాంటి ఆసక్తికర నేపథ్యం కానీ, నన్ను కావాలని తప్పించారనే వివాదం కానీ ఏమీ లేదు. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లకంటే ముందే ఇంగ్లండ్తో సిరీస్లో నా పని భారం ఎలా ఉండబోతోందో అనే విషయంపై బీసీసీఐ అధికారులతో పాటు నా వెన్ను నొప్పికి చికిత్స చేసిన వైద్యులతో కూడా మాట్లాడాను. జాగ్రత్త పాటిస్తేనే మంచిదని చెప్పారు. దాంతో నేను ఇంగ్లండ్లో అన్ని టెస్టులూ ఆడలేనని, సారథిగా నా పేరును పరిగణనలోకి తీసుకోవద్దని బోర్డుకు చెప్పాను. సిరీస్ మధ్యలో నేను తప్పుకొని మరొకరు కెప్టెన్సీ చేయడం సరైంది కాదు. కాబట్టి జట్టు ప్రయోజనాల కోణంలోనే నిర్ణయం తీసుకున్నా. భారత కెప్టెన్గా వ్యవహరించడం గొప్ప గౌరవం. కానీ కెప్టెన్గాకంటే ఒక ప్లేయర్గా నేను జట్టు కోసం ఉపయోగపడటం ముఖ్యమని భావించా’ అని బుమ్రా తెలిపాడు.

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి మరో ఆటగాడు?
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రెండు వారాల ముందే ఇంగ్లండ్ గడ్డపై అడగుపెట్టిన భారత జట్టు తీవ్రంగా శ్రమించింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ సారథ్యంలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను బ్యాకప్ ఆప్షన్గా భారత టెస్ట్ జట్టులో చేర్చినట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కలేదు.కానీ ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇండియా-ఎ జట్టుకు రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో ఉన్న రాణాను జట్టుతో పాటు ఉండమని సెలక్టర్లు సూచించినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. అయితే అతడిని ఇంకా జట్టులో అధికారిక సభ్యుడిగా లెక్కించలేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు క్రిక్బజ్ తెలిపింది. కాగా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్లో రాణా తన టెస్టు అరంగేట్రం చేశాడు. 2 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో సెలక్టర్లు అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ ఇప్పుడు ఆటగాళ్ల గాయాల బెడద దృష్ట్యా అతడికి మరోసారి అవకాశం లభించింది.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?

షాంటో, మష్ఫికర్ సూపర్ సెంచరీలు.. తొలి రోజు బంగ్లాదే
గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటింగ్లో రాణించింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(136 బ్యాటింగ్), వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(105 బ్యాటింగ్) ఉన్నారు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే రెండు, అసిత ఫెర్నాండో ఒక వికెట్ పడగొట్టారు.ఆదుకున్న రహీం, శాంటో..అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ మొదటి సెషన్లో భారీ షాక్ తగిలింది. శ్రీలంక శ్రీలంక ఫాస్ట్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లా టైగర్స్ వరుసగా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే బంగ్లా ఓపెనర్ అనముల్ హక్ వికెట్ కోల్పోయిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత మోమినుల్ హక్(29), షాద్మాన్ ఇస్లాం (14) స్వల్పవ్యవధిలో పెవిలియన్కు చేరారు.ఆ సమయంలో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(136 బ్యాటింగ్), వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(105 బ్యాటింగ్) అద్బుత సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 247 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి రోజు ఆటలో శ్రీలంక బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయలేకపోయారు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.తుది జట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, లహిరు ఉదార, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), మిలన్ ప్రియనాథ్ రత్నాయక్, తరిందు రత్నాయకే, ప్రబాత్ జయసూర్య, అసిత ఫెర్నాండోబంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, అనాముల్ హక్, మోమినుల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహిద్ రాణా

బంగ్లాదేశ్తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. అయితే ఈ పర్యటనకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశముంది.సూర్యకుమార్ యాదద్ మరో శస్త్రచికిత్స లండన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. న్యూస్24 రిపోర్టర్ వైభవ్ భోలా ప్రకారం.. సూర్యకుమార్ కుడివైపున స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సూర్య తన గాయానికి శస్త్రచికిత్స చేసుకోవడానికి ఇప్పటికే లండన్కు వెళ్లినట్లు వైభవ్ భోలా ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా ఈ ముంబై ఆటగాడు స్పోర్ట్స్ హెర్నియా బారిన పడడం ఇది రెండో సారి. గతేడాది జనవరిలో ఎడమ వైపున నొప్పి రావడంతో జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్కు దూరమయ్యాడు. కానీ ఫిట్నెస్ సాధించి ఐపీఎల్తో పాటు, టీ20 ప్రపంచకప్-2024లో భాగమయ్యాడు.ఇప్పుడు కుడివైపు నొప్పి రావడంతో మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మిస్టర్ 360 దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. బంగ్లా టూర్కు సూర్య సూర్యదూరమైతే భారత జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్-2025లో అద్బుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అయ్యర్.. తిరిగి టీ20 జట్టులోకి రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు.చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్గా టీమిండియా స్టార్ ఓపెనర్
బిజినెస్

రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?
రిచ్డాడ్ పూర్డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రతిఒక్కరి భవిష్యత్తు కోసం ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడు చేయాలో తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈమేరకు కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. దాంతో ఈ పోస్ట్ కాస్తా వివిధ సోషల్మీడియా ప్లాట్ఫామ్ల్లో వైరల్గా మారింది.ఎక్స్ వేదిక రాబర్ట్ కియోసాకి తెలిపిన పోస్ట్లో..‘మీ భవిష్యత్తు ఈ రోజే నిర్ణయించబడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. దయచేసి దాన్ని వృథా చేయకండి. ఈ రోజు నేను మరింత బిట్ కాయిన్ కొనుగోలు చేస్తున్నాను. దాంతోపాటు ఆంత్రప్రెన్యూర్షిప్కు సంబంధించి కొత్త పుస్తకంపై పనిచేస్తున్నాను. ఈ రోజు మీరు మీ భవిష్యత్తు కోసం ఏమి చేస్తున్నారు..? దయచేసి మీ ఈ రోజును గొప్ప రోజుగా మలుచుకోండి. జాగ్రత్త’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపుYOUR FUTURE is decided TODAY!!!Saying it another way:“TODAY is the most IMPORTANT DAY of YOUR LIFE. Please do not waste it.”TODAY I am buying more BITCOIN and working on a new book on ENTREPRENEURSHIP.What are you doing today….for your future?You are important. Your…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 11, 2025

త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపు
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్ కంపెనీ జులైలో మరింత మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈసారి తొలగింపులు సంస్థ ఫ్యాక్టరీ కార్మికులు 15 నుంచి 20 శాతం మందిని ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. కొత్త సీఈఓ లిప్-బు టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థ త్వరలో భారీగా శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తుంది. రాబోయే కోతలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇంటెల్ ఫౌండ్రీ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.నిర్ణయం బాధాకరమైనా తప్పదుకంపెనీ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం ఇంటెల్లో కొత్త విడత తొలగింపులు జులై మధ్యలో ప్రారంభమై నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉంది. ఇంటెల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చీఫ్ నాగ చంద్రశేఖరన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ నిర్ణయం చాలా బాధాకరమైనది. కానీ పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అవసరం’ అని చెప్పారు.జాగ్రత్తగా, గౌరవంతో..ఉద్యోగుల తగ్గింపు శాతంపై ఇంటెల్ నేరుగా వ్యాఖ్యానించనప్పటికీ ఉద్యోగులను ‘జాగ్రత్తగా, గౌరవంతో’ చూస్తామని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు మెరుగ్గా స్పందించడానికి ఇంజినీరింగ్ బృందాలను శక్తివంతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు ఉన్నాయని తెలిపింది. గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఇంటెల్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. పీసీ, డేటా సెంటర్ మార్కెట్లలో పెరుగుతున్న పోటీ వల్ల కంపెనీ కాస్త వెనుకబడుతుందనే వాదనలున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదనే అభిప్రాయాలున్నాయి. ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఒరెగాన్లో 3,000 మంది ఉన్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీగట్టిదెబ్బ..రాబోయే తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ కర్మాగారాలపై ప్రభావం చూపనుండగా, సుమారు 20,000 మంది కార్మికులున్న ఒరెగాన్లో గట్టిదెబ్బ పడే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రాధాన్యతలు, నైపుణ్య మదింపుల ఆధారంగా కోతలకు సిద్ధం కావాలని కంపెనీ ఇప్పటికే విభాగాలను నోటిఫై చేసింది. ఉన్నత యాజమాన్యం అందించిన చట్రంలోనే తొలగింపులను అమలు చేసే విచక్షణాధికారాన్ని ఆయా విభాగాధిపతులకు ఇచ్చినట్లు తెలిసింది.

ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీ
ప్రభుత్వరంగ బ్యాంక్ల చీఫ్లతో ఈ నెల 27న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. బ్యాంకుల పనితీరుతోపాటు పలు ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల లక్ష్యాలపైనా చర్చ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును అర శాతం తగ్గించిన తర్వాత ఆర్థిక మంత్రి బ్యాంక్లతో నిర్వహిస్తున్న మొదటి సమీక్ష కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంజీడీపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 6.5 శాతానికి తగ్గడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఉత్పాదక రంగాలకు రుణ వితరణ పెంచాలని ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో బ్యాంక్లను కోరే అవకాశాలున్నట్టు తెలిపాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల పరంగా పురోగతిని మంత్రి సమీక్షించనున్నట్టు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంక్ల లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 26 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.

పాత బంగారానికి 2 క్యారెట్ల అదనపు విలువ
పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బంగారు ఆభరణాల రిటైల్ బ్రాండ్ తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ పాత బంగారానికి గరిష్టంగా 2 క్యారెట్ల అదనపు విలువ పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిమిత కాల ఆఫర్ జూన్ 30, 2025 వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.ఆఫర్ ఎలా పనిచేస్తుందంటే..పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే కస్టమర్లు కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు క్యారెట్ విలువను పొందేలా ఈ ఆఫర్ను డిజైన్ చేశారు. ప్లేయిన్ జ్యువెలరీ లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 1 క్యారెట్ అదనంగా పొందవచ్చు. అదే వజ్రాలతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 2 క్యారెట్లను అదనంగా పొందేందుకు ఈ ఆఫర్ ద్వారా వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంకస్టమర్ల పాత బంగారం 20 క్యారెట్లు ఉండి దాన్ని ఎక్స్ఛేంజ్ ఇచ్చి తిరిగి కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే పాత దాన్ని 21 క్యారెట్లుగా లెక్కిస్తారు. అదే వజ్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు 22 క్యారెట్లుగా విలువ కడుతారు. బంగారం ధరలు పెరుగుతున్నందున ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తనిష్క్ ప్రీమియం డిజైన్లను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదా వ్యక్తిగతంగా తమ ఆభరణాలు కొత్త డిజైన్లలోకి మార్చుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.
ఫ్యామిలీ

గ్రామీణ సాంస్కృతిక కళా రూపం..'చేర్యాల చిత్రం'
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేర్యాల నకాషి పెయింటింగ్స్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు ఆదరణ లేని ఈ చిత్రాలకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో గ్రామీణ, సాంస్కృతిక ఇతివృత్తాలను తెలిపే చిత్రాలను వేస్తోంది బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్కు చెందిన ధనాలకోట వైకుంఠం నకాషి కుటుంబం. మహాభారతం, రామాయణం, వివిధ భారతీయ పురాణాలు వంటి హిందూ ఇతిహాసాలను చిత్రాల రూపంలో ఆలయాలు, మ్యూజియాల్లో, పలు ఎగ్జిబిషన్స్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఈ తరహా చిత్రకళపై వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. నకాషి కళాకారులు 13వ శతాబ్దం నుంచి చిత్రకళను ప్రారంభించారు. రాజులు, జమీందారులు తమ ఇళ్లలో ఇంటీరియల్ డిజైన్ కోసం, వాహనాల రూపంలో ఈ తరహా పెయింటింగ్స్ చెక్కలతో చేయించుకునేవారు. అంతేకాకుండా గ్రామ దేవతల విగ్రహాలు, బొమ్మల కొలువులు, ఆవుపేడ, చింతపిక్కలతో చిన్న పిల్లలకు బొమ్మలు చేసేవారు. వందల సంవత్సరాల క్రితమే కథ చెప్పే సంఘాలు వీటిని దృశ్య సహాయంగా ఉపయోగించుకుని కథలు చెప్పుకుంటూ తెలంగాణ గ్రామాల్లో తిరిగేవారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ అనేది ఆడియో – విజువల్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభ రూపాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ రాష్ట్రంలో నకాషి కులస్తులు మాత్రమే వీటిని తయారు చేస్తారు. ఎనిమిది కులాల పురాణాల చిత్రాలను వీరే వేస్తారు. దేశంలో పలు ఆలయాలు, మ్యూజియాల్లో చేర్యాల నకాషి చిత్రాలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఉజ్జయినిలో శివపురాణం, దీనిని ఇటీవల ప్రధాని మోదీ సందర్శించారు. శివపురాణం ఆయనను ఆకట్టుకోగా, పెయింటింగ్స్ వివరాలు తెలుసుకుని గీసిన వైకుంఠం నకాషి గురించి మన్కీ బాత్లో మాట్లాడారు. నూతన పార్లమెంట్ భవనంలో జైన్ మహావీర్ చరిత్ర ఏర్పాటు చేశారు. బొల్లారం రాష్ట్రపతి భవన్లో ఈ తరహా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. బీహారులోని తక్షశిల మ్యూజియంలో, అయోధ్యలోని తులసీదాస్ రామాలయం మ్యూజియంలో, భోపాల్లోని ఆదివాసీ లోక్ కళా చిత్రసమితి ప్రదర్శనలో ఉంచారు. స్విట్జర్లాండ్, చైనా, లండన్, మలేషియా, ఇటలీ, బెర్లిన్, సౌత్ ఆఫ్రికాలో ప్రదర్శనలో పెట్టారు. అంతేకాకుండా న్యూ ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ చేర్యాల చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.నకాషి కళకు ప్రభుత్వాల సహకారం.. చేర్యాల నకాషి పెయింటింగ్స్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. వైకుంఠం నకాషి కుటుంబ సభ్యులు వనజ, రాకేష్ నిహారిక, వినయ్కుమార్, తన్మయ్, సారిక ఈ చేర్యాల చిత్రాలను వేస్తున్నారు. వైకుంఠానికి 2016లో జాతీయ అవార్డు, 1994, 1995లో నేషనల్ మెరిట్ అవార్డు, 1994లో రాష్ట్ర అవార్డు లభించాయి. (చదవండి: ఐదు పదులు దాటకా.. ఆ వైద్య పరీక్షలు తప్పనిసరి..!)

ఇంటి వేడుకలు చుట్టూ ఇంతుల విజయ విహారం..!
చారిత్రక వైభవాన్ని సమకాలీన ఆధునికతను సమపాళ్లలో కలుపుకుని, విభిన్న రకాల వేడుకలకు నిలయంగా మారిన నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో మహిళలు చెప్పుకోదగిన విధంగా రాణిస్తున్నారు. మొదట ఈ రంగంలో పురుషాధిపత్యం కనిపించినా, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. తమదైన సృజనాత్మకత, అర్థవంతమైన నిర్వహణ, డీటెయిల్డ్ ప్లానింగ్తో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. సీఏ నుంచి ఈవెంట్స్ వరకూ.. చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తూ దానిని వదిలేసి, అనుకోకుండా కోవిడ్ సమయంలో ఈ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పటికి 500కి పైగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాను. మహిళలు ప్రతి ఒక్కరితో సులభంగా కలిసిపోతారు. అందుకే రాణించగలుగుతున్నారు. ప్రస్తుతం పుట్టినరోజులు, శారీ సెర్మనీలు, షష్టిపూర్తి..వరకూ ప్రతి వేడుకకీ మహిళలే సారథ్యం వహిస్తున్నారు. – నిహారిక, శ్రీ వర్ణంఉద్యోగం కన్నా ఉన్నతంగా.. యుక్తవయసు నుంచీ మెహిందీ అంటే ఇష్టం. మా ఊరు నుంచి నగరానికి వచ్చాక ఎమ్మెస్సీ చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ కోసం అన్వేషిస్తున్నప్పుడు ఈ ఆర్ట్ ద్వారా ఆదాయం గురించి తెలిసింది. అలా పార్ట్ టైమ్ ఆర్టిస్ట్గా.. ఆ తర్వాత ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా మారాను. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో కంటిన్యూ చేస్తున్నాను. మెహందీతో పాటు నెయిల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాను. నెలలో 15రోజులు పనిచేసినా చాలు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కన్నా ఎక్కువే వస్తుంది. – శ్వేత గన్నోజు, మెహందీ ఆర్టిస్ట్ అందం.. అందరికీ.. ఇంటర్తో చదువు అటకెక్కింది. భర్త ప్రోత్సాహంతో ప్రొఫెషనల్గా నేర్చుకుని మేకప్ సేవలు అందిస్తున్నాను. బర్త్డే, ప్రీ వెడ్డింగ్ షూట్స్, సంగీత్ ఇలా ప్రతి వేడుకకూ మేకప్ అవసరం. ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఆ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ మేకప్ కావాలంటున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ రంగంలో పలువురు యువతకు శిక్షణ అందిస్తున్నా. – భవానీ నవీన్, మేకప్ ఆర్టిస్ట్సమన్వయమే.. ‘సంగీత్’కి న్యాయం.. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ బాగా చేసేదాన్ని. డ్యాన్స్ పోటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే ఈ రంగంలోకి వచ్చేశా. దీంతో ఎనిమిదేళ్ల నుంచి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నా. ఈ రంగంలో రాణించాలంటే సహనం ఉండాలి. మనకు వచి్చనట్టు, నచ్చినట్టు కాదు అతిథుల బాడీ లాంగ్వేజ్ బట్టి నేర్పించాలి. – శ్రీవాణి, కొరియోగ్రాఫర్ వెడ్డింగ్ ప్లాన్ చేయడం ఒకెత్తయితే సంగీత్, మెహందీ, హల్దీ, రిసెప్షన్ వరకూ పెళ్లిలో భాగమైన కార్యక్రమాలన్నింట్లో మహిళల పాత్రే కీలకం. గత కొన్నేళ్లుగా ట్రెండీగా మారిన డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహణా బాధ్యతల్ని సైతం మహిళలు చేపట్టడం విశేషం. ఫ్లోరల్ డెకరేషన్, టేబుల్ సెట్టింగ్స్, బ్యూటీ, కాంపాక్ట్ స్టేజింగ్ వంటివి పండించడంలో మహిళలకు సహజంగా ఉండే సున్నితత్వం ఉపకరిస్తోంది. ‘సంగీత్’ వారధి.. నృత్యానికి సారధి నాట్యం, సంగీతం, డ్రామా కలగలిపిన మ్యూజికల్ ఫెస్టివల్ సంగీత్ ప్రోగ్రామ్. నృత్యం వచ్చిన, రాని, అంతంత మాత్రమే చేయగలిగిన ప్రతి ఒక్కరినీ సమన్వయపరచి సంగీత్ని రక్తి కట్టించే కొరియోగ్రాఫర్ అనే కీలకపాత్రలో మహిళలు సునాయాసంగా ఒదిగిపోతున్నారు. సంప్రదాయంగా నాట్యం నేర్పడంలో ఉండే సమర్థత, శ్రద్ధ, సమయ పాలన వీటన్నింటికీ మించి కుటుంబంతో మమేకమైపోయే నేర్పు.. ఈ పాత్రలో మహిళలకు తిరుగులేని ఎంపిక. సాంగ్ సెలక్షన్ నుంచి స్టెప్పుల ఎంపిక వరకూ అంతా తామై వ్యవహరిస్తున్నారు. మాటే మంత్రం.. ఫ్యామిలీ ఈవెంట్స్లో బంధుమిత్రుల్ని భాగస్వాములుగా చేసే పలు కార్యక్రమాలను నడిపించే కంపేరర్లుగా కూడా మహిళలు సాటిలేని రీతిలో రాణిస్తున్నారు. భాషాపరంగా నైపుణ్యం, హాస్య చతురత, కలుపుగోలు తనంతో కంపేరింగ్ క్వీన్స్గా మారిపోతున్నారు. ఇంగ్లిష్–తెలుగు మిక్స్తో సహజంగా మాట్లాడే వీరి శైలి ఆకట్టుకుంటోంది. చిన్నితెరపై యాంకర్స్గా ఎలాగైతే దుమ్ము రేపుతున్నారో.. అలాగే వినోద భరిత కార్యక్రమాల్లోనూ కంపేరర్స్గా నగరంలో సత్తా చాటుతున్నారు. తాను ఆర్జేగా ప్రారంభమైనా వివాహ వేడుకలతో పాటు బేబీ షవర్స్, కార్పొరేట్ ఈవెంట్స్లో కంపేరర్గా స్థిరపడడానికి కారణం అందులో అవకాశాలు, ఆదాయం బాగుండడమేనని నగరానికి చెందిన పూజిత అంటున్నారు. (చదవండి: ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది)

ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది
‘సమస్య నీలోనే ఉన్నప్పుడు...దానికి పరిష్కారం కూడా నీలోనే ఉంటుంది’... ఇది తత్వం కాదు. నిజం. ‘నీట్’కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో అవిక ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేది. కన్నీళ్లు తుడుచుకున్నాక... ఒత్తిడిని దూరం చేసే దారి కనిపించింది. ఇక ఎప్పుడూ ఆమె ఏడవ లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది.‘చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలనుకునేదాన్ని’ అంటున్న పదిహేడు సంవత్సరాల అవిక అగర్వాల్ జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’లో 5వ ర్యాంక్ సాధించింది. వైద్యుల కుటుంబంలో పుట్టిన అవిక ఆ వృత్తి విలువను ప్రత్యక్షంగా చూసింది.ఫరిదాబాద్కు చెందిన అవిక పదవతరగతి వరకు ఢిల్లీలో చదివింది. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో కనిపించే తల్లిదండ్రులను చూడడం తనకు ఇష్టం.‘వారు ఎంతోమందిని బాధ నుంచి విముక్తి చేశారు. జీవితంపై ఆశ కల్పించారు’ అంటుంది తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులను చూసి డాక్టర్ కావాలనుకున్న అవిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఆ ఒత్తిడికి పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది. తనకు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ ఆడడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేది.యుద్ధంలోనే కాదు పరీక్షల యుద్ధంలోనూ వ్యూహం(స్ట్రాటజీ) అనేది ముఖ్యం. ‘మేజర్, మైనర్ గోల్స్గా నా స్ట్రాటజీని విభజించుకున్నాను. నీట్ అనేది నా మేజర్ గోల్. మైనర్ గోల్...ప్రతిరోజూ ఇంటికి వెళ్లిన తరువాత విన్న పాఠాలను మననం చేసుకోవడం. డౌట్స్ లేకుండా చూసుకోవడం. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం’ అంటుంది అవిక. (చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!)

