ప్రధాన వార్తలు

మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు.

తల్లికి వందనం మహా మోసం!
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్!వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు.

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.విదియ ప.2.18 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: పూర్వాషాఢ రా.10.54 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ఉ.7.46 నుండి 9.27 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు, తదుపరి ప.12.26 నుండి 1.18 వరకు, అమృత ఘడియలు: సా.5.43 నుండి 7.24 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30. మేషం.. వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు,ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.వృషభం... కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.మిథునం.... సోదరులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కర్కాటకం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.సింహం..... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.కన్య.... రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృశ్చికం....... పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.ధనుస్సు.. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.మకరం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.కుంభం... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.మీనం... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

సూపర్ సిక్స్ అమలు చేసేశాను: చంద్రబాబు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని అన్నారు. తల్లికి వందనం పథకం అమలుపై గురువారం ఆయన ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట మేరకు.. నలుగురు పిల్లలున్న వారికి కూడా ఇస్తున్నామని తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు రూ.13 వేలు చొప్పున వారి తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. మిగతా రెండు వేల రూపాయలు స్కూళ్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి అమ్మ ఒడి మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని చెప్పారు. పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశామన్నారు. ఈ నెల 20న కేంద్రం రైతులకు డబ్బులు వేస్తుందని, అదే రోజు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రం తొలి వాయిదా ఇస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని, దీంతో సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసినట్లేనని తేల్చి చెప్పారు. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై దళితులను బహిరంగంగా లాఠీలతో కొట్టిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ జగన్ ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘దేవతల రాజధాని అమరావతిని వేశ్యల నగరం అంటారా... ఎంత కొవ్వు ఎక్కింది.. మీడియా ఏం చేస్తోంది.. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ 15 వేల మందితో పొగాకు రైతుల దగ్గరకు వెళ్లి రౌడీయిజం చేశారు. పొగాకు క్వింటా రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నాం. రాజకీయ ముసుగులో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. తీవ్రవాదులపైనే పోరాటం చేసిన వాడిని. ప్రజల భద్రత విషయంలో రాజీపడను. ఏం చేయాలో చేసి చూపిస్తా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. 60 శాతం కుటుంబాలకు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్లైనర్
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. సామర్థ్యం ఎంత? ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. టెక్నాలజీ ఎలాంటిది? కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్ విజన్ సిస్టమ్(ఎస్వీఎస్) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో రన్వేపై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మరి లోపాలేంటి? తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్లైన్స్లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్దాకా 787 సిరీస్ల డెలివరీ ఆగిపోయింది.లోపాలను ఎత్తిచూపిన సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజినీర్లు ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్ సంస్థలో ఇంజనీర్గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్ సలేహ్పౌర్ 2024లో ఎఫ్ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్ టిక్ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్పౌర్ ఆరోపించారు.సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా 32 ఏళ్లు బోయింగ్లో పనిచేసిన జాన్ బార్నెట్ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ మాస్్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్

ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో, ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్ నుంచి మయన్మార్లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.ఈ ఏడాదిలో జరగాల్సిందే!అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. అవామీని దూరం చేయకూడదు!ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. అవామీ లీగ్ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.బలం పెంచుకుంటున్న జమాత్!మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్కున్న రిజిస్ట్రేషన్ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు’ జమాత్ నాయకుడు అజహరుల్ ఇస్లామ్ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. అప్పట్లో జమాత్ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ డిమాండ్కు భారత్ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్ చేస్తున్న డిమాండ్కు యూనస్ నిర్ణయించిన ఏప్రిల్ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది. అవామీ లీగ్ స్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్ అధినేత షఫీకుర్ రహమాన్ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

ట్రంప్ కార్డ్ దరఖాస్తులు షురూ
వాషింగ్టన్: సంపన్న వలసదారుల కోసం తెచ్చిన శాశ్వత వీసా పథకం ‘ట్రంప్ కార్డ్’దరఖాస్తులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పలికారు. గోల్డ్కార్డ్గా పిలిచే ఈ దీని కొనుగోలు కోసం trumpcard.gov వెబ్సైట్లో దరఖాస్తు నింపవచ్చని ట్రంప్ ప్రకటించారు. 50 లక్షల డాలర్లతో ఈ కార్డును కొనుగోలు చేయవచ్చని ట్రూత్ సోషల్లో అధ్యక్షుడు వెల్లడించారు. ‘‘ప్రపంచంలోనే గొప్ప దేశమైన అమెరికాలో అడుగు పెట్టడానికి, ఇక్కడ జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. వేలాది మంది కాల్ చేస్తున్నారు’’అని పేర్కొన్నారు. అయితే గోల్డ్ కార్డ్ అమెరికా పౌరసత్వానికి హామీ ఇవ్వదని, నివాసానికి అవకాశం మాత్రమే కల్పిస్తుందని ఆయన సూచించారు. ‘‘ఈ కార్డు పౌరసత్వం ఇవ్వదు. కనుక దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు’’అని ట్రంప్ తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే భారతీయులకు, ఇతర విదేశీయులకు గోల్డ్ కార్డు దారి చూపుతుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇటీవల ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా 1990లో అమెరికా ఈబీ–5 వీసాలను ప్రవేశపెట్టింది. కనీసం 10 మందికి ఉపాధి కల్పిoచే కంపెనీలో 10 లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే ఈ శాశ్వత వీసాలు లభించేవి. వాటి స్థానంలో గోల్డ్ కార్డ్ తేనున్నట్టు ట్రంప్ ఫిబ్రవరిలో ప్రకటించారు. గతంలోలా ఈ వీసాలకు ఉద్యోగాల కల్పన తప్పనిసరి చేయలేదు. ఈబీ–5 వీ వీసాల్లో జరుగుతున్న మోసాన్ని అరికట్టడానికే కొత్త కార్డు తీసుకొస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల గోల్డ్ కార్డులను జారీ చేయాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది.గోల్డ్ కార్డ్ నిబంధనలు» శాశ్వత నివాసం పొందాలంటే కార్డు తీసుకున్న అనంతరం ఐదేళ్లు అమెరికాలోనే ఉండాల్సి ఉంటుంది. » 18 ఏళ్లు నిండి ఉండాలి » ఇంగ్లిష్ మాట్లాడగలగాలి

కేవైసీ అప్డేషన్ ఇక ఈజీ!
ముంబై: కాలానుగుణంగా కేవైసీ అప్డేషన్ను మరింత సులభతరం చేసే దిశగా ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ అప్డేషన్ సేవలను బిజినెస్ కరస్పాడెంట్ల ద్వారా (బీసీలు) చేపట్టేందుకు అనుమతించింది. కస్టమర్లకు నిర్ణిత గడువుతో ముందస్తు నోటీసులు/సమాచారం ఇవ్వాలంటూ బ్యాంక్లతోపాటు తన నియంత్రణల పరిధిలోని ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తదితర) ఆర్బీఐ కోరింది. ‘‘ఖాతాల కేవైసీ అప్డేషన్ విషయంలో పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నట్టు గమనించాం. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం, స్కాలర్ షిప్ ప్రయోజనాల కోసం తెరిచిన ఖాతాలు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది’’అని ఆర్బీఐ ఆదేశాల్లో పేర్కొంది. కస్టమర్ల సౌకర్యం దృష్ట్యా బిజినెస్ కరస్పాడెంట్ల (బీసీలు)ను కేవైసీ అప్డేషన్ పనుల నిర్వహణకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, బ్యాంక్ శాఖలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల కస్టమర్లకు సైతం కేవైసీ అప్డేషన్ సులభతరం కానుంది. ఇందుకు వీలుగా సవరించిన కేవైసీ ఆదేశాలను జారీ చేసింది. 3 పర్యాయాలు సమాచారం ఇవ్వాల్సిందే.. కాలానుగుణ కేవైసీ అప్డేషన్ విషయంలో కస్టమర్లకు బ్యాంక్లు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. కనీసం మూడు పర్యాయాలు కస్టమర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కసారి లేఖ ద్వారా తెలియజేయాలని ఆర్బీఐ పేర్కొంది. ప్రతి ఇంటిమేషన్/రిమైండర్ను నమోదు చేయాలని కూడా ఆదేశించింది. కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతే కస్టమర్ నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకుంటే సరిపోతుంది. తక్కువ రిస్క్ లో ఉన్న కస్టమర్లు గడువులోపు కేవైసీ అప్డేట్ చేయకపోయినప్పటికీ.. అప్పటి నుంచి ఏడాది పాటు లేదా 2026 జూన్ 30 వరకు వారి ఖాతాల్లో అన్ని లావాదేవీలను అనుమతించాలని ఆర్బీఐ కోరింది. కేవైసీ అప్డేషన్ విషయంలో క్యాంపులు నిర్వహించి కస్టమర్లలో అవగాహన కల్పించాలని సూచించింది.

కలియుగ శ్రవణ కుమారుడు
రామాయణ కాలంలో శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బిహార్కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తొంభై ఏళ్ల తన తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని గయలో స్నానానికి తీసుకువెళ్లాడు. ఈ వార్త వైరల్ అయింది. బిహార్లోని కైమూర్ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ సింగ్ అనే అతనికి తన తల్లి అంటే పంచప్రాణాలు. ఆమె అడిగితే ఏమైనా చేస్తాడు. ఆ ముసలి తల్లి ఓ రోజు తన కుమారుడిని తనకు గంగాస్నానం చేయాలని ఉంది చెప్పింది. ఇంతకాలానికి తనకు తల్లి కోరిక నెరవేర్చే అవకాశం దొరికిందని అతడు ఎగిరి గంతేశాడు. అయితే అమ్మను అక్కడికి తీసుకువెళ్లాలంటే ఏదైనా వాహనం మాట్లాడుకోవాలి. అందుకు చాలా ఖర్చవుతంంది. అంత భారం భరించలేడు తను. అందుకోసం అతను తన తల్లిని పసిపిల్లలా ఎత్తి తన మెడలమీద కూచోబెట్టుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమెను వారణాసికి తీసుకువెళ్లాడు. అక్కడ పవిత్రమైన గంగాస్నానం చేయించాడు. ‘‘అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు బిడ్డలకు అమ్మ చేసే సేవలతో పోల్చుకుంటే ఇదెంత? దుస్తులు పాడుచేసుకున్న ప్రతిసారీ బిడ్డకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శుభ్రం చేసి పొడిబట్టలు తొడుగుతుంది. గోరుముద్దలు తినిపిస్తుంది. ఉప్పెక్కించుకుని తిప్పుతుంది. పిల్లలతో గుర్రం ఆట ఆడుతుంది. ఆ బిడ్డలు మాత్రం పెద్దయ్యాక అమ్మనాన్నలను అంతగా పట్టించుకోరు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారికి జీవితంలో అపజయం అంటూ ఉండదని నా నమ్మకం. నేను నా తల్లిని నా బిడ్డలా చూసుకుంటాను. ఆమె తనకు గంగాస్నానం చేయాలని ఉందని చెప్పగానే వాహనం కుదుపులు లేకుండా నేనే తనను ఎత్తుకుని తీసుకువెళ్లాలనుకున్నాను. అందుకే అమ్మను ఇలా తీసుకువచ్చి స్నానం చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది’’ అంటున్నాడు.

రెండో రోజూ 14 వికెట్లు
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రెండో రోజు ముగిసేసరికే ఉత్కంఠభరిత స్థితికి చేరింది. గురువారం కూడా పేసర్ల జోరు కొనసాగడంతో తొలి రోజులాగే మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా తడబడి ఆధిక్యం కోల్పోగా... ఆ తర్వాత రబాడ, ఇన్గిడి దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు కూడాచేతులెత్తేశారు. అయితే ఇప్పటికే ఆధిక్యం 200 దాటిన ఆ్రస్టేలియాదే కాస్త పైచేయిగా కనిపిస్తుండగా... చివరి రోజు సఫారీ టీమ్ ముందు ఎంతటి లక్ష్యం ఉంటుందనేది ఆసక్తికరం. లండన్: ఆ్రస్టేలియా డబ్ల్యూటీసీ ట్రోఫీని నిలబెట్టుకుంటుందా... దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటుందా అనేది శుక్రవారమే తేలే అవకాశం ఉంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఫైనల్లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 43/4తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 57.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ్రస్టేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. బెడింగ్హామ్ (45; 6 ఫోర్లు), బవుమా (36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కమిన్స్ (6/28) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. 12 పరుగులకు 5 వికెట్లు... రెండో రోజు బవుమా, బెడింగ్హామ్ భాగస్వామ్యంతో జట్టు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. లబుషిషేన్ అద్భుత క్యాచ్కు బవుమా వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. బవుమా, బెడింగ్హామ్ ఐదో వికెట్కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెడింగ్హామ్ కొద్దిసేపు పోరాడాడు. అయితే లంచ్ తర్వాత కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది. 126/5తో ఉన్న జట్టు 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో వెరీన్ (13), యాన్సెన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... బెడింగ్హామ్నూ పెవిలియన్కు పంపించి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (7) రనౌట్ కాగా, రబాడ (1) వికెట్తో సఫారీల ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... తొలి ఇన్నింగ్స్కంటే మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి సవాల్ విసరాల్సిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్లో మరింత పేలవంగా సాగింది. ఓపెనర్లు లబుషేన్ (22), ఖ్వాజా (6) తొలి 10 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆసీస్కు సరైన ఆరంభం లభించినట్లు అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జట్టు పతనం మొదలైంది.ఒకే ఓవర్లో ఖ్వాజా, గ్రీన్ (0) లను రబాడ పెవిలియన్ పంపించగా, యాన్సెన్ చక్కటి బంతితో లబుషేన్ను అవుట్ చేశాడు. స్మిత్ (13) ఇన్గిడి బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా... ‘రివ్యూ’ లో దక్షిణాఫ్రికా ఫలితం సాధించింది. వెబ్స్టర్ (9), హెడ్ (9), కమిన్స్ (6) కేవలం 7 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. కేరీ, స్టార్క్ (16 బ్యాటింగ్) 8వ వికెట్ కు 61 పరుగులు జోడించి జట్టు ను ఆదుకున్నారు. దాంతో ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది.‘హ్యాండిల్డ్ ద బాల్’ వివాదం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వెబ్స్టర్ వేసిన 49వ ఓవర్లో బెడింగ్హామ్ బ్యాట్ను తాకిన బంతి అతని కాలి ప్యాడ్ ఫ్లాప్లోకి వెళ్లింది. అది కింద పడే లోపు క్యాచ్ అందుకునేందుకు ఆసీస్ కీపర్ కేరీ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో బెడింగ్హామ్ తన చేత్తో బంతిని తీసి కింద విసిరేశాడు. దీనిపై స్మిత్, ఖ్వాజా ‘హ్యాండిల్డ్ ద బాల్’ గురించి అప్పీల్ చేశారు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు గాఫ్నీ, ఇల్లింగ్వర్త్ చర్చించి అప్పటికే ‘డెడ్బాల్’ అయిందని ప్రకటిస్తూ నాటౌట్గా తేల్చారు. అయితే రీప్లేలు చూస్తే బంతి ప్యాడ్లో ఇరుక్కుపోకుండా ఇంకా ‘రోలింగ్’లోనే ఉండటం కనిపించింది. అది స్పష్టంగా అవుట్ అని, మూడో అంపైర్ను సంప్రదించకుండా ఫీల్డ్ అంపైర్లు వేగంగా నిర్ణయం వెలువరించారని దీనిపై తీవ్ర చర్చ సాగింది. 300 టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ వికెట్ల సంఖ్య. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆ్రస్టేలియా బౌలర్గా నిలిచిన కమిన్స్ 68 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరాడు. స్కోరు వివరాలుఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి) కమిన్స్ 6; బవుమా (సి) లబుషేన్ (బి) కమిన్స్ 36; స్టబ్స్ (బి) హాజల్వుడ్ 2; బెడింగ్హామ్ (సి) కేరీ (బి) కమిన్స్ 45; వెరీన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 13; యాన్సెన్ (సి అండ్ బి) కమిన్స్ 0; మహరాజ్ (రనౌట్) 7; రబాడ (సి) వెబ్స్టర్ (బి) కమిన్స్ 1; ఇన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (57.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30, 5–94, 6–126, 7–126, 8–135, 9–138, 10–138. బౌలింగ్: స్టార్క్ 13–3–41–2, హాజల్వుడ్ 15–5–27–1, కమిన్స్ 18.1–6–28–6, లయన్ 8–3–12–0, వెబ్స్టర్ 3–0–20–0. ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 22; ఖ్వాజా (సి) వెరీన్ (బి) రబాడ 6; గ్రీన్ (సి) ముల్డర్ (బి) రబాడ 0; స్మిత్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 13; హెడ్ (బి) ముల్డర్ 9; వెబ్స్టర్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 9; కేరీ (ఎల్బీ) (బి) రబాడ 43; కమిన్స్ (బి) ఇన్గిడి 6; స్టార్క్ (బ్యాటింగ్) 16; లయన్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 19; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–44, 4–48, 5–64, 6–66, 7–73, 8–134. బౌలింగ్: రబాడ 11–0–44–3, యాన్సెన్ 12–3–31–1, ముల్డర్ 6–0–14–1, ఇన్గిడి 9–0–35–3, మహరాజ్ 2–0–10–0.
బడిబుడి అడుగులు
ఏసీ @ 24.. ఆదా సూపర్
ట్రంప్ కార్డ్ దరఖాస్తులు షురూ
కలియుగ శ్రవణ కుమారుడు
బాపు పట్టుదల.. బడికి పునరుజ్జీవం!
జైళ్లలో డీ అడిక్షన్ సెంటర్లు
‘పీఎం కుసుమ్’లో దళారీలు!
ముందస్తు నివారణ చర్యలే మేలు
పిడుగుపాటుకు ఆరుగురు మృతి
రైలు బోగీలో ప్రసవం
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
ప్రపంచం మన మాట వినట్లేదేం?
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 241 మంది మృతి
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
సాక్షి కార్టూన్ 11-06-2025
ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి : సింగర్ సునీత ఫ్యామిలీ పిక్స్ (ఫొటోలు)
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
సీఎం శాఖలు సీనియర్లకు!
‘హనీమూన్’ కేసు: సోనమ్ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి
చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్లైనర్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
డీఎస్సీ పరీక్షపై స్టే ఇవ్వలేం
ఖైదీ భార్య పాత్రలో..?
రాళ్లు విసిరి.. కేసులు పెట్టి..
ఏఐ మార్కెట్ @ 17 బిలియన్ డాలర్లు
పోలీస్... ఆన్ డ్యూటీ
రామగిరిలో గూండాగిరి
ఏడాది పాలన అంతా అరాచకమే
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
ప్రపంచం మన మాట వినట్లేదేం?
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
ఒక్క లాడెన్కే కాదు! ప్రపంచంలో ఉన్న ప్రతి టెర్రరిస్టుకు ఇక్కడ మాత్రమే సేఫ్!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 241 మంది మృతి
మీరిచ్చిన గూగుల్ మ్యాప్లో లోకేషన్ ఇదే చూపిస్తుంది సార్!
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
ఇంట్లో బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా..!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
సాక్షి కార్టూన్ 11-06-2025
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
సీఎం శాఖలు సీనియర్లకు!
‘హనీమూన్’ కేసు: సోనమ్ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి
చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
సినిమా

పబ్లో అల్లరి... నటిపై కేసు.. అనుకున్నదే జరిగిందిగా!
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అనేది ఒకప్పుడు అవివేకంతో జరిగేది.. ఇప్పుడు అతి తెలివితో జరుగుతోంది. ఆ అతి తెలివి ఎలాంటిది అంటే... వైరంతోనే వైరల్ అవుతామనే అపోహ కల్పిస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో అనవసర వివాదాలతో అవాంఛనీయ ప్రచారాన్ని తెచ్చుకుంటున్న సెలబ్రిటీలు ఎందరో కనిపిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు చుట్టాలున్నారు జాగ్రత్త అనేది సినిమా తీశారు గానీ చట్టాలున్నాయి జాగ్రత్త అనే సినిమా కూడా ఎవరైనా తీసి వీళ్లకి చూపించి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది.ట్రెండింగ్లో కల్పికఅది అలా ఉంచితే... సినీ నటి కల్పిక (Kalpika Ganesh) అనగానే ఒకప్పుడు అయితే ఎవరామె? అని అడిగినవాళ్లే ఎక్కువ. అయితే ఇప్పుడు మాత్రం ఓహో ఆ అమ్మాయా? పబ్లో గొడవపడింది ఆమెనా? అని వెంటనే గుర్తుపడుతున్నారు. మరి ఇలాంటి ప్రచారం ఆమె కెరీర్కు ఎంతవరకూ ఉపకరిస్తుందో ఆమెకే తెలియాలి కానీ.. ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం ఉపకరించదని పోలీసులు తమ చర్యల ద్వారా తేల్చి చెప్పారు.చిలికి చిలికి గాలివానలా..హైదరాబాద్ నగరంలో ప్రిజమ్ పబ్ అంటే తెలియని పార్టీ ప్రియులు ఉండరు. ఓ రకంగా చెప్పాలంటే వందకు పైగా పబ్స్ ఉన్న సిటీలో టాప్ 5 ప్లేస్లో ఉంటుంది. అలాంటి చోటకి వెళ్లి తాను సెలబ్రిటీని కాబట్టి బర్త్డే కేక్ తనకు కాంప్లిమెంట్రీ ఇవ్వాలని అడగడం, దానికి తాము ఒప్పుకోకపోవడంతో కల్పిక గొడవ సృష్టించారని పబ్ సిబ్బంది ఆరోపణ... ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది అనడం కన్నా కల్పిక తన ఇంటర్వ్యూల ద్వారా సోషల్ వేదికలపై హల్ చల్ ద్వారా మరింత రచ్చ చేసింది అనడం సబబుగా ఉండొచ్చు.కల్పికపై కేసుఆ వివాదం ద్వారా ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసింది కల్పిక. దాదాపుగా ఓ వారం రోజుల పాటు ఆ వివాదం సజీవంగా ఉండేలా తన వంతు సఫలయత్నం చేసిందామె. ఏమైతేనేం.. జనం కొత్త వివాదాల అన్వేషణలో తలమునకలవడంతో ప్రస్తుతం కల్పిక వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే పబ్లో గొడవను సామరస్యంగా పరిష్కరిద్దామని తాము చూస్తే ఆ సందర్భంగా కల్పిక తమపై వీరంగం చేసిందనే అభిప్రాయంతో ఉన్న పోలీసులు మాత్రం విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు. పకడ్బందీగా కేసు తయారు చేసి కల్పికను బుక్ చేసేశారు. గత నెలాఖరులో ప్రిజం పబ్లో అల్లర్లు సృష్టించిందనే ఆరోపణలతో నటి కల్పిక గణేష్పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన బ్యూటీపబ్లో గొడవ జరుగుతుందనే సమాచారం మేరకు తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అయితే తమ సమక్షంలోనే నటి పబ్ సిబ్బందిని దుర్భాషలాడిందని కేసు పెట్టారు. అంతేకాక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి కోర్టు నుంచి పోలీసులు అనుమతి కోరారు. అనంతరం గురువారం కోర్టు అనుమతి పొందిన తర్వాత పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో.. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని కల్పికకు పోలీసులు రేపో మాపో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని కల్పిక ఇకపై ఎలా ముగించబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.చదవండి: బొమ్మలా నిల్చున్న జైనబ్.. తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది: తబిత సుకుమార్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ 16 ఏళ్లలో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, ప్రేమ మరింత బలపడుతూనే ఉందంటూ తన భర్త, పిల్లలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రయాణంలో మమ్మల్ని కలిపి ఉంచిన ఆ దేవుడికి కృతజ్ఞతలు.. మేము ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటామని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సుకుమార్- తబిత జంటకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించారు. పుష్ప సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్గా తన పేరు సుస్థిరం చేసుకున్నారు. గతేడాది పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టారు. మరోవైపు టాలీవుడ్లో తబిత సుకుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar)

పచ్చబొట్టు వేయించుకున్న సురేఖావాణి.. బిల్డప్ దేనికంటూ ట్రోలింగ్
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి (Surekha Vani) పచ్చబొట్టు వేయించుకుంది. ఏముందిలే, కూతురు సుప్రిత పేరును టాటూ వేయించుకుని ఉంటుందనుకుంటున్నారేమో! కానే కాదు, తనకెంతో ఇష్టమైన ఏడుకొండలస్వామి పాదుకలను కుడి చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకుంది. అలాగే గోవింద నామాలు కూడా ఉన్నాయి.టాటూ వీడియో..ఇందుకు సంబంధించిన వీడియోను సురేఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో పచ్చబొట్టు వేస్తుండగా సురేఖ నొప్పితో విలవిల్లాడుతుంటే కూతురు సుప్రీత తనకు ధైర్యం చెప్తూ చప్పట్లు కొడుతోంది. అయితే నొప్పిని పంటికింద భరించిన సురేఖ.. చివర్లో ఆ టాటూ చూసి తను పడ్డ కష్టమంతా మర్చిపోయింది. ముందు నా పెదబాబు నడుస్తాడు. ఆయన వెనకాల నేనూ నడుస్తాను. గోవిందా గోవిందా.. అని సురేఖ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆయన వెనకాలే నేనుఇది చూసిన నెటిజన్లు కొందరు ఆమె భక్తికి మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఓవరాక్టింగ్ చేస్తోంది, టాటూ ఉంది కానీ అక్కడ భక్తి లేదు అని విమర్శిస్తున్నారు. అయితే సురేఖకు తిరుమల స్వామివారు అంటే ఎంతో నమ్మకం. ఆ మధ్య తిరుపతిలో ఆమె తలనీలాలు కూడా సమర్పించింది. తనకు ఏ కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా కచ్చితంగా తిరుమల వెళ్తుంది.సినిమాసురేఖావాణి మొదట్లో తెలుగు వెండితెరపై నటిగా రాణించింది. దుబాయ్ శీను, నాయక్, బొమ్మరిల్లు, రెడీ, పిల్లా నువ్వు లేని జీవితం.. ఇలా ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించింది. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబోలో సురేఖావాణి చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో సినిమాల సంఖ్య కూడా తగ్గుతూ పోతోంది. అయితే కూతురు సుప్రీతను హీరోయిన్ చేసింది సురేఖ. చౌదరిగారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి సినిమాతో సుప్రిత హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా

Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్గా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు మహేశ్బాబు, రామ్చరణ్, సూర్య, యశ్, నిఖిల్, అల్లరి నరేశ్, సుకుమార్, బుచ్చిబాబు, తమన్.. ఇలా ఎంతోమంది వచ్చారు.రిసెప్షన్లో హైలైట్..ఈ ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో రిలీజ్ చేశారు. తాజాగా నాగచైతన్య- శోభితల స్పెషల్ ఫోటోను వదిలారు. తమ్ముడి పెళ్లిలో చై సూటుబూటేసుకుని హుందాగా కనిపించగా శోభిత ఎరుపు చీరతో ఆకట్టుకుంది. ఈ చీరకు మ్యాచింగ్గా బంగారు వర్ణం బ్లౌజ్ను ధరించడంతో మరింత ట్రెండీగా కనిపించింది. అటు బరాత్లో చై.. డీజే దగ్గర సందడి చేస్తూ కనిపించాడు. చై సంబరం చూసిన నెటిజన్లు.. తమ్ముడి పెళ్లంటే ఆమాత్రం జోష్ ఉండాలిగా.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) My Demigod Marriage Vibes 🔥King Akhil Chay 🤯Energy Levels 💥#AkhilWedding #AkhilAkkineni pic.twitter.com/EEIhmEyWy5— King Srinu (@KingSrinu0120) June 6, 2025 చదవండి: ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రెండో రోజూ 14 వికెట్లు
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రెండో రోజు ముగిసేసరికే ఉత్కంఠభరిత స్థితికి చేరింది. గురువారం కూడా పేసర్ల జోరు కొనసాగడంతో తొలి రోజులాగే మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా తడబడి ఆధిక్యం కోల్పోగా... ఆ తర్వాత రబాడ, ఇన్గిడి దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు కూడాచేతులెత్తేశారు. అయితే ఇప్పటికే ఆధిక్యం 200 దాటిన ఆ్రస్టేలియాదే కాస్త పైచేయిగా కనిపిస్తుండగా... చివరి రోజు సఫారీ టీమ్ ముందు ఎంతటి లక్ష్యం ఉంటుందనేది ఆసక్తికరం. లండన్: ఆ్రస్టేలియా డబ్ల్యూటీసీ ట్రోఫీని నిలబెట్టుకుంటుందా... దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటుందా అనేది శుక్రవారమే తేలే అవకాశం ఉంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఫైనల్లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 43/4తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 57.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ్రస్టేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. బెడింగ్హామ్ (45; 6 ఫోర్లు), బవుమా (36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కమిన్స్ (6/28) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. 12 పరుగులకు 5 వికెట్లు... రెండో రోజు బవుమా, బెడింగ్హామ్ భాగస్వామ్యంతో జట్టు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. లబుషిషేన్ అద్భుత క్యాచ్కు బవుమా వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. బవుమా, బెడింగ్హామ్ ఐదో వికెట్కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెడింగ్హామ్ కొద్దిసేపు పోరాడాడు. అయితే లంచ్ తర్వాత కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది. 126/5తో ఉన్న జట్టు 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో వెరీన్ (13), యాన్సెన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... బెడింగ్హామ్నూ పెవిలియన్కు పంపించి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (7) రనౌట్ కాగా, రబాడ (1) వికెట్తో సఫారీల ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... తొలి ఇన్నింగ్స్కంటే మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి సవాల్ విసరాల్సిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్లో మరింత పేలవంగా సాగింది. ఓపెనర్లు లబుషేన్ (22), ఖ్వాజా (6) తొలి 10 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆసీస్కు సరైన ఆరంభం లభించినట్లు అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జట్టు పతనం మొదలైంది.ఒకే ఓవర్లో ఖ్వాజా, గ్రీన్ (0) లను రబాడ పెవిలియన్ పంపించగా, యాన్సెన్ చక్కటి బంతితో లబుషేన్ను అవుట్ చేశాడు. స్మిత్ (13) ఇన్గిడి బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా... ‘రివ్యూ’ లో దక్షిణాఫ్రికా ఫలితం సాధించింది. వెబ్స్టర్ (9), హెడ్ (9), కమిన్స్ (6) కేవలం 7 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. కేరీ, స్టార్క్ (16 బ్యాటింగ్) 8వ వికెట్ కు 61 పరుగులు జోడించి జట్టు ను ఆదుకున్నారు. దాంతో ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది.‘హ్యాండిల్డ్ ద బాల్’ వివాదం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వెబ్స్టర్ వేసిన 49వ ఓవర్లో బెడింగ్హామ్ బ్యాట్ను తాకిన బంతి అతని కాలి ప్యాడ్ ఫ్లాప్లోకి వెళ్లింది. అది కింద పడే లోపు క్యాచ్ అందుకునేందుకు ఆసీస్ కీపర్ కేరీ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో బెడింగ్హామ్ తన చేత్తో బంతిని తీసి కింద విసిరేశాడు. దీనిపై స్మిత్, ఖ్వాజా ‘హ్యాండిల్డ్ ద బాల్’ గురించి అప్పీల్ చేశారు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు గాఫ్నీ, ఇల్లింగ్వర్త్ చర్చించి అప్పటికే ‘డెడ్బాల్’ అయిందని ప్రకటిస్తూ నాటౌట్గా తేల్చారు. అయితే రీప్లేలు చూస్తే బంతి ప్యాడ్లో ఇరుక్కుపోకుండా ఇంకా ‘రోలింగ్’లోనే ఉండటం కనిపించింది. అది స్పష్టంగా అవుట్ అని, మూడో అంపైర్ను సంప్రదించకుండా ఫీల్డ్ అంపైర్లు వేగంగా నిర్ణయం వెలువరించారని దీనిపై తీవ్ర చర్చ సాగింది. 300 టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ వికెట్ల సంఖ్య. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆ్రస్టేలియా బౌలర్గా నిలిచిన కమిన్స్ 68 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరాడు. స్కోరు వివరాలుఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి) కమిన్స్ 6; బవుమా (సి) లబుషేన్ (బి) కమిన్స్ 36; స్టబ్స్ (బి) హాజల్వుడ్ 2; బెడింగ్హామ్ (సి) కేరీ (బి) కమిన్స్ 45; వెరీన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 13; యాన్సెన్ (సి అండ్ బి) కమిన్స్ 0; మహరాజ్ (రనౌట్) 7; రబాడ (సి) వెబ్స్టర్ (బి) కమిన్స్ 1; ఇన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (57.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30, 5–94, 6–126, 7–126, 8–135, 9–138, 10–138. బౌలింగ్: స్టార్క్ 13–3–41–2, హాజల్వుడ్ 15–5–27–1, కమిన్స్ 18.1–6–28–6, లయన్ 8–3–12–0, వెబ్స్టర్ 3–0–20–0. ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 22; ఖ్వాజా (సి) వెరీన్ (బి) రబాడ 6; గ్రీన్ (సి) ముల్డర్ (బి) రబాడ 0; స్మిత్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 13; హెడ్ (బి) ముల్డర్ 9; వెబ్స్టర్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 9; కేరీ (ఎల్బీ) (బి) రబాడ 43; కమిన్స్ (బి) ఇన్గిడి 6; స్టార్క్ (బ్యాటింగ్) 16; లయన్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 19; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–44, 4–48, 5–64, 6–66, 7–73, 8–134. బౌలింగ్: రబాడ 11–0–44–3, యాన్సెన్ 12–3–31–1, ముల్డర్ 6–0–14–1, ఇన్గిడి 9–0–35–3, మహరాజ్ 2–0–10–0.

‘సిరీస్ను చిరస్మరణీయం చేసుకోండి’
బెకెన్హామ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ భారత ఆటగాళ్లకు గొప్ప అవకాశమని... అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దీనిని చిరస్మరణీయం చేసుకోవాలని జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఇందు కోసం తమ సహజశైలిని దాటి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాలని అతను అన్నాడు. కోహ్లి, రోహిత్, అశ్విన్ లేకుండా టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో జట్టులోని యువ ఆటగాళ్లు సత్తా చూపించాలని కోచ్ ఆకాంక్షించాడు. ‘ఈ సిరీస్ను రెండు విధాలుగా చూడవచ్చు. ముగ్గురు సీనియర్లు లేకుండా ఆడుతున్నామనే కోణంలో ఒకటి... వారు లేరు కాబట్టి దేశం తరఫున గొప్ప ఆటతీరు కనబర్చేందుకు దక్కిన సరైన అవకాశంగా చూడటం మరొకటి. ఏదైనా ప్రత్యేకంగా సాధించి చూపించాలనే కసి, పట్టుదల నాకు ప్రస్తుత జట్టులో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక గిరి గీసుకొని ఆడినవారు కూడా దానిని దాటి రావాలి. ప్రతీ రోజు, ప్రతీ సెషన్, ప్రతీ బంతి కోసం పోరాడితే ఈ సిరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్తో తొలిసారి టెస్టు టీమ్లో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్, అర్‡్షదీప్ సింగ్లను కోచ్ టీమ్లోకి ఆహ్వానించాడు. ‘తొలిసారి టెస్టు పిలుపు రావడం ఎప్పుడైనా గొప్పగా చెప్పుకోగలిగే ప్రత్యేక సందర్భం. సాయి గత మూడు నెలలుగా అద్భుతంగా ఆడుతున్నాడు. టెస్టుల్లోనూ మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటున్నా. అర్ష్ దీప్ కూడా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎంతో బాగా ఆడాడు. ఇప్పుడు టెస్టుల్లో రాణించాల్సిన సమయం వచ్చింది’ అన్న గంభీర్... తొలిసారి టెస్టు కెపె్టన్గా వ్యవహరించబోతున్న గిల్ను ప్రత్యేకంగా అభినందించాడు. భారత్ గురించి బాగా తెలుసు: మెకల్లమ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు బాగా సన్నద్ధమై వచ్చిందని, అయితే తాము ఏం చేయాలనేదానిపై పూర్తి స్పష్టత ఉందని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. తమ టీమ్ సభ్యులంతా సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతను చెప్పాడు. ‘భారత్ చాలా బలమైన జట్టు. ఎన్నో అంచనాలతో ఇక్కడికి వచ్చింది. అయితే ఒక టెస్టు జట్టుగా మా లక్ష్యాలేమిటో మాకు బాగా తెలుసు. పోరు కోసం సిద్ధంగా ఉన్నాం. కొందరు కీలక బౌలర్లు అందుబాటులో లేకపోయినా ప్రస్తుత పేస్ బృందంలో వైవిధ్యం ఉంది. స్పిన్నర్ బషీర్ ప్రతీ మ్యాచ్కు రాటుదేలుతున్నాడు. బ్యాటర్లలో జేమీ స్మిత్, బెథెల్లాంటి వాళ్లు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో కనిపించే దూకుడుకు ఆట జత కలిస్తే మంచి ఫలితాలు ఖాయం’ అని మెకల్లమ్ తన సహచరుల గురించి విశ్లేషించాడు.

సిఫ్ట్ కౌర్కు కాంస్యం
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 453.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. డ్యూస్టాడ్ జెనెట్ హెగ్ (నార్వే; 466.9 పాయింట్లు) స్వర్ణం, ఎమిలీ జెగీ (స్విట్జర్లాండ్; 464.8 పాయింట్లు) రజతం సొంతం చేసుకున్నారు. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్కు ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీలలో ఇది ఐదో పతకం కావడం విశేషం. మరోవైపు గురువారమే జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్కు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్లో అంకుశ్ జాదవ్ (631.7 పాయింట్లు) 11వ స్థానంలో, అర్జున్ బబూటా (629.1 పాయింట్లు) 43వ స్థానంలో, సందీప్ సింగ్ (628.3 పాయింట్లు) 53వ స్థానంలో నిలిచారు.

బంగ్లాదేశ్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్.. అధికారిక ప్రకటన
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కొత్త వన్డే కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ మెహిదీ హసన్ మీరాజ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం(జూన్ 12) విలేకరుల సమావేశంలో వెల్లడించింది. ఈ ఆల్ రౌండర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. బంగ్లా వన్డే కెప్టెన్గా మెహదీ హసన్ ఏడాది పాటు కొనసాగనున్నాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్తో మీరాజ్ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. మీరాజ్ గతంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో డిప్యూటీగా వ్యవహరించాడు. శాంటో గైర్హజరీలో నాలుగు మ్యాచ్లలో బంగ్లా జట్టును అతడు నడిపించాడు."బంగ్లాదేశ్ కెప్టెన్గా ఎంపికవ్వాలన్ననా కల ఈరోజు నిజమైంది. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన బోర్డుకు ధన్యవాదాలు. ఇది నాకు, నా కుటుంబానికి గర్వకారణమైన క్షణం. మా జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. జట్టును విజయపథంలో నడిపించడమే నా లక్ష్యమని" మెహదీ హసన్ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.మెహిదీ హసన్ ఇప్పటివరకు 105 వన్డేలు ఆడి 1617 పరుగులతో పాటు 110 వికెట్లు పడగొట్టాడు. అతడు ప్రస్తుతం ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. కాగా బంగ్లాదేశ్ జట్టుకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. టెస్ట్ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్ గా ఉండగా, టీ20ల్లో లిట్టన్ దాస్, వన్డేల్లో మెహిదీ హసన్ మీరాజ్ సారథిలుగా ఉన్నారు.చదవండి: WTC Final 2025: చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్గా వరల్డ్ రికార్డు
బిజినెస్

విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్
ఎయిరిండియా విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లు కూడా కుప్పకూలాయి. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో బోయింగ్ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా పతనమయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ విమానాల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.ఏఐ-171 అనే విమానం లండన్ గాట్విక్కు బయలుదేరింది. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, ముగ్గురు చిన్న పిల్లలు సహా 242 మంది ఉన్నారు. రన్ వే 23 నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ పోర్టు వెలుపల కూలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. కాగా విమానంలోని ప్రయాణికులందరూ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.బోయింగ్ 737 మ్యాక్స్, 787 మోడళ్లకు సంబంధించిన ఇటీవలి భద్రతా సమస్యల కారణంగా కంపెనీ ఇప్పటికే రెగ్యులేటరీ, పెట్టుబడిదారుల ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ సంఘటన బోయింగ్ పై కొత్త పరిశీలనను పెంచింది. గురువారం బోయింగ్ షేరు ధర భారీగా పడిపోవడం మరో హైప్రొఫైల్ క్రాష్ వల్ల కలిగే నష్టాలపై ఇన్వెస్టర్ల ఆందోళనను ప్రతిబింబిస్తోంది.ఇదీ చదవండి: ఊహించని ఘోరం.. విమాన ప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి

ఊహించని ఘోరం.. విమానప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై పలువురు వ్యాపార ప్రముఖులు స్పందించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ తదితరులు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అహ్మదాబాద్-లండన్ గాట్విక్ ఎయిరిండియా విమానం 171 ఈ రోజు ఘోర ప్రమాదానికి గురైందని నేను తీవ్ర విచారంతో ధ్రువీకరిస్తున్నాను. ఈ వినాశకరమైన సంఘటనతో ప్రభావితమైన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో, మా ప్రాథమిక దృష్టి బాధితులందరికీ, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపై ఉంది. సంఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయపడటానికి, ప్రభావితులకు అవసరమైన మద్దతు, సహకారం అందించడానికి మేము మా శక్తి మేరకు కృషి చేస్తున్నాము" అని పేర్కొన్నారు.అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఘటనపై స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. "ఎయిరిండియా ఫ్లైట్ 171 దుర్ఘటనతో మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఊహించని నష్టాన్ని చవిచూసిన బాధిత కుటుంబాల వైపు మా హృదయాలు ద్రవిస్తున్నాయి. అధికారులందరితో కలిసి పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తున్నాం" అని రాసుకొచ్చారు.👉ఇదీ చదవండి: విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అహ్మదాబాద్-లండన్ విమానం కూలిన విషాద ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను. నా ఆలోచనలు, ప్రార్థనలు విమానంలో ఉన్న వారు, ప్రభావిత ప్రాంత నివాసితుల వైపే ఉన్నాయి. ప్రతి ఒక్కరి భద్రత,సత్వర అత్యవసర ప్రతిస్పందన కోసం ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఘటన జరిగిన వెంటనే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.Deeply shocked and saddened by the tragic #planecrash of the #AirIndia Ahmedabad-London flight during take off in Ahmedabad having 242 passengers on board. My thoughts and prayers are with all those on board and the residents in the affected area. Wishing for everyone's safety… pic.twitter.com/KjTlFfo1Bn— Parimal Nathwani (@mpparimal) June 12, 2025We are shocked and deeply saddened by the tragedy of Air India Flight 171. Our hearts go out to the families who have suffered an unimaginable loss. We are working closely with all authorities and extending full support to the families on the ground. 🙏🏽— Gautam Adani (@gautam_adani) June 12, 2025

స్టాక్ మార్కెట్లు భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. నిఫ్టీ 50 ఎఫ్ అండ్ ఓ వారాంతపు గడువు ముగియడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం, ట్రంప్ వాణిజ్య ఒప్పందం గడువు సమీపించడం వంటి అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి.ఇంట్రాడేలో 81,523.16 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 823.16 పాయింట్లు లేదా 1 శాతం క్షీణించి 81,691.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 253.2 పాయింట్లు లేదా 1.01 శాతం క్షీణించి 24,888.2 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.73 శాతం, 1.90 శాతం నష్టపోయాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే స్థిరపడ్డాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2.02 శాతం క్షీణించగా, ఫీనిక్స్, గోర్డెజ్ ప్రాపర్టీస్, అనంత్ రాజ్, డీఎల్ఎఫ్, ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్, మాక్రోటెక్ డెవలపర్స్ 3 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 శాతానికి పైగా నష్టపోయాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 27 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, టైటాన్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.54 శాతం పెరిగి 14.01 పాయింట్ల వద్ద స్థిరపడింది.ㅤ ㅤ ㅤ

సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు.
ఫ్యామిలీ

డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్)

To day recipes :మోకాళ్ల నొప్పులకు బెస్ట్ ఇది, మరి జీర్ణశక్తికి!
మన పెద్దల నాటి వంటకం ఇది. ఇపుడంటే చాలామంది మర్చిపోయారు కానీ, మన అమ్మమ్మలు తాతల కాలంలో బాగా ప్రాచుర్యం సంపాదించుకున్నదే. అదే నల్లేరు పచ్చడి. నల్లేరును సాధారణంగా కూరగాయల పాదులపై వాడేవారు. ఉడతలు, తొండలు పూత , పిందెలను కొరికి పాడు చేయకుండా దీన్ని పాదులపై ఉంచేవారు. అయితే నల్లేరు పచ్చడిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు ప్రధానంగా పచ్చడి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయనీ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. మరి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ రోజు నల్లేరు కాడల పచ్చడి, పోషకాలు అందించే వామ్ము ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా.నల్లేరు పచ్చడి కావలసిన పదార్థాలు:నల్లేరు కాడలు (మరీ ఫ్రెష్గా కాకుండా, కాస్త వడిలితే దురదలు రావు) మిర్చి, ఉల్లిపాయలు, టమోటా, పసుపు, కారం, నూనె, చింతపండు, ఉప్పు, తాలింపు కోసం ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు. తయారీ: ముందుగా నల్లేరు కాడలనును శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కడిగేటపుడు చేతులకు గ్లౌజులు వాడటం మంచిది. లేదంటే చేతులు దురదలొస్తాయి. ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమోటా(ఇవి ఆప్షనల్) కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక పాన్ లో నూనె వేసి, మిర్చి, ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత, నల్లేరు ముక్కలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. చిటికెడు పసుపు, కారం, రవ్వంత చింతపండు ఉప్పు వేసి మరికొద్దిసేపు మగ్గించాలి. చల్లారిన తరువాత మెత్తగా రోటిలో (మిక్సీ అయినా పరవాలేదు) దంచుకోవాలి. రుచిచూసుకొని, చివరగా ఇంగువ, ఎండుమిర్చితో పోపు వేసుకుంటే కమ్మని నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో గానీ, రాగి సంగటిలో గానీ కాస్తంత నెయ్యివేసుకుని తింటే ఆహా అనాల్సిందే. రొట్టె, లేదా చపాతీతో గానీ తినవచ్చు. ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే.. వామ్ము ఆకు ఇడ్లీ పచ్చడికావలసిన పదార్థాలు: వామ్ము ఆకులు, పచ్చి మిరపకాయలు,పుట్నాల పప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా, ఉప్పు, చింతపండు, కొత్తిమీర పోపుదినుసులు,తయారీ: ముందుగా ప్యాన్ పెట్టుకుని, చింతపండు, పోపు దినుసులు వేసి వేగిన తరువాత పుట్నాల పప్పువేసి , ఆతరువాత శుభ్రవంగా కడిగిపెట్టుకున్న వామ్ము ఆకులువేయాలి. దీంతోపాటు శుభ్రం చేసుకున్న చింతపండు కూడా వేయాలి. నిమిషంలో వామ్ము ఆకులు మగ్గిపోతాయి. దీన్ని చల్లారిన తరువాత పచ్చి వెల్లుల్లి, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పోపు గింజలువేసి, కొంచెం చిటపటలాడనిచ్చి వాము ఆకుల పచ్చడిని వేసుకోవాలి. ఆపైన శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తమీర జల్లుకుంటే...నోరూరించే వామ్మాకు పచ్చడి రెడీ! ఇది జీర్ణ శక్తికి చాలామంచిది.

వసివాడుతున్న బాల్యం..
అభంశుభం తెలియని చిన్నారులు ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు. బడికి పోవాల్సిన బాలలు బండెడు చాకిరీలో మగ్గిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల పైనే అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా లెక్కల్లోకి రాని వారెందరో..మన దేశంలోనే ప్రతి ముగ్గురిలో ఒకరు బడి ముఖం చూడని వారున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు పిల్ల లను పనిలో పెట్టేలా ప్రోత్సహిస్తుండడంతో..వ్యాపార వర్గాల వారు కూడా తక్కువ వేతనంతో ఎక్కువ పనిని బాలలతో చేయిస్తున్నారు. కొందరు బాలలైతే ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనులు చేస్తూ బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నేడు ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినం సందర్భంగా.. బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల వెతలపై ప్రత్యేక కథనం.. విజయనగరం గంటస్తంభం: చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకారి్మక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.బాలలను పనిలో పెడితే...కఠిన చర్యలుబాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం. ఈ ఏడాది జూన్ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకారి్మకుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. ఎస్డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ (చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..)

ఏ సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలి?
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుని, దుర్గను పూజించిన మంచి ఫలం కలుగుతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువును సాయంత్రం మూడుగంటలకు పూజించిన మంచి ఫలితం కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ. రాత్రి ఆరు నుంచి తొమ్మిదివరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.చదవండి: Murudeshwar Temple Facts: కోరిక కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రంబౌద్ధవాణి : ఆ గౌరవం అనుభవానికే..! ఒక అడవిలో ఏనుగు, కోతి, తిత్తిరి పిట్ట స్నేహంగా జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మూడూ ఒకచోట చేరి సాధక బాధలు చెప్పుకునేవి. తాము గడించిన అనుభవాలు పంచుకునేవి. ఒకరోజున వాటికి ఒక ఆలోచన వచ్చింది. మన ముగ్గురిలో జ్ఞానులు ఎవరు? పెద్ద ఎవరు? పెద్దవారు ఎవరైతే వారికి మిగిలిన ఇద్దరూ నమస్కరించాలి. గౌరవించాలి’’ అని అనుకున్నాయి. అప్పుడు ఏనుగు– ‘‘మీ ఇద్దరికంటే నేనే పెద్దను. గౌరవనీయుడను. ఎందుకంటే ఇదిగో ఈ మర్రిచెట్టు ఇప్పుడు మహావృక్షంగా ఉంది. కానీ ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడే నాకు తెలుసు. నేను ఆ మొక్క మీదినుండి నడిచి΄ోయేవాణ్ణి. అప్పుడు దాని చివరి కొమ్మలు నా పొట్టకు తాకుతూ ఉండేవి’’ అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతి– ‘‘ఓ! మిత్రమా! అలాగా! ఐతే విను. ఈ చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పటినుంచే నాకు తెలుసు. నేను కూర్చొని దీని చిగుర్లు తినేదాన్ని. కాబట్టి నేనే పెద్దను. నన్నే గౌరవించాలి’’ అంది. ఆ రెండింటి మాటలు విన్న తిత్తిరి పిట్ట నవ్వుతూ– ‘‘మిత్రులారా! ఈ చెట్టుకు తల్లి వృక్షం నదీతీరం ఆవల గట్టున ఉంది. దాని కాయలు తిని, ఇటుగా వచ్చి ఇక్కడ రెట్ట వేశాను. అందులోని విత్తనమే ఈ చెట్టుగా మొలిచింది’’అంది. మిగిలిన రెండూ ఆశ్చర్యపడి– ‘‘మిత్రమా! మా ఇద్దరికీ ఈ ఒక్క చెట్టే తెలుసు. నీకు ఈ చెట్టు, దాని ముందరి తరం చెట్టూ తెలుసు. తరతరాల అనుభవం నీది. కాబట్టి నీవే గౌరవనీయుడవు’’అని తిత్తిరికి నమస్కరించాయి. బుద్ధుడీ కథ చెప్పి– ‘‘భిక్షువులారా! పెద్దల్ని మనం అందుకే గౌరవించాలి. మనం వారికి ఇచ్చే గౌరవం వారి వయస్సుకే కాదు, అనుభవానికి’’ అని చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
ఫొటోలు
అంతర్జాతీయం

చైనాతో డీల్: ట్రంప్
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా నడుమ రెండు నెలల వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడ్డట్టే. ఇరుదేశాల మధ్య వర్తక ఒప్పదం ఖరారైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘లండన్లో రెండు రోజుల సంప్రదింపుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నేను, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తుది ఆమోదముద్ర వేయడమే తరువాయి’’ అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇకపై చైనా దిగుమతులపై అమెరికా 55 శాతం సుంకాలు విధిస్తుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 10 శాతం టారిఫ్లు వసూలు చేస్తుంది’’ అని వివరించారు. విభేదాలు ముదిరిన నేపథ్యంలో అమెరికాకు మ్యాగ్నెట్లు మొదలుకుని 17 రకాల అరుదైన ఖనిజాలు తదితరాల ఎగుమతులపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తేయనుందని తెలిపారు. ‘‘బదులుగా చైనాకు కూడా గత ఒప్పందాల మేరకు అన్ని విషయాల్లోనూ తలుపులు తెరుస్తాం. చైనా విద్యార్థులను అమెరికా కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లోకి ఎప్పట్లాగే సాదరంగా ఆహ్వానిస్తాం’’ అని ప్రకటించారు. ‘‘ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుదేశాలకూ లాభదాయక రీతిలో ఒప్పందం కుదిరింది’’ అంటూ హర్షం వెలిబు చ్చారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మొత్తం అరుదైన ఖనిజ నిల్వల్లో 61 శాతం, ఉత్పత్తిలో ఏకంగా 91 శాతం వాటా చైనాదే.

లూటీ.. విధ్వంసం.. కర్ఫ్యూ
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో సరైన పత్రాలులేని వలసదారుల అరెస్ట్లతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. అయితే దీనిని అదునుగా చూసుకుని కొందరు దుండగులు ముసుగులు ధరించి లాస్ఏంజెలెస్ డౌన్టౌన్లో లూటీలకు తెరలేపారు. యాపిల్ ఐఫోన్ స్టోర్సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు. విలువైన వస్తువులను అందినకాడిని దోచుకెళ్లారు. ఉద్యమంవేళ యథేచ్ఛగా లూటీలు, విధ్వంసం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుకాణ సముదాయాల నుంచి పారిపోతున్న ముసుగు ధరించిన దుండగులను అరెస్ట్చేశారు. పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దుకాణాలను యువకులు లూటీలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత నాలుగు రోజుల్లో మొత్తంగా 23 పెద్ద వ్యాపార సముదాయాలు లూటీకి గురయ్యాయని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ చెప్పారు. నగరంలో తాత్కాలిక కర్ఫ్యూస్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలదాకా పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్ కరెన్ ప్రకటించారు. ప్రతిరోజూ ఇదే సమయానికి కర్ఫ్యూను అమలుచేయనున్నారు. ఇలా కొద్దిరోజులపాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. లూటీలు, విధ్వంసానికి పాల్పడిన వారికి గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్లపర్వాన్ని మొదలెట్టారు. అడ్డొచ్చిన వారిపైకి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. డౌన్టౌన్ జిల్లాలోని ఆర్ట్స్ డిస్ట్రిక్, చైనా టౌన్, స్కిడ్ రో, ఫ్యాషన్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుచేశారు. కర్ఫ్యూ మొదలయ్యాక కనీసం 200 మందిని పోలీసులు అరెస్ట్చేశారని మేయర్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా అత్యధిక లూటీలు, విధ్వంసం జరిగిన 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తామని నగర పోలీస్ చీఫ్ జిమ్ మెక్డోనెల్ చెప్పారు. నగరంలో మరింత ఉద్రిక్తంగా మారడానికి ట్రంప్ ‘నేషనల్ గార్డ్’ తరలింపు’ నిర్ణయమే కారణమని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆరోపించారు. సైనికఛత్రంలోకి నగరాన్ని ఇరికించి సమస్యను జటిలంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘ఆందోళనకారులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశానికి శత్రువుల్లా తయారయ్యారు. అల్లరిమూకల అరాచకత్వం ఇక ఎంతమాత్రం సాగనివ్వను. అవసరమైతే తిరుగుబాటు అణచివేత చట్టం,1807ను తీసుకొచ్చి యావత్ సైన్యాన్ని రాష్ట్రంలోకి దింపుతా. లాస్ ఏంజెలెస్లో ఇలాగే అల్లర్లు, ఆందోళనలు కొనసాగితే సిటీని రాష్ట్ర పాలన పరిధి నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తా’’ అని శ్వేతసౌధంలో ట్రంప్ హెచ్చరించారు.కోర్టులో గవర్నర్కు చుక్కెదురున్యూయార్క్ గవర్నర్ అనుమతిలేకుండా అసా ధారణ అధికారాలతో లాస్ ఏంజెలెస్లోకి నేషనల్ గార్డ్, మెరైన్లను పంపుతూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలుపుదలచేయాలన్న న్యూయార్క్ అటార్నీ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ అంశాన్ని గురువారం మరోసారి పరిశీలిస్తామని శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు జడ్జి చార్లెస్ బ్రేయర్ చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల మోహరింపు మున్ముందు మరింత ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఇప్పటికే నేషనల్గార్డ్, మెరైన్లను రప్పించినందుకు ఏకంగా రూ.1,146 కోట్లు ఖర్చయిందని ఆయన వెల్లడించారు. అక్రమవలసదారుల కోసం గాలింపు, అరెస్ట్ విధుల్లో ఉన్న ఫెడరల్ ఏజెంట్లు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే నేషనల్ గార్డ్లకు అప్పగించడంతో వాళ్లు ఆందోళనకారులను అరెస్ట్చేయట్లేదు. అరెస్ట్చేసే అధికారం వీళ్లకు లేదు. దీంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగానే ముసుగు ధరించిన ఆగంతకులు లూటీలు చేయగలిగారు.ఇతర నగరాల్లో ఆందోళనలుకర్ఫ్యూతో లాస్ ఏంజెలెస్లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తక్కువ ప్రాణహాని ఉండే ఉపకరణాలనే వాడుతున్నారు. భాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రే, టేజర్, లాఠీలు, జల ఫిరంగులు, చెవులు చిల్లులు పడే శబ్దాలు వెదజల్లే పరికరాలు, రబ్బర్బుల్లెట్లు బీన్–బ్యాంగ్ రౌండ్లను ప్రయోగిస్తున్నారు.టిక్టాక్ స్టార్పై బహిష్కరణ వేటు16.24 కోట్ల మంది టిక్టాక్ ఫాలోవర్లు ఉన్న ప్రఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ ఖబీ లేబ్ను సైతం అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. వీసా గడువు ముగిశాక సైతం అమెరికా ఉంటున్నందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయనే స్వయంగా అమెరికాను వీడారని వార్తలొ చ్చాయి. సెనెగల్– ఇటాలియన్ మూలాలున్న ఇతను చేసే టిక్టాక్ వీడియో లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతను యూనిసెఫ్ గుడ్విల్ అంబాసి డర్గా ఉన్నారు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోనూ నేషనల్ గార్డ్లను రప్పించామని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ చెప్పారు.

OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్తో కవర్ చేశారని సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్ మస్క్.. యూటర్న్ ఇలా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు. I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.— Elon Musk (@elonmusk) June 11, 2025ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’
జాతీయం

విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తం ప్రయాణికులు దుర్మరణం చెందినట్ల తెలుస్తోంది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతిచెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు.విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు.విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..ఈ ప్రమాదం కూలిన వెంటనే దాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి.. పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)తో మాట్లాడారు. ‘ నేను విమానం కూలినప్పుడు నేను ఇంటిలోనే ఉన్నా. ఒక్కసారిగా బయట నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఏమైందని బయటకి వచ్చి చూశాను. చుట్టూ దట్టంగా పొగ వ్యాపించి ఉంది. అక్కడకు వెళ్లి చూశాను. విమానం కూలిపోయి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అక్కడంతా భయానకంగా కనిపించింది’ అని పేర్కొన్నారు. VIDEO | Ahmedabad plane crash: Here's what an eyewitness said:"I was at home when we heard a massive sound. When we went out to see what had happened, there was a layer of thick smoke in the air. When we came here, dead bodies and debris from the crashed aircraft were scattered… pic.twitter.com/Km0xCm9yde— Press Trust of India (@PTI_News) June 12, 2025

భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్టాప్ రన్వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్ఈస్ట్లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో

ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.— Narendra Modi (@narendramodi) June 12, 2025ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతివిమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.— President of India (@rashtrapatibhvn) June 12, 2025 కాగా, ఈ రోజు గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి?

లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్కు బిగ్ షాక్ తగిలింది.
ఎన్ఆర్ఐ

న్యూయార్క్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.

అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అబుదాబి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అబు ధాబిలోని ఇండియా ఎంబసీ వేదికగా ఎంతో వైభవంగా నిర్వహించబడింది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ - అబుధాబి ఆధ్వర్యంలో జయప్రదంగా సాగిన ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వేడుకకు ప్రేం చంద్, కాన్సులర్(కౌన్సిలర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గౌరవ అతిథులుగా కుమారి ఆయుషి సుతారియా, సెకండ్ సెక్రటరీ (పాలిటికల్) పాల్గొన్నారు. వీరి సమక్షంలో దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది.తెలంగాణ పిల్లలు భారత మరియు యుఏఈ జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి దేశభక్తిని ప్రతిబింబించారు. అనంతరం తెలంగాణ బాలికలు మరియు మహిళలు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వేడుకకు కొత్త అందాన్ని తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో, ధరావత్ రాజ్కుమార్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పేరిణి శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజు, మరియు ఇతర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సంపదను మధురంగా ప్రతిబింబించాయి.ప్రత్యేకంగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు - పావని, అర్చనా, లక్ష్మి తమ కృషితో తెలంగాణ కళా సంపదను ప్రతిబింబించే చిత్ర ప్రదర్శన వేడుకలకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ఎంబసీ ప్రాంగణం తెలంగాణను తలపించేలా అలంకరించబడింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇంతే కాదు, డప్పు కళాకారుల దరువు వేడుక లో మరింత ఉత్తేజం నింపింది. డప్పు కళాకారులు, పోతరాజు కళాకారులు, గుస్సాడీ కళాకారులు మరియు పేరిణి శివ తాండవం కళాకారులు కలిసి చేసిన జుగల్ బంది ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎంబసీ అధికారులను ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సంబరాలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల సంఘాల నాయకులను మరియు ఇతర సాంఘిక సేవ సంఘం నాయకులను శాలువా కప్పి మరియు మొమెంటో ప్రధానం చేసి సత్కరించారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు.. ఈ వేడుక అబూదాబి లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవలసిన జ్ఞాపకంగా మారింది అని అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు తెలియ జేశారు.వేడుకల తదనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిదులందరికి, కార్య క్రమ నిర్వాహకులు తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, మరియు భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంతో ఈ వేడుక మరింత వైభవంగా జరిగింది. వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంబసీ అధికారులకు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్

నా చావుకు.. నా భార్యే కారణం..
సంగారెడ్డి క్రైమ్: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం..పుల్కల్ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్ కుమార్(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది. తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్లో సమాచారం అందించింది. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్ రూమ్కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సాగర్ హైవేపై ఘోర ప్రమాదం
యాచారం(హైదరాబాద్): నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కియా కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం, గుడిబండ గ్రామానికి చెందిన వాస సాయితేజ(24), వాస రాఘవేంద్ర(22), వాస పవన్కుమార్(26), వాస శివకుమార్, వాస సాయికుమార్(ఇద్దరు అన్నదమ్ములు), ఇదే జిల్లా మూసాపేట మండల కేంద్రానికి చెందిన మేకల సందీప్ సమీప బంధువులు. వీరంతా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంగళవారం వాస శివకుమార్ పుట్టిన రోజు కావడంతో బీఎన్రెడ్డి నగర్కు చెందిన స్నేహితుడు శివకుమార్ గౌడ్తో కలిసి..ఉదయం నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ సంబ రాలు ముగించుకుని మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. మాల్ సమీపంలోకి రాగానే నగరం నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సాయితేజ, రాఘవేంద్ర, పవన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్, సాయికుమార్, శివకుమార్ గౌడ్, సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాల్, మన్నె గూడలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పారీ్టకి వెళ్లిన వారిలో పవన్కుమార్ ఒక్కడికే వివాహం జరిగింది. ఇతనికి భార్య వరలక్ష్మి, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి నాలుగు నెలల గర్భిణి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. సాగర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ సాగర్ రోడ్డుపై జరిగిన ప్రమాదంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొన్న సమయంలో భారీ శబ్దం వచి్చందని గ్రామస్తులు తెలిపారు. అతివేగం కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు.

మీ బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగింది
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు. ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు. ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు.

హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.