
సెప్టెంబర్ 5న సెలవు
సాక్షి, హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5ను సెలవురోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నిమజ్జన రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. సెప్టెంబర్ 5న సెలవు ఇచ్చినందున ఈ నెల 9న(రెండో శనివారం) ఉద్యోగులంతా పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.