ఐదు పదులు దాటాకా.. ఆ వైద్య పరీక్షలు తప్పనిసరి..!
వయసు పైబడిన వయోవృద్ధులను చాలామంది ఓ భారంగా చూస్తుంటారు. ఓ రోజుకు మనమూ ఆ వయసుకు వస్తాం. అప్పటి మన ఆరోగ్య సమస్యలనూ, మన వెతలనూ ఇవ్వాళ్లే వాళ్ల పాదరక్షల్లో కాళ్లు పెట్టి ఆలోచించాలి. నిజానికి వాళ్ల అనుభవం మనందరికీ అవసరమైన అంశం. వాళ్ల వల్ల చాలా సమస్యలు తేలిగ్గా విడిపోతాయి. ఇవేవీ అవసరం లేకపోయినా...వాళ్లు అలా కుర్చీలో కూర్చుని మనల్ని పర్యవేక్షిస్తుంటే చాలు... బోలెడంత నిశ్చింత. అందుకే... మనమే ఇంకా సంపాదిస్తూ ఉన్నట్లయితే... స్త్రీ పురుషులు 50 దాటాక కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ పురుషుడు మన తండ్రీ లేదా మన తాతగారో, అమ్మ లేదా అమ్మమ్మో అయి... మనమే సంపాదిస్తూ ఉన్నట్లయితే మనమే మన తండ్రి, తాత లేదా మీకు బాగా కావాల్సినవారికి వైద్య పరీక్షలు చేయిస్తుంటే ఇంకా ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది. అదీ వాళ్లకూ, మనకూ ఆనందాన్ని, నిర్భీతిని పంచుతూ కుటుంబ సంబంధాలను ఇంకా బలంగా చేస్తుంది. అందుకే మీ ఇంట్లో 50 దాటిన స్త్రీ, పురుషులకు చేయించాల్సిన కొన్ని సాధారణ వైద్య పరీక్షలివి... కుటుంబ సభ్యుల్లో ఐదు పదులు నిండాక చేయించాల్సిన కొన్ని సాధారణ (కామన్) వైద్య పరీక్షలివి...డయాబెటిస్(చక్కెర వ్యాధి) కోసం...సాధారణంగా ఈ పరీక్షను రెండంచెల్లో చేస్తారు. ఉదయాన్నే పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించాలి. ఇందులో పరగడుపున ఉన్నప్పుడు చక్కెర మోతాదులు తెలుస్తాయి. ఇక ఆ తర్వాత భోజనం చేసిన రెండు గంటల్లోపు చేయించే మరో పరీక్ష చేస్తారు. దీన్ని పోస్ట్ లంచ్ / పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ గా చెబుతారు. వీటితో పాటు సీరమ్ క్రియాటినిన్, సీయూఈ అనే పరీక్షలూ అవసరం ఇక కొందరికి మూడు నెలల సగటు చక్కెర మోతాదులను తెలుసుకోడానికి ‘హెచ్బీఏ1సీ’ అనే పరీక్ష చేస్తారు ప్రతి అరగంటకోమారు గ్లూకోజ్ ఇస్తూ చేసే పరీక్షను జీటీటీ (గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్) అంటారు. సందర్భాన్నీ, అవసరాన్ని బట్టి డాక్టర్లు ఈ పరీక్షలు చేయిస్తుంటారు. అయితే సాధారణంగా ‘ఫాస్టింగ్ బ్లడ్ షుగర్’, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్’ పరీక్షలు 50 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా చేయిస్తుంటారు. మిగతా పరీక్షలను అవసరాన్ని బట్టి డాక్టర్లు సూచిస్తుంటారు.గుండె జబ్బుల నిర్ధారణ కోసం...ఇటీవల గుండెజబ్బులు చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్నందున ఇందుకోసం చేయించాల్సిన సాధారణ పరీక్షలు... ∙ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్. అలాగే కొంత అడ్వాన్స్డ్ పరీక్షలైన 2డి ఎకో, టీఎమ్టీ, సీటీ, ∙కరోనరీ యాంజియో. ఈసీజీ ఎందుకంటే: గుండెజబ్బును నిర్ధారణ చేసేందుకు అవసరమైన సాధారణ తొలి పరీక్ష ఇది. ఒకవేళ ఛాతీ నొప్పి అనిపిస్తే తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఒకవేళ అది గుండె సమస్య లేదా గుండెపోటు అయితే 80, 90 శాతం కేసుల్లో ఆ విషయం ఈ పరీక్షతోనే నిర్ధారణ అవుతుంది. లేదా గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, ఆ విషయం బాధితులకు తెలియకున్నా ఈ పరీక్షతో గతంలో వచ్చిన గుండెపోటు సమాచారమూ తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు చాలా చిన్న చిన్న గుండెపోటు సమాచారాల్ని ఈసీజీ గుర్తించలేక΄ోవచ్చు. కాక΄ోతే ఈసీజీ మెషిన్లోని కంప్యూటరు గతంలోని గుండెజబ్బుల విషయంలో కొన్ని క్లూస్ ఇస్తుంది. అయితే ఆ క్లూస్ అన్నీ నూరు శాతం ఖచ్చితంగా నిజం కాక΄ోవచ్చు. అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే గుండెపోటు వచ్చినప్పుడు తక్షణమే ఈసీజీ తీయించినా గుండె΄ోటు వల్ల కలిగే మార్పులను ఈ పరీక్ష వెంటనే నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ : ఈ పరీక్షలో దేహంలోని అనేక రకాల కొవ్వు పదార్థాల వివరాలను తెలుసుకుని, అవి ఉండాల్సిన పరిమితుల్లో ఉన్నాయా లేదా అని చూస్తారు. ఒకవేళ పరిమితులకు మించి కొవ్వులు ఉంటే దాన్ని బట్టి డాక్టర్లు వాటిని అదుపులో ఉంచేందుకు అటర్వోస్టాటిన్స్ వంటి మందులను సూచిస్తారు. 2 డి ఎకో పరీక్ష ఎందుకు: టూ డీ ఎకో పరీక్ష గుండెస్పందనల్లోని మార్పులు, గుండె కండరంలో వచ్చిన మార్పులను తెలిపే పరీక్ష. గుండెపోటు వచ్చినప్పుడు గుండెస్పందనల్లో మార్పులు రావచ్చు కాబట్టి గుండెపోటు నిర్ధారణ కోసం ఎకో చేస్తారు. గుండెజబ్బు కారణంగానే ఛాతీ నొప్పి వస్తే... ఆ విషయం తెలుసుకునేందుకు అవకాశాలు 2 డీ ఎకో పరీక్షలో 95 శాతం కంటే ఎక్కువ. కాకపోతే ఈ పరీక్ష ఈసీజీ కంటే కాస్తంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. టీఎమ్టీ పరీక్ష : దీన్నే ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది ట్రెడ్ మిల్పై పేషెంట్ను నడిపిస్తూ... నడిచినప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు గుండెపై పడే ఒత్తిడీ... అలా ఒత్తిడి పడుతున్నప్పుడు గుండె పనితీరును అంటే... గుండెవేగం, గుండె లయ (రిథమ్), గుండె అలా పనిచేస్తున్నప్పుడు పెరుగుతున్న రక్త΄ోటు వంటి అంశాలను ఈ పరీక్షలో తెలుస్తాయి. యాంజియోగ్రామ్ : గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేక΄ోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేక΄ోయినా ఈ పరీక్షలో ఆ వివరాలు తెలుస్తాయి. అంతేకాదు... గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి ఖచ్చితంగా తెలుస్తాయి. యాంజియోగ్రామ్లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్లు : గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపే రక్తంలో హైసెన్సిటివిటీ ట్రో΄ోనిన్ అనే రసాయనాల మోతాదులు పెరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా ఆ విషయం నిర్ధారణ అయితే... ఎంత చిన్న గుండె΄ోటు అయినప్పటికీ అది తప్పనిసరిగా గుండె΄ోటే అన్న విషయం పూర్తిగా నిర్ధారణ అవుతుంది. కొన్ని ప్రత్యేక పరీక్షలు... బోన్స్కాన్ పరీక్ష ∙పెట్ స్కాన్ పరీక్ష. (ఇవి క్యాన్సర్ నిర్ధారణలో తొలుత చేసే ప్రాథమిక పరీక్షలు, వీటిలో ఏదైనా తేడా ఉన్నట్లు తెలిస్తే మరి కాస్త అడ్వాన్స్డ్ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక క్యాన్సర్ కోసం చేసే ప్రాథమిక పరీక్షల్లో ఏమీ లేదని తెలిస్తే క్యాన్సర్ ముప్పు లేదని నిశ్చింతగా ఉండవచ్చు) పళ్లకు సంబంధించిన పరీక్షలు... దీనికోసం ప్రతి ఆర్నెల్లకు ఒకమారు డెంటిస్ట్ను సంప్రదించి అవసరాన్ని బట్టి పళ్లు క్లీన్ చేయించుకోవాలి. చిగుర్లకు సంబంధించిన సమస్యలూ, వ్యాధులూ ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండాలి.కంటి పరీక్షలు...ప్రతి ఏడాదికి ఒకసారి కంటి నిపుణులకు చూపించుకోవాలి. కళ్లలో ప్రెషర్ చెక్ చేయించుకుని గ్లకోమా అవకాశాలు ఏవీ లేవని తెలుసుకుని నిర్భయంగా ఉండవచ్చు. గ్లకోమా అనేది చాపకింది నీరులా క్రమంగా కంటిచూపును తగ్గిస్తూపోయే వ్యాధి. దాదాపుగా చాలావరకు చూపు కోల్పోయే వరకు ఆ విషయం తెలియదు కాబట్టి పెద్దవయసు వచ్చాక తప్పనిసరిగా కంటి పరీక్షలు ప్రతి ఏడాదీ లేదా మీ డాక్టర్ / ఫిజీషియన్ సూచించిన విధంగా చేయిస్తూ ఉండాలి. ఇక కొంతవయసు దాటాక వచ్చే కంటి సమస్యల్లో క్యాటరాక్ట్ (తెల్లముత్యం) చాలా సాధారణంగా కనిపించే సమస్య. కళ్లు మసగ్గా కనిపిస్తున్నా లేదా అక్షరాలు, అంకెలు రెండుగా కనిపిస్తున్నా కంటి డాక్టర్ను సంప్రదించి క్యాటరాక్ట్ నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ అది క్యాటరాక్ట్ అయితే చిన్న శస్త్రచికిత్సతో డాక్టర్లు ఆ సమస్యను పూర్తిగా చక్కబరుస్తారు. ఏవైనా అసాధారణతలు ఉంటే... అసాధారణతలు అంటే మామూలు సగటు వ్యక్తులకు అని అర్థం. ఒకవేళ ఆ వ్యక్తులకు పొగతాగడం, మద్యం, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్లు సూచించిన విధంగా మరికొన్ని అదనపు పరీక్షలు అవసరం కావచ్చు. ఉదాహరణకు... పొగతాగేవారైతే... గుండె పరీక్షలతో పాటు... ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే పీఎఫ్టీ పరీక్ష చేయించుకోవాలి ఆల్కహాల్ అలవాటు ఉన్నవారైతే... కాలేయ సామర్థ్యాన్ని తెలుసుకుని ఎల్ఎఫ్టీ పరీక్ష, గుండె పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవాలి స్థూలకాయం ఉంటే... బీఎమ్ఐ, టీఎస్హెచ్, ఎఫ్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్స్ వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది ∙ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటిని బట్టి మీ ఫిజీషియన్ లేదా డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అరవైలలో ఆరోగ్య పరీక్షలివే... సాధారణంగా మధ్యవయసుకు చేరాక చేయించుకునే పరీక్షలతో పాటు వయసు 60 దాటాక పైన పేర్కొన్న పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు అదనంగా చేయించుకోవడం మంచిది. అవి... బీపీ స్క్రీనింగ్ : ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్ చెయించుకోవడం అవసరం. ఇకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయించాలి కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ : యాభై దాటాక ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించి, అది నార్మల్ గనక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకోమారు కొలెస్ట్రాల్ స్థాయులు తెలుసుకుంటూ ఉండటం మంచిది గుండెకు సంబంధించిన ఈసీజీ, టూ డి ఎకో, టీఎమ్టీ, అవసరాన్ని బట్టి యాంజియోగ్రామ్ లేదా సీటీ యాంజియో వంటి పరీక్షలుఒకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ పరీక్ష తప్పక చేయిస్తూ ఉండాలి. డయాబెటిస్ కోసం: చక్కెర వ్యాధి గురించి తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి. పెద్ద పేగు క్యాన్సర్ పరీక్షలు : పెద్ద వయసులో పెద్దపేగు క్యాన్సర్ లేదని తెలుసుకుని నిశ్చింతగా ఉండటం కోసం... ఏడాదిలో ఒకసారి మల పరీక్షతో పాటు ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభై దాటిన నాటి నుంచి ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది కొలనోస్కోపీ అనే పరీక్షను ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది ∙అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ స్క్రీనింగ్ : పురుషుల వయసు 65–75 మధ్య ఉన్నవాళ్లు... గతంలో వాళ్లకు పొగతాగిన అలవాటు ఉంటే... అయోర్టిక్ అన్యురిజమ్ అనే కండిషన్ కోసం ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది ఇక వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలను, కుటుంబ చరిత్రను, రిస్క్ ఫ్యాక్టర్స్ను బట్టి డాక్టర్ సూచించిన ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు స్త్రీ పురుషులెవరైనప్పటికీ వారికి 65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ తీసుకుని ఉండక΄ోతే ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటినా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ప్రతి పదేళ్లకోమారు టెటనస్–డిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి. గతంలో ఎప్పుడూ తీసుకోక΄ోతే 65 ఏళ్లు దాటక టీ–డాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది). అరవై దాటక షింగిల్స్ లేదా హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు. ఇక సాధారణంగా చూసుకునే పరీక్షలైన బరువు చెక్ చేయించుకోవడం, బాత్రూమ్లో లేదా ఇతరత్రా కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఉల్లాసంగా ఆహ్లాదంగా లేక΄ోతే డిప్రెషన్కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటి ఎవరికి వారు చేసుకునే పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీటితో పాటు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే నాన్నలూ, తాతలూ... లేదా అమ్మలూ అమ్మమ్మలూ, నానమ్మల వయసులో ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకుండా... హాయిగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమన్నది తేలిగ్గానే సాధ్యమవుతుంది.
ఫొటోలు
అంతర్జాతీయం

టెహ్రాన్లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)లోని భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన తొలి రోజున టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 140 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిని వర్శిటీ నుంచి సురక్షితంగా వెళ్లిపోవాలని అక్కడి సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేశారు.టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు క్షణక్షణానికి దిగజారుతున్నాయని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో తమకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని, తాము కిటికీల నుండి బయటకు చూడగా, నల్లటి పొగ ఆవరించి ఉందన్నారు. ఆ తరువాత మరిన్ని పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అన్నారు.తాము ఫైటర్ జెట్ల శబ్దం కూడా విన్నామని, ఆకాశం డ్రోన్లతో నిండిపోయిందని, శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరం శబ్దాలు వినిపించాయన్నారు. ఆ సమయంలో బ్లాక్అవుట్ కావడంతో డార్మిటరీ కింద కూర్చున్నామన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఆ సమయంలో తమకు సహకారం అందించారన్నారు. పేలుళ్లు జరిగిన వెంటనే తమ వైస్-డీన్ వచ్చి, ఏమీ జరగదని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం తమకు లేదన్నారు. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, వీలైనంత త్వరగా టెహ్రాన్ను ఖాళీ చేయాలనుకుంటున్నట్లు వైద్య విద్యార్థులు చెప్పారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో భారత విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారు గుర్తు చేశారు.ఇది కూడా చదవండి: టెహ్రాన్ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్ హెచ్చరిక

టెహ్రాన్ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్(ఇరాన్)లోని పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, వెళ్లిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఆయన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనంటూ పునరుద్ఘాటించారు. పరిస్థితి మరింత దిగజారకముందే ఇజ్రాయల్తో ఏర్పడే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఇప్పడు ఇరాన్కు మరో అవకాశం ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిని ఆయన తన ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధం మరింత తీవ్రమయ్యేందుకు దారితీసేలా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధంపై స్పందించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందన్న ట్రంప్, అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు. కాగా యుద్ధం ముగించాలంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని అంతం చేయాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులు చేసింది. టెహ్రాన్ గగనతలంపై తమ ఆధిపత్యం కొనసాగుతున్నదని ఇజ్రాయెల్ పేర్కొంది. తాము ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇంతలోనే ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం గమనార్హం.ఇది కూడా చదవండి: ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు

ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు
జరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. ఖమేనీని హత్య చేసేందుకు వేసిన ప్లాన్ను ట్రంప్ వ్యతిరేకించారంటూ అమెరికా అధికారులు ధ్రువీకరించిన అనంతరం నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలూ క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి. ప్రపంచం ఈ ఘర్షణలను నిశితంగా గమనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాల్గవ రోజుకు చేరుకుంది. పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశాయి.కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఒక రహస్య బంకర్కు తరలించారని సమాచారం. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ)ఆయనకు భద్రత కల్పిస్తున్నది. అయతుల్లా సురక్షితంగా ఉన్నారని, దేశపు రక్షణ చర్యలను అనుక్షణం పరిశీలిస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్ను ట్రంప్ వ్యతిరేకించారంటూ రాయిటర్స్ పేర్కొంది.ఇది కూడా చదవండి: బైక్పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా

G7 Summit: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. నేడు, రేపు(మంగళ,బుధ) ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. జీ-7 సదస్సులో ప్రధాని పాల్గొనున్నారు. జీ7 కూటమి వార్షిక సదస్సు నిన్న (సోమవారం) కెనడాలో ప్రారంభమైంది.జీ7 ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధాని మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. VIDEO | PM Modi (@narendramodi) arrived at Calgary International airport, Canada, earlier today for the G7 summit.(Source: Third Party) pic.twitter.com/YFjno8J9am— Press Trust of India (@PTI_News) June 17, 2025కాగా, పశ్చియాసియా, యూరప్లో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలపై భారత ప్రధాని మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చిచెప్పారు. వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోదీ, నికోస్ సమావేశమయ్యారు. భారత్–సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.మరోవైపు, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. రెండు దేశాలు వెంటనే వెనక్కి తగ్గాలని, యుద్ధానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఇజ్రాయెల్–ఇరాన్ వెంటనే చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. పరస్పరం కలిసి చర్చించుకొని, ఘర్షణకు తెరతించాలని అన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్ష్యగా ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని తామంతా అంగీకారానికి వచ్చినట్లు బ్రిటిష్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ చెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు సొంతం చేసుకొనేందుకు ఇరాన్ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు. మరోవైపు జీ7 కూటమిపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కనపెట్టడం ప్రపంచాన్ని ఇప్పుడు అస్థిరపరుస్తోందని అభిప్రాయపడ్డారు.
జాతీయం

Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్కి పోతాం!
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు. కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు. 👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్కు మారిపోతాను, కానీ ఈ పని వదలను:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25) 👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు. 👉వైట్ఫీల్డ్లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు. నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందనబైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. తీర్పు ఇలా..కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.మాకు అవసరంబెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.వా.. ఎన్ను ఐడియాఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు.

‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్తో పాటు ప్రియుడు..
షిల్లాంగ్: మధ్యప్రదేశ్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ల హనీమూన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోనమ్ను, అమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. నాడు నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ (Scene Reconstruction) చేశారు.సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్లో ఉండగా, ఒక పథకం ప్రకారం రాజా రఘువంశీ హత్య జరిగింది. రాజా మృతదేహం దొరికిన ఆరు రోజులకు సోనమ్ యూపీలోని ఘాజీపూర్లో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో సోనమ్ తన భర్త హత్యలో తన పాత్రను అంగీకరించింది. అయితే ఆమెపై ఉన్న అభియోగాలను నిరూపించే ఆధారాలను పోలీసులు కోర్టుకు అందించాలి. ఇందుకోసం వారు సోనమ్ను మేఘాలయ తీసుకువచ్చారు.మేఘాలయలోని సోహ్రాలో నేరాల రేటు అతి తక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పర్యాటక ప్రదేశంలో ఎటువంటి హత్య జరగలేదని పోలీసులు తెలిపారు. అందుకే వారు ఈ కేసు దర్యాప్తుపై మరింత దృష్టి సారించారు. నిందితులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మేఘాలయ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ అన్నారు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విచారణ కోసం సోనమ్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నామన్నారు.ఇది కూడా చదవండి: అంబులెన్స్లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’

అంబులెన్స్లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’
డెహ్రాడూన్: అతి తెలివి అనర్థాలకు దారితీస్తుందంటారు. ఈ మాటను పెడచెవిన పెట్టినవారు ఇబ్బందుల్లో పడటాన్ని మనం చూస్తుంటాం. ఇదే కోవలో ట్రాఫిక్ను తప్పించుకునేందుకు, కొందరు టూరిస్టులు ఎంతో తెలివిగా వేసిన ప్లాన్ చివరికి బెడిసికొట్టింది. వారు చేసిన పని పోలీసుల వరకూ చేరింది. విషయం తెలిసినవారంతా తెగ ఆశ్యర్యపోతున్నారు.హరిద్వార్ నుండి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి బయలు దేరిన కొందరు టూరిస్టులు రెండు అంబులెన్స్లను బుక్ చేసుకుని ,వాటిని టాక్సీలుగా మార్చివేశారు. ట్రాఫిక్ను తప్పించుకునేందుకే వారు ఈ పని చేశారు. అయితే చివరికి వారు పోలీసుల దృష్టి మళ్లించలేకపోయారు. వారు టాక్సీలుగా ఉపయోగించిన రెండు అంబులెన్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి డ్రైవర్లకు చలానా వడ్డించారు.జూన్ 14న కొందరు భక్తులు హరిద్వార్ నుండి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి వెళ్లేందుకు రెండు అంబులెన్స్లను బుక్ చేసుకున్నారు. వాటిలో వెళితే ట్రాఫిక్ బారినపడకుండా సులభంగా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చనుకున్నారు. రోగులను ఆసుపత్రికి తరలించడానికి ఉపయోగించే అత్యవసర సేవా వాహనం అయిన అంబులెన్స్ను పోలీసులు అడ్డుకోరని వారు భావించారు. తరువాత వారంతా అంబులెన్స్లలో ఎక్కి, సైరన్లను ఆన్ చేసి, ప్రయాణాన్ని మొదలుపెట్టారు.సోన్ప్రయాగ్ వరకూ వారు అన్ని చెక్పోస్టులను దాటారు. అయితే సోన్ప్రయాగ్లోని చెక్పోస్టు సిబ్బందికి ఆ మార్గంలో రెండు అంబులెన్స్లు వస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదు. దీంతో వారు ఆ అంబులెన్స్లను అడ్డుకున్నారు. వాటిలో కేదార్నాథ్కు వెళ్లే భక్తులు ఉండటాన్ని వారు గమనించారు. వాటిలోని ఒక అంబులెన్స్ రాజస్థాన్ నంబర్తో ఉండగా, రెండవది హరిద్వార్ నంబర్తో ఉంది. ఈ రెండు వాహనాలను మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాల డ్రైవర్లకు జరిమానా విధించారు. కేదార్నాథ్ ద్వారాలు మే 2న తెరిచారు. నవంబర్లో జరిగే ముగింపు వేడుక వరకు ఆలయం తెరచి ఉంటుంది. ఇది కూడా చదవండి: Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

అందుకే లండన్ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025
ఎన్ఆర్ఐ

Indian Student In USA: బేడీలేసి.. బలంగా అదిమిపట్టి
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కార్ కర్కశ వైఖరి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యవహారం ఆలస్యంగా మీడియాకు బహిర్గతమైంది. విద్యార్థిని నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి, దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విద్యాభ్యాసం కోసం తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఒక ప్రవాసభారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక భారతీయ యువకుడిని నెవార్క్ ఎయిర్పోర్ట్కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. నేనే తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కిందపడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. ‘‘ నేరస్తుడిలా సంకెళ్లు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలివేసింది. కలలను నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చిఉంటాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టకపోయినా ఇలా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూస్తూకూడా నేను నిస్సహాయుడినైపోయా. నా హృదయం ముక్కలైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను ఇలా బలవంతంగా పంపేయడం నిజంగా పెద్ద విషాదం. ఆ అబ్బాయి హరియాణా యాస అయిన హర్యాణ్వీలో మాట్లాడుతున్నాడు. ‘‘నాకేం పిచ్చిలేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడిని అని అందర్నీ న మ్మించేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ విద్యార్థి అరవడం ఆ వీడియోలో కనిపించింది. Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ఇండియన్ ఎంబసీ ఆదుకోవాలి‘‘ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్ ఎయిర్పోర్ట్లో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది’’ అని జైన్ రాసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విదేశీ విద్యార్థుల వీసా గడువును ముగించేసి వాళ్లను బలవంతంగా దేశబహిష్కరణ చేస్తున్న వేళ తాజాగా ఈ ఘటన జరగడం గమనార్హం. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ విద్యార్థులను గుర్తించి గెంటేస్తున్న ఉదంతాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువయ్యాయి.

Junicorn Summit 2025: అంతర్జాతీయ వేదికపై పల్లె బాలల ప్రతిభ
సాన్ మార్కస్, టెక్సాస్: టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన ISF గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ AI సమ్మిట్ 2025 చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్కి చెందిన గ్రామీణ ప్రాంతాల నుండి ఎంపికైన 50 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో చిన్నారులు రూపొందించిన ఆవిష్కరణలు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమ్మిట్కు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ISF) ఆధ్వర్యం వహించగా, వ్యవస్థాపకుడు డా. జె.ఎ. చౌదరి దూరదృష్టితో, ISF USA అధ్యక్షుడు అట్లూరి సమన్వయ నాయకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులకు విమాన ప్రయాణం, నివాసం, వర్క్షాపులు, డెమో డే వంటి సౌకర్యాలు ఉచితంగా అందించారు.ప్రత్యక్షంగా ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలుNaturaShe: బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్స్ – గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం రూపొందించిన ప్రయోగం.Sense Vibe: దివ్యాంగుల కోసం రూపొందించిన నావిగేషన్ పరికరం.Jalapatra: తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరంNGreenTech: ఈ-వేస్ట్ రీసైక్లింగ్ మోడల్.. వీటికి తోడు మరెన్నో ఆవిష్కరణలకు ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్, బ్రేకిత్రూ థింకర్, ప్రోటోటైప్, స్టోరిటెల్లింగ్ విభాగాల్లో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డుగత నెలలో ఆకస్మికంగా కన్నుమూసిన రామ్ పుప్పాల జ్ఞాపకార్థం ‘రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ISF USA అధ్యక్షుడు అట్లూరి ప్రకటించారు.లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు – 2025ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి గౌరవప్రదంగా అవార్డులు అందజేశారు.జయ్ తల్లూరి – ఇన్ఫ్రా & సామాజిక అభివృద్ధి,ప్రసాద్ గుండుమోగుల – డిజిటల్ ట్రావెల్ టెక్నాలజీ,స్వాతి అట్లూరి – కళా, సాంస్కృతిక సేవలు,నిశిత్ దేశాయ్ – న్యాయ రంగ మార్గదర్శకత, లాక్స్ చెపూరి – ఇన్నోవేషన్ అవార్డు – టెక్ టాలెంట్ డెవలప్మెంట్.పద్మా అల్లూరి, ప్రకాశ్ బొద్ధాలు ఈవెంట్ యాంకర్లు వ్యవహరించగా, డా. మహేష్ తంగుటూరు, సత్యేంద్ర, శేషాద్రి వంగల, విశాలా రెడ్డి నిర్వాహణలో ముఖ్యపాత్ర వహించారు. వందలాది వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు కలిసి ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మిట్ అనంతరం విద్యార్థులు NASA స్పేస్ సెంటర్, Texas Science Museum, డల్లాస్, ఆస్టిన్ పరిధిలోని ఇన్నోవేషన్ హబ్లను సందర్శించే అవకాశం పొందారు. ఫాలో-అప్ మెంటారింగ్, పెట్టుబడులు, స్టార్టప్ స్కేలింగ్ అవకాశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.విజన్ 2030 – లక్ష్యంISF ప్రకటించిన దీర్ఘకాలిక విజన్ ప్రకారం, 2030 నాటికి లక్ష మంది గ్రామీణ యువ స్టార్టప్ వ్యవస్థాపకులను రూపొందించాలనే ధ్యేయంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు – ఒక సామాజిక ఆవిష్కరణ ఉద్యమం. ISF అధికారికంగా ప్రకటించిన ప్రకారం, జ్యూనికార్న్ సమ్మిట్ 2026 ను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు.

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

టీఏడీ కార్య నిర్వహక బోర్డు ఎన్నిక
కోపెన్హాగన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(Telangana Association of Denmark)(టీఏడీ) 2025–2027 సంవత్సరానికి గాను కొత్తగా కార్యనిర్వాహక బోర్డును ఎన్నుకుంది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు టీఏడీ అభినందనలు తెలియజేసింది. 2025–2027 కాలానికి ఎన్నికైన కార్యనిర్వాహక బోర్డు సభ్యుల జాబితాను, వారి హోదాను టీఏడీ అధికారికంగా ప్రకటించింది. టీఏడీలోని సభ్యులు అంకితభావంతో బాధ్యతాయుతంగా సమాజానికి సేవ చేయడానికి, బోర్డుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపిక అయ్యారని టీఏడీ తెలిపింది. త్వరలో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ సభ్యులు అధికారికంగా తమ బాధ్యతలు చేపట్టనున్నారు. బోర్డుకు ఎంపికైన సభ్యులు, వారి హోదాలు ఇలా ఉన్నాయి.1. ఉపేందర్ గిలకథుల (అధ్యక్షులు) 2. సురేందర్ కేసాని (ఉపాధ్యక్షులు) 3. విజయ్ మోహన్ గోపి (కార్యదర్శి)4. ఈశ్వర్ ఎమ్మడి (కోశాధికారి), 5. పవన్ కుమార్ పబ్బా (టెక్నికల్ మేనేజర్) 6. సతీష్ సామ (విదేశీ వ్యవహారాల మేనేజర్), 7. రాజ్ కుమార్ కలువల (అసెట్ మేనేజర్), 8. రమేష్ వనపర్తి (పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్)9. సులక్షణ చౌదరి కోర్వా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 10. సాయ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 11. సాయికృష్ణా రెడ్డి మిల్కా (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు),12. మహేష్ ఆలేటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 13. దయానంద్ గౌడ్ పడాల (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 14. వాసుదేవ్ గౌడ్ బిక్కి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 15. అఖిల్ కర్నాటి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 16. గోకుల్ దేసు (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 17. రాజేశ్వర్ నీరడి (ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు), 18. శరణ్ యాల్కా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు)
క్రైమ్

అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్కుమార్(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగినమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వినయ్కుమార్ జనగామ పిన్కేర్ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్కుమార్ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు.

బైక్ను లారీ ఢీ.. డ్యాన్సర్లు మృతి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): నృత్య వేడుకలో ప్రదర్శన ఇచ్చి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు యువ డాన్సర్లకు అదే చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన నెలమంగల కుణిగల్ బైపాస్లో సోమవారం వేకువన జరిగింది. బెంగళూరు శ్రీరాంపుర కు చెందిన ప్రజ్వల్ (22), సహన (21) ఇద్దరూ సినిమాల్లో డాన్సర్లుగా నటించడంతో పాటు వేడుకలలో పాల్గొని ప్రదర్శనలిచ్చేవారు. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో స్నేహంగా ఉండేవారు. ఆదివారంనాడు కుణిగల్లో జరిగిన ఈవెంట్లో పాల్గొని తెల్లవారుజామున బైక్పై తిరిగి వస్తున్నారు. వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలై ఇద్దరూ అక్కడే మరణించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025

మోసం చేశాడు సరే.. డబ్బులిప్పిస్తాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి అనుచరులు, వందిమాగధులు చెలరేగిపోతున్నారు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, ప్రజా సంఘాల నుంచి నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ తరుణంలో రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు అల్లుడు వరుసయ్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు పులపర్తి సత్యదేవ్ పెళ్లి చేసుకుంటానంటూ ఒక దళిత మైనర్ బాలిక (17)ను గర్భవతిని చేసి.. అధికారం అండతో ధైర్యంగా తిరిగాడు.ఆమె బిడ్డను కన్న తర్వాత కూడా బుకాయిస్తూ వచ్చాడు. ఏడాది కాలంగా ఈ విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కిపెట్టారు. డబ్బులిప్పిస్తామని.. పెళ్లొద్దంటూ దుప్పటి పంచాయితీ చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ఎట్టకేలకు పోక్సో కేసు పెట్టారు. అయితే అధికార పార్టీ అండదండలతో నిందితుడు పరారీలో ఉన్నాడు. టీడీపీ పెద్దలు డబ్బులిప్పిస్తామంటూ దుప్పటి పంచాయితీ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ సత్యదేవ్ రెండేళ్లుగా వెంటపడుతూ వచ్చాడు. తనకు టీడీపీలో ముఖ్య నేతలంతా సన్నిహితంగా ఉంటారని, తాను ఎంత చెబితే అంత అంటూ నమ్మించి.. ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడు. సత్యదేవ్ మాటలు నమ్మి ఆ బాలిక మోసపోయింది. బాలికతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుని గర్భవతిని చేశాడు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తేలడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషిస్తూ అబార్షన్ చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు సత్యదేవ్ మోసంపై రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథానికి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ సమయంలో కేసు లేకుండా ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకునేలా అధికార పార్టీ నేతలు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకోవడమే పరిష్కారమని బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో అయ్యప్ప దీక్ష తీసుకున్నానని నిందితుడు పెళ్లి వాయిదా వేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికకు ఎనిమిదవ నెల వచ్చేసింది. అబార్షన్ చేయడం ప్రమాదమని వైద్యులు చెప్పి, సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత బిడ్డ్డ ఉన్నట్లుండి చనిపోయాడు. బిడ్డకు వైద్యం అందకుండా చేసి చనిపోయేందుకు సత్యదేవే కారకుడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ అప్పటి నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధిత కుటుంబం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ నెల 4న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు సత్యదేవ్ను పిలిపించి పెళ్లి చేసుకోవాలని వారం గడువు ఇచ్చారు. అయినప్పటికీ బాలికకు న్యాయం జరగలేదు. దీంతో ఈ బాగోతాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి మీడియా ఎదుట బయటపెట్టారు. బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వారు డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత బాలికకు తన అనుచరుడి కారణంగా ఏడాదిగా అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎమ్మెల్యే వాసు ఏమీ ఎరగనట్టు ఉండటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆక్షేపించారు. ఇప్పటికీ బాధిత బాలికకు న్యాయం చేసే బదులు ప్రైవేట్ సెటిల్మెంట్కు ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.మానవతా దృక్పథంతోనే కేసు నమోదులో ఆలస్యంమానవతా దృక్పథంతో ఆలోచించడం వల్లే కేసు నమోదుకు ఆలస్యమైంది. ఈనెల 4న బాధితురాలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. జిల్లా వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమెకు నేను, సౌజన్య కౌన్సెలింగ్ చేశాం. సత్యదేవ్తో తనకు పెళ్లి జరిపించాలని కోరింది. సత్యదేవ్ను, అతని బాబాయిని పిలిపించి మాట్లాడాం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని పది రోజులు గడువు కోరాడు. ఏడు రోజుల్లో స్పష్టం చేయాలని ఇద్దరికీ చెప్పాం. నిందితుడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటతో కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ గడువు తీరిపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్పై క్రైంనెంబర్ 197/2025 యు/ఎస్64(2)(ఎం), 89బిఎన్ఎస్,సెక్షన్ 5(1)ఆర్/డబ్ల్యూ 6ఆఫ్ పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ 3(2)(వి) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు నమోదు చేశాం. సత్యదేవ్ కోసం గాలిస్తున్నాం. బిడ్డ ఎలా చనిపోయిందో కూడా విచారిస్తాం. – బి.విద్య, డీఎస్పీ, తూర్పు జోన్, రాజమహేంద్రవరంఆరేళ్ల బాలికపై అత్యాచారం కర్నూలులో దారుణం నిందితుడిపై పోక్సో కేసుకర్నూలు: కర్నూలులో ఆరేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలో విజయ్కుమార్ అలియాస్ రాజు (40) ఉంటున్నాడు. అదే కాలనీలో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్డాడు. ఇతనికి పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న బాలికను ఇంట్లోకి పిలిచి ఈ నెల 13న దారుణానికి ఒడిగట్టాడు. శనివారం బాలిక మూత్రానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుండటంతో తల్లి కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరిశీలించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే రోజు విజయ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు.