-
సోలార్ప్యానెల్స్ పెట్టుకుంటేనే...గ్రేటర్లో ఇళ్లకు అనుమతి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతీ ఇంటిపై సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గ్రామాలను కూడా సోలార్ ఎనర్జీ హబ్లుగా మార్చాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సబ్స్టేషన్లకు వీటిని అనుసంధానిస్తారు. తద్వారా ఆ గ్రామాలకు విద్యుత్ సమస్య ఎదురుకాకుండా చూడాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రోడ్మ్యాప్ రూపొందించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోనూ పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్ ఎనర్జీనే ప్రధానం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్తోపాటు సౌర, పవనవిద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లలోనూ..: నాగార్జునసాగర్ రిజర్వాయర్లోనూ ఫ్లోటింగ్ సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరవ డాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఫ్లోటింగ్ సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రీనర్ ఎనర్జీకి స్కాండినేవియన్ దేశాలు అధిక ప్రా ధాన్యం ఇస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ఆ మోడల్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, బొగ్గు ధరలు ఏటేటా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధర పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా వినియోగదారులకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో సోలార్ పవర్ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. థర్మల్ కేంద్రాలతో భారీగా వెలువడే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
Hyderabad: పగటిపూట సిటీ బస్సుల సంఖ్య తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. -
‘బైరామల్ గూడ’ ఫ్లై ఓవర్తో.. రయ్ రయ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్రోడ్, బైరామల్గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్లతోపాటు రెండు లూప్లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది. అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్ నుంచి కర్మాన్ఘాట్, ఐఎస్ సదన్ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే. బైరామల్గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా.. నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్. ప్రయాణ మార్గం.. ఒకవైపు సిద్ధమైన బైరామల్గూడ ఫ్లైఓవర్ బైరామల్గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్గూడ జంక్షన్వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలినా.. గ్రేటర్ హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల ముందు ఊహించని షాక్ తగులుతోంది. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్లోకి వలసలు జోరందుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఆదివారం సాయంత్రం బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇందుకు ఊతమిస్తోంది. త్వరలోనే తన అనుచరులతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. చిన్నచూపు చూశారనే.. ► విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్ బాబా ఫసియుద్దీన్లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచి్చన తర్వాత బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో తగిన గుర్తింపును ఇచి్చంది. రెండో దఫా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఉద్యమ వీరులను చిన్నచూపు చూసిందని, అసలు లక్ష్యమే పక్కదారి పట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ► మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పారీ్టతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తుండగా... మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెప్పినా బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకో లేదంటూ ఇటీవల కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో.. ఆయన కాంగ్రెస్లో ఆయన చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా నగరంలో పట్టు కోసం బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ టచ్లో 20 మంది కార్పొరేటర్లు ► బీఆర్ఎస్కు చెందిన సుమారు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీడిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పారీ్టపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు గులాబీలు చేజారకుండా కట్టడి చేయాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ నుంచి పోతే పోనీ.. వాళ్ల కర్మ అన్నట్లు వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్ బాట పడుతున్నట్లు సమాచారం. -
టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. కోరిన చోటికి డిప్యూటేషన్పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్కు చెందిన ఓ టీచర్ను ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ జెడ్పీ హైసూ్కల్కు డిప్యూటేషన్పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్ జిల్లా డిప్యూటేషన్ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. ► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ జెడ్పీ హైసూ్కల్ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్ఎస్కు డిప్యూటేషన్పై వెళ్లారు. ► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్ఎస్లో పనిచేయాల్సిన ఓ టీచర్.. చంపాపేట్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్పైన విధులు నిర్వహిస్తున్నారు. ► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లారు. ► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ► షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. పక్షవాతం, కేన్సర్ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక్క డిప్యూటేషన్ కూడా ఇవ్వలేదు డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. – దేవసేన, విద్యాశాఖ కమిషనర్ -
రికార్డు బ్రేక్.. మన టార్గెట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన స్ఫూర్తితో రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ ఎంపీని భారీ మెజారీ్టతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మన పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. వారందరికీ రెండు లక్షలకుపైగా మెజార్టీ ఓట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లోనూ సులభంగానే గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేందుకు మరింత కష్టపడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేమని నిరాశ చెందవద్దు. పక్క పారీ్టవాళ్ల ప్రలోభాలకు లొంగవద్దు. రాజీలేని పోరాటంతో విజయం సాధిస్తాం. మళ్లీ గెలుపు మనదే. అవసరమైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ గెలిచేలా తయారు కావాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో అయ్యేదేమీ లేదని, మళ్లీ పోరాట పటిమతో మన సత్తా చాటాలన్నారు. ప్రజలు పోరాడేలా చేయండి కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, అమలు చేయకపోతే తిరగబడేలా చైతన్యం తేవాలని కేటీఆర్ సూచించారు. అభయహస్తం కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పెన్షన్కు అర్హులుంటే ఎంతమందికి వర్తింపజేస్తారో పరిశీలించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెబుతున్నప్పటికీ, రేషన్కార్డులు లేని వారికి ఎప్పటిలోగా ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వాటితోపాటు ప్రజల నుంచి అందిన ఇతర ఫిర్యాదులనూ ఆన్లైన్లో నమోదు చేయలేదని, ఈ ప్రక్రియలన్నీ ముగిసి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదని చెబుతూ వీటన్నింటినీ ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి వారు పోరాడేలా చేయాలని చెప్పారు. సమీక్ష సమావేశాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని, భద్రాచలం నుంచి వచి్చన నేతలు సమావేశం ఆసాంతం ఉండగా.. నగర నాయకులు మాత్రం మాట్లాడి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని కందుకూరు వద్ద ఫార్మా సిటీ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఫార్మాసిటీ ఉండకూడదని.. దాన్ని నగరానికి దూరంగా తరలించడం మంచిదని అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్మెంట్ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి పలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి, సీఎంఓ అధికారులు వి.శేషాద్రి, బి.శివధర్రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే ఔటర్రింగ్రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ నగరం నలువైపులా సమంగా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఈ క్రమంలో ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్చాలని పేర్కొన్నారు. ఆ రెండు రూట్ల మీదుగా.. ‘‘హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చాలి. ఈ మేరకు ఎంజీబీఎస్, ఓల్డ్సిటీ, ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్టు వరకు.. అలాగే ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట రూట్లో ఎయిర్పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలి. అలాగే మైలార్దేవ్పల్లి, జల్పల్లి, పీ–7 రోడ్, లేదా బార్కాస్, పహడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు రూట్లను కూడా పరిశీలించాలి..’’ అని రేవంత్ సూచించారు. ఈ రూట్లలో మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చును అంచనా వేయాలని మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా ఉండే మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో ఎందుకు చేపట్టలేదు? పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందినా ఓల్డ్సిటీ మెట్రోను పూర్తి చేయకపోవడం సరికాదన్నారు. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎయిర్పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేత నేపథ్యంలో.. జీఎంఆర్తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక కోరారు. నగర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ప్లాన్ రూపొందించాలని రేవంత్ ఆదేశించారు. మూసీ సుందరీకరణ చేపట్టాలన్నారు. తూర్పు నుంచి పడమర వరకు మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండాలని సూచించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉందని చెప్పారు. భవిష్యత్తులో 3 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. నేడు కేబినెట్ భేటీ సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయి, సభ వాయిదా పడ్డాక ఈ భేటీని నిర్వహించనున్నారు. -
గ్రేటర్ హైదరాబాద్పై బీఆర్ఎస్ ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ పార్టీకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయా? సిటీలో నివసిస్తున్న తెలంగాణేతర ప్రాంతాల ప్రజల ఓట్ల కోసం బీఆర్ఎస్ శ్రమిస్తోందా? హోరా హోరీగా జరిగే ఈ ఎన్నికల్లో బయటి ప్రాంతాలవారి ఓట్లే కీలకంగా మారనున్నాయా? సామాజిక వర్గాల వారీగా ఓట్లు కూడగట్టేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? బయటి ప్రాంతాల ప్రజల ఓట్లు సాధించడంలో గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా ఓటర్లకు చేరుయ్యేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ...అమలు చేస్తున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు.. ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో వారి ఓట్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. గ్రేటర్లో మెజార్టీ సీట్లు గెలవాలంటే వారి ఓట్లు కీలకం కాబట్టి...ఇతర ప్రాంతాల ప్రజల విశ్వాసం పొందేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణేతర ప్రజల ఓట్లను అన్ని పార్టీలు కీలకంగా భావించాయి. ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లతో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థులు ఆయా సామాజికవర్గ నేతల భేటీలు పూర్తి చేసే పనిలో ఉన్నారట. చివరి దశలో ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆయా సామాజికవర్గాలతో భేటీలు నిర్వహించి మద్దతు కోరతారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గ్రేటర్ లో ఎక్కువ సీట్లు గెలవకపోయినా...2018 వచ్చే సరికి పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలపై ఆధిక్యం సాధించింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా గ్రేటర్ లో అదే స్థాయిలో సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలలో మునిగి తేలుతున్నది గులాబీ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి ఓటర్లు ఎటువైపు ఉంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఎంఐఎం ప్రాతినిత్యం వహిస్తున్న స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో గులాబీ పార్టీ పాగా వేస్తుందా లేదా అనే చర్చ మాత్రం జరుగుతోంది. గ్రేటర్ ప్రజలు ఎవరిని కరుణిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. -
కౌన్ బనేగా కిస్మత్ వాలా!
హైదరాబాద్: శాసనసభలో అడుగు పెట్టాలని ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ రాజకీయ నాయకుడి కల. గెలిచిన అభ్యర్థులకేమో ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనే ఆశ. ఇందుకోసం గెలుపు కోసం ఓటర్లను, చోటు కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటుంటారు. ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పలువురు తాజా, మాజీ మంత్రులు గ్రేటర్ హైదరాబాద్ నుంచి బరిలోకి దిగారు. వీరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుసగా రెండుసార్లు కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కించుకొని రికార్డు సృష్టించారు. ఒకే శాఖకు రెండుసార్లు మంత్రిగా.. 2014లో శాసనసభ ఎన్నికలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ టికెట్తో సనత్నగర్ నుంచి పోటీ చేసి, టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్పై గెలుపొందారు. ఆ తర్వాత తలసాని కారెక్కి, కేసీఆర్ కేబినెట్లో చేరిపోయారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ టికెట్తో బరిలోకి దిగిన తలసాని వరుసగా రెండోసారి గెలుపొంది, మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. రెండోసారి కూడా ఇదే శాఖకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తలసాని మరోసారి సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. తొలి మహిళా హోంమంత్రిగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే వరుసగా మూడుసార్లు గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కండువాతో పోటీ చేసి, సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత సబితా టీఆర్ఎస్ పార్టీలో చేరి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సమైక్య రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు దేశంలోనే తొలి మహిళా హోం శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి చరిత్ర సృష్టించారు. సబితా మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీలో చేరి.. కేబినెట్లోకి.. 2014లో టీడీపీ పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి మల్కాజిగిరి లోకసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణలో టీడీపీ నుంచి గెలుపొందిన ఏకై క పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016లో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 శాసనసభ ఎన్నికలలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్తో పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్లో కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ మేడ్చల్ నుంచి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ నుంచి డిప్యూటీ స్పీకర్.. 1984, 2001లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన పద్మారావు గౌడ్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో సనత్నగర్ నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన పద్మారావు గెలుపొందారు. తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా శాఖ మంత్రిగా పనిచేసి.. డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోనిలిచారు బరిలో మాజీ ‘ఉమ్మడి’ మంత్రులు.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన కృష్ణ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, దానం నాగేందర్ ఈసారి శాసనసభ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్.. అంబర్పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా.. టూరిజం మంత్రిగా పనిచేసిన మర్రి.. బీజేపీ కండువాతో సనత్నగర్ నుంచి.. గతంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్యాదవ్ కార్పొరేటర్గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్లో 2014లో గోపాల్పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జగదీశ్వర్గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్అలీ, మాజిద్ హుస్సేన్లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
అప్పు చేసి.. ఆస్తి అమ్మి..
ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు అభ్యర్థుల తంటాలు ఎన్నికల ఖర్చు కోసం దొరికిన చోటల్లా అప్పు చేసేవారు కొందరైతే... భూములు, ఆస్తులు అమ్ముతున్నవారు మరికొందరు ఉన్నారు. ఎలాగైనా గెలవాలనే భావనతో ఖర్చు ఎంత అయినా సరే అంటూ బరిలో ఉంటున్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థి.. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏం వెనకేసుకున్నాడో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి తెలిసినవారిని, పరిచయం ఉన్నవారిని కలుస్తూ.. కాస్త డబ్బులు సర్దాలంటూ కోరుతున్నారు. చేబదులుగానే కాదు భూమిని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత సొమ్మును రెడీ చేసుకుంటున్నారు. ‘‘నా దగ్గర ఉన్న డబ్బుకు తోడు అక్కడా ఇక్కడా మరింత సర్దుబాటు చేసుకుంటున్నాను. అవసరం మనది. నానా రకాల పత్రాల మీద సంతకాలు చేయించుకోనిదే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు..’’ అని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఆయన.. ఎన్నికల ఖర్చు కోసం ఇటీవలే తన భూమిని అమ్మేశారు. గతంలో ఇతరులకు అప్పుగా, చేబదులుగా ఇచ్చి న సొమ్మును తిరిగి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఎక్కువై, ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. భూమిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఐదేళ్లదాకా ఆగాల్సిందే. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. దొరికిన చోటల్లా డబ్బు సిద్ధం చేసుకుని అయినా ఈసారి గట్టెక్కాల్సిందే..’’ అని సదరు ఎమ్మెల్యే అంటున్నారు. ... ఇలా ఈ ఇద్దరే కాదు, ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరిదీ ఇదే మాట. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి కొత్తగా బరిలోకి దిగుతున్న వారి వరకు ఇదే వరుస. ముందు జాగ్రత్తగా ఇప్పటికే సొమ్ము రెడీ చేసుకుంటున్నవారు కొందరు.. పార్టీల నుంచి టికెట్ ఖరారుకాగానే బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. స్వతంత్రులుగానో, ఏదైనా చిన్న పార్టీ నుంచో పోటీ చేయడానికి సిద్ధమైనవారు ఇంకొందరు.. ఎవరిని కదిలించినా ఆఫ్ ది రికార్డుగా ‘ఖర్చు’ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. సమయం దగ్గరపడుతుండటంతో..: బీఆర్ఎస్ తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. బీ–ఫారాలు కూడా అందుకుని ప్రచారమూ ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. టికెట్ కచ్చి తంగా దక్కుతుందన్న భరోసా ఉన్నవారూ ‘ఖర్చు’ మొదలుపెట్టేశారు. ఇక టికెట్ ఆశిస్తున్నవారూ అస్త్రశ్రస్తాలను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. అంతా డబ్బు సమీకరణ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చవుతుంది, ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరమనే లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్, తనిఖీల నేపథ్యంలో ఎక్కడికక్కడే నమ్మకస్తులు, అనుచరుల వద్ద డబ్బును సిద్ధంగా పెట్టి.. ఏయే సమయంలో, ఏ ఖర్చులకు వాడాలో సూచిస్తున్నారు. - గౌటే దేవేందర్ -
పీపుల్స్మేనిఫెస్టో
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 3,17,32,727 మంది. వీరిలో గ్రేటర్ను ఆనుకొని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఓటర్లు 1,04,90,621 మంది. అంటే దాదాపు మూడోవంతు మంది ఇక్కడే ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఎందరో ఉన్నారు. నగర ప్రజల మేనిఫెస్టోను అమలు చేయడమంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేసినట్లే. – సాక్షి, హైదరాబాద్ రవాణా.. అతిపెద్ద సమస్య నగరంలోని ప్రజలే కాక ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రవాణా. జిల్లాల నుంచి నగర శివార్లలోకి రెండు గంటలలోపే చేరుకుంటున్నప్పటికీ, అక్కడి నుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతోంది. ఇందుకు పరిష్కారంగా ఇస్నాపూర్ నుంచి షాద్నగర్ వరకు, యాదాద్రి నుంచి చౌటుప్పల్ వరకు.. నగరం నలువైపులా ఎటునుంచి ఎటు వెళ్లేందుకైనా మెట్రో రైలు కావాలంటున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ప్రజారవాణా పెరగాలి. ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు నిర్మించినా ట్రాఫిక్ ఇక్కట్లు తీరలేదు. ట్రాఫిక్ జామ్లు తప్పేలా లింక్రోడ్లు పెరగాలి. అన్ని రద్దీప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జీలుండాలి. వరద ముంపు తప్పాలి విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో వానొస్తే నాలాల్లో మరణాలు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి నాలాలన్నింటినీ ఆధునీకరించాలి. నాలాల మరణాలు తప్పేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణ దూరాభారం తగ్గించేందుకు మూసీపై 14 వంతెనలు అందుబాటులోకి రావాలి. అపరిమిత ఇంటర్నెట్.. మొబైల్ లేనిదే చేయి విరిగినట్లుగా భావిస్తున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో అన్ని వేళలా ఉచిత ఇంటర్నెట్ ఉంటే ఎంతో మేలంటున్నారు. ప్రజలకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే సదుపాయం ఉన్నా, ఇంటర్నెట్కు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండరాదని, అందులోనూ అంతరాయాలు ఉండొద్దని బలంగా కోరుకుంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు, ఆయా ప్రాంతాల్లో రద్దీ తెలుసుకునేందుకు సింగిల్యాప్ లాంటిది కావాలని కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. ఉద్యోగాలు.. సొంతిళ్లు.. ఆరోగ్య బీమా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు సొంతిళ్లు లేనివారికి నెలనెలా ఈఎంఐలతో గృహ సదుపాయం కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లేదా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని అలవెన్సులు, సకాలంలో ఉద్యోగాల భర్తీ, పేదలకు ఉచిత వైద్యంతోపాటు అవసరమైన పక్షంలో శస్త్రచికిత్సలకు ఉపకరించేలా ప్రభుత్వమే ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలంటున్నారు. 24 గంటలు స్వచ్ఛమైన నీరు కరెంటు కష్టాలు తీరినప్పటికీ నగరంలో నీటి ఇబ్బందులున్నాయి. నిర్ణీత వేళల్లో కాకుండా 24 గంటలు ఎప్పుడు నల్లా తిప్పినా తాగునీరొచ్చే సదుపాయం ఉండాలంటున్నారు ప్రజలు. -
గ్రేటర్ బీఆర్ఎస్ తొలిజాబితాలో పాతవారికే చోటు
హైదరాబాద్: ఊహించినట్లుగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ తొలిజాబితాలో ఒక్కరికి తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టిక్కెట్లు లభించాయి. కొంత సంశయాత్మకంగా కనిపించిన అంబర్పేటలో కాలేరు వెంకటేశ్కు, ముషీరాబాద్లో ముఠాగోపాల్లకే టిక్కెట్లు ఇచ్చారు. ఎలాంటి ప్రచారం జరిగినా వారు టిక్కెట్లు తమకే లభిస్తాయనే ధీమాను వ్యక్తం చేయగా, అందుకు తగ్గట్లే వారికే తిరిగి అవకాశం లభించింది. కంటోన్మెంట్లోనూ సిట్టింగ్కు ఇచ్చినట్లే లెక్క. సాయన్న మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉంది. సాయన్న స్థానే ఆయన కుమార్తె లాస్యనందితకు అవకాశం కల్పించారు. లాస్యనందితకు గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఉప్పల్ తిప్పల్.. ఉప్పల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. బండారికి టిక్కెట్ రాకుండా ఉండేందుకు ఆ సీటు కోసం ఎంతో కాలంగా ఆశలు పెట్టుకున్న మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్, సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి విభేదాలు వీడి సంయుక్తంగా చివరి క్షణంలో ఎమ్మెల్సీ కవితను కలిసినప్పటికీ వారి కోరిక నెరవేరలేదు. అప్పటికే జాబితా ఖరారు కావడంతో వారి ఆశ నిరాశే అయినట్లు తెలిసింది. అంబర్పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు, స్థానికంగా ఐదుగురు మాజీ కార్పొరేటర్లు, ఒక సిట్టింగ్ కార్పొరేటర్కు పొసగడం లేదు. మంత్రి కేటీఆర్ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలోనూ వారి వైషమ్యాలు బయటపడ్డాయి. కాలేరుకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొంత అయోమయం నెలకొన్నప్పటికీ కాలేరుకే తిరిగి టిక్కెట్ లభించింది. ముషీరాబాద్లో వయోభారం వల్లనే ముఠాగోపాల్పై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఆయనకే కేటాయించారు. తమ నాయకులకే తిరిగి టిక్కెట్లు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఓల్డ్సిటీలో.. ఓల్డ్సిటీలో నాలుగు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన వారికి మళ్లీ టిక్కెట్లు లభించాయి. చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా, యాకుత్పురా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడినా మళ్లీ వారికే టిక్కెట్లిచ్చారు. ఆ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాల్లేకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నాంపల్లి, గోషామహల్ పెండింగ్.. కోర్సిటీ (పాత ఎంసీహెచ్) పరిధిలోని నాంపల్లి, గోషామహల్వి మాత్రం పెండింగ్లో ఉంచారు. గత 2018 ఎన్నికల్లోనూ నాంపల్లి విషయంలో కొంత గందరగోళం జరిగింది. తొలుత ఎం.ఆనంద్కుమార్గౌడ్కు కేటాయించినప్పటికీ, బీ ఫారం ఇచ్చే సమయానికి మరో ఆనంద్గౌడ్కు కేటాయించారు. గోషామహల్ ఈసారి నందుబిలాల్కు ఇవ్వనున్నట్లు భావించారు. ఈరెండు స్థానాలు పెండింగ్లో ఉంచడంతో అధిష్ఠానం ఆంతర్యం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ) సస్పెండ్ కాకముందు పకడ్బందీ ప్రణాళికతో ఆయనను ఓడించే అభ్యర్థిని ఎంపిక చేయాలని బీఆర్ఎస్ నేతలు భావించినట్లు సమాచారం. ఆయనపై సస్పెన్షన్ను బీజేపీ ఇప్పటికీ తొలగించలేదు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ను తమవైపు తిప్పుకునే ఆలోచనల్లో బీఆర్ఎస్ ఉందనే అభిప్రాయాలున్నప్పటికీ, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వేరే పార్టీలోకి వెళ్లనని రాజాసింగ్ కుండబద్దలు కొట్టడం తెలిసిందే. మేడ్చల్లో ఇలా... మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో నాలుగింటిలో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధిష్థానం అవకాశం కల్పించింది. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి చామకూర మల్లారెడి, కుత్బుల్లాపూర్ నుంచి కేవీ వివేకానందగౌడ్, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కృష్ణారావు, మ ల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావులను బీఆర్ఎస్ అభ్యర్థులుగా అధిష్థానం ప్రకటించింది. ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం బండారి లక్ష్మారెడ్డికి కొత్తగా అవకాశం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో... రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నిచోట్లా సిట్టింగ్లకే అవకాశం కల్పించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్– దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఇబ్రహీంపట్నం–మంచిరెడ్డి కిషన్రెడ్డి, కల్వకుర్తి– గుర్క జైపాల్ యాదవ్, షాద్నగర్–ఎల్గమోని అంజయ్య యాదవ్, చేవెళ్ల– కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ప్రకాష్గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఆరికెపూడి గాంధీల పేర్లను అధినేత కేసీఆర్ ప్రకటించారు. అసంతృప్తులు క్షణికమే ? కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెటు వారి అసంతృప్తి క్షణికమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్లో బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్, గజ్జెల నగేష్ వంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి లేదు. కాగా, కంటోన్మెంట్కు చెందిన శ్రీగణేశ్, శేరిలింగంపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్లు పార్టీ మారనున్నట్లు వారి అనుయాయులు చెబుతున్నారు. ఉప్పల్లో బండారి..కంటోన్మెంట్లో లాస్య నందిత 24 స్థానాల్లో ఇద్దరే మహిళలు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మహిళలకు పెద్దగా చోటు దక్కలేదు. ఈసారి కూడా ఊరించి ఉస్సూరనిపించారని పలువురు ఆశావహ మహిళానేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 24 స్థానాల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి యథావిధిగా ఈసారి కూడా పోటీ చేయనున్నారు. కొత్తగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని మాత్రం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు ఈసారి అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 24 నియోజకవర్గాల్లో కేవలం ఇద్దరు మహిళలకే అవకాశం లభించింది. అందులోనూ సాయన్న కన్నుమూయడం వల్ల ఆయన కూతురు లాస్య సందితకు అవకాశం ఇచ్చారు. కానీ మహిళా అభ్యర్థిగా ఆ స్థానాన్ని కేటాయించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. బీఆర్ఎస్ మహిళాశ్రేణులు పెద్ద సంఖ్యలో ఆ ఆందోళనలో పాల్గొన్నారు. కానీ బీఆర్ఎస్లోనే మహిళలకు ఆశించిన స్థాయిలో చోటు దక్కలేదు. మొత్తం 119 స్థానాల్లో ఆరుగురికి మాత్రమే అవకాశం కల్పించగా, గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరు మహిళలకు ఆ అవకాశం దక్కింది. మజ్లిస్–బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోటీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పాతబస్తీ రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారీ ఇక్కడ బీఆర్ఎస్–మజ్లిస్ మధ్య స్నేహపూర్వక పోటీనే ఉంటుందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నాంపల్లి మినహా బీఆర్ఎస్ గతంలో ఓడిపోయిన తమ పాత అభ్యర్థులనే తాజాగానూ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో సైతం మజ్లిస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో బాహాటంగా బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో సైతం అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే ఈసారి 50 స్థానాల్లో బరిలో దిగి కనీసం 15 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెడుతామని అక్బరుద్దీన్ ప్రకటించడం ఇటీవల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పోటీ చేసే స్థానాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా..బీఆర్ఎస్తో దోస్తి ఉందంటూ ఒవైసీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా సీఎం కేసీఆర్ కూడా ఫ్రెండ్లీ పార్టీ అంటూనే ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో రెండుమూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రాజధానిలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావహులు ఉండటం సాధారణం. అధికార పార్టీతో పాటు విపక్షాల్లోనూ ఈ పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఆఖరి నిమిషం వరకు అనేక ప్రయత్నాలు చేసే వీళ్ళు టిక్కెట్ దొరక్కపోతే అసమ్మతి రాగం అందుకుంటారు. నిరాశపడిన ఆశావహుల్లో మరికొందరు తన అనుచరులతో కలిసి నేరుగా నిరసనలకు దిగడం, కొందరైతే తాము తెర వెనుక ఉండి అనుచరులను రెచ్చగొట్టడం చేస్తుంటారు. వీళ్ళు చేపట్టే నిరసన కార్యక్రమాల వల్ల ఒక్కోసారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తడం, ట్రాఫిక్ ఇబ్బందులు చోటు చేసుకోవడం జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే నగర నిఘా విభాగాలు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. టిక్కెట్ లభించని ఆశావహులు, వారి ముఖ్య అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడంపై దృష్టి పెట్టాయి. దీని కోసం కొన్ని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అభివృద్ధే విజయానికి సోపానం సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి సోపానాలవుతాయి. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుంది. – పి.సబితారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ పార్టీ ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. గత కొన్నేళ్లుగా పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ రెండోసారి యాకుత్ఫురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉంది. – సామ సుందర్రెడ్డి హమీలన్నీ నెరవేర్చా.. మరోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేశాం. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చాను. వచ్చే ఎన్నికల్లోనూ అభివృద్ధే ప్రధాన నినాదంగా ముందుకెళ్తా. విజయం సాధిస్తా. – టి.ప్రకాష్గౌడ్ సాక్షి, సిటీబ్యూరో: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రాజకీయ వారసత్వానికి బ్రేకులు పడ్డాయి. బీఆర్ఎస్ యువనాయకులుగా కొనసాగుతున్న పలువురు ఎమ్మెల్యేల తనయులకు ఈసారి అవకాశం దక్కలేదు. సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఆ పార్టీ వారసత్వ యువ కిశోరాలను ఊరించి ఉస్సూరుమనిపించింది. మరోసారి వారే... సనత్నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుమారుడు సాయికిరణ్కు ఈసారి అవకాశం లభించవచ్చునని భావించారు. ఈ మేరకు ఆయన సనత్నగర్లో రాజకీయంగా ఎదిగేందుకు సన్నద్ధమయ్యారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆ పార్టీ శ్రేణుల్లోనూ తలసాని వారసుడిగా ఆయన కొడుకు పోటీచేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఈసారి సాయికిరణ్కు అవకాశం దక్కలేదు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్రెడ్డికి సైతం అవకాశం లభించలేదు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కార్తీక్రెడ్డికి నిరాశే ఎదురయ్యింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు డాక్టర్ రోహిత్ సైతం మైనంపల్లి వారసుడిగా ఎన్నికల బరిలోకి దూకేందుకు సన్నద్ధమయ్యాడు. ఈ మేరకు విస్తృతంగా ప్రచారం సైతం జరిగింది. కానీ యథావిధిగా మైనంపల్లి హనుమంతరావుకే అవకాశం లభించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి కుమారుడు ప్రశాంత్రెడ్డి కూడా టిక్కెట్ ఆశించనా ఫలితం దక్కలేదు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు జయసింహ పేరు దాదాపు ఖరారు అని భావించిన తరుణంలో చివరి నిమిషంలో నిలిపివేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం ఎమ్మెల్యే సాయన్న కన్నుమూయడంతో ఆ స్థానాన్ని ఆయన కూతురు లాస్యకు కేటాయించారు. -
కామారెడ్డి నుంచే కేసీఆర్ పతనం: షబ్బీర్ అలీ
న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుంచే మొదలవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం పోటీ చేసినా.. ఎవరు పోటీ చేసినా కామారెడ్డి అంటే షబ్బీర్ అని పేర్కొన్నారు. నేను కామారెడ్డి బిడ్డను, ఆశీర్వదించండి అని అడుగుతానన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గెలిస్తే ఫామ్హౌస్కు వెళ్తారు.. నేను గెలిస్తే ప్రజల్లో ఉంటానని తెలిపారు. సంబంధిత వార్త: KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్ ముందే కూశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే లిస్ట్ అనౌన్స్ చేశారని విమర్శించారు. గజ్వేల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ మరోచోటికి వెళ్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లో కేసీఆర్కే దిక్కు లేకుండా పోయిందని, ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని తెలిపారు. సీఎల్పీ లీడర్గా పీపుల్స్ మార్చ్ చేశాక నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు చెప్పారు. పాదయాత్ర అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఖర్గేతో చర్చించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చదవండి: మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. -
మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మంత్రిపై మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని, తామంతా హారీష్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించారనే ఆవేశంతో మన ఎమ్మెల్యే ఒకరు హరీష్పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అంతేగాక మేమంతా హరీష్ రావుకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నాను. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన పార్టీకి మూలస్తంభంగా కొనసాగుతున్నారు.’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ కవిత సైతం మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.‘తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత,BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్ తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు గారి నిబద్ధత మరియు BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు గారి పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 One of our MLAs who was denied a ticket to his family member in an outburst has made some derogatory comments on Minister Harish Rao Garu I not only strongly condemn the MLA’s behaviour and also want to make it clear that we all stand with @BRSHarish Garu He has been an… — KTR (@KTRBRS) August 21, 2023 మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ లభించిన వారందరికీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అదే విధంగా సిరిసిల్ల అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలని టికెట్ లభించని వారిని ఉద్ధేశిస్తూ పేర్కొన్నారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కే.కృష్ణ (కంటోన్మెంట్ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం దక్కని వారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తప్పక లభిస్తుంది’ అని కేటీఆర్ అన్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో? -
‘కమ్యూనిస్టు పార్టీని కేసీఆర్ కరివేపాకులా పడేశారు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూసి కాంగ్రెస్గెలుపు ఖాయమనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కలిగిందని కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం అంటే.. తన ఓటమిని అంగీకరించినట్లే. ఓటమి భయం ఉన్న కేసీఆర్ కచ్చితంగా ఓడిపోతారు. మధ్యాహ్నం 12.08కి అభ్యర్థులను ప్రకటిస్తామని ముందుగా చెప్పారు. కానీ, ఆ టైంకి లిక్కర్ టెండర్ల డ్రా తీశారు. మహిళల టికెట్ల విషయంలో ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి మాట్లాడాలి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకులా కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని పారేశారు. మోసం చేసిన కమ్యూనిష్టులు కేసీఆర్పై తిరుగుబాటు చేయాలి. తెలంగాణ కోసం అత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని కేసీఆర్ అవమానించారు అని రేవంత్ మండిపడ్డారు. 12,500 గ్రామ పంచాయతీలకు విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, మెట్రో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బినామీల భూముల విలువ పెంచడానికే ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు రేవంత్. నాడు వైఎస్ హయాంలో హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి గా షబ్బీర్ ఆలీ సేవలు అందించారు. మైనార్టీ నాయకుడిని ఓడించాలనే కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తున్నారు. ఉచిత విద్యుత్ అంటే నాడు కొందరు బట్టలు అరేసుకోవాలని వెటకారం చేశారు. తెలంగాణ కాడి కేసీఆర్ కింద పడేస్తేనే జానారెడ్డి, కోదండ రామ్ కలిసి JAC ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హయంలోనే చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ఎం చేసిందో కేసీఆర్ చర్చకు వస్తే చెప్పడానికి సిద్దంగా ఉన్నా అంటూ ప్రతిసవాల్ విసిరారు రేవంత్. రెండు పంటలకు మాత్రమే రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు. మూడో పంటకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు. పేదలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం.. కేసీఆర్ గోడ మీద రాసి పెట్టుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ అగ్రిమెంట్ చేసుకున్నా.. వారంలోపే విదేశాలకు వెళ్తారు. ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంచబోము అని యదాద్రి, నాంపల్లి దర్గా, మెదక్ చర్చిలో ప్రమాణం చేయడానికి సిద్దమా ! అంటూ కేసీఆర్కు సవాల్ విసిరిన రేవంత్.. పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు కోరితే నేను ఎక్కడైనా పోటీచేస్తానని ప్రకటించారు. ఇదీ చదవండి: అధిష్టానం చెప్పింది అందుకే కామారెడ్డిల పోటీ- కేసీఆర్ -
BRS List: వివాదాలున్నా... వాళ్లకే టికెట్లు
సాక్షి, హైదరాబాద్: విజయంపై పూర్తి ధీమాతో ఉన్నామని, అందుకే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. అలాగే తమది క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, పూర్తి స్థాయి వడపోత తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారాయన. అందుకే కేవలం.. ఏడు మార్పులు మాత్రమే చేసినట్లు హైలెట్ చేశారు. అయితే.. చెన్నమనేని లాంటి ఉత్తముడికి పౌరసత్వ వివాదం కారణంగా సీటు కేటాయించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం గట్టి షాకే ఇచ్చారు. ఒకవైపు మహిళా సర్పంచ్ ఆరోపణలు, మరోవైపు కడియంతో పొసగక పోవడం.. చివరకు పిలిపించుకుని అధిష్టానం మందలించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. దీంతో.. ఆయన స్థానంలో అంతే దూకుడుగా ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్న కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. అయితే.. ఏకంగా లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. శేజల్ అనే బాధితురాలు వరుసగా చిన్నయ్యపై ఆరోపణలు చేయడం, ఏకంగా ఆత్మహత్యకు యత్నించడం, ఢిల్లీకి చేరి చిన్నయ్యపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అధినేతకు సైతం విజ్ఞప్తి చేస్తూ రకరకాల రూపాల్లో నిరసనలు కొనసాగించింది. అయినా కూడా దుర్గయ్యకే మరో అవకాశం ఇచ్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా విషయంలోనూ అలాగే జరిగింది. పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. ఈ వివాదం ఆధారంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలతో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి కూడా. మరోవైపు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఏకంగా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది కూడా. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం వనమాకే మళ్లీ టికెట్ కేటాయించడం గమనార్హం. వీళ్లతో పాటు చిన్న చిన్న వివాదల్లో నిలిచిన మరికొందరికి.. పెద్ద కంప్లయింట్లాగా పరిగణించకుండానే అసెంబ్లీ టికెట్ తిరిగి కేటాయించడం గమనార్హం. మరోవైపు జనగాంలో కిరికిరి జరుగుతున్న నేపథ్యంలో ఆ టికెట్ను జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇవ్వకుండా.. పెండింగ్లో ఉంచినట్లు బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. ముత్తిరెడ్డి చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: కల్వకుంట్ల కవితకు టికెట్ అందుకే ఇవ్వలేదా? బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ) -
95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో
సాక్షి, హైదరాబాద్: అక్టోబరు 16న వరంగల్లో సింహగర్జన సభ ఏర్పాటు చేసి.. అదే రోజు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు శ్రావణ మాసం మంచి ముహూర్తం కావడంతో ఇదే శుభఘడియగా భావించి మధ్యాహ్నం 2.38 గంటలకు తర్వాత అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని తెలిపారు. అయితే మొత్తంగా తొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. ఇదిలా ఉండగా సీఎం గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీలోకి దిగనున్నారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు. చదవండి: BRS List: వివాదాలున్నా వాళ్లకే టికెట్లు బీఆర్ఎస్ సముద్రం లాంటింది అవకాశాలు రాని అభ్యర్థులు హడావిడీ చేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అని హితవు పలికారు. పార్టీలోనే ఉండి, అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తమకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని చెప్పారు. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్.. ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చాలా మంది జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని, గతంలో అలా చేశాం కూడా అని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ‘హైదరాబాద్లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’ ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ మాకు మాత్రం ఒక టాస్క్ - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6 — BRS Party (@BRSparty) August 21, 2023 ఎన్నికలంటే బీఆర్ఎస్కు ఓ టాస్క్ ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బీఆర్ఎస్కు మాత్రం ఓ టాస్క్ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలను ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ.. అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
‘హైదరాబాద్లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల్లోని మొత్తం 29 స్థానాల్లో ఇరవై తొమ్మిది తామే గెలుస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ గెలుస్తాయి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని తెలిపారు. 2014 నుంచి ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమ మధ్య స్నేహం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే మిత్రపక్షాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మరింత ఉజ్వలమైన తెలంగాణ సాధన కోసంప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. చదవండి: Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ? -
రెండు చోట్ల పోటీపై కేసీఆర్ స్పందన ఇది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ నియోజకవర్గం గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో స్పందించారాయన. పార్టీ నిర్ణయించింది కాబట్టే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారాయన. ‘‘కేసీఆర్ చరిత్ర మీకు తెల్వదు. కరీంనగర్, రివర్స్ల మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచా. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారు. వాళ్లే కాదు.. ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారు. చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్ అయ్యాం. అంతేగానీ.. ఇందులో ఏం ప్రత్యేకత లేదు అని తెలిపారాయన. -
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీట్లు పోయిన సిట్టింగ్లు వీరే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. వేములవాడ, స్టేషన్ ఘన్పూర్, కోరుట్ల, ఉప్పల్, ఖానాపూర్, అసిఫాబాద్, కామారెడ్డి, బోథ్,వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ మాకు మాత్రం ఒక టాస్క్ - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6 — BRS Party (@BRSparty) August 21, 2023 వీరిలో 2009 నుంచి కామారెడ్డిలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన గంపగోవర్దన్ రెడ్డి.. కేసీఆర్ కోసం సీటు త్యాగం చేశారు. ఇక కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన కొడుకు డాక్టర్ సంజయ్కు టికెట్ కేటాయించారు. మిగిలిన ఏడుచోట్ల అభ్యర్థులను మార్చారు. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే ►ఉప్పల్ - సుభాష్ రెడ్డి ►బోథ్ - రాథోడ్ బాపూరావు ►ఖానాపూర్ - రేఖా నాయక్ ►అసిఫాబాద్ - ఆత్రం సక్కు ►వైరా - రాములు నాయక్ ►కామారెడ్డి - గంప గోవర్ధన్ ►స్టేషన్ ఘన్పూర్ - రాజయ్య పెండింగ్ స్థానాలు ఇవే ►నర్సాపుర్ ►జనగామ ►నాంపల్లి ►గోషామహల్ కోర్టు కేసు కారణంగా నిరాకరణ ►వేములవాడ - చెన్నమనేని రమేష్ సిట్టింగ్ ల వారసులు వీరే ►కోరుట్ల - ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్ ►సికింద్రాబాద్ కంటోన్మెంట్ - దివంగత సాయన్న కూతురు లాస్య ఇక హుజూరాబాద్ స్థానంలో కౌశిక్రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్లో ఉన్నాయని(నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్) , ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే మరోసారి టికెట్లు కేటాయించామని, వారందరికీ అభినందనలు తెలుపుతూ.. మరోసారి అద్భుత విజయం సాధించాలని కోరారు. మొత్తం 119 స్థానాల్లో ప్రస్తుతం 114 మంది అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఎమ్మెల్యే మైనంపల్లికి మల్కాజ్ గిరిలో టికెట్ ఇచ్చామని, ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ లో అడిగినా ఇవ్వలేకపోయామన్నారు. ఇవ్వాళ తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడిన కెసిఆర్.. మైనంపల్లి పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నామని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా? వద్దా? అన్నది మైనంపల్లి నిర్ణయించుకోవాలని చెప్పారు. చదవండి: CR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల -
CM KCR : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం కూడా సీఎం కెసిఆర్ పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్యులు సూచించినట్టు తెలిసింది. గజ్వేల్ వేడేక్కిన రాజకీయం ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పటికే గజ్వేల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకరు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మరొకరు బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. వీరిద్దరు కూడా గజ్వేల్ లో సీఎం కెసిఆర్ పై పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనితో సంబంధం లేకుండా.. కెసిఆర్ మరో నియోజకవర్గం కూడా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణపై కామారెడ్డి ఎఫెక్ట్ కామారెడ్డి ఓ రకంగా భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీకి ఉన్న ఊపు కొనసాగాలంటే కామారెడ్డి నుంచి పోటీ చేయడం సరైన నిర్ణయం అని భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ విజయం సాధించారు. కామారెడ్డిలో పోటీపై కాంగ్రెస్ విమర్శలు కామారెడ్డిలో పోటీ చేయాలన్న సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. గజ్వేల్ లో ఓడిపోతననే భయంతోనే కామారెడ్డి వస్తున్నట్లు తెలుస్తోంది, కామారెడ్డిలో ఎవరు పోటీ చేసినా నేనే గెలుస్తానని షబ్బీర్ అలీ తెలిపారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగు నీరు వచ్చేదని, సాగు నీరు కామారెడ్డి లో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పి కేసీఆర్ నామినేషన్ వేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తొలి జాబితా ఇదే.. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా 1. సిర్పూర్ - కోనేరు కోనప్ప 2. చెన్నూర్ (SC) - బాల్క సుమన్ 3. బెల్లంపల్లి (SC) - దుర్గం చిన్నయ్య 4. మంచిర్యాల - నడిపల్లి దివాకర్ రావు 5. ఆసిఫాబాద్ (ST) - కోవా లక్ష్మి 6. ఖానాపూర్ (ST) - భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ 7. ఆదిలాబాదు - జోగు రామన్న 8. బోథ్ (ST) - అనిల్ జాదవ్ 9. నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 10. ముధోల్ - జి.విఠల్ రెడ్డి ఉమ్మడి నిజామాబాదు జిల్లా 11. ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్ రెడ్డి 12. బోధన్ - షకీల్ అహ్మద్ 13. జుక్కల్ (SC) - హన్మంతు షిండే 14. బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి 15. ఎల్లారెడ్డి - జాజల సురేందర్ 16. కామారెడ్డి - సీఎం కెసిఆర్ 17. నిజామాబాదు (పట్టణ) - గణేష్ గుప్తా బిగాల 18. నిజామాబాదు (రూరల్) - బాజిరెడ్డి గోవర్థన్ 19. బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా 20 కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్ 21 జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్ 22 ధర్మపురి (SC) - కొప్పుల ఈశ్వర్ 23 రామగుండం - కోరుకంటి చందర్ 24 మంథని - పుట్టా మధు 25 పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి 26 కరీంనగర్ - గంగుల కమలాకర్ 27 చొప్పదండి (SC) - సుంకె రవిశంకర్ 28 వేములవాడ - చలిమెడ లక్ష్మీ నర్సింహారావు 29 సిరిసిల్ల - కె.తారక రామారావు 30 మానుకొండూరు (SC) - రసమయి బాలకిషన్ 31 హుజురాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి 32 హుస్నాబాద్ - వడితెల సతీష్ ఉమ్మడి మెదక్ జిల్లా 33 సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు 34 మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి 35 నారాయణ్ఖేడ్ - మహారెడ్డి భూపాల్ రెడ్డి 36 ఆందోల్ (SC) - చంటి క్రాంతి కిరణ్ 37 నర్సాపూర్ - పెండింగ్ 38 జహీరాబాద్ (SC) - కొనింటి మాణిక్రావు 39 సంగారెడ్డి తూర్పు - జయప్రకాశ్ రెడ్డి 40 పటాన్చెరు - గూడెం మహిపాల్ రెడ్డి 41 దుబ్బాక - కొత్తా ప్రభాకర్ రెడ్డి 42 గజ్వేల్ - సీఎం కెసిఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ మినహా మిగతా సీట్లలో అభ్యర్థులు యధాతధంగా ఉన్నారు. తనయులకు ఛాన్స్ ఇవ్వాలని సబితారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్ కోరినా.. సీఎం కెసిఆర్ అంగీకరించలేదు. సామాజిక పరంగా చూస్తే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 7 రెడ్డిలకు, 2 గౌడ్స్, ఒకటి కమ్మ, ఇద్దరు వెలమ, ఇద్దరు మాదిగ ఉన్నారు. 43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి 44 మల్కాజ్గిరి మైనంపల్లి హన్మంతరావు 45 కుత్బుల్లాపూర్ కూన పండు వివేకానంద 46 కూకట్పల్లి మాధవరం కృష్ణారావు 47 ఉప్పల్ బండారు లక్ష్మా రెడ్డి 48 ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి 49 ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి 51 రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ 52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ 53 చేవెళ్ళ (SC) కాలె యాదయ్య 54 పరిగి కొప్పుల మహేశ్వర్ రెడ్డి 55 వికారాబాద్ (SC) మెతుకు ఆనంద్ 56 తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి ఉమ్మడి హైదరాబాదు జిల్లా హైదరాబాద్ లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుండగా.. రెండు స్థానాలు పెండింగ్ ఉంచారు. ఇద్దరు మైనార్టీలు, ఐదుగురు బీసీలు ( మున్నూరు కాపు, వంజెర, యాదవ్, గౌడ్, గంగపుత్ర), ఒకటి కమ్మ , ఇద్దరు రెడ్డి , ఒకటి మాదిగ అభ్యర్థులు ఉన్నారు. 57 ముషీరాబాద్ ముఠా గోపాల్ 58 మలక్పేట్ తీగల అజిత్ రెడ్డి 59 అంబర్పేట్ కాలేరు వెంకటేశ్ 60 ఖైరతాబాద్ దానం నాగేందర్ 61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ 62 సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ 63 నాంపల్లి పెండింగ్ 64 కార్వాన్ అయిందాల కృష్ణయ్య 65 గోషామహల్ పెండింగ్ 66 చార్మినార్ ఇబ్రహీం లోడి 67 చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి 68 యాకుత్పురా సామా సుందర్ రెడ్డి 69 బహదుర్పురా అలీ బక్రీ 70 సికింద్రాబాదు టి.పద్మారావు 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) - లాస్య నందిత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 72 కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి 73 నారాయణపేట - ఎస్.రాజేందర్ రెడ్డి 74 మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్ 75 జడ్చర్ల - చర్లకోల లక్ష్మారెడ్డి 76 దేవరకద్ర - ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి 77 మఖ్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి 78 వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 79 గద్వాల - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 80 ఆలంపూర్ (SC) - అబ్రహాం 81 నాగర్కర్నూల్ - మర్రి జనార్థన్ రెడ్డి 82 అచ్చంపేట్ (SC) - గువ్వల బాలరాజ్ 83 కల్వకుర్తి - గుర్క జైపాల్ యాదవ్ 84 షాద్నగర్ - అంజయ్య యాదవ్ 85 కొల్లాపూర్ - బీరం హర్షవర్థన్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా 86 దేవరకొండ (ST) రమావత్ రవీంద్రనాయక్ 87 నాగార్జున సాగర్ నోముల భగత్ 87 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్ రావు 88 హుజుర్నగర్ శానంపూడి సైది రెడ్డి 89 కోదాడ బొల్లం మల్లన్నయాదవ్ 90 సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్ రెడ్డి 91 నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి 92 మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 93 భువనగిరి పైళ్ళ శేఖర్ రెడ్డి 94 నకిరేకల్ (SC) చిరుమర్తి లింగయ్య 95 తుంగతుర్తి (SC) గ్యాదరి కిశోర్ 96 ఆలేరు గొంగడి సునీత ఉమ్మడి ఖమ్మం జిల్లా 110 పినపాక (ST) రేగా కాంతారావు 111 ఇల్లెందు (ST) బానోత్ హరిప్రియ నాయక్ 112 ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ 113 పాలేరు కందాల ఉపేందర్రెడ్డి 114 మధిర (SC) లింగాల కమల్ రాజు 115 వైరా (ST) బానోత్ మదన్ లాల్ 116 సత్తుపల్లి (SC) సండ్ర వెంకట వీరయ్య 117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు 118 అశ్వారావుపేట (SC) మచ్చా నాగేశ్వరరావు 119 భద్రాచలం (ST) తెల్లం వెంకట్ రావు I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏 Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,… — KTR (@KTRBRS) August 21, 2023 -
అప్పుడు సార్ హ్యాండిచ్చింది వీళ్లకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల నేపథ్యంలో.. సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సిట్టింగ్లలో కొందరికి మళ్లీ సీటు దక్కదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తుండడం.. దీనికి తోడు 105 స్థానాలకే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో.. జాబితాలో ఎవరుంటారనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. అయితే సిట్టింగ్లకు గులాబీ బాస్ హ్యాండ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2018 ఎన్నికల సమయంలోనూ ఆయన కొందరు సిట్టింగ్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. ఆ జాబితాను పరిశీలిస్తే.. ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించి.. ఓరుగల్లు రాజకీయాల్లో పట్టున్న కొండా సురేఖకు తిరిగి అవకాశం ఇవ్వలేదు కేసీఆర్. అలాగే.. వికారాబాద్, ఆందోల్, చొప్పదండి, చెన్నూరూ రిజర్వ్డ్ స్థానాల క్యాండిడేట్లను సైతం పక్కన పెట్టేశారు. అప్పటి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మేడ్చల్, మల్కాజ్గిరి స్థానాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం తిరిగి టికెట్లు కేటాయించలేదు. -
KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్.. హ్యాట్రిక్ లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న గులాబీ బాస్.. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల జాబితా.. అదీ వందకు పైనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్లే 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించారాయన. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఏడు సిట్టింగ్ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు(నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు అభ్యర్థలను ప్రకటించలేదు). ‘‘2023 ఎన్నికలకు పెద్దగా మార్పుల్లేవ్. మంచి ముహూర్తం ఉండడంతోనే అభ్యర్థుల్ని ప్రకటించాం’’ అని ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాకు తెలియజేశారు. పంచమి తిథి కావడంతో.. ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement