భూమిపూజ నిర్వహించిన సీఎం కేసీఆర్‌ | Telangana CM KCR to lay foundation stone for new Secretariat | Sakshi
Sakshi News home page

భూమిపూజ నిర్వహించిన సీఎం కేసీఆర్‌

Published Fri, Jun 28 2019 8:07 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రాష్ట్ర సచివాలయ కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. సచివాలయం డీ–బ్లాక్‌ వెనుక భాగం లోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి పూజ నిర్వహించారు. శృంగేరీ పీఠం వేదపండితులు  పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు శుభసూచకంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ సీఎం కేసీఆర్‌ కుడి చేతికి ఇమామ్‌ జామిన్‌ కట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement