ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై యాజమాన్యం కాఠిన్యం ప్రదర్శిస్తోంది. ఇకపై ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా తనువు చాలిస్తే వారి కుటుంబంలో అర్హులకు ఉద్యోగం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. గత ఆర్టీసీ బోర్డులోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.