జమ్మికుంట వినాయక నిమజ్జనంలో అపశృతి | Tragedy Incident in Ganesh Immersion at KarimNagar | Sakshi
Sakshi News home page

జమ్మికుంట వినాయక నిమర్జనంలో అపశృతి

Published Sat, Sep 22 2018 7:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

జిల్లాలోని జమ్మికుంటలో శనివారం నిర్వహించిన గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నాయిని చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ తాడు తెగిపడింది. ఈ ఊహించని ఘటనతో నలుగురు గాయపడ్డారు. అప్పటికే ఇదే క్రేన్‌తో రెండు విగ్రహాలను నిమజ్జనం చేయగా మూడో విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విగ్రహం చిన్నది కావడంతో క్రేన్‌పైకి ముగ్గురు భక్తులను అనుమతించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement