Ganesh immersion
-
Ganesh Nimajjanam: హుస్సేన్సాగర్లో లక్ష విగ్రహాలు
ఖైరతాబాద్: హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 3 గంటల ముందే పూర్తి చేశామని, సోమవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ ఫ్రీ చేయగలిగామని, ఇదంతా ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వల్లే సాధ్యమైందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లో కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో హుస్సేన్ సాగర్లో ఒక్కరోజే 15 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని తెలిపారు. మొత్తం 11 రోజుల్లో హుస్సేన్ సాగర్లో లక్ష విగ్రహాలు నిమజ్జనం చేశారన్నారు. ఇంకా మిగిలి ఉన్న విగ్రహాలను ప్రణాళిక ప్రకారం నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 1.40కి పూర్తిచేశాం..ఇందుకు సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో చత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేటలకు చెందిన నిర్వాహకులు ముందుకొచ్చి విగ్రహాలను త్వరగా తరలించారన్నారు. ఈస్ట్జోన్, సౌత్ జోన్ల పరిధిలో మండప నిర్వాహకులు ఎంత చెప్పినా ముందుకు రాలేదని, అందుకే ఆలస్యమవుతుందన్నారు. ఇష్టమొచి్చనట్లు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచైనా మండప నిర్వాహకులు మొత్తం ప్రక్రియను అర్థం చేసుకొని పోలీసులకు, జీహెచ్ఎంసీకి సహకరిచాలన్నారు. అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య రెండు భారీ వినాయక విగ్రహాలు ఇరుక్కుపోవడం వల్ల కొంత ఆలస్యమైందని, ఓల్డ్ సిటీ, ఆబిడ్స్ మెయిన్ రోడ్లలో వాహనాలు బ్రేక్ డౌన్ కావడం 4–5 గంటల ఆలస్యానికి కారణమైందన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ట్రాన్స్కో, ఆర్టీఏ సిబ్బంది, అధికారులు 40 గంటల పాటు నిద్రాహారాలు మాని పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే గొడవలు చాలా తగ్గాయని, చిన్న చిన్న గొడవలు జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచి్చన వెంటనే పరిష్కరించామని తెలిపారు. మొదటి ఫేజ్, రెండవ ఫేజ్లలో కలిపి సిటీ పోలీసులు 15 వేల మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది మొత్తం 25 వేల మంది పోలీసులు నిమజ్జనోత్సవాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. మొత్తం మీద నిమజ్జనోత్సవాలను సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నానని నగర సీపీ తెలిపారు. -
Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం వేళ డీజేల హోరు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వినాయకుడు మోత మోగించేశాడు. గణేష్ నిమజ్జనం వేళ డీజేలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాలలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. పీసీబీ పరిమితులను గణేష్ మండప నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్ధరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా పీసీబీ, మున్సిపల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉గణేష్ ఊరేగింపుల్లో డీజేల చప్పుళ్లు, లౌడ్ స్పీకర్లు, జనరేటర్ల వినియోగం, టపాసులు కాల్చడం, వాహనాల హారన్లు, యువతీయువకులు బూరలతో శబ్దాలు చేయడం తదితర కారణాలతో నిమజ్జనం వేళ పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదైంది. ప్రధానంగా హుస్సేన్సాగర్, అబిడ్స్, బహదూర్పురా, చార్మినార్, ఖైరతాబాద్, సరూర్నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది. ఆయా ప్రాంతాల్లోని నివాసితులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేరే రాష్ట్రాల్లో కేసులు.. పుణే, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో అధిక శబ్దాలను గుర్తించేందుకు పోలీసులు ప్రధాన రహదారుల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేశారు. కానీ, వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి.వినికిడి సమస్యలు.. మితిమీరిన శబ్దాలతో చిన్న పిల్లల కర్ణభేరి సూక్ష్మ నాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు వినికిడి శక్తి లోపించే ప్రమాదం ఉంది. పరిమితికి మించి శబ్ధాలతో తలనొప్పి, చికాకు, గుండె స్పందనలో వేగం, రక్త ప్రసరణ పెరగడంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 65 డెసిబుల్స్కు మించిన ధ్వనితో గుండె జబ్బులు, చెవుడు కూడా రావచ్చు. -
మహా గణపయ్య నిమజ్జనంలో పాల్గొన్న మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి
-
గణనాథుడికి ఘన వీడ్కోలు
-
వినాయక విగ్రహాలతో నిండిపోయిన ట్యాంక్ బండ్.. ఫుల్ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో గణేష్ విగగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.ఇక, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్లో విగ్రహాలను తరలిస్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కాగా, సోమవారం అర్ధరాత్రి వరకు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి. నేడు రోజు కూడా నిమజ్జనాల ప్రక్రియకు మరింత సమయం పట్టనుంది. నిన్నటి నుంచి నిమజ్జనం కోసం గణపతి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. దీంతో, ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ.. పోలీసుల అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్లో ఒక వైపు రోడ్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. అలాగే, విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని మరో రోడ్లోకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇక, ట్యాంక్ బండ్పై నిమజ్జనం కోసం ఇంకా ఐదువేల వరకు విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: లంబో‘ధర’ లడ్డూ! -
గణేష్ నిమజ్జనంలో విషాదం.. చెరువులో పడి యువకుడి మృతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: వినాయకుడి నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు గణేషుడిని చెరువులో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందాడు. ప్రవీణ్ మృతదేహం వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చదవండి: ఉత్సాహంగా వినాయక నిమజ్జనం -
నిఘా నీడలో.. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
-
Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్సాగర్లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు. రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం... కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్బండ్పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్బండ్పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు. ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయేపటిష్టంగా బారికేడింగ్ నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవీ లోపాలు... ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్ఫామ్కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాలో శనివారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జనం అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటమునిగి మృతి చెందాడు. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ బొల్లారం తండాకు చెందిన మాజీ సర్పంచ్ మాంగ్యా నాయక్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి పలువురు యువకులు సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో కరంతోడ్ సురేందర్ అలియాస్ హంజా(28) నీటిలో మునిగాడు. ఈ విషయాన్ని గమనించని మిగతా యువకులు విగ్రహాన్ని నీటిలోకి నెట్టారు. ఈ క్రమంలో విగ్రహం మీద పడి హంజా నీటిలో మునిగిపోయాడు. నిమజ్జనం తర్వాత రోడ్డుపైకి వచ్చిన యువకులకు హంజా కనబడకపోవడంతో తిరిగి నీటిలోకి వెళ్లి చూడగా విగ్రహం కింద పడి విగతజీవిగా కనిపించాడు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గణేష్ నిమజ్జనాలు.. రూట్ మ్యాప్ ఇదే
-
Ganesh immersion: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న జరిగే గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్బోర్డు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్సరీ్వసెస్, ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతోపాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పను లు చేయనున్నారు. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధుల్లోనూ నిమజ్జనాలు జరిగే ప్రాంతాలవారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటరుకు ఒక గ్రూపుచొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. గణేశ్ యాక్షన్ టీమ్స్ పేరిట ఇవి మూడు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఒక్కో టీమ్లో ప్రాంతాన్ని, అవసరాన్ని బట్టి అయిదుగురు నుంచి పన్నెండు మంది వరకు కారి్మకులుంటారు. దాదాపు మూడు వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధుల్లో పాల్గొంటారు. ఇబ్బందులు తలెత్తకుండా: ఆమ్రపాలి శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. మండపాల నుంచి నిమజ్జనాలు జరిగే చెరువులు, కొలనుల దాకా భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులకు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ సిబ్బంది, జీవవైవిధ్య విభాగం, ఇంజినీర్లు కమిటీగా ఏర్పడి మండపాల నిర్వాహకుల సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 73 కొలనుల్లో ఏర్పాట్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 73 కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాటు చేసినట్లు ఆమ్రపాలి పేర్కొన్నారు. వాటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 తాత్కాలిక కొలనులు ఉన్నాయన్నారు. వీటితోపాటు 5 పెద్ద చెరువుల (సరూర్ నగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్పురా మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు) వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కలి్పంచనున్నట్లు పేర్కొన్నారు. నమో.. మహా గణనాథా ఒక్కరోజే 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచి్చనట్లు అంచనా. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల నుంచి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో సోమవారం దర్శనం ఉండదని సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్కుమార్ తెలిపారు. నిర్వాహకులు మాత్రం సోమవారం భక్తులు మహా గణపతిని దూరం నుంచి దర్శించుకోవచ్చన్నారు.బాలాపూర్ నుంచి.. ట్యాంక్బండ్ వరకు నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీజీపీ, సీపీలు చాంద్రాయణగుట్ట/పహాడీషరీఫ్: ఈ నెల 17న జరిగే బాలానగర్ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని డీజీపీ డాక్టర్ జితేందర్తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, సు«దీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు సీపీలు (శాంతి భద్రతలు) విక్రం సింగ్, పి.విశ్వప్రసాద్ (ట్రాఫిక్)లు ఇతర శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు బాలాపూర్ గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జనం రూట్లోని రాయల్ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, ఇంజన్లి, శంషీర్గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్దర్వాజా మోడ్, శాలిబండ, చారి్మనార్, గుల్జార్హౌజ్, మదీనా, అఫ్జల్గంజ్, మొజంజాహీ మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ట్యాంక్బండ్ వరకు 19 కిలోమీటర్ల రూట్ను పరిశీలించారు. అధికారులతో మహేశ్వరం, సౌత్, సౌత్ ఈస్ట్ డీసీపీలు సునీతా రెడ్డి, స్నేహ మెహ్రా, కాంతిలాల్ సుభాష్ పాటిల్, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత ్డ ఉన్నారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 👉 రహదారులపై వ్యర్థాలు తొలగించేందుకు గణేశ్ యాక్షన్ టీమ్లు 160. 👉 అందుబాటులో ఉంచిన మినీ టిప్పర్లు 102, జేసీబీలు 125. 👉 మొబైల్ టాయ్లెట్స్ 309 👉 తాత్కాలిక వీధి దీపాలు 52,270. 👉 రోడ్ల మరమ్మతులు, ప్యాచ్వర్క్స్కు సంబంధించిన పనులు 172. 👉 వీటికి చేసిన వ్యయం రూ.12.77 కోట్లు. 👉 రవాణాకు సంబంధించిన పనులు 36. వ్యయం రూ.16.35 కోట్లు. పనులన్నీ పూర్తయినట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్వర్క్ పనులు పూర్తి కాలేదు. -
HYD: కీలకఘట్టం.. 17న మహా నిమజ్జన సెలవు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం ఈ నెల 17న (మంగళవారం) జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17కి బదులుగా నవంబర్ 9(రెండో శనివారం)న పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 7న మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 17తో ముగియనున్నాయి.నిమజ్జనాలు నేపథ్యంలో నగర పోలీసులు, అదనపు బలగాలతో కలిపి దాదాపు 25 వేల మంది బందోబస్తు, భద్రత విధులు నిర్వర్తిస్తారని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నిమజ్జనంతో పాటు 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్క అడుగుతో మొదలై 70 అడుగులకు..హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఏడాది కూడా ట్యాంక్బండ్పై నిమజ్జనాలు నిషేధించామని చెప్పిన ఆయన ఎన్టీఆర్ మార్గ్తో పాటు పీవీ నరసింహారావు మార్గ్ల్లో అవసరమైన అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.మరోపక్క కమిషనరేట్లోని జోన్ల వారీగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆనంద్ శుక్రవారం వెస్ట్ జోన్పై సమీక్షించారు. మాసబ్ట్యాంక్లో డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, టాస్్కఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. కమ్యూనల్ రౌడీలను కట్టడి చేయాలని, సోషల్ మీడియా ద్వారా వదంతులు, సున్నిత అంశాలు సంబంధించిన వీడియోలు ప్రచారం చేసే వారిపైనా నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. -
అనంతపురం జిల్లాలో సందడిగా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
హుస్సేన్సాగర్లో నిమజ్జనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
#Hyderabadసాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే, హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్సాగర్లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ట్యాంక్ బండ్లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం. ఈ సందర్భంగా అధికారుల చర్యలను హైకోర్టు సమర్థించింది. 2022లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాము. పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేం. కానీ, పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్లో నిమజ్జనం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చు అని ధర్మాసనం చెప్పింది. #Tankbundఇదిలా ఉండగా.. కోర్టులో పిటిషన్పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. No idol immersion on Tank bund ✅ pic.twitter.com/ZwQBdao8LQ— Sreekanth B+ ve (@sreekanth324) September 10, 2024 #RajaSingh Comments..ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం రేవంత్, జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపై వివరణ ఇవ్వాలి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్కు నిమజ్జనానికి విగ్రహాలు వస్తాయి. నిజంగా హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే ఈ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయిస్తారు. ఇప్పటికే ప్రజలు ఎన్నో సందేహాలతో ఉన్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ట్యాంక్ బండ్లో విగ్రహాలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారో జీహెచ్ఎంసీ కమిషనర్ బయటకు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. There seems to be some confusion regarding the immersion of Ganesh idols at Vinayaka Sagar (Tankbund). I kindly request Telangana CM @revanth_anumula garu and the @GHMCOnline Commissioner to provide clarity on this matter as a priority.Ensuring clear guidelines will help in… pic.twitter.com/JmWthMZyze— Raja Singh (@TigerRajaSingh) September 10, 2024ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే -
అమెరికా విస్కాన్సిన్ స్టేట్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
మాడిసన్: విదేశాల్లో గణనాథుడి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్టం విస్కాన్సిన్ స్టేట్లోని సన్ ప్రైరీలో తెలుగు వాళ్లంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించి.. సోమవారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అభిషేక్ సింధుజ, సంతోష్ ప్రణయ, ప్రసాద్ రమ్య, క్రాంతి కవిత, సంతోష్ ఉష తదితరులు పాల్గొన్నారు. -
హుస్సేన్సాగర్లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వినాయకచవితి నవ రాత్రుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై రేపు(మంగళవారం) విచారణ జరుగనుంది.కాగా, హుస్సేన్సాగర్లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై వాదనలను రేపు(మంగళవారం) వింటామని న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో రేపు వాదనలు జరుగనున్నాయి. -
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద బాలుడు మృతిచెందాడు. గణనాథుడిని తీసుకొస్తున్న లారీ టైర్ కిందపడి బాలుడు మృతిచెందాడు. మృతిచెందిన మైనర్ కిషన్బాగ్కు చెందిన ప్రణిత్కుమార్గా గుర్తించారు. మరో ప్రమాదంలో.. బషీర్బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో లారీ టైర్ కింద పడి ఒకరు మృతిచెందారు. సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం.. నిమజ్జనం చేయడానికి బైక్పై వస్తుండగా, బైక్ స్కిడ్ కావడంతో కుటుంబసభ్యులు కిందపడ్డారు. నాలుగేళ్ల ఆయుష్పై నుంచి టక్కర్ వాహనం వెళ్లడంతో నిలోఫర్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు
-
భక్త 'గణ' యాత్ర
సాక్షి, హైదరాబాద్: గణపతి నిమజ్జన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం నలువైపుల నుంచి తరలి వచ్చిన భక్తజన సందోహంతో సాగరతీరం సందడిగా మారింది. ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ప్లాజా తదితర ప్రాంతాల్లో ‘జై బోలో గణపతి మహారాజ్కీ జై ’అంటూ నినాదాలు హోరెత్తాయి. వైవిధ్య భరితమైన వినాయక మూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భక్తుల నినాదాలు, నృత్యాలతో కూడిన శోభాయాత్రతో మహానగరం ఆధ్మాత్మికతను సంతరించుకుంది. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిశాయి. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్త జనందోహం నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్. రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, సచివాలయం, ఎన్టీయార్మార్గ్ మీదుగా ఉదయం 11.40 గంటలకు 4వ నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12.24 గంటలకు చివరి పూజ నిర్వహించిన గంట తరువాత మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విభాగాల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేకత ఉందని పది రోజుల్లో 50 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో భారీగా పోటెత్తిన భక్త జనం వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ మహాగణపతి నిమజ్జన వేడుకలు ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి బొజ్జ గణపయ్యలు సాగరతీరంలో నిమజ్జనానికి తరలివచ్చారు. మధ్యలో స్వాగత వేదికలు గణపతులకు సాదర స్వాగతం పలికాయి. రకరకాల ఆకృతులలో అందంగా రూపుదిద్దుకున్న మూషికవాహనుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటి సోషల్ మీడియాను ప్రతిబింబించే చిన్న చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తీసుకొచ్చారు. అబిడ్స్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్లతో అలంకరించిన విగ్రహాలు, కాగితంతో అందంగా తీర్చిదిద్దిన పర్యావరణ గణపతులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హుస్సేన్సాగర్లో నిమజ్జనం కోసం అమరవీరుల స్మారక చిహ్నం వద్ద బారులు తీరిన వినాయక విగ్రహాలు ఏరియల్ నిఘా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీస్శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీ స్ కమిషనర్లు వినాయక నిమజ్జన ప్రాంతాలు పరిశీలించారు. హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు మహమూ ద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి డీజీపీ అంజనీకుమార్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. హెలికాప్టర్లో శోభాయాత్రను, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కూడా పాల్గొన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా శోభయాత్రను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల లైవ్ ఫీడ్ను చూస్తూ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నగరం ఆధ్యాత్మిక సంద్రమైంది. ఎటుచూసినా భక్తజన సందోహం.. అంతటా గణనాథుని నిమజ్జన వేడుకల కోలాహలం.. దారిపొడవునా వినాయకులకు ఘన స్వాగతాలు.. ట్యాంక్బండ్లు, చెరువుల వద్ద వీడ్కోళ్లు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జనోత్సవం మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిసింది. -
హైదరాబాద్లో వర్షం.. వానలోనే గణనాథుల నిమజ్జనం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటం ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. బషీర్బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, హిమాయత్నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, వర్షంలోనే గణనాథులు ట్యాంక్ బండ్పైకి తరలి వస్తున్నాయి. వర్షంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విగ్రహాల తరలింపునకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ముగిసింది. #28SEP 5PM⚠️ HEAVY THUNDERSTORMS ALERT FOR South -East #Hyderabad ⛈️#SaroorNagar,#Uppal,#Malakpet,#Amberpet ,#Ou ,#Secunderabad surroundings Seeing Intense Downpour⛈️⚠️ & These Stroms will Later Spread towards Central City.,#HyderabadRains pic.twitter.com/fjHhxcvUxR — Hyderabad Rains (@Hyderabadrains) September 28, 2023 Hyderabad right now! #rain #hyderabadrains #weather pic.twitter.com/r8lyCBXmEg — Stella Paul (@stellasglobe) September 28, 2023 మరోవైపు.. హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాయత్నగర్, కవాడిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్పేట్, ఓయూ, తర్నాక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. #24HrWx #Telangana #Hyderabad High chances of thunderstorms in parts of the city particularly in the evening time. pic.twitter.com/fBpORkJxeg — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) September 28, 2023 RED WARNING FOR HYDERABAD ⚠️ As expected, Huge thunderstorms clouds forming in Central Zone like Himayatnagar, Kavadiguda, Narayanguda, Musheerabad, Uppal, Amberpet, OU, Tarnaka side will later cover other parts too. Get ready for the blast 🔥⚡️⚡️⚡️⚡️#HyderabadRains — Telangana Weatherman (@balaji25_t) September 28, 2023 Pouring really hard. Almost like a curtain/waterfall. Can't see anything. Video somehow there's some visibility. #HyderabadRains pic.twitter.com/PmVPU4dEHd — VT-RRB ◢◤ (@rb_41) September 28, 2023 -
ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి తరలివస్తున్న గణనాధులు
-
ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం
-
Khairatabad Ganesh Nimajjanam 2023: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. నిమజ్జనం (ఫొటోలు)
-
రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, రంగారెడ్డి: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం. ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డూ. ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట ముగియడంతో కాసేపట్లో నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు. బాలాపూర్ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే.. ► 1994లో కొలను మోహన్రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000 ►2000లో కల్లెం ప్రతాప్రెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,10,000 ►2010లో కొడాలి శ్రీధర్బాబు..రూ.5,35,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు... ►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్రెడ్డి... రూ. 18,90,000 ► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి ► 2023లో 27 లక్షలు దాసరి దయానంద్రెడ్డి -
బాలాపూర్ లడ్డు వేలం 2023
-
ఖైరతాబాద్ గణేశుడి చివరి పూజ.. దర్శనం నిలిపివేత..
-
గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా(జంట నగరాల్లో) ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. అయితే, రేపు(గురువారం) ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. గణేష్ నిమజ్జనం సందర్బంగా మెట్రో సమయాల్లో మార్పులు చేశారు. ప్రయాణీకులకు గురువారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మెట్రో ట్రైన్ సేవలు అందుబాటులో ఉండనున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అలాగే, మెట్రో సర్వీలసులను కూడా పెంచినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి ఒంటి గంటకు అన్ని స్టేషన్ల నుంచి చివరి సర్వీస్ బయలుదేరి అర్థరాత్రి 2 గంటలకు చివరి స్టేషన్లకు చేరుకుంటాయని వెల్లడించారు. మరోవైపు.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వాన కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా గణనాథుల నిమజ్జనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Get ready to celebrate Ganesh Nimarjan like never before! 🙏 Hyderabad Metro is here to make your festivities extra special. 🚇 𝗝𝗼𝗶𝗻 𝘂𝘀 𝗮𝘀 𝘄𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝗱 𝗼𝘂𝗿 𝗼𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗵𝗼𝘂𝗿𝘀 𝗳𝗿𝗼𝗺 𝟲 𝗔𝗠 𝗼𝗻 𝟮𝟴𝘁𝗵 𝗦𝗲𝗽𝘁𝗲𝗺𝗯𝗲𝗿 𝘁𝗼 𝟭 𝗔𝗠 𝗼𝗻… pic.twitter.com/Rl8H2oktwB — L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 27, 2023 -
హైదరాబాద్ మహానగర వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
-
ట్యాంక్ బండ్పై భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంతో ట్యాంక్ బండ్పై కోలాహలం నెలకొంది. అయితే ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఓ విగ్రహ తీసుకెళ్తున్న వాహనం నిలిచిపోగా.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఇది చోటు చేసుకోగా.. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. ట్రాక్టర్పై విగ్రహం తీసుకెళ్తుండా.. టైర్ డ్యామేజ్ అయ్యి వాహనం ఆగిపోయింది. దీంతో ట్యాంక్ బండ్ వద్ద భారీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి దాకా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోలేదని వాహనదారులు మండిపడుతున్నారు. మరోవైపు పీవోపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) విగ్రహాల నిమజ్జనం తాత్కాలిక కుంటల్లోనే చేయించాలంటూ జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ట్యాంక్ బండ్పై నిన్న నిరసన చేపట్టారు కొందరు. -
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం
సాక్షి, పల్నాడు జిల్లా: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వీధుల్లో, వ్యాపార సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల నిమజ్జనం మహోత్సవంలో పలు అపశ్రుతి, అనుకోని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కరెంట్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. సోమవారం వినాయకుడి ఊరేగింపు చూసేందుకు 13 ఏళ్ల బాలుడు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగిలి బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వేడుకగా చక్రస్నానం -
అమెరికాలో గణేష్ నిమజ్జనం వేడుకలు
-
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫోటోలు)
-
నిమజ్జనంలో విషాదం.. చావును ఏరికోరి తెచ్చుకోవడం అంటే ఇదే!
సాక్షి, అన్నమయ్య: రాజంపేటలో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు చేయబోయి ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటిదాకా సంతోషంగా గంతులేసిన వ్యక్తి.. అరక్షణంలో రక్తపు మడుగులో పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయయారు. రాజంపేట పట్టణంలో శనివారం కిరణ్ అనే వ్యక్తి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్న కిరణ్.. రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో విగ్రహం తీసుకెళ్తున్న ట్రాక్టర్ బంపర్పై నుంచి దూకి విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే.. ఆ ఊపులో తల సరాసరిగా రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్నవాళ్లు కడప ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో నరాలు దెబ్బ తిన్నాయని.. ఆపరేషన్ అవసరమని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మద్యం మత్తులో వినోదానికి పోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. -
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు వాయిదా
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీన గణేష్ నిమజ్జనం ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ నిమజ్జనం ఉన్నందున.. వచ్చే నెల ఒకటో(అక్టోబర్ 1వ) తేదీన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్ణయించాలని మత పెద్దలు నిర్ణయించారు. -
హైదారాబాద్లో వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: హైదారాబాద్లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయరాదని తెలిపింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయవద్దని గతేడాది హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. పీవోపీ విగ్రహాలు ప్రత్యేక కృత్తిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. అయితే గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలన్న తయారీదారుల పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని వినాయక విగ్రహ తయారీదారులు తమ పిటిషన్లో కోరారు. గతేడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ తెలిపారు. అయితే ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25కి వాయిదా వేసింది. చదవండి: కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం -
నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్ నిఘా వేశాయి. మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్ కృషిని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినులపై హెచ్ఎం అసభ్యకర ప్రవర్తన మహబూబాబాద్ రూరల్: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం షేక్ సర్వర్ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాందాస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్ పాషాను సస్పెండ్ చేశారు. (చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..) -
గణేశుడి నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి, సూర్యాపేట: గణేశుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కోటినాయక్ తండాలోని ఎస్సారెస్పీ కాల్వలో శుక్రవారం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. తండాలో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహానికి ప్రజలు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం తండా శివారులోని ఎస్సారెస్పీ కాలువ 71 డీబీఎం 36ఎల్ వద్ద నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో తండాకు చెందిన బానోత్ సూర్య(55) కాల్వలోని మెట్లు దిగుతూ కాలుజారి నీళ్లలో పడ్డాడు. నీటి ప్రవాహానికి సూర్య కొట్టుకుపోతుండగా అతడిని రక్షించేందుకు ఆయన అన్న కుమారుడు బానోత్ నాగు(36) నీళ్లలోకి దూకాడు. నిమజ్జనం చేసేచోట కాలువ రెండుగా విడిపోతుండడంతో గేట్ల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు రెప్పపాటులోనే గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపుల చర్యలు చేపట్టారు. రాత్రి ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో సూర్య మృతదేహం లభ్యం అయింది. కానీ బానోత్ నాగు ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సీఐ ఆంజనేయులు సందర్శించి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
స్టేజ్ ఎక్కి.. మైక్ లాక్కొని.. అస్సాం సీఎంను నిలదీసే యత్నం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ దూసుకువెళ్లారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్ లాగా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్లిన నంద కిషోర్.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్ను బలవంతంగా స్టేజ్ కిందకు తీసుకుపోయారు. అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బండి సంజయ్, డీకే అరుణ ఖండన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అస్సాం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. కుటుంబ పార్టీలు దేశం కోసం ఆలోచించవు: హిమంత తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమ ర్శించారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. కుటుంబ పార్టీలు కొడుకు, కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని, గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి కేసీఆర్కు మరో 50 ఏళ్లు పడుతుందేమోనని ఎద్దేవాచేశారు. రాహుల్గాంధీకి నిజంగా దేశ భక్తి ఉంటే 1947లో ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ భారత్ జోడో యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే జోడించాలో అక్కడ ఆ పనిచేయాలి తప్ప పటిష్టంగా ఉన్న దేశంలో ‘భారత్ జోడోలు’ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్లో వినాయక శోభాయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదు అబిడ్స్: సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ వ్యాస్ (నందుబిలాల్) పేర్కొన్నారు. కేసీఆర్ను విమర్శించినందుకే తాను మైకు లాక్కున్నానని చెప్పారు. అబిడ్స్ పోలీస్స్టేషన్ దగ్గర నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్యాత్మిక భావంతో, దేవుడిపైనే ప్రసంగించాలన్నారు. సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను విమర్శిస్తూ హైదరాబాద్లో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర
-
కాసేపట్లో బాలాపూర్ గణేశుడి ఊరేగింపు
-
గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ చుట్టూ విస్తృత ఏర్పాట్లు
-
Telangana: గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో సెలవు
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 9న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. 9న సెలవు తీసుకుంటున్నందున ఈ నెల 10న రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్బండ్కు రండి’
కవాడిగూడ (హైదరాబాద్): పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక నాస్తికుడని అందుకే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గణనాథులను ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేద్దామని, అందుకు హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్బండ్పైకి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం సంజయ్ పలువురు నేతలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి దీక్షలకు, బీజేపీ నిరసనలకు దిగొచ్చి ప్రభుత్వం ట్యాంక్బండ్పై క్రేన్లను ఏర్పాట్లు చేస్తోందన్నారు. ట్యాంక్బండ్పై వినాయక మండపాల నిర్వాహకులను పోలీసులు అడ్డుకుంటుంటే దారుసలాంలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు. నిఖా ర్సయిన హిందువునని ప్రకటించుకునే సీఎం కేసీఆర్కు ఇది తగునా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: Telangana: స్పీకర్పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
హైదరాబాద్ లో నిమజ్జనాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
ఆటంకాలు సృష్టిస్తే ప్రగతిభవన్లోనే నిమజ్జనాలు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని లేనిపక్షంలో ప్రగతిభవన్ వేదికగా గణేశ్ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వు లను ఉల్లంఘించే సీఎస్ సోమేశ్కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్తోపాటు మరికొందరు నేతలతో కలసి సోమవారం ఆయన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 25 కిలోల లడ్డూ ప్రసాదాన్ని బండి సంజయ్ నెత్తిన పెట్టుకొని కొద్దిదూరం నడిచి వెళ్లి మహాగణపతికి సమర్పించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఏటా వినాయక నిమజ్జనాలు ఉద్రిక్త వాతావరణంలో జరుపుకునే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఏర్పడింది. ఈ ఉత్సవాలు జరుపుకునేందుకు అన్ని అనుమతులు తీసుకున్నాక కూడా ప్రభుత్వం నిమజ్జనాలకు ఆటంకాలు సృష్టిస్తోంది. ఏటా గణేశ్ మండపాల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. హిందువుల పండుగలంటేనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారుస్తోంది’ అని ఆరోపించారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు సైతం పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ముస్లింలు ర్యాలీలు చేపట్టారని.. బాదం, పిస్తాలు పంచినా తాము అడ్డుకోలేదని చెప్పారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని.. ట్యాంక్బండ్ వద్ద ఎలా నిమజ్జనం చేసుకోవాలో తమకు తెలుసన్నారు. సమాజమంతా బాగుండాలని కోరుకునే వాడే నిజ మైన హిందువని, హిందువులంతా సంఘటితం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాగా, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన పలువురు హోంగార్డులు సంజయ్ను కలసి వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలిచ్చినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. ఇందుకు సంజయ్ స్పందిస్తూ కేసీఆర్ను సీఎం పదవి నుంచి తొలగిస్తేనే హోంగార్డులతోపాటు ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదీ చదవండి: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట -
దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని
హిమాయత్నగర్ (హైదరాబాద్): పండుగలు, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం తగదని, ఈ నెల 9న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వమే ఘనంగా చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదని, చేతకాకపోతే తామే నిర్వహిస్తామని.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవసమితి నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోమవారం ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేలసంఖ్యలో పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, రవా ణా, ఆర్అండ్బీ తదితర ప్రభుత్వ విభాగాలన్నీ కలసి చేసే కార్యక్రమం వారి వల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఉత్సవసమితి నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ జరుగుతాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ట్యాంక్బండ్లో గణేశ్ నిమజ్జనం చేయనివ్వకపోతే ప్రగతిభవన్లో నిమజ్జనం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఇటువంటి వ్యాఖ్యలు నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వింటున్నా’ అని (నవ్వుతూ) అన్నారు. కాగా, ఒకరి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారని, హిందువుల పండుగలు జరిపించడంలేదనే పిచ్చి మాటల నుంచి కొందరు వ్యక్తులు బయటకు రావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి అన్ని పండుగలూ సమానమేనన్నారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
గణేష్ నిమజ్జనంలో కూతురితో సందడి చేసిన బన్నీ
గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో కూతురు అర్హతో కలిసి సందడి చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వినాయ చవితి సందర్భంగా ఆగస్ట్ 31న జూబ్లిహిల్స్లోని గీతా ఆర్ట్స్ భవనంలో నెలకొల్పిన గణేషునికి నేడు విడ్కోలు పలికారు. ఈ నిమజ్జనం కార్యక్రమంలో బన్నీ తన కూతురు ఆర్హతో కలిసి పాల్గొన్నాడు. చదవండి: బిగ్బాస్పై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు.. ‘చచ్చినా ఆ తప్పు చేయను’ ఇక ఈ వేడుకులో గణపతికి వీడ్కోలు చెబుతూ బన్నీ కొబ్బరి కాయ కొట్టగా.. అర్హ గణపతి బప్పా మోరియా అంటూ సందడి చేసింది. ఇక కూతురిని ఎత్తుకుని మురిసిపోతూ బన్నీ డాన్స్ చేసిన ఈ వీడియో నెట్టంట వైరల్గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో, ఫొటోలు అల్లు ఫ్యాన్స్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. చదవండి: తిరుమల కొండపై నటి అర్చనా రచ్చ.. స్పందించిన టీటీడీ Icon Star @alluarjun was in a celebratory mood as he bid adieu to Lord Ganesh along with his staff. The actor broke a coconut with his daughter #AlluArha by his side to kickstart the immersion procession. He also encouraged Arha to further take part in the festivities#AlluArjun pic.twitter.com/6TZIUZ62UJ — Sreedhar Sri (@SreedharSri4u) September 5, 2022 -
మీ ఇంటి ముందే నిమజ్జనం.. ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ప్రత్యేక వాహనాలు
సనత్నగర్: వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే గణేషుడి చెంతకు వచ్చే సరికొత్త విధానానికి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ నాంది పలికింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఆ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ‘ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. తొలిసారిగా ప్రయోగాత్మకంగా కమ్యూనిటీ అపార్ట్మెంట్ల నివాసితులకు ఈ సేవలను అందించనున్నారు. వీటిని శుక్రవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాలపై ఏర్పాటుచేసిన నీటి తొట్టెలో వినాయకుడి విగ్రహాన్ని మంత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసేవిధంగా వాహనాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ వాహనాలను అవసరాలను బట్టి వచ్చే ఏడాది మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్సాగర్, ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ పాల్గొన్నారు. చదవండి: BJP Telangana: గ్రేటర్పై కమలం కన్ను -
బతుకు చిత్రం : నిమజ్జనం సమయంలో విశేష సేవలందిస్తున్న క్రేన్ ఆపరేటర్లు
-
హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనాలు
-
Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి
సాక్షి, ఆదిలాబాద్: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అప్పటివరకు బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపిన యువకుడు నిమజ్జనం అనంతరం వాగులో మునిగి మృతిచెందాడు. ఆదిలాబాద్రూరల్ ఎస్సై అంజమ్మ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణం అనుకుంటకు చెందిన దేవన్న–అక్కమ్మల కుమారుడు కన్నయ్య(22) బంగారుగూడ వాగులో గణేశ్ నిమజ్జనం అనంతరం కొంతమంది యువకులు కలిసి వాగులో స్నానం చేశారు. వారితో పాటు కన్నయ్య కూడా స్నానం చేయగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగాడు. స్నేహితులందరూ రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ గల్లంతయ్యాడు. తీరా శవమై తేలాడు. కన్నయ్యకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి గతంలో మరణించగా తల్లి కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చేతికొచ్చిన కుమారుడు ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: Medak: ఒకేరోజు ఏడు చోట్ల చోరీలు మరువక ముందే.. -
‘గణ’యాత్ర.. జన జాతర
సాక్షి, హైదరాబాద్: మహానగరం భక్తజన సంద్రమైంది. ఆదివారం హైదరాబాద్లో గణనాథుల నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తుల జయజయ ధ్వానాలు, డప్పు కళాకారుల దరువులు, యువత నృత్యాలు, విభిన్న రూపాల్లో దర్శనమిచ్చిన గణపతులు, పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంపాటలతో శోభాయాత్రలో ఆద్యంతం పండుగ వాతావరణం నెలకొంది. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు హుస్సేన్సాగర్ సహా వివిధ చెరువుల్లో నిమజ్జనపర్వం కొనసాగింది. ముఖ్యంగా 40 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య ఉదయం 10:30 గంటలకు మొదలైన పంచముఖ రుద్ర మహాగణపతి శోభాయాత్ర మధ్యాహ్నం 3:23 గంటలకు నిమజ్జనంతో ముగిసింది. మధ్యాహ్నం నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా భక్తులు భారీ స్థాయిలో యాత్రను తిలకించేందుకు తరలివచ్చారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లు జాతరలను తలపించాయి. సోమవారం తెల్లవారుజాము వరకు హుస్సేన్సాగర్లో సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్సాగర్లో ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాగర్లో పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీజీపీ మహేందర్రెడ్డి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. హుస్సేన్సాగర్ చుట్టూ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్సేన్సాగర్ వద్ద 40 క్రేన్లను ఏర్పాటుచేసి నిమజ్జనం నిర్వహించారు. బాలాపూర్ వినాయకుడి లడ్డూతో శశాంక్రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ బాలాపూర్ లడ్డూ 18.90లక్షలు ►ప్రసాదాన్ని ఏపీ సీఎం జగన్కు అందిస్తామన్న వేలంపాట విజేతలు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ ఈ ఏడాదీ రికార్డు ధర పలికింది. ఆది వారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన వేలంపాటలో ఏకంగా రూ. 18.90 లక్షలకు (2019లో రూ. 17.60 లక్షలు పలికింది) లడ్డూ అమ్ముడుపోయింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్ గుల్కు చెందిన అబాకస్ విద్యాసంస్థల అధినేత మర్రి శశాంక్రెడ్డి సంయుక్తంగా లడ్డూ ప్రసా దాన్ని చేజిక్కించుకున్నారు. వేలంలో బాలాపూర్ లడ్డూను పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమేశ్ యాదవ్ తెలిపారు. ఈ ప్రసాదాన్ని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి అందజేస్తానని చెప్పారు. రమేశ్ సహాయంతో ఈ ఏడాది లడ్డూను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని మర్రి శశాంక్రెడ్డి పేర్కొన్నారు. వేలంపాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ అనితా హరినాథ్రెడ్డి, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్లెం నిరంజన్రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
గణేశ్ నిమజ్జనం వేళ: సజ్జనార్ సారూ మీరు సూపర్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సమితి (ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు. మొన్న ఆర్టీసీ బస్సు, బస్టాండ్లో సాధారణ వ్యక్తిలా ప్రయాణించి క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సేవలను పరిశీలించారు. తాజాగా గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ బస్సులోనే వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కుటుంబసభ్యులతో కలిసి సజ్జనార్ వినాయకుడి ప్రతిమను తీసుకుని బస్సులో బయల్దేరారు. ఈ సందర్భంగా సజ్జనార్ తెలుపు దుస్తులు ధరించి తలపై టోపీ పెట్టుకుని మహారాష్ట్ర లుక్లో కనిపించారు. వినాయక విగ్రహంతో బస్సులో కూర్చుని ఉండగా భక్తులు నినాదాలు చేస్తున్నారు. కొందరు ఉత్సాహంగా డ్యాన్స్లు కూడా చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సంస్థ బాగు కోసం సజ్జనార్ చేస్తున్న ప్రయత్నాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని నెటిజన్లు అభినందిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో ఆర్టీసీకి పూర్వ వైభవం వస్తుందని, ఆర్టీసీ లాభాల బాట పడుతుందని పేర్కొన్నారు. TSRTC MD VC Sajjanar takes Ganpati on a bus for immersion #GaneshChaturthi2021 @TSRTCHQ @tsrtcmdoffice pic.twitter.com/V9UFAXv3oe — Donita Jose (@DonitaJose) September 19, 2021 -
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విశిష్టమైన చరిత్ర కలిగి ఉన్న బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. గత 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్ గణేష్ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన వేలం పాటలో 35 మంది పాల్గొన్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోల బరువుతో తయారు చేస్తారు. బాలాపూర్ లడ్డూ సంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా.. వేలం మాత్రం 1994లో మొదలైంది. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఈ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతోపాలు ప్రముఖులు సైతం పోటీపడతారు. ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా ప్రభావంతో రద్దు చేశారు. ఉత్సవసమితి సభ్యులు సీఎం కేసీఆర్కు ఆ లడ్డూను అందజేశారు. 2019లో బాలాపూర్ లడ్డూ రికార్డుస్థాయిలో 17లక్షల 60 వేల రూపాయలు పలికింది. నిమజ్జన వేడుకలు 41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ఆదివారం తెల్లవారు జామునే ప్రారంభమయ్యాయి. ఉదయం అయిదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో చివరిపూజలందుకున్న గణేషుడు ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగింపు సాగుతోంది. ట్యాంక్బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలు ► 1994లో కొలను మోహన్రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం ప్రతాప్రెడ్డి.. రూ. 65,000 ►2000లో కల్లెం అంజిరెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత శేఖర్రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,15,000 ►2010లో కొడాలి శ్రీధర్బాబు..రూ.5,25,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 ---- ---- ►2021లో మర్రి శశాంక్రెడ్డి... రూ. 18,90,000 -
Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే
సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. ‘కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. మహాగణపతి క్రేన్ నంబర్–4 ► ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనం క్రేన్ నంబర్–4 వద్ద జరిగేలా ఏర్పాట్లు చేశారు. ► 2.5 కి.మీ. మేర సాగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ప్రక్రియ మొత్తం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ► బెంగళూరు నుంచి ప్రత్యేక భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. ► ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ► 11 గంటల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెం.4 వద్దకు చేరుకోగానే 12 గంటల నుంచి 1 గంట మధ్య నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఇలా... మహాగణపతి మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సెన్షేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా మీదుగా టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. బాలాపూర్ గణేష్ ఎటు వైపు నుంచి? బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు 17 కి.మీ. గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలోని ఫలక్నుమా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. శనివారం రాత్రి వరకు కొంత పూర్తయ్యే అవకాశం ఉందని..రాత్రి సమయంలో ట్రయల్ రన్ వేసి..సజావుగా సాగితే బాలాపూర్ గణేష్తో పాటు 15 అడుగులకు మించిన మూడు నాలుగు విగ్రహాలను కూడా ఇదే బ్రిడ్జి మీదుగా అనుమతిస్తామని సీపీ తెలిపారు. ట్రయల్ రన్లో విఫలమైతే కందికల్ గేట్ నుంచి లాల్దర్వాజా మీదుగా సాగర్ వైపు మళ్లిస్తామని చెప్పారు. ► కేశవగిరి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు విగ్రహాలు పాత చాంద్రాయణగుట్ట పీఎస్– చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్– నల్లవాగు–కందికల్గేట్ ఫ్లైఓవర్– ఓపీ ఛత్రినాక– లాల్దర్వాజాగుడి–నాగుల్చింత–చార్మినార్–మదీనా–అఫ్జల్గంజ్– ఎస్బజార్–ఎంజేమార్కెట్– అబిడ్స్–బషీర్బాగ్–లిబర్టీ–అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, (నెక్లెస్ రోడ్) లేదా ఎగువ ట్యాంక్బండ్ వెళ్తాయి. ► సికింద్రాబాద్ మీదుగా వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఆర్పీ రోడ్ నుంచి ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్– కవాడిగూడ– ముషీరాబాద్ క్రాస్ రోడ్– ఆర్టీసీ క్రాస్రోడ్– నారాయణగూడ క్రాస్ రోడ్– హిమాయత్నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీలో ప్రధాన మార్గంలో కలవాలి. ► చిలకలగూడ క్రాస్రోడ్ నుంచి వచ్చే వాహనాలు గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్లో కలవాలి. ► ఉప్పల్ నుంచి వాహనాలు రామంతాపూర్– 6 నంబర్ జంక్షన్ అంబర్పేట– శివంరోడ్– ఎన్సీసీ– దుర్గాభాయి దేశ్ముఖ్ ఆసుపత్రి– హింది మహావిద్యాలయ్ క్రాస్రోడ్– ఫీవర్ ఆసుపత్రి– బర్కత్పుర క్రాస్ రోడ్– నారాయణగూడ క్రాస్రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే మార్గంలో కలవాలి. ► దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్ సదన్– సైదాబాద్– చంచల్గూడ నుంచి ముసారాంబాగ్ మీదుగా అంబర్పేట మార్గంలో కలవాలి. ► తార్నాక నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ దూరవిద్యా కేంద్ర రోడ్ నుంచి అడిక్మెట్ నుంచి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి మార్గంలో కలవాలి. ► టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు మాసబ్ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్– నిరంకారీ భవన్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లాలి. ► ఎర్రగడ్డ నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్నగర్– అమీర్పేట–పంజగుట్ట–వీవీ విగ్రహం నుంచి మెహదీపట్నం మీదుగా నిరంకారీ భవన్ వైపు మళ్లాలి. ► టపాచబుత్ర, ఆసిఫ్నగర్ మీదుగా వచ్చే వాహనాలు సీతారాంబాగ్– బోయిగూడ కమాన్– వౌల్గా హోటల్– గోషామహల్ బారాదరి– అలాస్కా మీదుగా ఎంజే మార్కెట్ ప్రధాన మార్గంలో కలవాలి. ఇక్కడ్నుంచి అబిడ్స్ మీదుగా బషీరాబాగ్–లిబర్టీ– అంబేద్కర్ విగ్రహం– ఎన్టీఆర్ మార్గ్– పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా ఎగువ ట్యాంక్బండ్కు చేరుకోవాలి ► సుమారు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్త్ను ఏర్పాటు చేశారు. హోంగార్డ్లు, స్పెషల్ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు ఉన్నారు. ► సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, జంక్షన్లలో వజ్ర వాహనాలను, గ్యాస్ ఎస్కార్ట్, వాటర్ వెహికిల్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. 19 సైబర్ ట్యాచ్ టీమ్, బాంబ్ డిస్పోజ్ టీమ్ను ఏర్పాటు చేశారు. 24 స్నిపర్ డాగ్స్ కూడా బందోబస్త్లో పాల్గొంటున్నాయి. ► రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, సాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే పోలీసులు వద్ద ఉన్న 2,700 వైర్లెస్ సెట్స్తో పాటు అదనంగా 475 సెట్లను అందించారు. ► హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇరిగేషన్, మెట్రో, ట్రాన్స్పోర్ట్ విభాగాలలతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ► సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి కనుగుణంగా చెరువులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ► హుస్సేన్సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం. సోమవారం ఉదయం లోపే పూర్తి.. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అవసరమైన మేర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయి. మూడు కమిషనరేట్లతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి విగ్రహాలు తరలివస్తాయి. సుమా రు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నాం. సోమ వారం ఉదయం 5:30 వరకు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ కోవిడ్ నిబంధనలు పాటించాలి వినాయక నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తులు, నిర్వాహకులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. నిమజ్జనానికి వచ్చే మార్గాలలో ఎలాంటి వాహనాలు, నిర్మాణ సామగ్రి వంటివి నిలిపి ట్రాఫిక్ జామ్లకు గురిచేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు సహకరించాలి. – మహేశ్ ఎం. భగవత్, సీపీ, రాచకొండ వదంతుల్ని ఫార్వర్డ్ చేయొద్దు భక్తులు తమ పిల్లల్ని, వెంట తెచ్చుకునే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు. వాట్సాప్ గ్రూప్లకు అనవసర మెసేజ్లను ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ 94906 17444 వాట్సాప్లో గానీ ఫిర్యాదు చేయాలి. మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 94936 22395 నంబరులో ఫిర్యాదు చేయాలి. – స్టీఫెన్ రవీంద్ర, సీపీ, సైబరాబాద్ -
నేడే ‘గణ’ వేడుక
సాక్షి, హైదరాబాద్: సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. చదవండి: గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే ఉత్సవాలు వైవిధ్యభరితమైన హైదరాబాద్ మహానగర చరిత్రకు ఒక సమున్నతమైన ఆధ్యాత్మిక ఆవిష్కరణ. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు అడుగడుగునా కొలువుదీరిన విభిన్న మూర్తుల గణనాథుడి ఉత్సవంతో నగరం సరికొత్త కాంతులను సంతరించుకుంటుంది. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందో త్సాహాలతో కొలిచి మొక్కారు. ‘ కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వ యంతో సకల ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి మొదలయ్యే నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంది. ►వివిధప్రాంతాల నుంచి హుస్సేన్సాగర్కు శోభాయాత్ర మార్గాలు: 320 కి.మీ. ►ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేసేందుకు యాక్షన్ టీమ్స్ : 162 ►గణేశ్ యాక్షన్ టీమ్స్ సిబ్బంది : 8,116 ►నిమజ్జనం జరిగే ప్రాంతాలు : 33 చెరువులు, 25 కొలనులు. ►విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉన్న క్రేన్లు: 316 ►ట్యాంక్బండ్ పరిసరాల్లో క్రేన్లు: 40 ►అంచనా వ్యర్థాలు: 3,910 మెట్రిక్ టన్నులు ►చెత్తను తరలించేందుకు పెద్ద వాహనాలు: 44, మినీ టిప్పర్లు: 39, జేసీబీలు:21 ►ఫైర్ వాహనాలు : 38 ►బారికేడింగ్స్ : 12 కి.మీ. ►వాటర్ప్రూఫ్ టెంట్లు : 15 ►తాగునీటి పంపిణీ శిబిరాలు: 101 ►అందుబాటులో వాటర్ప్యాకెట్లు: 30 లక్షలు ►హుస్సేన్సాగర్ వద్ద ట్రాన్స్ఫార్మర్లు: 48 ►అన్ని నిమజ్జనప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు: 101 ►తాత్కాలిక వీధి దీపాలు: 41,284 ►ట్యాంక్బండ్ పరిసరాల్లో ఎల్ఈడీ లైట్లు: 2600 ►హుస్సేన్సాగర్ వద్ద బోట్లు : 9 ►ట్యాంక్బండ్ వద్ద స్విమ్మర్లు: 32 ►పంపిణీకి అందుబాటులో మాస్కులు: 5 లక్షలు ►శోభాయాత్ర మార్గంలో, చెరువుల వద్ద శానిటైజర్లు ►విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది: 19000 ►ట్యాంక్బండ్పై అంబులెన్సులు: 2 పోలీస్ కంట్రోల్రూమ్స్: 2 ►ఆయా ప్రాంతాల్లో వాచ్ టవర్లు ►ఎన్టీఆర్ మార్గ్లో వాటర్బోర్డు, టీఎస్ఎస్ పీడీసీఎల్, జీహెచ్ఎంసీల కంట్రోల్రూమ్స్. ►సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తికనుగుణంగా చెరు వులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ►హుస్సేన్సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక వ్యాక్సినేషన్ శిబిరం శనివారం రాత్రి హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహ నిమజ్జనం హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహ మూద్అలీలతోపాటు డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్లో ఏరియల్వ్యూ ద్వారా పరిశీలిస్తారు. వాటర్ బోర్డు మంచి నీటిసరఫరా గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు.అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో ►నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల (సోమవారం తెల్లవారు జాము)వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ►నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్ హుస్సేన్సాగర్కు చేరుకునేం దుకు వీలుగా ఆర్టీసీ 565 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు వరకు, మెహదీపట్నం, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ వరకు ఈ బస్సులు నడుస్తాయి. ►ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమ వారం ఉదయం 4 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా 8 ఎంఎం టీఎస్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణమ ధ్య రైల్వే చర్యలు చేపట్టింది. లింగంపల్లి– సికింద్రాబాద్, నాంపల్లి– లింగపల్లి, ఫలక్నుమా– సికింద్రాబాద్, నాంపల్లి– ఫలక్నుమా రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. -
గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆదివారం గణేష్ నిమజ్జనం దృష్టా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనుంది. రేపు అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అంతేగాక ఈ అర్థరాత్రి నుంచి అంతరాష్ట్ర వాహనాల ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అదే విధంగా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లేవారు ప్రత్యేక మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లు మరోవైపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి పోలీసులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై ఎలాంటి సమస్య తలెత్తకుండా భారీ క్రేన్స్తో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్బండ్పై 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లను ఉంచారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చదవండి: Ganesh Idol Immersion: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ మహాగణపతి నిమ్మజనం 2.5 కిలోమీటర్ల పొడవునా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర సాగనుంది. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ మహాగణపతి నిమ్మజనం జరగనుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. చదవండి: రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ 20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి ట్రాఫిక్ అదనపు సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. నిమజ్జనం సాఫీగా జరిగేందుకు ట్రాఫిక్ విభాగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. క్రేన్లు క్విక్ రిలీజ్ పద్దతిలో విగ్రహాలు నిమజ్జనం చేస్తాయని, దీని వల్ల విగ్రహాల నిమజ్జనం తొందరగా అవుతుందన్నారు. ప్రతిచోట సైన్ బోర్డ్లు ఏర్పాటు చేశామని, ఫ్లై ఓవర్ నిర్మాణాల వల్ల కొన్ని చోట్ల శోభాయాత్ర దారి మళ్లింపు చేస్తున్నామని తెలిపారు. ఫలక్నుమా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వల్ల ప్రత్యామ్నయ దారిలో శోభాయాత్ర దారి మళ్లించామని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పెద్ద విగ్రహాల వెంట 8 మంది భక్తులు, చిన్న విగ్రహాల వెంట నలుగురు మాత్రమే రావాలని కోరారు. 20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి చేసేలా ప్రతి ఒక్క మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు. -
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ముంబై తర్వాత అత్యంత ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివస్తుంటారు. హైదరాబాద్లో రేపు ఆదివారం మహా నిమజ్జనం జరగనుంది. జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయక విగ్రహాలు తరలి రానున్నాయి. శోభాయమానంగా జరిగే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చదవండి: మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో తీవ్ర ఆంక్షలు విధించారు. అందులో భాగంగా మద్యం దుకాణాలు మూసి వేస్తున్నారు. ఆది, సోమవారం (19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు) మద్యం దుకాణాలు మూసి ఉంటాయని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న వైన్స్తో పాటు బార్లు, పబ్లు మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు All the #Toddy & #WineShops shall remain #closed from 0600 hrs on 19.09.2021 to 1800 hrs on 20.09.2021, in the jurisdiction of #RachakondaPoliceCommissionerate in view of #Ganeshimmersion to be held on 19.09.2021. pic.twitter.com/1bm4r78qGU — Rachakonda Police (@RachakondaCop) September 18, 2021 -
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకమైన భారీ క్రేన్ సిద్ధం
-
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి వెంటనే చేయాలని, విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు. శుక్రవారం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్లో చేపట్టిన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, కలెక్టర్ శర్మన్, వాటర్ వర్క్స్ అధికారి సత్యనారాయణ, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమజ్జనం ఏర్పాట్లను తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఎంఎంటీఎస్ స్పెషల్ ... ► ట్యాంక్బండ్కు తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి– సికింద్రాబాద్, ఫలక్నుమా–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ► ఆదివారం రాత్రి 11 గంటల వరకు ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను అన్ని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులు.. ► నిమజ్జనం సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తజనసందోహం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ► బషీరాబాగ్ – కాచిగూడ, బషీర్బాగ్–రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్–దిల్సుఖ్నగనర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్–ఎల్బీనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్ – వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ► ఉప్పల్– ఇందిరాపార్కు, మల్కాజిగిరి–ఇందిరాపార్కు, ఇందిరాపార్కు నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జామై ఉస్మానియా వరకు ► లక్డీకాపూల్ నుంచి టోలీచౌకి,ఖైరతాబాద్ నుంచి బీహెచ్ఈఎల్వరకు, లకిడికాఫూల్ నుంచి కొండాపూర్, యూసుఫ్గూడ, రాజేంద్రనగర్ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ► ఆల్ఇండియా రేడియో నుంచి కోఠీ, ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి,బోరబండ, బాచుపల్లి,లింగంపల్లి, పటాన్చెరు. తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. నిమజ్జన మార్గాల్లో మళ్లింపు.. ► పాతబస్తీ నుంచి హుస్సేన్సాగర్ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్గంజ్ వరకే పరిమితం చేస్తారు. ► సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి. ► ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి. హెచ్ఎండీఏ.. ► హుస్సేన్సాగర్లోని విగ్రహాలు, పూజాసామాగ్రి తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుధ్యవిభాగంతో సమన్వయంతో తరలిస్తుంది. ► ఈ పనుల కోసం వెయ్యిమంది సిబ్బంది విధుల్లో ఉంటారు. వాటర్బోర్డు.. ► 101 ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి జలమండలి ఏర్పాట్లు చేపట్టింది. గణేశ్ యాత్రలో ఇంకా.. ► గణేశ్ శోభాయాత్ర మార్గంలో 38 ఫైర్ వాహనాలు ఉంచుతారు. ► సరూర్నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద బోట్లు అందుబాటులో ఉన్నాయి. ► టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్సాగర్ ట్యాంక్బండ్ వైపు 3 బోట్లు, నెక్లెస్రోడ్ వైపు 2 బోట్లు అందుబాటులో. వీటితోపాటు 4 స్పీడ్బోట్లు. 10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు ► విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో హుస్సేన్సాగర్ చుట్లూ 48 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. సరూర్నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్లు. వీటితో సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ► జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు రూ. 1.52 కోట్లతో 41284 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు. చదవండి: నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన చదవండి: ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి -
హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
నేడు సుప్రీం కోర్టు ముందుకు వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్
సాక్షి, ఢిల్లీ: వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. (చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య) ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. ఊరేగింపుగా జరిగే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు అనేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు, నాలుగు నెలల ముందుగానే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: రాజు ఆత్మహత్య: కేటీఆర్ స్పందన.. -
నాడు 15 రోజులపాటు వాహనంపైనే ఖైరతాబాద్ గణేషుడు.. కారణం ఇదే!
సాక్షి, ఖైరతాబాద్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్తోపాటు చెరువుల్లో నిమజ్జనం చేయనివ్వొద్దని హైకోర్టు సూచనలు చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా వినాయకుడు కొలువుదీరాడు. ప్రతి ఏటా మహాగణపతిని అత్యంత వైభవంగా..హంగూ ఆర్భాటాలతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్బండ్కు తరలించి అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన క్రేన్లు వేలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జన శోభార్యాలీ మొత్తం గణేష్ ఉత్సవాల్లోనే హైలెట్గా నిలుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులతోపాటు అధికారులు, పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపడుతుంది. అయితే..ఈసారి నిమజ్జనంపై కోర్టు సూచనల నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారా..లేకుంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాట్లు చేస్తారనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సాగర్లోనే నిమజ్జనం: ఉత్సవ కమిటీ ఈసారి కూడా మహాగణపతి నిమజ్జనం హుస్సేన్సాగర్లోనే జరగాలని, 66 సంవత్సరాలుగా ఇది సంప్రదాయంగా కొనసాగుతోందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఒక వేళ హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి అనుమతివ్వకుంటే, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని పేర్కొన్నారు. 1986లో ఇలా... 1986లో 20 అడుగుల ఎత్తులో తయారుచేసిన వినాయకుడిని సాగర్లో నిమజ్జనం చేసేందుకు ట్యాంక్బండ్పైకి వెళ్లగా అక్కడ తగిన సౌకర్యాలు కల్పించ లేదు. దీంతో 15 రోజుల పాటు వినాయకుడ్ని అక్కడే వాహనంపైనే ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేయడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తలసానికి విన్నపం అఫ్జల్గంజ్: హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విధించిన ఆంక్షల నేపథ్యంలో మంగళవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి చర్చించారు. గణేష్ విగ్రహాల సామూహిక నిమజ్జనం హుస్సేన్సాగర్లో జరిపేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్రావు, ఉపాధ్యక్షులు కరోడీమాల్, కోశాధికారి శ్రీరామ్వ్యాస్, రామరాజు, కార్యదర్శులు మహేందర్, శశి, ఆలె భాస్కర్, రూప్రాజ్ తదితరులు ఉన్నారు. అంబారీపై ఊరేగింపు.. వచ్చేసారి 70 అడుగుల మట్టి వినాయకుడు వచ్చే సంవత్సరం..2022లో ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో 70 అడుగుల ఎత్తులో తయారుచేస్తాం. ఈ భారీ వినాయకుడిని ఉన్నచోటే నిమజ్జనం చేస్తాం. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని..ఖైరతాబాద్ మహాగణపతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – సింగరి సుదర్శన్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ 1954 : ఒక అడుగు వేరేచోట కష్టమే... 40 అడుగుల ఎత్తులో ఉన్న భారీ వినాయకుడిని హుస్సేన్సాగర్లో కాకుండా వేరేచోట నిమజ్జనం చేయడం కష్టమేనని నిపుణులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. మహాగణపతిని నిమజ్జనం చేసేంత విశాలమైన, లోతైన కొలనులు సమీపంలో ఎక్కడా లేవు. ఒకవేళ అంతపెద్ద పాండ్ను రూపొందించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అంత సమయమూ లేదు. మరోవైపు మహాగణపతి విగ్రహం మరో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే రహదారిలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. ఫ్లై ఓవర్లు, మెట్రో మార్గంలో పిల్లర్లు, విద్యుత్ కేబుళ్లు దాటుకుంటూ తరలించడం అసాధ్యం. ఇది చాలా ఇబ్బందులతో కూడుకున్న పనిగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మహాగణపతి నిమజ్జనం ఎక్కడ, ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. గణేష్ మండపాల డిమాండ్ మేరకు వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాలపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న నిమజ్జనం కోసం ప్రస్తుతం వెయ్యి భారీ వాహనాలను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. గణేష్ మండపాల డిమాండ్ మేరకు అవసరమైన వివిధ రకాల వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచన మేరకు నగరంలోని ప్రధాన మండపాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు భారీ ట్రాలీ వాహనాలు మొదలుకొని టాటాఏస్ వంటి చిన్న వాహనాల వరకు అందజేయనున్నారు. నిమజ్జన వాహనాల కోసం వచ్చే మండపాల నిర్వాహకులకు నగరంలోని 12 చోట్ల వాహనాలను సిద్ధంగా ఉంచుతారు. ► నెక్లెస్రోడ్డు. మేడ్చల్, టోలీచౌకి, జూపార్కు, మలక్పేట్, కర్మన్ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్చెరు, ఆటోనగర్ నుంచి వాహనాలను తీసుకోవచ్చు. ► 19వ తేదీన నిమజ్జనంజరుగనున్న దృష్ట్యా మండపాల నిర్వాహకులు 18వ తేదీనే వాహనాలను తీసుకెళ్లవచ్చు. ► మరోవైపు వాహనాలను అందజేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ రవాణా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జేటీసీ వెల్లడించారు. వాహనాల అద్దె.. ► నిమజ్జనానికి తరలి వచ్చే వాహనాల అద్దెలను సైతం అధికారులు ఖరారు చేశారు. ► భారీ ట్రాలీ లేదా టస్కర్లకు రూ.20 వేలు. (డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాతో కలిపి) ► 10 నుంచి 12 టైర్ల సామర్ధ్యం ఉన్న హెవీగూడ్స్ వెహికల్స్కు రూ. రూ.4000. డీజిల్ ఖర్చు, డ్రైవర్కు రూ.500 బత్తా అదనం. ► 6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు రూ.2500, ► మిడిల్ గూడ్స్ వెహికల్స్కు రూ.1600, ► డీసీఎం వంటి లైట్గూడ్స్ వెహికల్స్కు రూ.1300, ► టాటాఏసీలకు రూ.1000 చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ► వీటితో పాటు ప్రతి వాహనం డ్రైవర్కు బత్తా తప్పనిసరిగా ఇవ్వాలి. -
బ్యాండ్ లేకపోతేనేం.. చిన్నారుల ఆలోచన అదిరిపోయింది
సాక్షి, నిర్మల్: గణేష్ పండగంటేనే ఉత్సాహం, ఊరేగింపు. వినాయక మండపాలు, భారీ సెట్టింగులు, వీధికో వినాయకుడు, పెద్దఎత్తున పూజలు ఇలా ప్రతీదిగా సందడిగా ఉంటుంది. ఇక, నవరాత్రుల చివరి రోజున నిర్వహించే శోభాయాత్ర అయితే ఇక మామూలుగా ఉండదు. కిలోమీటర్ల మేర బారులు తీరిన గణనాథులను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. బ్యాండ్లు, డీజేలతో జరిగే వినాయకుడి ఊరేగింపు కన్నుల పండుగగా కనిపిస్తుంది. చదవండి: వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓచోట గణేష్ ఊరేగింపులో వారికి బ్యాండ్లు దోరకలేదు. అయితేనేం ఏమాత్రం నిరుత్సాహ పడని యువకులు, చిన్నారులు వినూత్న ఆలోచన చేశారు. నూనె పీపాలను బ్యాండ్ వాయిద్యాలుగా మార్చారు. నూనె పీపాల వాయిద్యాలు మోత మోగుతుంటే తీన్మార్ డాన్స్లు చేస్తూ గణేష్ నిమజ్జనం శోభ యాత్ర ముందుకు సాగించారు. ఈ విచిత్ర ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పేల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం కోసం పిల్లలు బ్యాండ్ అద్దే ప్రయత్నించారు. కానీ బ్యాండ్ అద్దె దొరకలేదు. దీంతో నూనె పీపాల వాయిద్యాలతో, ఎండ్ల బండి రథంపై వినాయకుని శోభ యాత్ర గ్రామంలోని వీధుల గుండా సాగించారు. ఈ వైరైటీ నిమజ్జనం తిలకించడానికి గ్రామస్తులు భారీగా తరలివస్తున్నారు. పైగా విన్నూతన అలోచనతో నిమజ్జనం చేస్తున్న పిల్లలను శభాష్ అంటూ పలువురు అభినందిస్తున్నారు. చదవండి: వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్! -
నిమజ్జనంపై నియంత్రణ ఉండాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రానున్న వినాయకచవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. గణేశ్ మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు నియంత్రణ చర్యలుండాలని, ఈ మేరకు ఆంక్షలు విధించాలని సూచించింది. మండపాలలో ఏర్పాటు చేసే లౌడ్స్పీకర్లతో శబ్దకాలుష్యం, విగ్రహాల నిమజ్జనం కారణంగా ఏర్పడే జలకాలుష్యంతో ఇతరులు ఇబ్బందిపడతారని, ఒకరి మతవిశ్వాసాల కోసం ఇంకొకరిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తేల్చిచెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, మండపాల దగ్గర, నిమజ్జనం సమయంలో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్లో విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. హుస్సేన్సాగర్లో నిమజ్జనంపై గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ‘భక్తులను నియంత్రించడం అంత సులభమేమీ కాదని మాకు కూడా తెలుసు, అయినా కోర్టు ఆదేశాలను చూపించి నియంత్రణ చర్యలు చేపట్టాలి’అని సూచించింది. మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), పీసీబీ, గణేశ్ ఉత్సవ సమితి, పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. 50 వేల విగ్రహాలు ఎలా సరిపోతాయి ? జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 50 వేల ఉచిత గణేశ్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ హైకోర్టుకు నివేదించారు. ఎవరికి వారు ఇంట్లోనే మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ‘జంటనగరాల జనాభా ఎంత, మీరిచ్చే 50 వేల ఉచిత విగ్రహాలు ఎలా సరిపోతాయి, విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశాం, మన బాధ్యత అయిపోయిందని అనుకుంటే ఎలా’అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసేలా చూడాలని, సహజ రంగులనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అన్ని విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 16 ప్రత్యేక నీటికొలనులను నిర్మించారని, అయినా వాటిని వినియోగించుకోకుండా మెజారిటీ విగ్రహాలు హుస్సేన్సాగర్లోనే నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు. పీసీబీ ఏం చేస్తోంది ? ‘హుస్సేన్సాగర్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అనేక సూచనలు చేసింది. వాటి అమలు తీరును పర్యవేక్షించడం మరిచింది. పీసీబీ సూచనలను ఇతర విభాగాల అధికారులు పాటించకపోతే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినా ఎందుకు మౌనంగా ఉంటోంది’’అని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాది శివకుమార్ను ధర్మాసనం ప్రశ్నించింది. హుస్సేన్సాగర్ ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉండేదని, నిమజ్జనంతో కాలుష్య కాసారంగా మారిందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సమయంలోనే సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసేలా నిర్వాహకులకు తెలియజేయాలని సూచించింది. చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ -
నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు గంగమ్మ ఒడికి గణనాథుడు తరలనున్నాడు. దీంతో ఊరేగింపు, నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఘట్టం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అదనపు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల బైండోవర్, వారిపై నిఘా ఉంటుంది. ఏటా నిమజ్జన కార్యక్రమం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సాగుతోంది. దీంతో ఈ ఏడాది మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీల సహకారంతో మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాములోపు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. విగ్రహాల తరలింపునకు వాహనాలు లభించని వారికి పోలీసులే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు హ్యాండ్ హెల్డ్ కెమెరాలను వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు సాయుధ బలగాలూ మోహరించనున్నాయి. విధుల్లో ఉండే సిబ్బందికి షిఫ్ట్ విధానం అమలు చేస్తూ వారికి అవసరమైన ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో మాస్క్లు, శానిటైజర్లు, ఫేస్షీల్డ్స్ అందిస్తున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీసు అధికారులు ఇతర విభాగాలతో పాటు శాంతి, మైత్రి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారు. ఏర్పాట్ల వివరాలివి నిమజ్జనం జరిగే ప్రదేశాలు: ట్యాంక్బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్పేట చెరువు, సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్, సఫిల్గూడ/మల్కాజ్గిరి చెరువులు, హస్మత్పేట చెరువు. హుస్సేన్సాగర్కు వచ్చేవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు శివారులోని మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని విగ్రహాలు. ఊరేగింపుల్లో డీజేలు నిషేధం: నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఇలాంటి తీవ్రమైన శబ్దం వచ్చే వాటివల్ల పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థకు నష్టం ఉంటుంది. మద్యం విక్రయాలు బంద్: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. -
గణేష్ నిమజ్జనంలో తుపాకీతో కాల్పులు
-
చెవి పక్క నుంచి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: వినాయకుని విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఆర్మీ మాజీ జవాన్ ఒకరు తుపాకీతో హల్ చల్ చేశాడు. పిస్టల్తో గాల్లోకి కాల్పులు జరపడంతో నిమజ్జనంలో పాల్గొన్నవారు భయభ్రాంతులకు లోనయ్యారు. నార్సింగిలోని హైదర్ష్కోటలో శివం హైట్స్లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని నాగ మల్లేష్గా గుర్తించారు. నాగ మల్లేష్ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: నిబంధనలు గాలికి వదిలేసి.. ప్రయాణం..) మాట వినకపోవడంతో.. ఘటనపై అపార్ట్మెంట్ వాసులు, వాచ్మన్ మాట్లాడుతూ.. హై రీచ్ బ్రాడ్ బ్యాండ్ మొదటి ఫ్లోర్లో ఉంది. వాళ్ల ఆఫీస్లో గణేష్ నిమజ్జనానికి 40 మందికిపైగా వచ్చారు. లిఫ్ట్ లో కిందకి పైకి తిరుగుతూనే ఉన్నారు. గట్టిగట్టిగా అరుస్తున్నారు. మెట్లపై, టెర్రస్పై మద్యం తాగుతూ హంగామా చేశారు. మేము హెచ్చరించినా పట్టించుకోలేదు. మూడో ఫ్లోర్లోని ఫ్లాట్లో ఉండే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మల్లేష్ పైకి వెళ్లి మద్యం తాగొద్దు అని చెప్పాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ఓసారి ఫైర్ చేసాడు. అందరూ కిందకి వచ్చి సెల్లార్ లో డ్యాన్సులు చేస్తూ అరుస్తుండటంతో.. మరోసారి గాల్లోకి ఫైర్ చేశాడు. -
నిమజ్జనానికి వద్దన్నారని.. గోవాకు వెళ్లాడు
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనానికి తల్లిదండ్రులు వెళ్లొద్దన్నందుకు ఓ మైనర్ బాలుడు ఇంట్లో చెప్పకుండా యాక్టివాపై గోవాకు వెళ్లిపోయాడు. పొద్దున్నే లేచి బెడ్రూమ్లో చూడగా కుమారుడు కనిపించడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ కేశవమెమోరియల్ కళాశాల సమీపంలో ఉండే రాజస్థాన్కు చెందిన కుటుంబం ఈ నెల 5న స్వరాష్ట్రం వెళ్లి తిరిగి 11వ తేదీన నగరానికి వచ్చారు. అదేరోజు రాత్రి వారి కొడుకు(16) ఉదయం నిమజ్జనానికి వెళ్తానని అడగ్గా అందుకు తల్లిదండ్రులు వద్దంటూ వారించారు. కాగా 12వ తేదీ తెల్లవారుజామున బాలుడు పాత యాక్టివాపై గోవాకు వెళ్లిపోయాడు. ఉదయం కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడికి ఏ ఫోన్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోగా.. ఆ నంబర్ని బ్లాక్లిస్టులో పెట్టసాగాడు. బెల్గాం వద్ద రెండు ముక్కలైన యాక్టివా ఈనెల 12వ తేదీ అర్ధరాత్రికి యాక్టివాపై ‘బెల్గాం’ చేరుకున్న బాలుడు అక్కడ పెద్ద గుంతలో పడ్డాడు. దీంతో యాక్టివా రెండు ముక్కలైంది. ఈ క్రమంలో అడ్మిన్ ఎస్సై కర్ణాకర్రెడ్డి సెల్ఫోన్ నంబర్ ఆధారంగా సిగ్నల్స్ని ట్రేస్ చేసి బాలుడు గోవా హైవేపై మహబూబ్నగర్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్సై అక్కడి పోలీసులకు సమచారమివ్వగా అక్కడి పోలీసులకు దొరకలేదు. దాంతో పోలీసుల సలహా మేరకు బాలుడి తండ్రి గోవాకు వెళ్లగా బాలుడు ‘అంజునా’ బీచ్ దగ్గర ఓ రూమ్లో ఉన్నట్టు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు తెలుసుకుని తండ్రికి సమాచారమిచ్చారు. దాంతో అక్కడ ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమైయ్యింది. నారాయణగూడ ఎస్సై కర్ణాకర్రెడ్డి చొరవతో ‘కిడ్నాప్ కథ’ 24 గంటల్లో తేలిపోయింది. -
గణేష్ నిమజ్జనం: 28మంది దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: గణేశ్ నిమజ్జం సందర్భంగా పలు రాష్ట్రాల్లో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రతో పాటు భోపాల్లో సుమారు 28 మంది దుర్మరణం చెందగా, పలువురు గల్లంతు అయ్యారు. ఒక్క మహారాష్ట్రలోనే 17మంది నిమజ్జనం సందర్భంగా నీట మునిగారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. అమరావతిలో నలుగురు, రత్నగిరిలో ముగ్గురు, నాసిక్, సింధుదుర్గ్, సతరాలో ఇద్దరు చొప్పున, థానే, ధులే, బుల్దానా,భందారాలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక భోపాల్లో ఖట్లపురా ఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 16మంది ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఢిల్లీతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు యమునా నదిలో గణపతి నిమజ్జనం సందర్భంగా మృత్యువాత పడ్డారు. ఇక రెండు రోజుల క్రితం కర్ణాటకలోని కేజీఎఫ్ పట్టణంలో నిమజ్జనంలో పాల్గొన్న ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. -
ట్యాంక్బండ్లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం
-
గణేష్ నిమజ్జనంలో విషాదం
-
నిమజ్జనం వేళ కిటకిటలాడిన మెట్రో రైళ్లు
-
ప్రశాతంగా ముగిసిన నిమజ్జనం
-
ప్రశాంతంగా నిమజ్జనం : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 35 వేల మంది పోలీసులతో పకడ్బందీగా నిమజ్జనం నిర్వహించారు. పాతబస్తీ, బాలాపూర్, ఖైరతాబాద్ శోభాయాత్రలు ప్రశాంతంగా సాగడంలో సీనియర్ ఆఫీసర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 33 జిల్లాల్లో ప్రతి నిమజ్జనం పాయింట్ను లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీతో కలిసి డీజీపీ శోభాయాత్రను పర్యవేక్షించారు. ‘పోలీసు అధికారులు, సిబ్బంది ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు. వారికి అప్పగించిన పనులను పకడ్బందీగా, వ్యూహాత్మకంగా పూర్తిచేశారు. ప్రతి ప్రాంతంలో గణేశ్ మండపాల నిర్వాహకులను భాగస్వాములను చేసి ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేయడంలో సఫలీకృతులయ్యారు’ అని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. -
‘హిందువుల ఐక్యతకు చిహ్నం ఈ ఉత్సవాలు’
సుల్తాన్బజార్/గన్ఫౌండ్రి: దేశంలోనే భాగ్యనగరంలో ఎంతో ఉత్సాహంగా సామూహిక గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం హిందువుల ఐక్యతను తెలియజేస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్వసంచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్రావు అధ్యక్షతన నగరంలోని మోజాంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభ వేదిక నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులను ఉద్దేశించి భాగవత్ ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశంలోకెల్లా నగరంలోనే ఘనంగా గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడు
-
ట్రెండ్ సెట్ చేస్తున్నారు..
సాక్షి, అనకాపల్లి టౌన్ (విశాఖ జిల్లా): నిమజ్జనం అంటే అదో ఉత్సాహం. ఊరేగింపులో తీన్మార్ డప్పుల దరువులు ఓ వైపు.. జై.. చిందెయ్ అంటూ నృత్యాలు చేసే యువత మరో వైపు.. ఇప్పటి వరకూ మనం ఇలాంటి సన్నివేశాల్నే చూశాం. గంగ దరికి గణపయ్యను చేర్చే ట్రెండ్కి ఈ యువకులు ఫుల్స్టాప్ పెట్టారు. గంగను గణపయ్య దరికి చేర్చే ట్రెండ్ను సెట్ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగం.. జలవనరులు కలుషితమవ్వడం.. ఊరేగింపు కోసం ఇంధనం ఖర్చు.. ఇలాంటి పర్యావరణ సంబంధిత అంశాలు ఆ యువకుల్ని ఆలోచింపజేశాయి. అందుకే ఈ ఏడాది గణపయ్య పండుగను పూర్తి పర్యావరణహితంగా చేయాలని నిర్ణయించుకున్నారు గవరపాలెం సత్తెమ్మతల్లి యూత్ క్లబ్ సభ్యులు. 25 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 2 ట్రాక్టర్ల మట్టిని వినియోగించారు. పి.శ్యామ్ అనే శిల్పి 30 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. నిమజ్జనాన్ని కూడా మండపంలోనే చేయాలని సంక్పలించారు. ఈ నెల 21న దీనికి ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయనున్నారు. నిమజ్జనం కోసం 5000 లీటర్ల నీటిని వినియోగిస్తారు. చివరి రోజు పార్వతీపుత్రుడ్ని 20 నుంచి 30 లీటర్ల పాలతో అభిషేకించనున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న మృణ్మయనాథుడ్ని చూసేందుకు అనకాపల్లితో పాటు పరిసర ప్రాంతాల వాసులు మక్కువ చూపుతున్నారు. -
గణనాథుడికి బైబై
-
నిఘా నీడన నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. నిమజ్జనం సందర్భంగా బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిమజ్జనం నేపథ్యంలో 33 జిల్లాల్లో ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మిగిలిన కమిషనరేట్ల పరిధిలోనే 35,000 మంది బలగాలు నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నాయన్నారు. సివిల్ పోలీసులతోపాటు, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), టీఎస్ఎస్పీ, ఎక్సైజ్, ఫారెస్ట్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతోపాటు జిల్లాల నుంచి వచ్చిన పోలీసు లు విధుల్లో ఉన్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఎలక్ట్రిక్, నీటి సరఫరా, పారిశుధ్యం, రవాణా, ఆర్టీసీ ఇలా అన్ని శాఖలను భాగస్వామ్యం చేశామన్నారు. 50 వేల విగ్రహాలు నిమజ్జనం... రాష్ట్రంలో వినాయక చవితి మొదలు బుధవారం వరకు దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, గురువారం ఒక్కరోజే మరో 50 వేల ప్రతిమలు జలప్రవేశం చేస్తాయని వివరించారు. గ్రేటర్లో ట్యాంక్బండ్తో కలిపి మొత్తం 50 చెరువుల్లో నిమజ్జనం జరుగుతుందని, ప్రతీ నిమజ్జన కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో క్రేన్లు, లైటింగ్, తాగునీరు, తదితర సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈసారి మండప నిర్వాహకులు నిమజ్జనమయ్యాక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్టు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పుకార్లు రేపితే చర్యలు.. నిమజ్జనానికి విఘాతం కలిగించేలా పుకార్లు రేపినా, సోషల్ మీడియాలో వదంతులు రేపినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద అలర్ట్ కొనసాగుతున్నప్పటికీ తెలంగాణకు ఇంతవరకూ కేంద్ర నిఘా సంస్థల నుంచి ఎలాంటి హెచ్చరికలు అందలేదని స్పష్టం చేశారు. అయినా.. తాము నిత్యం అప్రమత్తంగానే ఉంటున్నామని తెలిపారు. -
ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: నిమజ్జనంపై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ముఖ్యఘట్టం అన్నారు. అన్ని శాఖలను కలుపుకుని కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం సాగిందని తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రేటర్తో కలుపుకుని 50 శివారు ప్రాంతాల్లో రేపు 50 వేల వినాయకుల నిమజ్జనం జరుగుతుందన్నారు. నిమజ్జనం జరిగే అన్ని చోట్లా సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందన్నారు. మూడు కమిషనరేట్లు, డీజీపీ ఆఫీసులతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. గణేష్ మండపానికి చెందిన వారితో కలిసి నిమజ్జనం కొనసాగిస్తామన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు తరలి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ అవసరం కోసం ఆయా ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించేందుకు ప్లాన్ చేశామన్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 100 సీసీటీవీలను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలపాటు బ్రేక్ లేకుండా నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. -
రేపు జంట నగరాలకు సెలవు
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రెండో శనివారం ఈ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
నిమజ్జనంలో అపశృతి..
-
నిమజ్జనంలో అపశ్రుతి.. చావుతో పోరాడిన యువకుడు
సాక్షి, విజయవాడ : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రకాశం బ్యారేజ్లోని సీతమ్మ వారి పాదాల ఘాట్ వద్ద గణేష్ నిమజ్జానాన్ని తిలకిస్తున్న ఓ యువకుడు బ్యారేజ్లో పడిపోయాడు. వరద ప్రవాహానికి ఆ యువకుడు చాలా దూరం కొట్టుకుపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తం కావడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ చావుతో పోరాడుతున్న యువకుడిని ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు నరేష్ సోనియా రెస్క్యూ చేసి కాపాడారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొన్నూరు సుధాకర్గా గుర్తించారు. కాగా, ప్రాణాలకు తెలిగించి యువకుడిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సందర్శకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రెస్య్యూ చేసి యువకుడిని కాపాడిన నరేష్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యారేజ్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
13గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. 11వ రోజున బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు 18కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 17 ప్రధాన రహదారుల మీదుగా శోభయాత్ర కొనసాగనుందని.. 10వేల లారీలు దీనిలో పాల్గొంటాయన్నారు. అలిబాద్, నాగులచింత, చార్మినార్, మదీన, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభయాత్ర కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. నిమజ్జనం చూడ్డానికి విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారని తెలిపారు. శోభయాత్రలో ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఉపయోగించుకోవాలని కోరారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగ్ కాలనీ, గోసేవ సధన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్ వంటి పది చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6గంటల నుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. మొత్తం 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. -
గణేష్ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి
-
నిమజ్జనంలో అపశ్రుతి.. 6గురు చిన్నారుల మృతి
కోలార్ : కర్ణాటక కోలార్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. క్యేశంబల్లా సమీపంలోని మరదాగట్టు గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. నిమజ్జనం కోసం గణేష్ విగ్రహాన్ని నీటికుంట వద్దకు తీసుకెళ్లిన సమయంలో ముగ్గురు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు చిన్నారులు కూడా అందులోకి దిగారు. దీనిని గమనించిన గ్రామస్తులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ముగ్గురు పిల్లలు ఘటన స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులను చిన్నారులు తేజసి, రక్షిత, రోహిత్, వైష్ణవి, ధనుష్, వీణలుగా గుర్తించారు. -
నిమజ్జనానికి సులువుగా వెళ్లొచ్చు ఇలా..
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 13న తెల్లవారు జామున 4 గంటల వరకు 8 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 30 నిమిషాల నుంచి 45 నిమిషాలకు ఒకటి చొప్పున ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి. లింగంపల్లి–ఫలక్నుమా, సికింద్రాబాద్–ఫలక్నుమా, సికింద్రాబాద్–నాంపల్లి, ఫలక్నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య ఈ అదనపు రైళ్లు నడుస్తాయి. ఎంఎంటీఎస్... ‘హైలైట్స్’ యాప్ నగరంలో రైళ్ల రాకపోకల సమాచారం కోసం ‘హైలైట్స్’ మొబైల్ యాప్ ఎంతో దోహదం చేస్తుంది. ప్రయాణికులు ఈ మొబైల్ యాప్ ద్వారా ఎంఎంటీఎస్ రైళ్ల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల వేళలు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు లభిస్తాయి. జంటనగరాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నాంపల్లి– లింగంపల్లి, ఫలక్నుమా–సికింద్రాబాద్, ఫలక్నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్నుమా మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంఎంటీఎస్పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు ‘హైలైట్స్’ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ రూట్లలో నడిచే రైళ్లను ప్రత్యక్షంగా ఈ యాప్ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఏ ట్రైన్ ఏ రూట్లో ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ యాప్ ద్వారా తేలిగ్గా తెలుసుకోవచ్చు. మూడేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ఈయాప్ను ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. (ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?.. ఇక్కడ క్లిక్ చేయండి) -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా ఏ కొండూరు వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకొంది. గణపతి బప్పా మోరియా అంటూ వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. అందరూ చూస్తుండగానే వాళ్లంతా జలసమాధి అయ్యారు . చెరువులో నిమజ్జన చేసే ప్రదేశం లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ముగ్గురు యువకులు ప్రాణాలు వదిలారు. మృతులు బాణవతు గోపాలరావు,భూక్యా శంకర్, భూక్యా చంటిగా గుర్తించారు. మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చెసి అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకూ ఎంతో సరదాగా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న యువకులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. -
మైకుల వైర్లు కట్ చేయించిన ఎస్సై!
సాక్షి, ధారూరు: మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వినాయకుల ఊరేగింపులో ఎస్ఐ ప్రభాకర్రెడ్డి ఓవరాక్షన్ చేసి హల్చల్ చేశారు. దీంతో యువత, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఎస్ఐ ఎవరికీ చెప్పకుండా మైకులకు ఉన్న వైర్లను కట్చేసి సౌండ్ సిస్టంను బంద్ చేయించారు. దీంతో యువకులతోపాటు భక్తులు ఆందోళనకు దిగారు. మైకులకు అనుమతి ఇవ్వకుంటే వినాయక విగ్రహాలను కదలనివ్వమని, పోలీస్స్టేషన్లో విగ్రహాలను పెడతామని, పోలీసులే నిమజ్జనం చేసుకోవాలని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఎస్ఐ పట్టించుకోకుండా ఊరుకున్నారు. దీంతో యువకులు పోలీసుల వాహనం ఎదుట బైఠాయించారు. ‘జై బోలో.. గణేశ్ మహరాజ్ కీ జై’ అంటూ నినదించారు. చివరకు ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సర్పంచ్ చంద్రమౌలి, గ్రామస్తులు చర్చలు జరిపారు. ధారూరు సీఐ రాజశేఖర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఎస్ఐ మిన్నుకండిపోయారు. అనంతరం యువకులు శాంతించి నిమజ్జనం పూర్తి చేయడంతో సమస్య సద్దుమణిగంది. -
గణేశ్ నిమజ్జనంలో అపశృతి
ఇటిక్యాల (అలంపూర్): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా నదిలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా బుధవారం అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్లోని మస్తాన్నగర్కు చెందిన 22 మంది యువకులు గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు బుధవారం ఉదయం బీచుపల్లికి చేరుకున్నారు.విగ్రహాన్ని దించుతున్నప్పుడు హైదరాబాద్ ఎస్ఆర్నగర్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయిరాం(18), రాజ్కుమార్(18) విగ్రహం అడుగు భాగంలో చిక్కుకుపోవడంతో ఊపిరి ఆడక మృతి చెందారు. కాగా, బీచుపల్లి వద్ద రెండు రోజుల క్రితమే గణేశ్ నిమజ్జనోత్సవాలు ముగియడంతో అధికారులెవరూ అక్కడ లేరు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక గజ ఈతగాళ్లు యువకుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. -
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
-
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, బడంగ్పేట్: బాలాపూర్ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది. వేలం పాటలో రూ. 16లక్షల 60వేలకు శ్రీనివాస్ గుప్తా (ఆర్యవైశ్య సంఘం) లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాదితో పొలిస్తే బాలాపూర్ లడ్డూ లక్ష రూపాయలు అధికంగా పలికింది. భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో లడ్డూ వేలం పాట కన్నుల పండుగగా జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ గణపయ్యది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇక్కడి వినాయకుని లడ్డూకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పెద్ద ఎత్తున ఉంటుందనే సంగతి తెలిసిందే. దీనిని దక్కించుకోవడానికి పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఈ వేలం పాటలో పాల్గొంటారు. బాలాపూర్ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైనప్పటికీ అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ... 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లడ్డూ ఫ్రమ్ తాపేశ్వరం... బాలాపూర్ లడ్డూను తొలుత చార్మినార్లోని గుల్జల్ ఆగ్రా స్వీట్ హౌస్ వారు తయారు చేసేవారు. బరువు 21 కిలోలు ఉండేది. అయితే గత నాలుగేళ్లుగా అంతే బరువుతో తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్ లడ్డూను తయారు చేస్తోంది. వేలంపాట విజేతకు లడ్డూను ఉంచే రెండు కిలోల వెండి గిన్నెను ఇస్తున్నట్లు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వర్ తెలిపారు. 15లక్షల రూపాయలు పలికిన ఫిలింనగర్ గణపతి లడ్డూ ఫిలింనగర్లో గణపతి లడ్డూ వేలం పాటు పోటాపోటీగా జరిగింది. యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన లడ్డూ వేలానికి భారీ స్పందన వచ్చింది. ఈ వేలంలో మేఘనా కన్స్ట్రక్షన్స్ 15 లక్షల రూపాయలకు వినాయకుడి లడ్డూ సొంతం చేసుకుంది. -
గణేష్ నిమజ్జనం: ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. 1.సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్నగర్ ఎక్స్రోడ్స్, ఇంజిన్బౌలి, నాగుల్చింత, హిమ్మత్పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్పురా, లక్కడ్కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్,దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ 2.ఈస్ట్ జోన్: చంచల్గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ 3.వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 4.సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్, దోమల్గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్కు, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు 5.నార్త్జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్లోకి ఎలాంటి ట్రాఫిక్ను అనుమతించరు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్పేట మీదుగా పంపిస్తారు. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్నుమా–సికింద్రాబాద్, ఫలక్నుమా–లింగంపల్లి, తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 550 ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్ వద్దకు చేరుకునేందుకు 550 బస్సులను అదనంగా తిప్పనున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, కాచిగూడ, కూకట్పల్లి, లింగంపల్లి, బాలానగర్, జీడిమెట్ల, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్బాగ్ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. #HYDTPinfo Please go through the maps of Main procession and Parking Places around Hussain Sagar Lake. Pl. Plan ur journey by avoiding the routes shown in the Map. Separate parking places around the Hussain Sagar Lake were arranged for the convenience of viewers. @AddlCPTrHyd pic.twitter.com/lBvND599tZ — Hyderabad Traffic Police (@HYDTP) 21 September 2018 -
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఒంటిగంటలోపే గణపతి నిమజ్జనం పూర్తయింది. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మహాగణపతి నిమజ్జనం కోనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరో నంబర్ క్రేన్ వద్ద శోభాయాత్ర చేరుకుంది. నగరంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం అప్డేట్స్ ఇవి. టాంక్ బండ్కు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు హుస్సేన్ సాగర్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు బారులు తీరిన గణనాధుల శోభాయాత్ర రథాలు గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 51,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగాయి. ఒక్క ట్యాంక్బండ్లోనే 16 వేల విగ్రహాల నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్బండ్పై 29 క్రేన్లు, నెక్లెస్ రోడ్ మార్గంలో 9క్రేన్లు.. మొత్తం 38 క్రేన్ల ఏర్పాటు చేశాం. - దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న వినాయకుడి విగ్రహాలతో ట్యాంక్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఎన్టీఆర్ మార్గ్లో వినాయకుడి విగ్రహాలు బారులు తీరాయి. నిర్విరామంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ సప్త ముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర.. ఇప్పటికే సెన్సేషన్ థియేటర్ దాటి వాసవీ అతిధిగృహం వరకు చేరుకున్న శోభా యాత్ర.. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావటం.. పెద్దగా భక్తులు రాకపోవటంతో నిమజ్జనం ఘాట్కు ప్రశాంతంగా సాగుతున్న శోభాయాత్ర.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మధ్యాహ్నం 12 గంటలలోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం. నగరంలో వినాయక నిమజ్జనానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సాయం అందిస్తోంది. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. నగరంలో సాగుతున్న వినాయక శోభాయాత్ర వీఆర్ డీవోటీ యాప్ తిలకించవచ్చు. ట్యాంక్బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారి నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న వెంకయ్యనాయుడు. ఆయన రాక సందర్భంగా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్సాగర్కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. -
నిమజ్జనంపై నిఘా
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైటెక్ పద్ధతిలో ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. 31 జిల్లాల్లోని వినాయక మండపాలు, నిమజ్జన ప్రక్రియను పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి లైవ్లో వీక్షించేలా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 74,809 మండపాలను జియో ట్యాగ్ చేసి ప్రతి జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 వేల మంది పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లో ఉంటారని.. సోషల్ మీడియాలో వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పద వ్యకులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. జిల్లాల్లో లోతయిన చెరువుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మహిళలు, అమ్మాయిలను వేధించే పోకిరీలను గుర్తించేందుకు షీ టీమ్స్ను రంగంలోకి దింపిన ట్లు వెల్లడించారు. సున్నిత ప్రాంతాలు, గతం లో అల్లర్లు సృష్టించేందుకు యత్నించిన వారిపై నిఘా పెంచామన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో పోలీస్ అధికారులు సమన్వయం చేసుకోవాలని, వాళ్లను కలుపుకుంటూ వెళ్లి కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. 3 ఫీట్ల పైబడినవే..: రాష్ట్రవ్యాప్తంగా 3 ఫీట్ల పైబడి ఉన్న విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 74,809 విగ్రహాలు ఏర్పాటయినట్లు ఆ శాఖ నివేదిక రూ పొందించింది. ఇందులో 60% విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే పూర్తయిందని డీజీపీ తెలిపారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని జమ్మికుంటలో శనివారం నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నాయిని చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ తాడు తెగిపడింది. ఈ ఊహించని ఘటనతో నలుగురు గాయపడ్డారు. అప్పటికే ఇదే క్రేన్తో రెండు విగ్రహాలను నిమజ్జనం చేయగా మూడో విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విగ్రహం చిన్నది కావడంతో క్రేన్పైకి ముగ్గురు భక్తులను అనుమతించారు. వారితో పాటు క్రేన్కు సంబంధించిన ఒకరు గాయపడ్డారు. నీరు తక్కువగా ఉండటంతో వీరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. -
జమ్మికుంట వినాయక నిమజ్జనంలో అపశృతి
-
వినాయక వీడ్కోలు!
-
గూగుల్తో ఒప్పందం.. నిమజ్జనం లైవ్ అప్డేట్స్!
సాక్షి, హైదరాబాద్ : ఏటా హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరిగే గణేశ్ ఉత్సవాల్లో కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం గూగుల్కు ఎక్కనుంది. దీనికి సంబంధించి తొలిసారిగా ఈ ఏడాది ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్కుమార్ తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ–1 ఎల్ఎస్ చౌహాన్తో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా గణేశ్ నిమజ్జనం సందర్భంలో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. వాహనాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఊరేగింపు మార్గంలో ఉన్న వాహనాలు, విగ్రహాలతో ఉన్న వాహనాలు చేరిన ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆంక్షలు, మళ్లింపుల్లో మార్పులు చేస్తుంటారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు ఉన్న ప్రధాన ఊరేగింపు మార్గంతో పాటు మరో 20 ఉపమార్గాల్లోని 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటా యి. వీటి ప్రభావం సాధారణ వాహనచోదకుల పైనా ఉంటోంది. ఆయా మార్గాల్లో ఉన్న పరిస్థితులు, ఊరేగింపు ముగింపు ఉన్న ప్రాంతాలపై ప్రజలు సమాచారం ఇవ్వడానికి ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు వారి అధికారిక సోషల్మీడియాతోపాటు మీడియాను, రేడియోలను వినియోగిస్తున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగటంతోపాటు గూగుల్ నావిగేటర్, మ్యాప్స్లతోపాటు ట్రాఫిక్ లైవ్ను వాహనచోదకులు, ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ గూగుల్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. గణేశ్ ఊరేగింపుతోపాటు ఆ రోజు, ఆయా మార్గాల్లో ఉన్న ట్రాఫిక్ స్థితిగతుల్ని ప్రత్యేకంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. బషీర్బాగ్లోని నగర పోలీసు కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు చెందిన అధికారులు ఊరేగింపు, ట్రా ఫిక్ స్థితిగతులు గమనిస్తూ ఉంటారు. దీనికోసం నగరంలోని జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తుంటారు. ఈ వివరాల ను సీసీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు గూగుల్కు అందిస్తూ మ్యాప్లో అప్డేట్ అయ్యేలా చూస్తా రు. ఇది సాధారణ వాహనచోదకులకు ఉపయుక్తమని అనిల్కుమార్ అభిప్రాయపడ్డారు. వీక్షణకు యాప్... గణేశ్ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తొలిసారిగా ఒక యాప్ అందు బాటులోకి వచ్చింది. ఈ వీఆర్ డివోటీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని 360డిగ్రీస్ వర్చువల్ రియాలిటీ పిక్చర్తో 23న హైదరాబాద్లో జరిగే నిమజ్జన దృశ్యాలను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీక్షించవచ్చునని రూపకర్తలు కాల్పనిక్ టెక్నాలజీస్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణేశ్ భక్తులు ఎక్కడ నుంచైనా సరే వేలాదిగా ప్రయాణించే వినాయకుడి రూపాలను, ఊరేగింపు విశేషాలను, పండుగ సంబరాన్ని చూడొచ్చునన్నారు. వీక్షకులు తాము సైతం హుస్సేన్సాగర్ సమీపంలోనే ఉన్నామని అనుభూతి చెందేలా, స్పష్టంగా ఈ దృశ్యాలను యాప్ అందిస్తుందన్నారు. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఆ ప్రతినిధులు వివరించారు. సిటీని 38 సెక్టార్లుగా విభజించి.. ‘నిమజ్జన ఘట్టం నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగరాన్ని 38 సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 2,100 మంది సిబ్బంది, అధికారులు విధుల్లో ఉంటారు. సిటీలోని ప్రతీ జంక్షన్లోనూ ఓ ఎస్సై, కీలక ప్రాంతాల్లో ఆపై స్థాయి అధికారులు ఉంటారు. మొత్తమ్మీద ఇద్దరు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 10 మంది ఏసీపీలు, 32 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది ఎస్సైలు, 1,950 మంది ఇతర సిబ్బందిని మోహరిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో శాంతిభద్రతల విభాగం అధికారుల సాయం తీసుకోనున్నాం. ప్రజలకు సూచనలు చేయడానికి నగర వ్యాప్తంగా 2 వేల సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. సౌత్జోన్లో ఊరేగింపు పూర్తికావడం కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ త్వరగా ప్రారంభించాలి. ఊరేగింపు ముగిసిన ప్రాంతాల్లో ఆంక్షల్ని దశల వారీగా ఎత్తివేస్తాం’ – అనిల్కుమార్, ట్రాఫిక్ చీఫ్ -
నీట మునిగి స్నేహితుల మృతి..
సాక్షి, కవిటి / శ్రీకాకుళం : అభం శుభం తెలియని చిన్నారులను కోనేరు కాటేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం గొర్లెపాడు గ్రామానికి చెందిన కర్రి చలమయ్య కుమారుడు దిలీప్ (8) బొణికేల పుణ్యవతి కుమారుడు వేణు (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవారు. పాఠశాలకు కలిసే వెళ్లి వచ్చేవారు. శనివారం బడికి సెలవు కావడంతో ఆటాడుకోవడానికి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధి హామీ పథకం పనుల కోసం వెళ్లారు. తిరిగి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు కనిపించలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా పిల్లలు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై వెతకడం ప్రారంభించారు. ఊరి చివర్లో ఉన్న కోవెల చెరువు గట్టుపై పిల్లల దుస్తులు కనిపించడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. స్నానానికి చెరువులో దిగి ఉండవచ్చునని భావించి కొంతమంది అందులో గాలించగా దిలీప్,వేణు శవాలై కనిపించారు. దీంతో కన్నవారు, గ్రామస్తులు గొల్లుమన్నారు. ఆటలాడుకున్న పిల్లలు అలసిపోయి స్నానం కోసం దిగి నీట మునిగి చనిపోయి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండే దిలీప్, వేణు మరణంలోనూ తోడుగా వెళ్లిపోవడంపై స్థానికులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు వేణు తల్లి బొణికేల పుణ్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్సై పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్రి దిలీప్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు..ఇన్సెట్లో కర్రి దిలీప్ (ఫైల్) -
నిమజ్జన వివాదం: సుప్రీంకు మమతా సర్కార్..?
సాక్షి,కోల్కతాః మొహరం సందర్భంగా అక్టోబర్ 1న దుర్గా మాత విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలను అక్టోబర్ 1న నిషేధిస్తూ మమతా సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.మొహరం, విజయదశమి ఒకేసారి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. మొహరం ఊరేగింపు, దుర్గా విగ్రహాల నిమజ్జనం రెండూ నిర్వహించాలని, వీటికి సంబంధించిన రూట్ మ్యాప్ను ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్ధానంలో సవాల్ చేయాలని మమతా సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం కోర్టు ఉత్తర్వులపై సీఎం మమతా బెనర్జీ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఏం చేయాలో తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రీం ఏ క్షణమైనా ప్రభుత్వం తరపున హైకోర్టు ఆదేశాలపై పిటిషన్ దాఖలు చేయవచ్చని తెలిసింది. -
విభిన్నరూపాల్లో ఉన్న గణేశుల నిమజ్జనం
-
అనుక్షణం.. అప్రమత్తం..
ఏరియల్ సర్వే చేస్తున్న హోంమంత్రి నాయిని, సీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీజీపీ అనురాగ్ శర్మ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ పర్యవేక్షణ హోంమంత్రి, సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏరియల్ సర్వే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తును డీజీపీ అనురాగ్ శర్మ, నగర కమిషనర్ మహేందర్రెడ్డి పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ గణేశ్ శోభా యాత్ర రాత్రి 10 గంటల వరకు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ ద్వారా అనురాగ్ శర్మ, అదనపు డీజీపీ అంజనీ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్చంద్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్జైన్, నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి, శాంతి భద్రతల ఇన్చార్జి ఐజీ రమేశ్రెడ్డితో కలసి సీసీ కెమెరాల్లో వీక్షించారు. అనంతరం ఎల్బీస్టేడియం, అబిడ్స్, అఫ్జల్గంజ్, చార్మినార్ ప్రాంతంలో శోభాయాత్రను పరిశీలించారు. హోంమంత్రి ఏరియల్ సర్వే.. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్టులో నాయిని మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడు మధ్యాహ్నంలోపే నిమజ్జనం కావడం హర్షించదగ్గ విషయ మన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని, నిమజ్జనోత్సవంలో ప్రజల సహకారం మరు వలేనిదని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అనురాగ్శర్మ.. 1992 నుంచి.. భాగ్యనగరంలో నిమజ్జనాలకు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం అంత సులువుకాదు. అయితే డీజీపీ అనురాగ్శర్మ 1992 నుంచి నగరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. సౌత్జోన్ డీసీపీగా 1992 జూన్లో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అప్పటి నుంచి 1995 సెప్టెంబర్ వరకు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించారు. తదనంతరం నగర కమిషనర్గా 2012, 2013లో రెండుసార్లు యూనిట్ ఆఫీసర్గా గణేశ్ నిమజ్జన బందోబస్తులో పాల్గొన్నారు. ప్రస్తుతం డీజీపీ çహోదాలో నాలుగేళ్లుగా గణేశ్ నిమజ్జన బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పదిసార్లు వినాయక నిమజ్జనాల్లో స్వయంగా పాల్గొనడం గర్వంగా ఉందని, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీజీపీ అనురాగ్శర్మ ‘సాక్షి’కి చెప్పారు. వైభవంగా మహాగణపతి నిమజ్జనం సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. సంప్రదా యానికి భిన్నంగా ఈసారి ఉదయం ఏడు గంటలకే శోభాయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటలలోపే నిమజ్జన వేడుకలు ముగిశాయి. భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ నుంచి లక్డీకాఫూల్, టెలిఫోన్భవన్, సెక్రటేరియట్ మీదుగా వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర సాగింది. ఉదయం 10.25 గంటలకు మహాగణపతి బయలుదేరిన వాహనం ఎన్టీఆర్ రోడ్డులోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరింది. అక్కడ గణనాథుడికి తుది పూజలు నిర్వహించిన అనంతరం వెల్డింగ్ పనులు చేపట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 1.57 గంటలకు భక్తుల జయజయ ధ్వానాల నడుమ నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. -
బాయ్ బాయ్ గణేశా..
-
నిమజ్జనంలో అపశ్రుతి: ట్యాంక్ బండ్పై సెల్ఫీ దిగుతూ..
సాక్షి, హైదరాబాద్ సిటీ: ఉత్సాహంగా జరుగుతోన్న గణపతి నిమజ్జనమహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగవారం నిమజ్జనం చూసేందుకు ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ హుస్సేన్ సాగర్లో పడిపోయాడు. ఇది గమనించిన స్నేహుతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. నీళ్లలోకి దిగి గాలించింది. కానీ యువకుడి ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు పరిధిని పెంచుకుంటూ పోయారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆ యువకుడి జాడ తెలియరాలేదు. -
ప్రపంచంలో బెస్ట్ టీచర్ ఆయన: నటి
ముంబయి: నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు, ఎన్నో విషయాలు నేర్పించిన గురువులను స్మరించుకుంటూ గౌరవించుకుంటాం. మన నిత్య జీవితంలో గురువుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నది అక్షరసత్యం. బాలీవుడ్ నటి కాజోల్ మాత్రం టీచర్స్డే ను భిన్నంగా జరుపుకున్నారు. గణనాథుడికి టీచర్స్డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప టీచర్ ఆయనే అంటూ గణనాథునితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. విగ్రహం వద్ద చిరునువ్వులు చిందిస్తూ సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ నటించిన భజరంగీ బాయ్జాన్ లోని సెల్ఫీ లే లే పాటను తన సెల్ఫీ క్యాప్షన్లో కాజోల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే గొప్ప గురువు వినాయకుడంటూ గణేష్ నిమజ్జనం రోజున నటి చేసిన సోషల్ మీడియా పోస్టుపై విపరీతమైన స్పందన వస్తోంది. మన జీవితాంతం గురువు ఎవరైనా ఉన్నారంటే గణనాథుడేనంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు గణేషుడితో నేచురల్ బ్యూటీ, వెరీ నైస్ స్మైల్ అంటూ స్పందిస్తున్నారు. -
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం: సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్నదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అనుకున్న సమయానికే పూర్తవుతుందని, ట్యాంక్బండ్పైకి ఖైరతాబాద్ మహాగణపతిని తీసుకువచ్చామని వెల్లడించారు.హైదరాబాద్లో 12వేల విగ్రహాలకు జియోట్యాగింగ్ చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుందని ఆయన అన్నారు. రేపు ఉదయం కల్లా నిమజ్జనం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. -
నిమజ్జనంలో ముగ్గురు గల్లంతు, ఒకరు మృతి
సాక్షి, విజయనగరం/భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వేర్వేరు జిల్లాల్లో నదుల్లో మునిగి ముగ్గురు వ్యక్తులు గల్లంతుకాగా ఒకరు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలోని చంపావతి నదిలో విగ్రహంతోపాటు కుప్ప పోతురాజు(19) అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. టూటౌన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు కలిసి అతని కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల వద్ద గోదవరి నదిలో నిమజ్జనానికి వచ్చిన ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు. వీరిని జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురానికి చెందిన వినయ్(20), శ్రీకాంత్(20)గా గుర్తించారు. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు కింద పడి ఒకరు మృతి విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు కింద పడి రాజశేఖర్ అనే వ్యక్తి మృతిచెందాడు.ఇతనికి పెళ్లి అయి ఎనిమిది నెలలు అవుతున్నది. ప్రస్తుతం భార్య గర్భవతి. -
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
-
తెలుగుతల్లి ఫ్లైఓవర్ చేరుకున్న గణేశుడు
-
ఎస్సైపై దాడికి యత్నించిన కానిస్టేబుళ్లు
♦నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి వీరంగం సాక్షి, హైదరాబాద్: నిమజ్జనానికి వినాయకుడిని తరలించే క్రమంలో ముగ్గురు కానిస్టేబుళ్లు ఆదివారం రాత్రి వీరంగం సృష్టించారు. ఓ ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్పై దాడికి యత్నించారు... రహ్మత్నగర్లోని బంగారుమైసమ్మ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆదివారం రాత్రి నిమజ్జనానికి తరలిస్తుండగా సెక్టారు ఎస్సై కురుమూర్తి, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. ఇప్పటికే ఆలస్యమైనందున త్వరగా విగ్రహాన్ని తీసుకెళ్లాలని ఎస్సై వారికి సూచించారు. దీంతో అక్కడున్న ముగ్గురు వ్యక్తులు తాము కూడా పోలీసులుగా పనిచేస్తున్నామని, ఎందుకు త్వరపెడుతున్నారంటూ వాదనకు దిగారు. అంతేగాక తాము అలానే నృత్యాలు చేస్తామని, ఏం చేస్తారో చేసుకోండంటూ ఎదురుతిరిగారు. ఎస్సైతోపాటు జూబ్లీహిల్స్ ఠాణా కానిస్టేబుల్ రాజేష్ నిలువరించేందుకు ప్రయత్నించగా వారు దాడికి ప్రయత్నించారు. అనంతరం ఎస్సై ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. దాడికి యత్నించినవారు బంజారాహిల్స్, ఎస్సార్నగర్, చిలకలగూడ ఠాణాలలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై ఇప్పటికే కానిస్టేబుల్ రాజేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ పోలీసులను వివరణ కోరగా అలాంటిదేమి లేదని.. మాటమాట పెరిగింది తప్ప ఎలాంటి గొడవ జరగలేదన్నారు. -
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హైదరాబాద్ పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు కమిషనరేట్ల అధికారులు నిఘా, తనిఖీలు, గస్తీ, సోదాలు ముమ్మరం చేశారు. జనసమ్మర్ద ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్ వద్ద విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పుకార్లను వ్యాపింప చేస్తున్న ఎస్సెమ్మెస్లు, సోషల్మీడియాలపై టెక్నికల్ నిఘా ఉంచే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేశారు. ఈవ్టీజర్లుకు చెక్ చెప్పడానికి 100 షీ–టీమ్ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. దీంతోపాటు స్నాచర్లుకు చెక్ చెప్పేందుకు సీసీఎస్, టాస్క్ఫోర్స్లకు చెందిన డెకాయ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. వీరు అనుమానాస్పద, కీలక ప్రాంతాల్లో మఫ్టీల్లో తిరుగుతూ నిఘా వేసి ఉంచుతారు. దాదాపు 40కి పైగా డెకాయ్ టీమ్స్ మోహరిస్తున్న ఉన్నతాధికారులు ఇందులో క్రైమ్ వర్క్పై పట్టున్న వాళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎవరికైనా పుకార్లతో కూడిన సందేశాలు వస్తే వాటిని తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు.వీటిని మరో గ్రూపులోకో, వ్యక్తిగతంగానో ఫార్వర్డ్చేస్తే సాంకేతిక నిఘాతో వారిని కనిపెట్టేలా ఏర్పాట్లు చేశారు. -
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
-
మొదలైన బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
-
నేడు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం
-
26 వేల మందితో బందోబస్తు
రాజధానిలో గణేశ్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మంగళవారం జరిగే వినాయక నిమజ్జనానికి 26 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. రాష్ట్ర పోలీసుశాఖలోని ప్రత్యేక బెటాలియన్లు, ఆర్మ్డ్ రిజర్వ్, పారామిలిటరీ బలగాలతో కలసి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర పోలీసు హెడ్క్వార్టర్స్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబరాబాద్, రాచకొండ, సిటీ కమిషనరేట్లలో మొత్తం 25,850 విగ్రహాలు ఏర్పాటయ్యాయని, ఒక్క హైదరాబాద్ కమిషన రేట్ పరిధిలోనే 11,572 విగ్రహాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో సగం వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. నిమజ్జన రూట్మ్యాప్ ఆధారంగా మొత్తం సీసీటీవీలను ఏర్పాటు చేశామని, సిటీ కమిషనరేట్, డీజీపీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏరియల్ సర్వే కూడా చేస్తామని వివరించారు. నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించేందుకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పదకొండు మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, పదిహేను మంది ఎస్పీలు, ఏడుగురు అదనపు ఎస్పీలు, 132 మంది డీఎస్పీలు, 349 మంది ఇన్స్పెక్టర్లు, 1,209 మంది ఎస్సైలు, 11,642 మంది కానిస్టేబుళ్లను రంగంలోకి దించామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, వాహనదారులకు ఎప్పటికప్పుడు నగర కమిషనరేట్ తగు సూచనలిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ, విద్యుత్శాఖ, వాటర్ బోర్డు విభాగాలతో అత్యవసర సేవల బృందాలనూ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాల్లో ఇప్పటికే సగం మేర గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, భైంసా, వరంగల్ తదితర సున్నిత ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను రంగంలోకి దించి ప్రశాంత వాతావరణంలో మంగళవారం నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేస్తామని డీజీపీ తెలిపారు. కిందటి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకోసం జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 101 ప్రాంతాలలో కౌంటర్లు, టెంట్లు, మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేశామన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీం, ఒక సూపర్వైజర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లతో మూడు విడతల వారీగా అందుబాటులో ఉండేవిధంగా సిబ్బందిని కేటాయించామని, ప్రతి సర్కిల్లో ఒక ఎమర్జెన్సీ టీంను 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 800 వీడియో కెమెరాల ద్వారా బాలాపూర్ నుండి ట్యాంక్బండ్ వరకు జరిగే గణేష్ నిమజ్జనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందన్నారు. నిమజ్జనంకోసం ఎన్టీఆర్మార్గ్లో 16, ట్యాంక్బండ్ వద్ద 25, మినిస్టర్ రోడ్డులో 3, రాజన్నబౌలి వద్ద 3, మీరాలంట్యాంక్లో 2, ఎర్ర కుంటలో 2 క్రేన్లు సిద్ధంగా ఉన్నాయని, అంబులెన్స్లు, జనరేటర్లు, వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. శానిటేషన్ నిర్వహణకు దాదాపు 9,710 మందితో 3 విడతలలో పనిచేసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. భక్తులకోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే పరిశుభ్రత కోసం 14 స్వీపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచామని తలసాని చెప్పారు. -
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలనుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు. ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్ రైలు నడిచేలా ఎర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 24వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడమేగాక 13 కంపెనీల కేంద్ర పారా మిలటరీ దళాలను, సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును రంగంలోకి దించారు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున గణేష్ యాక్షన్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ పోలీసులు తొలిసారిగా ఈ కెమెరాను ఉపయోగిస్తున్నారు. -
గణపతి నినాదాలతో హోరెత్తిన ట్యాంక్బండ్
-
కరీంనగర్లో వేడుకగా గణేష్ నిమజ్జనం
-
వరంగల్లో వేడుకగా గణేష్ నిమజ్జనం
-
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్ : వినాయక నిమజ్జనం చేస్తుండగా నగరంలో అపశృతి చోటు చేసుకుంది. ముందున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లి రాజీవ్గాంధీనగర్ లో ఆదివారం ట్రాక్టర్పై గణేశుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ముందు యువకులు నృత్యాలు చేస్తున్నారు. అంతలోనే ట్రాక్టర్ అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లి మహేశ్ అనే బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహేశ్ను వెంటనే నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఇద్దరు బాలురకు గాయాలు కాగా వారికి చికిత్స చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిమజ్జనం కోసం పీటీజెడ్ కెమెరాతో నిఘా
-
సెప్టెంబర్ 5న సెలవు
సాక్షి, హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5ను సెలవురోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిమజ్జన రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. సెప్టెంబర్ 5న సెలవు ఇచ్చినందున ఈ నెల 9న(రెండో శనివారం) ఉద్యోగులంతా పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నగరంలో అడుగడుగునా నిఘా: సీపీ
హైదరాబాద్: బక్రీద్, వినాయకచవితి పండుగల సందర్భంగా 24 వేల మంది పోలీసులతో, వేలాది సీసీ కెమెరాల ద్వారా అణువణువునా పర్యవేక్షిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీతో కలిసి రూట్ మ్యాప్ చెక్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎక్కడైనా రహదారి సమస్య వస్తే ప్రజలు ముందుగానే తెలియజేయాలని కోరారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రెండు పండగలు ఒకటే సారి వస్తున్నందువల్ల ప్రజలందరూ సహకరించాలని, అన్నిశాఖల సలహాలు తీసుకుంటామని చెప్పారు. వినాయక ఉత్సవ కమిటీలతో పాటు , అన్ని శాఖల సహకారంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్పారు. నిమజ్జనం రోజున జరిగే కార్యక్రమాలపై ఇప్పటికే అన్ని వసతుల ఏర్పాట్లు చేశామని తెలిపారు. చెత్త వేయడానికి అక్కడక్కడ లక్ష కవర్లను, 168 మంది యాక్షన్ టీమ్లను, 5300 మంది జీహెచ్ఎంసీ కార్మికులు, 203 వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
నిమజ్జనంలో విషాదం: ముగ్గురు మృతి
కోల్కతా: గణేష్ విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరెంట్షాక్తో ముగ్గురు చనిపోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ విషాదం చోటు చేసుకుంది. హుగ్లీ నదిలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తుండగా బాజా కడమ్తాల ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరెంటు తీగ తెగి విగ్రహంపై పడటంతో దానిని ఆనుకుని ఉన్న నిర్వాహకులు బిమల్ సహాని(37), జితేంద్ర సహాని(28), బితాష్ మండల్(30) అక్కడికక్కడే షాక్తో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విగ్రహం ఎత్తు 18 అడుగులకు మించి ఉండటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. -
నిమజ్జనం.. ఓ విఘ్నం!
►ముంచుతారా.. తేలుస్తారా! ►గణనాథునికి నిమజ్జన కష్టాలు ►జిల్లాలో ఎక్కడా చుక్కనీరు లేని వైనం ►హెచ్ఎల్సీ నీటి విడుదల అనుమానమే.. ►ప్రత్యామ్నాయం శూన్యం అనంతపురం సెంట్రల్: కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. మరో మూడు రోజుల్లో మొదలవనున్న ఈ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్న వేళ.. ఓ విఘ్నం భక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు నీటి జాడ లేకపోవడంతో నిమజ్జనం ఎలా చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పండుగకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. నిమజ్జనానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు.. జిల్లా కేంద్రంలో ఐదు రోజులకు నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. గతంలో ఎప్పుడూ ఈ సమయానికి చెరువులు జల కళ సంతరించుకునేవి. తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్ఎల్సీ)కి పుష్కలంగా నీళ్లొచ్చేవి. అయితే ఈ ఏడాది ఈ పరిస్థితి కరువయింది. ఎక్కడా చుక్క నీరు లేని పరిస్థితుల్లో నిమజ్జనం ఎలాగనే చర్చ తలెత్తుతోంది. అనంతపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను గుత్తిరోడ్డులోని హెచ్ఎల్సీ కాలువ వద్ద పెద్ద క్రేన్ సాయంతో నిమజ్జనం చేస్తారు. అలాంటిది.. ఇప్పటి వరకు కాలువకు నీటి విడుదల లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఇటీవల జరిగిన టీబీ బోర్డు సమావేశంలో జలాశయానికి నీటి లభ్యత తక్కువగా ఉందని.. సెప్టెంబర్ నాటి పరిస్థితి ఆధారంగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిడ్ పెన్నార్ జలాశయం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. పీఏబీఆర్లో మాత్రమే ఒక టీఎంసీ నీరు ఉంది. ఈ నీరు నెల రోజులకు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, వైఎస్ఆర్ తాగునీటి పథకాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టీబీ డ్యాం నీటి విడుదల విషయమై బళ్లారి జిల్లా కలెక్టర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో నిమజ్జనం విషయంలో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నడూ చూడని విధంగా జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవానికి నీటి కష్టాలు చుట్టుముట్టడం గమనార్హం. గతంలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఒట్టి చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం తెలిసిందే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనూ అలాంటి పరిస్థితి తప్పదేమోననే చర్చ జరుగుతోంది. తాగునీటిని వదిలేది లేదు తుంగభద్ర జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరాం. మంగళవారం నుంచి 500 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల అడుగుతున్నాం. ఇప్పటి వరకూ అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎంపీఆర్, సీబీఆర్ జలాశయాలు ఇప్పటికే డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. పీఏబీఆర్లో నెలరోజులకు సరిపడా మాత్రమే నీళ్లున్నాయి. ఎట్టి పరిస్థితిలో నీళ్లు వదిలేది లేదు. వినాయక నిమజ్జనం ఎలా అనేది నా పరిధిలో లేదు. - టి.వి.శేషగిరిరావు, ఎస్ఈ, హెచ్చెల్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లా కేంద్రంలో మాత్రమే 500లకు పైగా విగ్రహాలు కొలువు దీరుతాయి. ఐదవరోజు వేలాది మంది జనసందోహం నడుమ నిమజ్జనం జరుపుకోవడం ఆనవాయితీ. నిమజ్జనానికి నీళ్లు వదలాలని గతంలో హెచ్చెల్సీ అధికారులను కోరాం. జిల్లా అధికారులతో పాటు నాయకులు చొరవ చూపాలి. - పరుచూరి రమేష్, వినాయక ఉత్సవ సమితి, ప్రధాన కార్యదర్శి నీళ్లు వస్తాయి తాగునీటి కోసం నీటిని విడుదల చేయాలని తుంగభద్రబోర్డు అధికారులను కోరాం. రెండు రోజుల్లో తుంగభద్ర నుంచి నీటిని వదులుతారు. వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాం. ఒకవేళ రాని పక్షంలో ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం. - వీరపాండియన్, జిల్లా కలెక్టర్ -
పీరీలను నిమజ్జనం చేసిన భక్తులు
ధర్మారం: ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో గురువారం మోహార్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ధర్మారం, మల్లాపూర్, ఎర్రగుంటపల్లి, మేడారం, దొంగతుర్తి తదితర గ్రామాలలోని హిందూ, ముస్లీంలు ఐక్యంగా వేడుకలను నిర్వహించారు. సాయంత్రం ఆయా గ్రామాలలో దర్గాల ఎదుట పీరీల వద్ద భక్తులు దూలాటలు ఆడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీరీలను ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. -
దంతాలపల్లిని మండలంగా ప్రకటించాలి
నర్సింహులపేట : దంతాలపల్లిని మం డలంగా ప్రకటించాలని డిమాండ్ చే స్తూ బుధవారం స్థానికులు చెరువులో మునుగుతూ నిరసన తెలిపారు. అనంతరం దంతాలపల్లి అంబేద్కర్ సెంటర్ వరంగల్–ఖమ్మం హైవేపై రాస్తారోకో చేశారు. మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాయిని రఘునందన్ రెడ్డి, సర్పంచ్ కిషన్ నాయక్, ఎంపీటీసీ కిశోర్కుమార్, మాజీ సర్పంచ్ నాయిని శ్రీనివాస్రెడ్డి, జేఏసీ కన్వీనర్ ధర్మారపు వెంకన్న, బీజేపీ నియోజకవర్గ నాయకుడు చీకటి మహేష్, మండల సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వైభవంగా విశ్వకర్మ విగ్రహ నిమజ్జనం
సదాశివపేట: సదాశివపట్టణం హనుమాన్ నగర్ కాలనీలోని వీరబ్రహ్మం మందిరంలో ఈ నెల 17న ప్రతిష్టించిన విశ్వకర్మ విగ్రహాన్ని బుధవారం నిమజ్జనం చేశారు. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మందిరం నుంచి ప్రారంభమైన నిమజ్జన ఊరేగింపు వికారాబాద్ రోడ్డు, 65వ నంబర్ జాతీయ రహదారి, తిలక్రోడ్డు, గాంధీరోడ్డు మీదుగా శంభులింగేశ్వర మందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు, సాయంత్రం శంభులింగేశ్వర మందిరం ఎదుట విశ్వకర్మ విగ్రహానికి చివరగా పూజలు నిర్వహించి బావిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా కార్యదర్శి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మెదక్ శ్రీనివాస్చారి, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి పట్టణ యువత అధ్యక్షుడు మెదక్ సందీప్చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి అంబదాస్, పట్టణ యువత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్చారి, నాయకులు సంగమేశ్వర్, భోగేశ్, నర్సింగ్రావు, సురేశ్చారి, పట్టణ స్వర్ణకార సంఘం నాయకులు తదితరులు నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. -
నిమజ్జనం చూపిస్తానని తీసుకెళ్లి బలత్కారం
► బాలికపై మేనమామ అత్యాచారయత్నం ► ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన సైదాబాద్: వినాయక నిమజ్జనం చూపిస్తానని వరుసకు మేనమామ అయిన వ్యక్తి ఓ పద కొండేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నేపాల్కు చెందిన తులసి(35) నగరానికి వలస వచ్చి సింగరేణి వాంబే గృహాల్లో నివాసం ఉండేవాడు. ఇతనికి భా ర్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం చర్లపల్లికి మకాం మార్చాడు. సింగరేణి కాలనీలో ఉండగా పక్కింట్లో ఉన్న వరుసకు కొడ లు అయ్యే బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కాగా ఈ నెల 17న వినాయక నిమజ్జనం చూపిస్తానని తన ఆటోలో తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఆమె ఇంటికి తీసుకొచ్చి వదిలేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిచి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
సంచలనం సృష్టిస్తున్న వీడియో
పుణె: వినాయక నిమజ్జన ఉత్సవం ఇటీవలనే ముగిసిపోయినప్పటికీ అది చాటి చెప్పిన ఓ మానవీయ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా చక్కెర్లు కొడుతోంది. కాషాల జెండాలు, వస్త్రాలు ధరించిన భక్తులు, భజనపరులు డప్పుల దరువులకు గంతులేస్తుండగా, వారి చుట్టూ వేలాది మంది ప్రజలు ఇసుకకూడా రాలనంతగా కిక్కిర్సిపోయి ఉన్నప్పుడు అటుగుండా ఓ అంబులెన్స్ వచ్చింది. దానికి జన సముద్రం రెండుగా చీలిపోయి దారిచ్చింది. కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్చేయగా, దీన్ని ఇప్పటికే పది లక్షల మందికిపైగా చూశారు. రెండు రోజుల్లో 40 వేల మందికిపైగా షేర్ చేసుకున్నారు. పుణెలో వినాయక నిమజ్జనం రోజున తీసిన ఈ రెండు నిమిషాల నిడివిగల వీడియో విదేశాల్లో వింతకాకపోవచ్చు. భారత్లాంటి దేశంలో, అందులోనూ వినాయక నిమజ్జనం రోజున ఇలాంటి మానవత్వాన్ని చాటిచెప్పే సంఘటనలు చాలా చాలా అరదు. ఆరోజున ట్రాఫిక్ ఎంతగా స్తంభించిపోతుందో, పొరపాటున అత్యవసరమై వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వారి అవస్థలు మనకు అనుభవపూర్వకమే. వీఐపీలకు కూడా ఆరోజు దారిచ్చే దారులుండవు. -
సంచలనం సృష్టిస్తున్న వీడియో
-
గణేష్ శోభాయాత్రలో అపశ్రుతి
-యువకుడి మృతి జిన్నారం: వినాయక శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదలలో శనివారం ఉదయం బొజ్జ గణపతిని ఊరేగిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తాకాయి. దీంతో ఆ సమయంలో వాహనం పై ఉన్న కిషోర్(19) కరెంట్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కిషోర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
నిమ‘జ్జనం’లో పోకిరీ వేషాలు
సాక్షి, సిటీబ్యూరో: నిమజ్జనం నేపథ్యంలో గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో యువతులు/మహిళల్ని వేధిస్తున్న 26 మంది పోకిరీలను షీ–టీమ్స్ పట్టుకున్నాయి. వీరిలో ఏడుగురు మైనర్లు సైతం ఉన్నారని అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా శుక్రవారం పేర్కొన్నారు. పోకిరీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రధాన ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు నగరంలోని కీలక ప్రాంతాలు, హుస్సేన్సాగర్ చుట్టుపక్కల షీ–టీమ్స్ను రంగంలోకి దింపి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఫలితంగా వీరంతా చిక్కారు. ఈ పోకిరీల చేష్టలను వీడియో రికార్డింగ్ చేయడం ద్వారా అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. -
నిమజ్జనం వ్యర్థాల వెలికితీత షురూ
మహా నిమజ్జన పర్వం ముగిసింది. ఈసారి హుస్సేన్సాగర్లో సుమారు 51 వేల గణేష ప్రతిమలు నిమజ్జనం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్యాంక్బండ్ వైపు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనాలు కొనసాగాయి. ఈలోపు పెద్ద విగ్రహాల నిమజ్జనం పూర్తయిన ఎన్టీఆర్ మార్గ్లో వ్యర్థాల వెలికితీత పనులను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 3,456 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు చెప్పారు.శనివారం మధ్యాహ్నం నాటికి ఎన్టీఆర్ మార్గంలో వ్యర్థాల తొలగింపు ముగిస్తుందని చెప్పారు. ఆ తర్వాత ట్యాంక్బండ్ పక్క వెలికితీత పనులు మొదలు పెట్టనున్నారు. ఇనుప, చెక్క ఫ్రేంలు, కొబ్బరి పీచు తదితర వ్యర్థాలు ఎక్కడికక్కడ జలాశయంలో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని ఆంఫిబియస్ ఎక్స్కవేటర్ ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి జేసీబీల ద్వారా వాహనాల్లో నింపుతున్నారు. గతేడాది 4,500 టన్నుల వరకు వ్యర్థాలు రాగా.. ఈసారి 5000 టన్నులకు చేరేఅవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది 4 అడుగుల పైబడి విగ్రహాల సంఖ్య పెరిగిందని పోలీసుల రికార్డుల ప్రకారం తెలుస్తోంది. 500 టన్నుల ఇనుము, 240 టన్నుల కలప, 200టన్నుల పీఓపీ సాగరంలో కలిశాయని పీసీబీ అంచనా వేస్తోంది. ఇందులో ఇనుము, కలప, కొబ్బరిపీచును 4500 టన్నుల మేర తొలగించినా..పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్సాగర్ మరింత గరళసాగరం కానుందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. వ్యర్థాల తరలింపునకు ఆటంకం కలిగించింది. వాహనాల రాకపోకలు ఎన్టీఆర్ మార్గంలో నెమ్మదించడంతో వ్యర్థాలను డంప్ యార్డ్కు తరలించే టిప్పర్లు ముందుకు వెళ్లేందుకు గగనంగా మారింది. దీంతో తరలింపు పనులను కొద్ది సేపు నిలిపివేయాల్సి వచ్చిందని హెచ్ఎండీఏ ఈఈ జే.కృష్ణారావు, డీఈఈ దయాకర్రెడ్డి తెలిపారు. -
మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్
నృత్యం చేస్తున్న మహిళను వేదిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి షీటీం పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సఫీల్గూడ మిని ట్యాంక్బండ్ వద్ద వినాయక నిమజ్జనం జరుగుతున్న సమయంలో మెడికల్ రిప్రజంటేటివ్గా పని చేసే మల్కాజిగిరికి చెందిన ఆర్. అనిల్ (32) నృత్యాలు చేస్తున్న మిహ ళలను వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు అక్కడే విధులు నిర్వహిస్తున్న షీటీం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షీటీం పోలీసులు అనిల్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
నిజామాబాద్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్వతి తనయుడిని నిమజ్జనానికి తరలిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తాకడంతో దాని పై ఉన్న ఓ యువకుడు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని ఎల్లంగూట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా.. వాహనం పై ఉన్న నరేష్(28)కు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన నలుగురు చిన్నారులు క్షేమం
హైదరాబాద్: నగరంలోని బాగ్లింగంపల్లిలో అదృశ్యమైన నలుగురు బాలికల ఆచూకీ లభ్యమైంది. అచ్చయ్యనగర్కు చెందిన నలుగురు బాలికలు గురువారం సాయంత్రం అదృశ్యమయ్యారు. గాయత్రి(15), దివ్య(15), రుచిత(13), పావని(13) అనే నలుగురు విద్యార్థినులు జిరాక్స్ కోసం వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. -
నగరంలో నలుగురు బాలికల అదృశ్యం
-
ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురికి గాయాలు
కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో వినాయక నిమజ్జనం చేసి తిరిగి వెళ్తుండగా శుక్రవారం వేకువజామున ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. మిగతా వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ ఉడతలగూడెం గ్రామానికి చెందినదిగా గుర్తించారు. -
లంబోదర సంగీతం.
-
నిమజ్జనంపై సీఎం సంతృప్తి
-
కొనసాగుతున్న గణేష్ నిమజ్జనోత్సవం
-
దేవేంద్ర ఫడ్నవిస్ ఇంట వినాయక నిమజ్జనోత్సవం
-
నిమజ్జనంపై సీఎం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు, గంటల తరబడి నిరీక్షణ, తొక్కిసలాట లేకుండా నిమజ్జనం కార్యక్రమం పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆద్యంతం అప్రమత్తంగా వ్యవహరించిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సకాలంలో జరగడంతో మొత్తం కార్యక్రమం అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు వీలయిందన్నారు. -
దారి కాసిన మృత్యువు
కుక్కునూరు : వేలేరు గ్రామంలో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవంలో గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ ఢీకొని ఓ యువకుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేలేరు గ్రామానికి చెందిన యువకులు గురువారం వినాయక విగ్రహ నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఊరేగింపు అనంతరం రాత్రి 7 గంటల సమయంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే నిమిత్తం కిన్నెరసాని బ్రిడ్జి వద్దకు తరలించి అక్కడ విగ్రహాన్ని దింపుతుండగా, బూర్గంపాడు నుంచి కుక్కునూరు వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వేలేరు గ్రామానికి చెందిన మోదుగ నవీన్(17) అక్కడికక్కడే మృతిచెందగా మోదుగ రామకృష్ణ, ప్రవీణ్కు గాయాలయ్యాయి. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆశ్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తి.. ఏలూరు సెంట్రల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మరణించిన ఘటన ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి సుమారు 45 నుంచిl50 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది.∙స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు నీలిరంగు చొక్కా, సిమెంటు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు 08812– 230653 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నీళ్లులేని నిమజ్జనం
* అంతటా జోరువానలు.. * లింగాలఘణపురంలో నీరు కరువు లింగాలఘణపురం: కుండపోత.. భారీ వర్షాలు.. నిండిన కుంటలు... అలుగు పోస్తున్న చెరువులు... రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. వరంగల్ జిల్లా లింగాలఘణపురంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని పాత చెరువులో వరుసగా మూడేళ్ల నుంచి చుక్కనీరు రావడం లేదు. దీంతో గతేడాది నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నేటికీ అలాగే దర్శనమిస్తున్నారుు. ఇక ఈ ఏడాది కూడా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను స్థాని కులు మట్టిలోనే నిమజ్జనం చేస్తున్నారు. వరుస కరువుతో తాగేందుకు కూడా నీరు లేక ట్యాంకర్లతో తెచ్చుకుంటున్నారు. ఇక పంటల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ చెరువులోకి నీరు వచ్చే అశ్వరావుపల్లి రిజర్వాయర్ కాల్వలు అసంపూర్తిగా ఉండడంతో నీరు రావడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు ఇప్పటికై నా స్పందించాలని వారు కోరుతున్నారు. -
23 క్రేన్ల ఏర్పాటు
► నిమజ్జనానికి ట్యాంక్బండ్పై 23 క్రేన్ల ఏర్పాటు. ► పోలీసు నిఘా నీడలో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు....హుస్సేన్ర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవాన్ని సమీక్షించడం కనిపించింది. ► షీటీమ్లు మఫ్టీ డ్రెస్లో ట్యాంక్బండ్పై సంచరించారు. ► ఖైరతాబాద్ గణనాథుడు గతంలో ఎన్నడూలేని విధంగా మధ్యాహ్నమే నిమజ్జనం కావడంతో ట్యాంక్బండ్పై జనం సందడి గతంతో పొల్చుకుంటే కొంత తగ్గింది. ► పలు ప్రైవేటు ఆస్పత్రులు భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ► పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి గాంధీనగర్ ఇన్స్ పె క్టర్ ఎ. సంజీవరావు నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటు పోలీసులకు భక్తులకు పలు సూచనలు చేయడం కనిపించింది.. ► వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ► ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకు అప్పర్ ట్యాంక్బండ్లో సుమారు 844 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ► గణేష్ నిమజ్జనానికి తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి నగరం నలుమూలలకు గణేష్ నిమజ్జనం స్పెషల్ బస్సులను నడిపారు. ► భక్తుల కోసం జలమండలి అధికారులు ఎన్టీఆర్ స్టేడియం, అశోక్నగర్ మెయిన్ రోడ్డులో ప్రత్యేకంగా ఉచిత వాటర్ ప్యాకెట్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు. – బన్సీలాల్పేట్