రఫెల్ అంశంలో కేంద్రానికి ఊరట | Supreme Court Gives Clean Chit To Modi Govt In Rafale Deal | Sakshi
Sakshi News home page

రఫెల్ అంశంలో కేంద్రానికి ఊరట

Nov 15 2019 8:25 AM | Updated on Mar 21 2024 8:31 PM

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని సుప్రీం స్పష్టంచేసింది. గతంలో కేంద్రానికిచ్చిన క్లీన్‌ చిట్‌కే కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement