ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వలేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు. బుధవారం ఉదయం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏపీ విభజన అసంబద్ధంగా జరిగిందని, నాలుగన్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్న గవర్నర్.. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన కొనసాగుతోందన్నారు.