జిల్లాలోని జమ్మికుంటలో శనివారం నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నాయిని చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ తాడు తెగిపడింది. ఈ ఊహించని ఘటనతో నలుగురు గాయపడ్డారు. అప్పటికే ఇదే క్రేన్తో రెండు విగ్రహాలను నిమజ్జనం చేయగా మూడో విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విగ్రహం చిన్నది కావడంతో క్రేన్పైకి ముగ్గురు భక్తులను అనుమతించారు.