karimnagar
-
Telangana: రేషన్ కార్డ్ కష్టాలు ఇంతింత కాదయా?
ఈ యువకుడి పేరు కట్కూరి నరేశ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్. డిగ్రీ చదివి హమాలీ పని చేస్తున్నాడు. ఐదేళ్లక్రితం స్వప్నతో వివాహమైంది. అమ్మానాన్నలతో ఉన్న రేషన్ కార్డు నుంచి తన పేరును తొలగించుకున్నాడు. కొత్తరేషన్ కార్డుకు దరఖాస్తు చేయగా.. ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోయాడు. నరేశ్కు రేషన్కార్డు లేకపోవడంతో కిరాణా దుకాణంపై స్వయం ఉపాధి పొందాలనుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. కట్కూరి నరేశ్ఇతను కడార్ల అరుణ్ తేజ. కరీంనగర్లోని కోతిరాంపూర్. స్వర్ణకారుడిగా ఉపాధి పొందుతున్నాడు. అయిదేళ్ల క్రితం వరకు తల్లిదండ్రులతో రేషన్కార్డులో ఉండగా.. వివాహం కావడంతో పాతకార్డులో పేరు తొలగించుకుని, కొత్తకార్డు కోసం దరఖాస్తు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా కొత్త కార్డు లేదు. ఇటీవల యువ వికాస పథకంతో లబ్ధి పొందాలని భావించాడు. దరఖాస్తు చేద్దామని మీసేవకు వెళితే రేషన్కార్డు తప్పనిసరి చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ పథకాలకు పొందలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నాడు. కడార్ల అరుణ్ తేజఈ యువకుడు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కాసోజి ప్రతాప్. తమ కుటుంబంలో ఉన్న నలుగురు అన్నదమ్ములందరికీ పెళ్లిలు అయ్యాయి. రేషన్ కార్డులు కుటుంబాలవారీగా తీసుకునేందుకు తమ తల్లిదండ్రుల కార్డుల్లో పేరు తొలగించుకున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. దీంతో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. కాసోజి ప్రతాప్ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్ కార్డు జారీచేయలేదు. దీంతో పాత కార్డులో పేరు ఉండక, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు. బూస రాకేశ్సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్కార్డు నుంచి పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖా స్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టి న రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది.కొత్త కార్డులొస్తాయని ఆశతో...ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వివాహం అయినవారు రేషన్కార్డు పొందేందుకు, తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా.. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు. -
కేటీఆర్ కాన్వాయ్లో అపశ్రుతి
సాక్షి కరీంనగర్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ను బైక్ ఢీకొట్టింది. కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మహిళా కానిస్టేబుల్ను కేటీఆర్ పరామర్శించారు. ఆమెకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.కాగా, ఆదివారం.. కేటీఆర్ కరీంనగర్లో జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్లో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ముఖ్య అతిథులుగా కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరయ్యారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
కాంగ్రెస్ రైతులకు అన్యాయం చేసింది
-
కొత్త రేషన్కార్డులకు బియ్యం రాలే..
ఈ ఫొటోలో రేషన్కార్డు ప్రొసీడింగ్ కాపీతో కనిపిస్తున్న మహిళ పేరు దొమ్మాటి అనూష. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటకు చెందిన అనూషకు పదేళ్ల నుంచి రేషన్కార్డు లేదు. గణతంత్ర దినోత్సవం రోజు అధికారులు భర్త అనిల్ పేరిట కొత్త రేషన్కార్డు ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి బియ్యం వస్తాయని అధికారులు చెప్పగా రేషన్ డీలర్ మాత్రం ఈ పాస్ మిషన్లో పేర్లు రాలేదని చెప్పారు. ఈ సమస్య ఒక్క అనూషది మాత్రమే కాదు గ్రామంలోని 17మంది కొత్తకార్డుదారులది. రెండు నెలల నుంచి బియ్యం కోసం డీలరు, అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేట గ్రామాన్ని సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జనవరి 26న ఇందిరమ్మ ఇండ్లు 106మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 11, రైతుభరోసా 92మంది, 17 మందికి కొత్తరేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ రేషన్ డీలర్కు బియ్యం కోటా వచ్చినప్పటికీ కొత్త రేషన్కార్డు లబ్ధిదారుల పేర్లు ఈపాస్ మిషన్లో నమోదు చేయకపోవడంతో బియ్యం ఇవ్వలేదు. మార్చినెలలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయలేదు. కొత్త రేషన్కార్డు వచ్చి రెండు నెలలవుతున్నప్పటికీ బియ్యం రావడంలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బహుదూర్ఖాన్పేటలో మొత్తం 254 రేషన్కార్డులుండగా ప్రతినెలా 86 క్వింటాళ్ల బియ్యం స్టాక్ వస్తోంది. అయితే జనవరి 26న బహుదూర్ఖాన్పేటతోపాటు రెవెన్యూ గ్రామమైన చామనపల్లిలోని 36 మందికి కొత్తరేషన్కార్డులను అధికారులు మంజూరు చేశారు. చామనపల్లికి చెందిన లబ్ధిదారుల పేర్లు ఈపాస్ మిషన్లో నమోదు కాగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన బహుదూర్ఖాన్పేట గ్రామ లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం సివిల్సప్లై అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపుగా 40రోజుల నుంచి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అయితే కొత్త రేషన్కార్డు నెంబర్లు కొన్ని సాంకేతిక కారణాలతో స్టేట్ కమీషనరేట్ కార్యాలయం నుంచి జనరేట్ కాలేదని సివిల్ సప్లయి డీటీ సురేందర్ తెలిపారు. వచ్చేనెలలో సమస్యను పరిష్కరించి మే నెల నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అవకాశముందని పేర్కొన్నారు.ఏడేళ్ల తర్వాత కొత్తకార్డుపెళ్లయిన ఏడేళ్లకు కొత్త రేషన్కార్డు వచ్చింది. గతంలో నా పేరు తల్లిదండ్రుల రేషన్కార్డులో ఉంది. అయితే కొత్తగా భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో అధికారులు రేషన్కార్డు ఇచ్చారు. రెండునెలలుగా బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్తే కొత్త పేర్ల జాబితా రాలేదని డీలర్ చెప్పడంతో నిరాశపడ్డాను.– అజయ్, బహుదూర్ఖాన్పేటబియ్యం కోటా వచ్చిందిఫిబ్రవరి, మార్చి నెలల్లో అదనంగా ఆరు క్వింటాళ్ల బియ్యం కోటా వచ్చింది. ఈపాస్ మిషన్లో కొత్త రేషన్కార్డుదారుల పేర్లు రావడం లేదు. పేర్లు లేకపోవడంతో బియ్యం ఇవ్వడం లేదు.– తప్పెట్ల తిరుమల, రేషన్ డీలర్, బహుదూర్ఖాన్పేట -
కేంద్ర మంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు.ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళ్తుందన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదేళ్లుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
Karimnagar: ఫుట్పాత్పై వ్యాపారం.. రీల్స్తో క్రేజ్! సినిమాల్లోనూ ఆఫర్లు!
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్లోని భగత్నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్పాత్పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్స్ట్రాగామ్లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది. View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) -
బస్సులోనే శాశ్వత నిద్రలోకి.!
కరీంనగర్, సాక్షి: చావు ఎవరికి చెప్పి రాదు!. అప్పటిదాకా ఉన్న ఆనంద క్షణాలను.. హఠాన్మరణాలు హరించి వేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నవే. అలాంటిదే కరీంనగర్లో చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లొస్తానంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన ఆ వ్యక్తి.. ప్రయాణంలోనే గుండె ఆగి ఊరిలో విషాదం నింపాడు. జమ్మికుంట(Jammikunta) నుంచి కరీంనగర్ చేరుకున్న బస్సులో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్న దృశ్యం కండక్టర్ కంట పడింది. నిద్రపోయాడనుకుని లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని కాస్త ఆలస్యంగా గుర్తించాడు. వీణవంక(Veenkavanka) మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు.. కరీంనగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఊరిలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో కన్నుమూశాడు. కరీంనగర్(Karim Nagar) వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించాడు. గుండెపోటు(Heart Attack)తోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓదెలు హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం
-
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్లో 5,500 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి కన్నీటి పర్యంతమై వెళ్లిపోయారు. నరేందర్ రెడ్డి రెండో స్థానం, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు.వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి.కాగా, కరీంనగర్-మెదక్-నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. -
తెలంగాణ: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్లో ఇప్పటివరకు 2లక్షల 10వేల ఓట్లను విభజించారు. వీటిలో సుమారు 21వేల ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు.కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40వేల ఓట్లు విభజన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేసే అవకాశం ఉంది. -
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
MLC ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
-
కడుపులోనే శిశువు.. కాసేపటికే తల్లి
కోనరావుపేట(వేములవాడ): ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. శిశువు కడుపులోనే చనిపోగా.. పరిస్థితి విషమించి, కాసేపటికే తల్లి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెంది సిద్దరవేణి బాబుకు కొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. గర్భిణి అయిన లాస్యను కుటుంబసభ్యులు ప్రసవం నిమిత్తం గురువారం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురై, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని చెప్పడంతో వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు లాస్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకోగా వైద్యులు ఆపరేషన్ చేసి, మృత శిశువును బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కాసేపటికే తల్లి లాస్య కూడా మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పల్లిమక్త, కొండాపూర్లలో విషాదం నెలకొంది. -
తెలంగాణ: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Telangana MLC Elections Polling Updates..తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ఖమ్మం :ఖమ్మం పట్టణంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం రిక్కా బజార్ వద్ద ఉద్రిక్తత..ప్రధాని నరేంద్ర మోడీపై UTF నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతల ఆందోళనబీజేపీ నేతలను అడ్డుకుని, ఇరు వర్గాల టెంట్ లను తొలగించిన పోలీసులు..బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాటపోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి..బిజెపి నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు..చివరకు అదుపులోకి తీసుకున్న బీజేపీ నేతలను వదిలేయడంతో సద్దుమణిగిన వివాదం...2 గంటల వరకూ పోలింగ్ శాతం ఇలా..మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 40.61మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 63.49 12 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. ఉదయం 12 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 19.20 %ఉదయం 12గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 33.98%ఖమ్మంలో ఉద్రిక్తత..ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ సెంటర్లో ప్రచార టెంట్లో అభ్యర్థుల ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం.యుటీఎఫ్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం, తోపులాటఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులువరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పోలింగ్ సమీపంలో ఉద్రిక్తత.కరీంనగర్ జిల్లా:కరీంనగర్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం..గ్రాడ్యుయేట్స్ 6.37%టీచర్స్ 13.10%సూర్యాపేట జిల్లా..సూర్యాపేట జిల్లా కొనసాగుతున్న పోలింగ్ఇప్పటి వరకు శాతం 14.68% పోలింగ్ నమోదు.👉జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణి పెట్ స్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు ను వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.👉ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కూడా ఉత్తర తెలంగాణలో గెలిచి పట్టు నిలుపుకునే ప్రయత్నంలో పావులు కదిపింది.👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హర్షవర్ధన్రెడ్డి (పీసీసీ అధికార ప్రతినిధి)కి అధికార అభ్యర్ధిగా కాకుండా కాంగ్రెస్ పరోక్ష మద్దతు అందిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎక్కడా అభ్యర్ధిని నిలపలేదు. ఏ స్వతంత్ర అభ్యర్ధికి కూడా ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ప్రకటించలేదు. కరీంనగర్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... 👉మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తమ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ అంచనా వేస్తోంది. ఇక్కడ ప్రధానంగా మల్క కొమురయ్య (బీజేపీ), వంగా మహేందర్రెడ్డి (పీఆర్టీయూ), అశోక్కుమార్.వై (యూటీఎఫ్, ఇతర సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్రెడ్డి (ఎస్టీయూ, ఇతర సంఘాలు)ల మధ్య పోటీ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పరిధిలో ఇలా... 👉మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో ప్రధానంగా సి.అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణల మధ్య పోటీ ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నరేందర్రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి పడే ఓట్లను బట్టి ఫలితాలు ప్రభావితం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సి.అంజిరెడ్డి (బీజేపీ), ఉటుకూరి నరేందర్రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ), రవీందర్సింగ్(ఏఐఎఫ్బీ)ల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. వరంగల్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... 👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా సరోత్తమ్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరకు టీచర్లను ఇన్ఫ్లుయన్స్ చేయడం మనీ మేనేజ్మెంట్ అనేది కీలకంగా మారిందని చెబుతున్నారు. హర్షవర్ధన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నారు. శ్రీపాల్రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.👉టీచర్ల సమస్యలపై సరిగ్గా స్పందించలేదని సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ ఓటింగ్పై ఏ మేరకు ప్రభావం చూపుతారనే దానిని బట్టి ఓటింగ్ సరళిలో మార్పులు వచ్చి విజేతలపై స్పష్టత వస్తుందంటున్నారు. ఇక్కడ ప్రధానంగా హర్షవర్ధన్రెడ్డి (టీచర్స్ జేఏసీ అభ్యర్ధి, టీపీసీసీ అధికార ప్రతినిధి), పులి సరోత్తమ్రెడ్డి (బీజేపీ), శ్రీపాల్రెడ్డి (పీఆర్టీయూ మద్దతు), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (ఎస్టీ్టయూ, బీసీ సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్ అభ్యర్థి)ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
మళ్లీ గట్టు దాటి.. తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) రగడ కొనసాగుతోంది. ఒకవైపు నవీన్ను పార్టీ నుంచి బహిష్కరించాలనే గొంతుకలు పెరుగుతున్న వేళ.. ఆయన మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా తగ్గేదేలే అంటున్నారు. తాజాగా..ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) లో కాంగ్రెస్ది, తనది వేర్వేరు దారన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ కరీంనగర్లో సభకు హాజరవుతున్నారు. అయితే అంతకంటే ముందే.. అదే కరీంనగర్(Karimnagar) వేదికగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరైన బీసీ జేఏసీ మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రత్యక్షం కావడం, తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘జానారెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. నేను ఈ బీసీ జేఏసీ సమావేశానికి వస్తే ఓ పార్టీ అభ్యర్థి బాధపడుతున్నారు. మరి అదే అభ్యర్థి.. నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?’’ అని ఎమ్మెల్సీ నవీన్ నిలదీశారు... రాహుల్ గాంధీ స్పిరిట్తోనే బీసీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నా. కానీ, నేను ఇలా చేయడం కాంగ్రెస్ లో మరి కొన్ని వర్గాలకు నచ్చడం లేదు. మీకు పడకపోతే నేను బీసీ ఉద్యమాన్ని ఆపుతానా?.. ఇస్సా, ఇజ్జత్, హుకూమత్ కోసమే బీసీ ఉద్యమమం అంటూ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. -
పెళ్లి నిర్ణయం పెద్దలకేనా? యువత ఏమంటున్నారో తెలుసా?
కరీంనగర్ సిటీ: నేటి యువత చదువుకుంటూనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ముందుకు సాగుతున్నారు. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రేమ పెళ్లి వద్దు..పెద్దలు కుదిర్చిన పెళ్లి ముద్దు అంటున్నారు. మరికొందరు సరైన సమయంలో వివాహం జరగాలని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం డిబేట్ నిర్వహించగా.. వారి అభిప్రాయాలు వెల్లడించారు.అర్థం చేసుకుంటే బెటర్ప్రేమ వివాహాలతో ఎదుటి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన ముందుగానే తెలుసుకోవచ్చు. వారిపై మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారితో వివాహబంధం ముందుకు సాగుతుందా లేదా తెలుస్తుంది. కొంతవరకూ ప్రేమపెళ్లిలు మంచివే. ఏ బంధం అయినా అర్థం చేసుకుని సర్దుకుపోతే నిలుస్తుంది.– శ్రీజ, విద్యార్థినిపెద్దలు కుదిర్చినదే..పెద్దలు అన్ని రకాలుగా మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయం బలంగా ఉంటుందని నా నమ్మకం. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు వచ్చినా పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరిస్తారు. జీవితంలో మంచి సపోర్టుగా ఉంటారు. పెద్దలను విస్మరించి కొందరు ప్రేమ పేరుతో మోసపోతున్నారు.– వినోద, విద్యార్థినిప్రేమ వివాహాలపై 110మంది యువతులను వివిధ ప్రశ్నలు అడుగగా.. వెల్లడించిన అభిప్రాయాలుటీనేజీ ప్రేమపై మీ అభిప్రాయం65- ఆకర్షణ మాత్రమే45 -టీనేజ్లో ప్రేమ అవసరం లేదు85- కెరియర్ ఫస్ట్సరైన సమయంలో పెళ్లి అవసరం ప్రేమపై సోషల్ మీడియా ప్రభావం ఉందా?80-చాలా ఉందిఎలాంటి ప్రభావం లేదు-3060 - పెద్దలు కుదిర్చిందిప్రేమ వివాహం ప్రేమించి పెద్దలను ఒప్పించాలి- 30ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్లో పడితే జాగ్రత్త.. భయ్యా!ఒప్పించి.. మెప్పించాలిఒక మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వారి గురించి పెద్దలకు వివరించి ఒప్పించాలి. ప్రేమించి పెద్దల సహకారంతో వివాహం చేసుకుంటే జీవితం అనందంగా ఉంటుంది. ఉన్నత చదువులతో జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఏదైనా సాధ్యం. పెద్దలు చేసిన పెళ్లిలు సైతం విడిపోతున్నాయి కదా.– భానుమతి, విద్యార్థినికుటుంబ జోక్యంతోనేపెద్దలు కుదిర్చిన, ప్రేమ పెళ్లి ఏదైనా దంపతుల మధ్య కుటుంబాల జోక్యంతో విడిపోతున్నాయి. చాలా వరకూ అమ్మాయి ఇంటి వద్ద పెరిగిన విధంగానే అత్తవారింట్లో ఉండాలని అనుకుంటారు. కాని అలా ఉండదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావాలి. అబ్బాయిలు కూడా నమ్మి వచ్చిన వారిని మంచిగా చూసుకోవాలి. – సిరిచందన, విద్యార్థిని -
Valentine's day ప్రేమా .. అంత టైం లేదు ప్లీజ్!
ప్రేమ.. రెండక్షరాలే కాదు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్ ఫస్ట్ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తుండగా.. పలువురు లవ్ మ్యారేజ్ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్లో పడితే జాగ్రత్త..భయ్యా!పెద్దల అంగీకారంతో ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జవ్వాజి అనిల్– కల్యాణి దంపతులు వీరు. జమ్మికుంట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలంలో 2012లో ఇరువురు ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పంచి 2018లో వివాహం చేసుకున్నారు. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మా వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ప్రేమపెళ్లి అందంగా ఉంటుంది. ఒకరికి ఒకరు తెలిసిన తర్వాత వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా అర్థంచేసుకుని సర్దుకుంటారు. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది’. అని అనిల్ చెప్పుకొచ్చాడు.ఇష్టపడ్డాం.. కష్టపడ్డాం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి శ్రీనివాస్, స్రవంతి దంపతులు వీరు. జమ్మికుంటలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో 2008లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత స్నేహితుల సహకారంతో 2012లో ప్రేమపెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మా యి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. అయినా ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం కారు నడుపుకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. స్రవంతి గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. ‘మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రస్తుతం మా పాపతో ప్రయాణం గర్వంగా కొనసాగుతోంది’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తున్న కొన్ని గ్రామాలుప్రేమనగర్.. మరిమడ్లకోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట: ప్రేమ పెళ్లిళ్లకు నిలయంగా నిలుస్తోంది కోనరావుపేట మండలం మరిమడ్ల. ఈ గ్రామంలో 30కి పైగా జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఊరి జనాభా నాలుగు వేలు ఉండగా.. దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో జంటలు ఒక్కటయ్యాయి. కట్నా లు లేకుండా ఆదర్శ పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం జరిపించే కల్యాణ మస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్తో ముంబయికి చెందిన రజిత వివా హాన్ని మరిమడ్లవాసులు దగ్గరుండి జరిపించారు. జింక నరేందర్ అనే యువకుడు ముంబయికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని మరిమడ్లకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్లో 1,620 జనాభా ఉంటుంది. గ్రామంలో 17 మంది యువతీ యువకులు ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు.మనసు పడ్డాం.. ఏకమయ్యాంమాది కులాంతర వివాహం. తెలియకుండా ప్రేమలో పడ్డాం. మాటలు కలిసి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. పెద్దల మనసు మార్చి ఏకమయ్యాం. ప్రస్తుత యువత జీవింతంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలి. వేధింపులకు గురిచేస్తే చర్యలుయువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్ 8712670759 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్ఐఆర్లు కాగా, గతేడాది 40 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం.– శ్రీలత, మహిళా స్టేషన్ సీఐ, షీటీం ఇన్చార్జీ, కరీంనగర్ -
Bird Flu: కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం..
-
కరీంనగర్ : కనుల పండువగా శ్రీవారి శోభాయాత్ర (ఫొటోలు)
-
కరీంనగర్ : రమణీయం..శ్రీనివాస కల్యాణం (ఫొటోలు)
-
కరీంనగర్ : వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..వైభవంగా ఎదుర్కోలు వేడుక (ఫొటోలు)
-
ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్లో మీటింగ్లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారు..కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనకుండా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి అవినీతే తప్ప మంచి లేదు. ఇప్పుడు పెనం మీద నుంచి పొయిలో పడినట్లయింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండు. డ్రగ్స్ కేసు, ఈ-ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇలా అన్ని కేసులు పేర్లతో డైవర్షన్ తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు దావోస్ ఇష్యూ ముందుకు తెచ్చారు...గ్రీన్కో వంటి సంస్థలపై దాడులు చేస్తే ఇవాళ తెలంగాణాకు వచ్చేందుకు భయపడుతున్నాయి. గ్రీన్కో నుంచి కాంగ్రెస్కు పైసలు ముట్టినై. 2014 నుంచి ఇప్పటివరకు దావోస్లో జరిగిన ఒప్పందాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చియో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ? -
కరీంనగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు కరీంనగర్ పోలీసులు కౌశిక్ను హాజరు పర్చారు. కౌశిక్రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. -
‘నన్ను నెట్టేస్తావా.. కాంగ్రెస్తో కలిసి పని చేస్తే ఇంత అక్కసా?’
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్రెడ్డి నెట్టేశాడు. కౌశిక్రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.సమీక్షా సమావేశంలో తోపులాటఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్ను కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. -
కౌశిక్రెడ్డిVsసంజయ్కుమార్: గంగుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘సమావేశం ఎజెండా క్లియర్గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. -
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్ను కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. -
నిర్లక్ష్యంలో చాలా ‘స్మార్ట్’
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్మార్ట్సిటీ మిషన్ (ఎస్సీఎం) కింద చేపట్టిన పనులు పలు నగరాల్లో నత్తనడకన సాగుతున్నాయి. దేశంలోని 100 నగరాలను ఎస్సీఎం ద్వారా ‘సుందర నగరాలు’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. పనులు పూర్తి చేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నా.. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వాస్తవానికి 2023 జూన్లోనే.. దేశంలోని వంద నగరాల్లో చేపట్టిన స్మార్ట్సిటీ ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇప్పటికి రెండు పర్యాయాలు స్మార్ట్సిటీ మిషన్ గడువు పొడిగించినా ఫలితం లేదు. పనుల తీరు చూస్తే 2025 మార్చి 31 నాటికైనా పూర్తవుతాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. తొమ్మిదేళ్లుగా సా..గుతున్న పనులు దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015 ఆగస్టు 27న స్మార్ట్సిటీ మిషన్కు శ్రీకారం చుట్టింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం దీని లక్ష్యం. మొదటి విడత 98 నగరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్ను కూడా స్మార్ట్సిటీ జాబితాలో చేర్చింది. సుమారు తొమ్మిదేళ్ల వ్యవధిలో వంద నగరాల కోసం 8,066 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లను జారీ చేసి రూ.1,64,669 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసింది. ఈ మేరకు 2024 నవంబర్ 28 వరకు 7,352 ప్రాజెక్టుల వర్క్ ఆర్డర్లపై రూ.1,47,366 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని భువనగరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి తోఖన్ సాహు వెల్లడించారు.ఇన్ని నిధులు ఖర్చయినా.. అన్ని ప్రాజెక్టులను 13 నగరాలు మాత్రమే పూర్తి చేశాయి. ఆ తర్వాత 48 నగరాల్లో 90 శాతం, 23 నగరాల్లో 75 శాతం పూర్తయ్యాయి. 16 నగరాల్లో స్మార్ట్సిటీ మిషన్ ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉండగా.. రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. ఆ 13 నగరాలు భేష్.. నూరు శాతం స్మార్ట్సిటీ మిషన్లో చేపట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాల్లో గుజరాత్ రాష్ట్రంలో సూరత్, జార్ఘండ్లో రాంచీ, కర్ణాటకలో తుమకూరు, లక్ష్యదీప్లో కవరాట్టి, మధ్యప్రదేశ్లో జబల్పూర్, మహారాష్ట్రలో పుణె, రాజస్థాన్లో ఉదయ్పూర్, తమిళనాడులో కోయంబత్తూర్, మధురై, సాలెం, ఉత్తరప్రదేశ్లో ఆగ్రా, బరేలీ ఉన్నాయి. 60 శాతంలోనే వరంగల్, కరీంనగర్.. గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్సిటీల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆ రెండు నగరాలకు కేటాయించిన నిధులు, ఖర్చయిన నిధులు, పూర్తయిన ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఇంకా 58 శాతంలోనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోగా.. తుది గడువైన 2025 మార్చి 31 నాటికి పూర్తవడం ప్రశ్నార్థకంగా ఉంది. 2017–18లో కరీంనగర్, గ్రేటర్ వరంగల్ను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన తర్వాత.. ఆ రెండు నగరాల్లో రూ.1,879 కోట్లతో రహదారులు, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించింది. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి పురపాలకశాఖ అధికారులు ప్రతిపాదించగా.. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. స్మార్ట్సిటీలుగా ప్రకటించి ఆరేళ్లు దాటినా ఆ రెండు నగరాల్లో పనులు 60 శాతం దాటలేదు. నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు.. గ్రేటర్ వరంగల్లో రూ.179 కోట్లు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.102 కోట్లు అందుబాటులో ఉన్నా పనులు చేయించడంలో అధికారులు అలసత్వం చేశారనే ఫిర్యాదులున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. అందుకే గడువు పొడిగింపు.. ఉత్తరప్రదేశ్లోని 10 నగరాల్లో రూ.21,115.53 కోట్లతో 889 ప్రాజెక్టులు చేపట్టగా.. రూ.864.4 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఏడు నగరాల్లో 788 ప్రాజెక్టుల కోసం రూ.15,078.54 కోట్లు అంచనా కాగా.. 748 ప్రాజెక్టులను రూ.14,192.23 కోట్లతో పూర్తి చేయగా, 40 ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. తెలంగాణలోని రెండు నగరాల్లో రూ.2,817.65 కోట్ల విలువైన 169 ప్రాజెక్టుల్లో 97 పూర్తి కాగా, రూ.794.74 కోట్ల విలువైన 72 ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. తమిళనాడులోని 11 నగరాల్లో రూ.17,983.63 కోట్ల విలువైన 733 ప్రాజెక్టుల్లో రూ.513.54 కోట్లతో చేపట్టిన 25 పూర్తి కావలసి ఉంది. రాజస్తాన్లోని అజ్మీర్, జైపూర్, కోట, ఉదయ్పూర్ నగరాల్లో రూ.8639.95 కోట్ల ఖర్చు కాగల 579 ప్రాజెక్టుల్లో 561 పూర్తి కాగా, రూ.324.73 కోట్లతో నడుస్తున్న 18 పెండింగ్లో ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లో 47, ఛత్తీస్గఢ్లో 41, హిమాచల్ప్రదేశ్లో 32, బిహార్లో 30, జమ్ముకశీ్మర్లో 30, మహారాష్ట్రలో 29, కేరళలో 27, కర్ణాటకలో 26, హరియాణాలో 26 ప్రాజెక్టులు.. మొత్తం 714 పెండింగ్లో ఉన్నాయి.స్మార్సిటీ మిషన్ వివరాలు.. స్మార్ట్సిటీ మిషన్ (ఎస్సీఎం)కు శ్రీకారం: 2015 ఆగస్టు 27 దేశంలో ఎంపిక చేసిన నగరాల సంఖ్య: 100 (మొదట 98 నగరాలు.. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్) ఎస్సీఎం కింద విడుదలైన నిధులు: రూ.1,64,669 కోట్లు ప్రతిపాదన చేసిన ప్రాజెక్టులవర్క్ఆర్డర్లు: 8,066 నూరు శాతం ప్రాజెక్టులు పూర్తి చేసిన నగరాలు: 13 90 శాతంలో ఆగిన నగరాలు : 48 75 శాతం వరకు పూర్తి చేసినవి : 23 నత్తనడకన రూ.17,303 కోట్ల విలువైన 714 ప్రాజెక్టులుస్మార్ట్సిటీలతో ప్రయోజనాలు..» సమర్థవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ » వ్యర్థ నీటి రీసైక్లింగ్ » నీటి వృధాను అరికట్టే సెన్సార్స్, యాజమాన్యం, గ్రీన్ స్పేసెస్ » భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన » ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి వస్తు, సేవల లభ్యత » ప్రజల జీవన ప్రమాణాల్లో పెరుగుదల » సహజ వనరుల సమర్థ వినియోగం » గవర్నెన్స్లో పౌరుల భాగస్వామ్యం » పర్యావరణ పరిరక్షణ–యాజమాన్యం » ‘స్మార్ట్’ పట్టణాభివృద్ధి సాధన..సుస్థిర వృద్ధి » గ్లోబల్ నెట్ వర్కింగ్ » సృజనాత్మక పరిశ్రమ » ఆధునిక సమాచార వ్యవస్థఅందుబాటులోకి » ఈ–అర్బన్ గవర్నెన్స్.. » పారిశ్రామికీకరణ » భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. -
ఉత్తర తెలంగాణకు మంచిరోజులెన్నడు?
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కల వనరులు ఉన్నా... పేదరికమూ, దారిద్య్రమూ తాండవిస్తూనే ఉన్నాయి. రైతన్నల ఆత్మ హత్యలు, నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. యువత ఎడారి బాట పడుతుంటే... బీడీ కార్మికుల బతుకులు మసిబారుతున్నాయి. సామాజిక అణిచివేతలు సరేసరి! ఇలా ఎన్నో సమస్యలు. గతం గతః. నేడు కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఈ ప్రాంతవాసులు ఉన్నారు.రాష్ట్రంలోనే ఓ మూలకు విసిరేయబడ్డ ట్లున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నింటా వివక్షకు గురవుతోంది. ఆదర్శ జిల్లాగా చెప్పు కుంటున్న ఆదిలాబాద్ కేవలం అక్షర క్రమంలోనే ముందుండి, అభివృద్ధిలో మాత్రం ఏళ్లుగా వెనుక బాటుకు గురవుతోంది. ఉన్నంతలో కొంత మేరకు పైపై అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలది మరో ప్రత్యేక స్థితి. కార్పొరేటీకరణ దుష్ఫలితంగా విద్య, వైద్యం పేదలకు ఎండ మావిగానే మిగులుతున్నాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని అసంఘటిత, బీడీ కార్మికుల బతుకులు మరింత దుర్భర మవుతున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి సుమారు 7–8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఆకాశాన్నంటు తున్న ధరలు, అందని కనీస వేతనాలు, వెరసి వీరి బతుకులు మరింత దుర్భర స్థితిలోకి నెట్ట బడుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) మొత్తం జనా భాలో 18 శాతం మంది గిరిపుత్రులున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర చరిత్రలోనూ వీరివి చీకటి బతుకులే. జ్వరమొచ్చినా. జలుబు చేసినా వందల్లో జనం రాలిపోవాల్సిందే. ఈ మూడు జిల్లాల్లోనూ పుష్కల వనరులున్నా వాటి సద్వినియోగం లేక లక్షల మంది యువత ఉపాధి కోసం ఎడారి బాట పడుతున్నారు. ప్రణాళికా బద్ధంగా వినియోగించుకుంటే పక్క రాష్ట్రాలకు అప్పిచ్చేంత నీటి వనరులున్నాయి. అయినా ఖరీఫ్ ప్రారంభంలో రైతులు కారుమబ్బుల నుండి జాలువారే చినుకు కోసం ఆకాశానికేసి ఎదురు చూడాల్సిందే. గోదావరి వంటి జీవ నదులు, సిరులు పండించే సారవంతమైన నల్లరేగడి నేలలు, విస్తారమైన అటవీ సంపద. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనులు, (Sigareni Coal Mines) విస్తారమైన ఖనిజ సంపద ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నా వనరులను ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేక పోతోంది.నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ... అభివృద్ధికి నోచుకోని ఉత్తర తెలంగాణ జిల్లాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇక్కడి దుర్భిక్ష పరిస్థి తుల్ని పారదోలేందుకు ‘జలయజ్ఞం’ ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేసిన మహానేత ఆయన. అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఏ ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలనేకం ఉత్తర తెలంగాణలో మూసి వేతకు గురయ్యాయి. ఆదిలాబాద్లో సీసీఐ మూసివేతతో 2,500 మంది, స్పిన్నింగు మిల్లు ప్రైవేటీకరణతో 750 మంది, నిర్మల్ ప్రాంతంలో నటరాజ్ స్పిన్నింగ్ మిల్లుల మూతతో 2,000 మంది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ (Bodhan Sugar Factory) మూసివేతతో 2,500 మంది, కరీంనగర్లో ఎరువుల కర్మాగారం మూతతో 2,500 మంది ఉపాధికి దూరమయ్యారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఈ పరి స్థితుల్లో యువతకు గల్ఫ్ బాట తప్పడం లేదు. ఫలితంగా వేలాది కుటుంబాల్లో గల్ఫ్ గాయం మిగులుతోంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వైఎస్సార్ ‘సమ వికేంద్రీకరణ’ సిద్ధాంతం బదులు ‘అపసవ్య కేంద్రీకరణ’పై దృష్టి పెట్టడంతో ప్రాంతాల మధ్య అసమాన తలు మళ్లీ మొదలవుతున్నాయి.చదవండి: చెప్పిన గొప్పలు ఏమయ్యాయి?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సింగరేణి బొగ్గుగనులతో పాటు విస్తారంగా మాంగనీసు, ఇనుప ధాతువూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసు పుతో పాటు ప్రత్యేక పంటగా ఎర్రజొన్న సాగ వుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించాలి. ఆదిలాబాద్లో అటవీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. కరీంనగర్, నిజామాబాద్లలో గ్రానైట్ గనులున్నాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దులో భీమదేవరపల్లి మండలంలో ఇనుపరాతి గుట్టలున్నాయి. కావున ఇక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి పూను కోవాలి. మంథని కేంద్రంగా మైనింగ్ యూని వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. స్థానికులకే ఇక్కడ పనులు కల్పించాలి. ఈ ప్రాంతం నుండి ఎన్నుకోబడిన ప్రతి నేతా న్యాయంగా మనకు రావాల్సిన నిధుల కోసం చట్టసభల్లో గొంతు విప్పాలి.- డాక్టర్ బి. కేశవులు నార్త్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ – చైర్మన్ -
ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం
హుజూరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా హు జూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్కు చెందిన కిల్లి కుమారస్వామి, వసంత కూతురు వరుణ్ప్రియ (18) హన్మకొండలోని మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అజయ్ (19) మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వరుణప్రియ తల్లిదండ్రులు అజయ్ను మందలించినా.. అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కుమారస్వామి కూతురు వరుణ్ప్రియను.. ఆమె అమ్మమ్మ ఇల్లున్న పెద్దపాపయ్యపల్లిలో వదిలిపెట్టి వచ్చాడు. ఇంట్లో అందరూ వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు వచ్చి చూసేసరికే వరుణ్ప్రియ ఇంట్లో ఉరేసుకుని కనిపించింది. అజయ్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ సీఐ తిరుమల్గౌడ్ తెలిపారు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
-
దమ్ముంటే రా!.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలే చెబుతారు: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్ అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని, ఆనాడు 370 మంది అమరుల సాక్షిగా మొదటిసారిగా 11 సీట్లు బీఆర్ఎస్కు వచ్చాయని తెలిపారు. కరీంనగర్లోని అల్గునూర్లో దీక్షా దీవస్ సభలో శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. 1956 నుంచి 1968వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందని తెలిపారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని.. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారని చెప్పారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిన కేసీఆర్.. కరీంనగర్ సింహగర్జనతో ఉద్యమబాట పట్టాడని పేర్కొన్నారు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని రగిల్చారని.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని తెలిపారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారని చెప్పారు.‘ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుంది. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అంటున్నారు నేడు గద్ధెనెక్కినవారు. వారు కేసీఆర్ కాలి గోరుకు సరిపోరు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రా... పోదాం ఎక్కడికైనా. ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు లేకుండా పోతే వీపు చింతపండు చేసే పరిస్థితి ఉంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేందుకే దీక్షాదివస్: గంగుల
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని గంగుల కామెంట్స్ చేశారు.రేపటి దీక్షాదివస్ కోసం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ ని నిర్వహిస్తున్నాం. బీఅర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలి.తెలంగాణ అంటేనే సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను ఎందుకు మర్చిపోతాం?. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తెలంగాణ తరహా మలిదశ ఉద్యమానికి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
సార్.. ఈ అన్నం మాకొద్దు
కరీంనగర్/జగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగా రు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాల వి ద్యార్థులు రోడ్డెక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి చేరుకొని కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్లోని పురాతన పా ఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సో మవారం 217 మంది పాఠశాలకు హాజరయ్యారు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు. ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిíÙని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు. -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్లైన్ 14567 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
కేసీఆర్ను ఓడించినా మార్పు రాలేదు : రేవంత్
సాక్షి, కరీంనగర్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. వేములవాడలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.కేసీఆర్ను చిత్తుగా ఓడించిన మార్పు రాలేదుబీఆర్ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బిందిపదేళ్లలో రుణమాఫీ చేసుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదుకేసీఆర్ అసెంబ్లీ కి రా..రుణమాఫీ లెక్కలు మేము చెప్తాంరాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలో కేసీఆర్ నెట్టారుకేసీఆర్ గడీలను కూల్చివేసేందుకే పాదయాత్ర చేశా10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులన్నీ చేసి చూపిస్తున్నాంమిడ్ మానేరు నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలి10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజన్న దేవాలయాన్ని ఎందుకు పట్టించుకోలేదుకాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. దాన్ని నిలిబెట్టుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తుందితెలంగాణలో ప్రాజెక్ట్లను కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడున్న ప్రాజెక్ట్లను పూర్తి చేసేది కాంగ్రెస్సే బీఆర్ఎస్,బీజేపీ నేతలు పనిచేసి ఉంటే ప్రాజెక్ట్లు ఎందుకు మిగిలిపోయాయి కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించిందిఇదే కరీంనగర్ గడ్డపై తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా గాంధీ ఆనాడు మాట ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చారుబండి సంజయ్ రెండుసార్లు కరీంనగర్ ఎంపీ అయ్యారు. ఏమైనా అభివృద్ది చేశారా?కరీంనగర్ జిల్లా గురించి బండి సంజయ్ పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడారు కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఏమైనా నిధులు తెచ్చారుకరీంనగర్ ఎమ్మెల్యేని కలవాలనంటే జర్మనీ వెళ్లాల్సి వచ్చేదిస్వతంత్య్ర భారతంలో కొండంగల్ నుంచి ఎవరూ మంత్రి కాలేదుమా ప్రాంతం నష్టపోయింది.. అందుకే అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామా ప్రాంత నిరుద్యోగులకు ఉధ్యోగాలు రావాలని ఫార్మా విలేజ్ తెస్తే ..అధికారులపై దాడులు చేశారుకేటీఆర్, హరీష్ రావు బాషను కేసీఆర్ సమర్దిస్తున్నారా..?పరిశ్రమలు పెట్టొద్దా కేసీఆర్కాళేశ్వరం కింద భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించలేదా అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ జరగాల్సిందేభూమి కోల్పోయిన రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది -
మహిళ ప్రాణాలు కాపాడిన మంత్రి బండి సంజయ్
కరీంనగర్, సాక్షి: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం కెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్ లారీని ఆపాడు.ఈ క్రమంలో ములుగు వెళుతూ ఘటనా స్థలం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగారు. లారీ కింద చిక్కుకుని రక్తమోడుతున్న దివ్యశ్రీని బండి సంజయ్ కాపాడారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. కేంద్ర మంత్రి సూచనతో జుట్టు కత్తిరించి ఆమె మహిళ ప్రాణాలను స్థానికులు కాపాడారు. అనంతరం ఆ మహిళను చూసిన ఆమె పిల్లలు భోరున విలపించారు. గాయాలపాలైన మహిళను కరీంనగర్లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి బండి సంజయ్ పంపించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు మంత్రి సంజయ్ తెలిపారు. -
కరీంనగర్ రాయితో నూతన హైకోర్టు నిర్మాణం
కరీంనగర్ క్రైం: రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణంలో కరీంనగర్ నుంచి తెప్పించిన బండను వాడుతున్నామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర కలదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న 12 నూతన కోర్టు భవనాల సముదాయానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే సీతారాంపూర్ రోడ్డు లో జడ్జీల నూతన నివాస భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కో ర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించాలన్నారు. అందుకు న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కేసుల విచారణలో అనవసర వాయిదాల ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కోర్టు పరిపాలనా జడ్జిగా వ్యవహరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వినోద్కుమార్, జస్టిస్ విజయసేన్రెడ్డి, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణకుమార్ మాట్లాడారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ పి.నవీన్రావుతోపాటు వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు పి.గోపాలకృష్ణ, కె.మాధవరావు, జి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వరరావు, జి.హనుమంతరావును చీఫ్ జస్టిస్ సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్రెడ్డి, న్యాయమూర్తులు, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ ఆర్డీవో మహేశ్వర్, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కు తిరుగుపయనమయ్యే ముందు చీఫ్ జస్టిస్ సహా ఇతర న్యాయమూర్తులంతా మంకమ్మతోటలోని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. -
కౌశిక్రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కరీంనగర్,సాక్షి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధర్నా చేపట్టారు. కౌశిక్రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండోవిడత దళితబంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉద్రిక్తంగా మారింది. -
వీడియో కాల్ కలకలం.. అర్థరాత్రి ఎమ్మెల్యేకు నగ్నంగా ఫోన్ కాల్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి పొలిటీషియన్ వరకు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ డబ్బులు కాజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో వాట్సాప్లో నగ్న వీడియో కాల్స్ చేసి కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ ఎమ్మెల్యే సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది.వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత సదరు ఎమ్మెల్యేకు వీడియో కాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ రావడంతో ఎవరో అనుకుని.. వీడియో కాల్ను ఎమ్మెల్యే ఆన్సర్ చేశారు. దీంతో ఫోన్ స్క్రీన్పై ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కాల్ను కట్ చేశారు.ఈ క్రమంలో వీడియో కాల్ నుంచి తేరుకున్న ఎమ్మెల్యే.. నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే, తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా వీడియోకాల్ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే సందేహంతో ఆయన వెంటనే నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)లో సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కళ్లెదుటే కన్నకొడుకు సజీవ దహనం.. పాపం ఆ తల్లి..
మానకొండూర్: ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్ (6) సంతానం. సాయికుమార్ కరీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్ వేసుకుని సాయికుమార్ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.నిద్రలో ఉన్న సాయికుమార్ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్యస్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తెలంగాణలో కొత్త లైన్, ఉప్పల్ స్టేషన్.. రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్–హసన్పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి బండి సంజయ్ లేఖ ఇచ్చారు.ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలో..‘కరీంనగర్ నుండి హసన్పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్–వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్ను విస్తరించాలన్నారు. అలాగే, సోలార్ ప్యానల్స్ను కూడా అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఎందుకీ హైడ్రామాలు.. బండి సంజయ్ ఫైర్ -
‘లింగ’మార్పిడి చేసి చంపారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీకే) నుంచి జారీ అయిన దొంగ సర్టిఫికెట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిక్షేపంగా.. గుండ్రాయిలా ఉన్న వ్యక్తి పేరిట డెత్ సర్టిఫికెట్ జారీ అయిన తతంగం బల్దియాలో భూకంపం పుట్టిస్తోంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇందులో తమ డిపార్ట్మెంట్ ప్రమేయం కూడా ఉందని గుర్తించడం గమనార్హం. సంచలనం సృష్టించిన ఈ కేసులో బల్దియా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుండగాæ.. ఓ పోలీసు అధికారి పాత్రపైనా దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. ఈ సర్టిఫికెట్ జారీ అయిన విధానాన్ని బట్టి చూస్తే నేర పరిశోధనలో అనుభవం ఉన్నవారే ఇది చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి ఓ పోలీసు అధికారి, బల్దియా ఉద్యోగులు పథకం ప్రకారం ఈ పని చేశారని పోలీసులు అంచనాకు వచ్చారు.తొలుత స్త్రీగా చూపి.. తొలుత సునీల్ ఖీర్ పేరిట మిస్సింగ్ కేసులేమైనా నమోదయ్యాయా లేదా అని పోలీసులు రికార్డులు తనిఖీ చేశారు. లేవని తెలిశాక బల్దియాలోనే తప్పు జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. బతికి ఉన్న వ్యక్తిపై డెత్ సర్టిఫికెట్ జారీ అవడంపై బల్దియా ఉన్నతాధికారులు కూడా సీరియస్గా దృష్టి సారించారు. 12 ఏళ్ల క్రితం కేసు కావడంతో అప్పటి ఫైళ్ల బూజు దులిపి మరీ అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి 2012 జనవరి 29న సునీల్ ఖీర్ తల్లి మహాభిరీ మరణించింది. వారి బంధువుల్లోని ఓ పోలీసు అధికారి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే ఆయన తన తెలివితేటలు ప్రదర్శించారు. చనిపోయిన మహాభిరీ పేరును సునీల్ ఖీర్గా నమోదు చేయించారు. మరణించిన విషయమై బల్దియా సిబ్బంది వాల్మీకి నగర్లోని మహాభిరీ ఇంటికి వెళ్లి, వాకబు చేశారు. ఆ సమయంలో చనిపోయిన వృద్ధురాలి పేరు సునీల్ ఖీర్ అని కొందరు నమ్మబలికారని బల్దియా అధికారులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మరణించిన మహాభిరీ ఆధార్కార్డును సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అందులో మహాభిరీతో పేరుతోనే ఉండటం గమనార్హం. అదే సమయంలో ఆమెకు రెండు పేర్లు కూడా లేవని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.జారీ సమయంలో పురుషుడిగా..విచారణ ముగిసిన తరువాత సర్టిఫికెట్ జారీ సమయంలో సునీల్ ఖీర్ను పురుషుడిగా పేర్కొనడం ఇష్యూ అయింది. ఇక్కడే బల్దియా అధికారుల నిర్లక్ష్యాన్ని పోలీసులు గుర్తించారు. వాస్తవానికి మరణించిన వ్యక్తి మహిళ అయినా, ఆమె పేరు సునీల్ ఖీర్ అయినా పొరపాటు పడ్డారని అనుకునేవారు. కానీ, సర్టిఫికెట్పై ఆకస్మికంగా పురుషుడిగా లింగమార్పిడి చేసి, జారీ చేయడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది పొరపాటు కాదని, అసలు ఆ సమయంలో విచారణ సరిగా జరగలేదంటున్నారు. పథకం ప్రకారం.. పేరు, లింగం మార్చి బతికి ఉన్న మనిషిని డెత్ సర్టిఫికెట్పై చంపిన వ్యవహారంలో దరఖాస్తుదారుడితోపాటు బల్దియా ఉద్యోగులు కుమ్మక్కయ్యారని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.సోదరుడి మృతిపైనా అనుమానాలు..2012లో జనవరిలో మరణించిన తన తల్లి పేరిట జారీ కావాల్సిన డెత్ సర్టిఫికెట్ తన పేరిట రావడంపై బాధితుడు సునీల్ కొత్త సందేహాలు లేవనెత్తుతున్నాడు. 2016లో తన మరో సోదరుడు సంజయ్ ఖీర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఇప్పుడు అసలు అది రోడ్డు ప్రమాదమా లేక పథకం ప్రకారం హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని ‘సాక్షి’కి తెలిపాడు. తామిద్దరం అడ్డు లేకపోతే ఎవరికి లాభం కలుగుతుందో వారే ఈ పని చేశారని, పోలీసులు ఈ డెత్ సర్టిఫికెట్తోపాటు తన తమ్ముడి ఆకస్మిక మరణంపైనా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.లింగమార్పిడి కొత్తేమీ కాదు..కరీంనగర్ బల్దియాలో లింగమార్పిడి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రెండేళ్ల కింద పలువురు లబ్ధిదారుల పేరిట జారీ అయిన పింఛన్ల విషయంలోనూ పురుషులను స్త్రీలుగా, స్త్రీలను పురుషులుగా పేర్కొంటూ జారీ చేసిన రికార్డు కరీంనగర్ బల్దియాకు ఉంది. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలోనూ అదే మోడస్ ఒపెరండి అనుసరించడం గమనార్హం. -
బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్దం: బండి సంజయ్
కరీంనగర్, సాక్షి: పార్టీకోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.‘‘కేసీఆర్ దశ గ్రహ యాగాలు చేయాలి. కేసీఆరే ఓ దశమ గ్రహం. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం యాగాలు చేయాలి. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి.. బిడ్డ కోసం యాగాలు చేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబంకు ఇక నోఎంట్రీ బోర్డే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను దృష్టి మరల్చడానికే హైడ్రా పేరుతో కూల్చివేతలు. బీజేపీలో చేరడానికి ఇంకా చాలా మంది సిద్దంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటులోనే బీజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు కావాలి’’ అని అన్నారు. -
బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం వడుదల చేయాలి. రైతులకు క్లియరెన్స్ సర్టిఫిటికెట్ ఇవ్వాలి. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. సోనియాగాంధీ బర్త్ డే రోజున కూడా కూడా మోసం చేశారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది కాంగ్రెస్. రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు?. రైతుల పక్షాన పోరాడుతాం. విలీనాలు వద్దు.. దండం పెడుతా. ..గతంలో రేవంత్ రెడ్డి బీజేపీ అని బీజేపీలోకి పోతారని ప్రచారం చేశారు. 30 వేల ఉద్యోగాలు ఏ దేశంలో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలె. నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ను చేర్చుకోవాల్సిన అవసరరం బీజేపీకి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఉంది. బీఆర్ఎస్ను కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి. కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు వేయలేదు?. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్నీ అటకెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయ్. ప్రజలు కోరితే తప్ప అధికారులు, నాయకులూ స్పందించే పరిస్థితి లేదు. సాగు, తాగు నీటి వంటివాటిపై రివ్యూ లేదు’అని అన్నారు. -
కరీంనగర్లో సందడి చేసిన సంయుక్త మీనన్, పాయల్ రాజ్పుత్ (ఫొటోలు)
-
Naba Mohammadi: మోటారు పాఠం.. జపాన్ చేర్చుతోంది!
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.ఏంటా మోటారు కథ...!నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.తాను కూడా ఏదైనా సాధించాలంటే..!అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
డెడ్ స్టోరేజీతో బోసిపోతున్న మానేర్ రిజర్వాయర్
-
కరీంనగర్ బస్స్టాండ్లో అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన
సాక్షి,కరీంనగర్ జిల్లా : కరీంనగర్ ఆర్టీసీ బస్స్టాండ్లో అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒక డ్రైవర్ డ్యూటీ ఎక్కే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతడు మద్యం తాగినట్లు వచ్చింది. అయితే తాను ఎలాంటి మద్యం సేవించలేదని, అసలు తనకు మద్యం తాగే అలవాటే లేదని డ్రైవర్ చెబుతున్నాడు. దీంతో అద్దె బస్సుల డ్రైవర్లు అంతా కలిసి బస్సులు తీయకుండా బస్స్టాండ్లో ఆందోళనకు దిగారు. దీంతో బస్స్టాండ్లోనే బస్సులు నిలిచిపోయాయి. ప్రైవేటు బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
Karimnagar: ఒత్తిడి తట్టుకోలేక మెడికో ఆత్మహత్య
కరీంనగర్క్రైం: ఎంబీబీఎస్ చదవడం కష్టంగా ఉందని మానసిక ఒత్తిడికి గురైన ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన కోమళ్ల ప్రహ్లాదరావు–పద్మజ దంపతులు నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నారు. కూతురు కోమళ్ల శిరీష(20) కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే చదువు కష్టంగా ఉందని పలుమార్లు శీరీష తల్లిదండ్రులకు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శిరీష శనివారం ఉద యం కళాశాల నుంచి వచ్చి ఇంట్లో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుంది. తల్లి పద్మజ మధ్యా హ్నం ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరేసుకొని ఉండటాన్ని చూసి ఆందోళనకు గురైంది. స్థానికుల సహాయంతో ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రహ్లాదరావు ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రఫుల్ దేశాయ్పై ట్రోలింగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) ప్రఫుల్ దేశాయ్పై వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ తరహాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఆయన సివిల్స్లో 523వ ర్యాంకుతోపాటు ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా క్లెయిమ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ ఖేద్కర్ తరహాలోనే ప్రపుల్ దేశాయ్ కూడా నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్ తప్పని పలువురు ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలోని ఆయన సైక్లింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను ఉదహరిస్తున్నారు. కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆయన మిత్రులు, తెలిసినవారు ప్రఫుల్ దేశాయ్కి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్య ంగా ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారంతా ప్రఫుల్ కాలికి ఉన్న సమస్య నిజమైనదేనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మనసు గాయపరచవద్దని హితవు పలుకుతున్నారు. అయినా, ట్రోలింగ్ ఆగడకపోవడం గమనార్హం. ఒక ఖాతా నుంచి కాకుండా వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి ట్రోల్ చేస్తుండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా కరీంనగర్ కలెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తీసుకుంటాంతనపై జరుగుతున్న ట్రోలింగ్పై ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. అందులో.. ‘2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) మెడికల్ బోర్డు ముందు హా జరయ్యాను. వారు నాకున్న లోపాన్ని సర్టిఫై చేశారు. అనంతరం అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపారు. కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. నిజంగానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది. కానీ, నిజాయతీగా ఉన్న వారిని ఆన్లైన్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చే యడం మా పనితీరును, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’కి వివరణ ఇస్తూ.. తనను ఆన్లైన్లో ట్రోల్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.యూపీఎస్సీ స్కాం పేరిట ట్రెండింగ్మొత్తం మీద ఖేద్కర్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో యూపీఎస్సీ స్కాం, ఈడబ్ల్యూఎస్, వీల్చైర్ యూజర్ హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్ట్రాగామ్లలో ఎకనమిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్), నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు తీసుకొని, సివిల్స్ ర్యాంకు సాధిస్తున్నారంటూ ఇటీవల సివిల్స్ ర్యాంకు సాధించినవారి ఫొటోలతో నేరుగా ట్రోలింగ్కు దిగుతున్నారు. వీటిని ప్రధాని కార్యాలయం, డీవోపీటీ, ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి పూజా ఖేద్కర్ వివాదంతో యూపీఎస్సీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆన్లైన్లో ర్యాంకర్ల ర్యాంకులు, వారి రిజర్వేషన్లను స్క్రీన్ షాట్లు తీసి, పెడుతుండటంతో సదరు అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. -
అమ్మా.. ఎంత పనిచేశావు..!
మేడిపల్లి: ‘అమ్మా.. మమ్మల్ని ముద్దుగా పెంచావు. ఎంత అల్లరి చేసినా ఓపికగా భరించా వు.. అందరితో ఆడుకుంటుంటే మురిసిపోయావు. మేమే నీ లోకం.. మేమే నీ సర్వస్వం అ న్నట్లు మెదిలావు.. అంతలోనే మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా అమ్మా.. ఇక మాకు దిక్కెవరు.. మమ్మల్ని ఎవరు లా లిస్తారు.. ఎవరు బుజ్జగించి బువ్వ తినిపిస్తారు అ మ్మా.. అనే రీతిలో ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద కనిపించిన తీరు కంటతడి పెట్టించింది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అటు పుట్టింట్లో.. ఇటు మెట్టింట్లో తీరని శోకాన్ని మిగిలి్చంది. ఈ విషాధ ఘటన భీమారం మండలంలోని కమ్మరిపేటలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పాక లక్ష్మి, రాజం కూతురు శ్రావణిని కమ్మరిపేట గ్రామానికి చెందిన తిపిరి నరేశ్కిచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు శ్రాహన్స్(4), రుద్రాన్స్ (ఏడాది) ఉన్నారు. నరేశ్ తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శ్రావణి బీడీలు చుడుతోంది. ఉన్నంతలో హాయిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రాహన్స్కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నరేశ్ శ్రావణికి చెబుతున్నాడు. తానే తీసుకెళ్లాలంటే ఎలా అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘ఎంత పనిచేశావు బిడ్డా.. నీ పిల్లలు పసిమొగ్గలని గుర్తుకురాలేదా.. ఆ యముడే మదిలో నుంచి జ్ఞాపకాలు తీసేసాడా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. విగతజీవిగా మారిన భార్య మృతదేహాన్ని చూస్తూ భర్త నరేశ్.. అమ్మకు ఏమైంది నాన్న అంటూ నాలుగేళ్ల కొడుకు.. ఏం జరుగుతుందో తెలియక బోసిపోయిన ముఖంతో ఏడాది కుమారుడు.. మీ అమ్మ ఇకరాదు బిడ్డా అని ఎలా చెప్పాలో తెలియక బరువెక్కిన హృదయంతో దిక్కులు పిక్కటెల్లేలా రోదించారు శ్రావణి తల్లిదండ్రులు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఉన్న శ్రావణి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిలి్చంది. పెద్ద కుమారుడితో శ్రావణికి తలకొరివి పెట్టించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. -
బండి VS గంగుల కరీంనగర్లో ఫ్లెక్సీ పాలిటిక్స్
-
తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం.. మాజీ ఎంపీ వినోద్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం. ఏస్, అందులో నేనూ ఓ పాత్రధారినే అంటూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మానకొండూరులో జరిగిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్తో మాట్లాడి తెలంగాణ అనే అంశంతో ముడివిడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామన్నారు. టీఆర్ఎస్ పవర్లో లేకపోవచ్చు కానీ.. పవర్ ఫుల్ పార్టీ అన్నారాయన. -
నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏవి?
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 7 నెలలైందని, హామీల అమలు మాత్రం నీటిమూటగా మిగిలిపోయందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎంత వరకు వచ్చిందని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు.ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి రూ.4,000 ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామన్న హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు మాత్రం కొన్ని పోస్టులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.మాజీ సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, నియామక పత్రాలు ఇచ్చి, నిరుద్యోగుల చెవులో పూలు పెట్టారన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డితోపాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. -
కరీంనగర్ లో వర్షం వస్తే అంతే
-
కరీంనగర్ నేలను తాకి ప్రణమిల్లిన బండి సంజయ్
-
కేంద్ర హోం మంత్రిగా కరీంనగర్ లో బండి సంజయ్ మొదటి స్పీచ్
-
మోదీ 3.0.. 100 రోజులు.. మనవి 2 రోడ్లు
సాక్షి, హైదరాబాద్: మోదీ 3.0 తొలి ‘వంద రోజుల ప్రణాళిక’లో తెలంగాణకు చెందిన రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు దక్కింది. ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరసల జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఇందులో ఎంపిక చేశారు. ఈ వంద రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియతో మందగించిన పురోగతిని వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మూడో విడత పాలనను వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో దేశవ్యాప్తంగా 3 వేల కి.మీ. నిడివి గల జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులను చేర్చారు. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే క్రమంలో పనులను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తారు. వాటిలో తెలంగాణకు సంబంధించి ఈ రెండు జాతీయ రహదారులుండటం విశేషం. ఇందులో ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల రోడ్డుకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక జగిత్యాల–కరీంనగర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఆరు నెలల క్రితమే టెండర్లు పూర్తికాగా, ఇప్పుడు వాటిని రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) వేగంగా చర్యలు తీసుకుంటోంది.రెండు రోడ్ల అనుసంధానంనిజామాబాద్–ఛత్తీస్గడ్లోని జగ్దల్పూర్ మధ్య విస్తరించి ఉన్న ఎన్హెచ్–63ను విస్తరించాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది. ట్రక్కులు అధికంగా తిరిగే ఈ జాతీయ రహదారి రెండు వరసలతో ఇరుకుగా ఉండి ప్రమాదాలకు నిలయంగా మారటంతో నాలుగు వరసలకు విస్తరించనున్నారు. ఇందులో ఆర్మూరు–మంచిర్యాల మధ్య కీలక ప్రాంతాన్ని ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. రాష్ట్రం పరిధిలోని మిగతా నిడివిని రాష్ట్రప్రభుత్వ అ«దీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరిస్తోంది.పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరిస్తారు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా సాగే ఈ రోడ్డు నిడివి 131.8 కిలోమీటర్లు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల పట్టణాల వద్ద 6–12 కి.మీ. మేర భారీ బైపాస్లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్లు నిర్మిస్తారు. ఇతర రోడ్ల క్రాసింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. ఇక వంతెనలు, అండర్పాస్లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. భూసేకరణ విషయంలో గతంలో స్థానికులు వ్యతిరేకించి ఉద్యమించడంతో రెండుమార్లు దీని డిజైన్ మార్చాల్సి వచి్చంది. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వచి్చంది. ఇప్పుడు ఆలస్యం కాకుండా పనులను వేగంగా పూర్తి చేయనున్నారు.‘ప్రమాదాల రోడ్డు’కు ప్రాధాన్యం జగిత్యాల నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్హెచ్–563లో కీలక భాగమైన 58.86 కి.మీ. నిడివి కూడా ఇప్పుడు వంద రోజుల ప్రణాళికలో చోటు దక్కించుకుంది. ఈ రోడ్డు రెండు వరసలుగా ఉండి ఇరుగ్గా మారటంతో ప్రమాదాలకు నిలయమైంది. దీన్ని విస్తరించాలని చాలాకాలంగా యతి్నస్తున్నా పనుల్లో వేగం రాలేదు. కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య ఎట్టకేలకు పనులు మొదలు కాగా, జగిత్యాల–కరీంనగర్ మధ్య టెండర్ల ప్రక్రియతో ఆగిపోయింది. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని ఇప్పుడు నిర్ణయించారు. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వంద రోజుల గడువులో నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ఈ నిడివి పనులకు రూ.2,151 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా, ఇప్పుడు దాని విలువ రూ.2,300 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అది కూడా పూర్తికావొచి్చంది. కొన్ని అవాంతరాలున్నా, వేగంగా అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అతిపెద్ద స్కాం చేశాడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అండగదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీలో నుంచి వస్తున్న యాష్ను లోడ్ రికార్డు లేకుండానే బయటకు పంపిస్తున్నారని అన్నారు. అయితే లారీ లోడు ఖాళీగా చూపిస్తూ వే బ్రిడ్జి ఇస్తున్నారని విమర్శించారు. .కలెక్షన్ బాయ్గా పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ఈ వ్యవహారాలు చూస్తున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. స్థానికంగా దీనిపై వార్తలు రాస్తున్న రిపోర్టర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రెండు లారీలను సీజ్ చేసి, మిగితా 13 లారీలను వదిలిపెట్టారని తెలిపారు.ఇంత పెద్ద స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ పొన్నం ప్రభాకర్ను ప్రశ్నించారు. తమ ఆరోపణలపై దమ్ముంటే మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. `నా దిష్టి బొమ్మ తగలబెట్టడం కాదు. ఈ స్కాం పై మీరు మాట్లాడాలి. ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మేము బాధ్యులం కాదు. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.` అంటూ మండిపడ్డారు.కాగా రెండు రోజుల క్రితం ఓవర్ లోడ్తో రామగుండం నుంచి ఖమ్మం వెళ్తున్న బూడిద లారీలను హుజురాబాద్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లు లేకుండా ప్లై యాష్ బూడిద తరలించడాన్ని గుర్తించి సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆందోళనకు దిగి అధికారుల తీరు, మంత్రి పొన్నం వైఖరిపై మండిపడ్డారు.రవాణా శాఖ మంత్రి అండదండలతోనే అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. అధికారులకు పిర్యాదు చేసిన మంత్రి ప్రోద్బలంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ దందాకు చేస్తున్న మంత్రి పొన్నం ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
విద్యానగర్ (కరీంనగర్): ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్ ఫిలిగ్రీ కళానైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఆర్థిక కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్–రాధిక వివాహ వేడుకలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్లోని పెద్దస్టార్స్ కూడా హాజరుకానున్నారు. ఈ పెళ్లికి హాజరయ్యే వీవీఐపీలకు విలువైన బహుమతులను ఇచ్చేందుకు అంబానీ కుటుంబం నిర్ణయించింది. వాటిలో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కూడా ఉన్నాయి. ఈ విలువైన ఫిలిగ్రీ గిఫ్ట్స్ డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచి్చనట్లు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అర్రోజు అశోక్ తెలిపారు. ఇందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతర త్రా వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం 400 సంవత్సరాల నాటి పురాతన కళకు ప్రోత్సాహకంగా నిలు స్తుందని వారు పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళకు 2007లో జీఐ ట్యాగ్ లభించింది. స్వచ్ఛమైన వెండిని కరిగించి.. అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయా రు చేయడం, తీగలు అల్లడం ఈ కళ విశేషం. -
ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి
-
వికసిత్ భారత్ కాదు.. విఫల భారత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘‘పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిన ఏ వాగ్దానం కూడా నెర్చలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న మోదీ.. దేశ్ కా సత్యనాశ్ చేసిండు. వికసిత భారత్ అంటూ దేశాన్ని విఫల భారత్గా చేసిండు..’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక నాలుగైదు నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేసిందని విమర్శించారు. కేసీఆర్ గురువారం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి.. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘పదేళ్ల కింద మోదీ ప్రధాని అయినపుడు 150 హామీలిచ్చి ఒక్కటైనా నెరవేర్చలేదు. అచ్చేదిన్ అన్నారు.. సచ్చేదిన్ వచ్చింది. అంతా గ్యాస్.. ట్రాష్..! మాట్లాడితే పాకిస్తాన్, పుల్వామా అంటారు. పాకిస్తాన్ చిన్న దేశం. వాడిని చూపించి డ్రామా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు నిలిచినయ్. విదేశీ మారకాలు తగ్గినయ్.. కొలువుల భర్తీలేదు. కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే తప్ప పేదలకు రుపాయి ఇవ్వలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారు?పోయినసారి మంచికో చెడుకో రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వారు నాలుగు రూపాయల పనైనా చేశారా. మత విద్వేషాలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. అసలు ఇక్కడి ఎంపీ బండి సంజయ్కు సరిగా మాట్లాడటం వస్తదా? అతన్ని పార్లమెంటుకు పంపుదామా? విద్యావంతుడైన వినోద్కుమార్ను పంపుదామా? ఆలోచించాలి.మహిళలకు రూ.2,500 సాయం ఏది?అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నరు. ఏవి? రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏవి? మహిళలకు ఫ్రీ అని చెప్పి బస్సులు సరిగా వేయకపోతే.. మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవాల్సి వస్తోంది. 9 ఏళ్లపాటు రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది? మిషన్ భగీరథ నీళ్లు ఏవి? మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం పోవడం చూసి నా కళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లోనే తెలంగాణ ఎందుకింత ఆగమైంది? ముస్లింలంతా కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీ గెలుస్తుంది. బీజేపీకో హఠానా చాహియే.. ఆ పని బీఆర్ఎస్తోనే సాధ్యం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ
సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు.రేవంత్, రాహుల్ ట్యాక్స్..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతిపై కాంగ్రెస్ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్ఆర్’ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్ను ఎంఐఎంకు లీజ్కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్ విసురుతోంది. భారత్ ముందుకు సాగుతోంది..కాంగ్రెస్ అతి కష్టం మీద కరీంనగర్లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
నేడు వేములవాడకు మోదీ!
సాక్షి, హైదరాబాద్/ వేములవాడ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడంతోపాటు వేములవాడ, వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. సుమారు 8 గంటల సమయంలో వేములవాడకు చేరుకుంటారు.అక్కడి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత వేములవాడలోని బాలానగర్లో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో వరంగల్కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్కు మద్దతుగా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.పకడ్బందీగా ఏర్పాట్లు..వేములవాడలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తయిన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. వాటిని సరిచేస్తున్నారు. వానలు కొనసాగుతాయన్న వాతావరణశాఖ ప్రకటన నేపథ్యంలో.. బుధవారం సభ నిర్వహణ ఎలాగన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం గమనార్హం.అమిత్ షా, రాజ్నాథ్ల ప్రచారం కూడా..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. బుధవారం రాత్రే హైదరాబాద్కు చేరుకోనున్న అమిత్ షా.. గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో భువనగిరికి చేరుకుని, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక రాజ్నాథ్ సింగ్ గురువారం ఉదయం 9 గంటలకు వరంగల్లో, 11 గంటలకు జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.పీవీ కుటుంబ సభ్యులతో మోదీ డిన్నర్రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మోదీ నేరుగా రాజ్భవన్కు వెళ్లి బస చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్రావు, కుమార్తెలు ఎమ్మెల్సీ వాణీదేవి, శారదాంబ, ఇతర కుటుంబ సభ్యులు రాజ్భవన్కు వచ్చి ప్రధాని మోదీని కలిశారు. మోదీ వారితో కాసేపు మాట్లాడారు, కలిసి డిన్నర్ చేశారు. అనంతరం పీవీ మనవడు ఎన్వీ సుభాష్ మాట్లాడారు. ప్రధానిని కలిసి, అరగంటకుపైగా గడపడం.. సైన్స్, టెక్నాలజీ, ఇతర అంశాలపై మాట్లాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. -
హైదరాబాద్పై కన్నేశారు.. జాగ్రత్త!
కరీంనగర్/ వేములవాడ: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ తెరలేపాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్కు పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే వారి కుట్రలను ఛేదిస్తామని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవల్ కమిటీలతో కేటీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఒప్పందం జరిగింది. వచ్చే జూన్ 2తో ఆ గడువు ముగుస్తోంది. హైదరాబాద్పై కన్నేశారు.. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రె స్, బీజేపీలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటింపజేసేందుకు కుట్రలు మొ దలుపెడతాయి. అలా చేస్తే అడ్డుకునే శక్తి గులాబీ పార్టీకి మాత్రమే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పరస్పరం సహకరించుకుంటూ.. బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణ ప్ర యోజనాలే లక్ష్యంగా ఆ రెండు పారీ్టల కుట్రలను ఛేదిస్తాం. దేశంలో 400 ఎంపీ సీట్లలో గెలిస్తే.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లను ఎత్తివేస్తా మని బీజేపీ నాయకులు ప్రగ ల్భాలు పలుకుతున్నారు. అలాంటి వాటిని కూ డా అడ్డుకునే శక్తి కూడా గులాబీ పారీ్టకే ఉంది.వారితో ఒరిగేదేమీ లేదు..2014 నుంచి కేంద్రంలో బడేభాయ్ మోదీ.. వంద రోజుల నుంచి రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్.. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారు. గాలి మాటల సీఎం రేవంత్రెడ్డి, మాయమాటల ప్రధాని మోదీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచి్చన హామీలను మోదీ సర్కార్ అమలు చేయలేదు. హైదరాబాద్కు ప్రకటించిన ఐటీఐఆర్ను కూడా ఎత్తివేసింది. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని.. వారి కష్టాలను మాత్రం డబుల్ చేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధరను ఇప్పుడు రూ.1,200కు పెంచారు.సామాన్యులపై పెను భారం పడుతోంది. జాతీయ రహదారుల కోసం సెస్ పేరిట రూ.30లక్షల కోట్లు వసూలు చేసి.. ఇందులో సగం రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు అందించారు. యువతలో మతవిద్వేషాలు నింపి తప్పుదోవ పట్టిస్తున్నారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు, యువత మరోసారి బీజేపీ మాయలో పడొద్దన్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్
సాక్షి,కరీంనగర్: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. మానకొండూర్లో ఆదివారం(ఏప్రిల్27) నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. ‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. -
నామినేషన్లకు 2 రోజులే.. ఇంకా సస్పెన్స్లో కాంగ్రెస్ పెండింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో అనిశ్చితి నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగుళూరులో సమావేశమయ్యారు. మరో వైపు, కరీంనగర్ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్రావు నామినేషన్ వేయగా, పార్టీ ఆదేశించకుండా నామినేషన్ వేయడంపై ఆశావహుడు ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ అభ్యర్థి విషయంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారని.. లేని పక్షంలో అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదు?
కరీంనగర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ లెక్కన ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల చొప్పున బోనస్ ఎందుకివ్వడం లేదని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్కు చెందిన తాజా, మాజీ సర్పంచులు పలువురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంజయ్ మాట్లాడు తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో సర్పంచుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మోదీ ప్రభు త్వం పంచాయతీలకు నిధులివ్వడంతోనే సిబ్బందికి జీతాలిస్తున్నారని తెలిపారు. దేశమంతా మోదీ గాలి వీస్తుందని, తొలివిడతలోనే 102 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. -
Ponnam Prabhakar: 14న కరీంనగర్లో దీక్ష చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. -
అంజన్న సాక్షిగా అబద్ధాలు చెబుతారా?
కరీంనగర్ టౌన్: ఆరు గ్యారంటీలను అమలు చేశామని అంటున్న కాంగ్రెస్ నేతలు కొండగట్టు అంజన్న సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ విమర్శించారు. కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్ అని, ఆయన సన్నిధిలో అబద్ధాలాడిన, దొంగ హామీలిచ్చిన కేసీఆర్, ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘ఆరు గ్యారంటీలను అమలు చేశామంటున్న ఆ కాంగ్రెస్ నేతను అడుగుతున్నా.. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఎంతమందికి ఇచ్చారు..? రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఎంతమందికి అందించారు..? ధాన్యం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చారా..? తరుగు లేకుండా ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తామన్నారు.. చేశారా..? అని ప్రశ్నించారు. కరీంనగర్లో గురువారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇన్చార్జిల తో బండి çసమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై నయ్.. రెండుపార్టీలు కలిసి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నయి.’’ అని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ మంచి చేస్తే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ నెల 21న వేలాదిమందితో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తున్నట్లు బండి ప్రకటించారు. -
ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్ను ఢీకొట్టడంతో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలంలో ఓ లారీ.. బైక్ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెతో సహా మరో యువతి మృతిచెందింది. దీంతో, కుటుంబం సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపు వద్ద మొరం లోడ్తో వస్తున్న లారీ.. బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మొరం బైక్పై వెళ్లున్న వారిపై పడింది. మట్టిలో వారు ముగ్గురు కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం, జేసీబీ సాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు ఉన్నారు. మృతి చెందిన వారిని విజయ్, సింధుజ, వర్షలుగా గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, బోర్నవల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
చేతి కర్రతోనే పొలం బాట
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్ రూరల్ / సిరిసిల్ల: సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దూంపూర్లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్సింగ్, మేయర్ సునీల్రావు తదితరులు ఉన్నారు. -
కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట
-
కేసీఆర్ పర్యటనలో జేబు దొంగల హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో జేబు దొంగలు హల్చల్ చేశారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఎండిన పొలాలను కేసీఆర్ పరిశీలిస్తుండగా.. ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ. 10 వేలు కొట్టేశాడు. అయితే దొంగను పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అతడికి దేహశుద్ది చేశారు. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నారు. సాయంత్రం సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. -
రేపు ‘బండి’ రైతుదీక్ష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్సైరన్ మోగించారు. అకా లవర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సాగునీరందక పంటలు ఎండిపోతు న్నా పట్టించుకోలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్కహామీ కూడా అమలు చేయలేదని ఆరోపిస్తూ ‘రైతుదీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. మంగళవా రం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్లకల్లాల వద్ద బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... రైతుల పక్షాన మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే ‘దీక్ష’కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. కాగా, సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు ఆయన వినతిపత్రాలు అందించనున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే ’’పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతో పాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ను ఏర్పాటు చేయాలి.’’ -
వేసవిలో ఈ పంటతో.. శ్రమ తక్కువ! ఆదాయం ఎక్కువ!
వేసవికాలంలో దోస పంట సాగుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. పంట సాగుకు రసాయన ఎరువులు వినియోగం ఉండదు. సాగు ఖర్చులు కూడా తక్కువే. తక్కువ శ్రమతో ఈ పంటను సాగు చేయవచ్చు. కరీంనగర్, నిర్మల్ మండలంలోని కనకాపూర్ గ్రామం దోసకాయలకు కేరాఫ్గా నిలుస్తోంది. గ్రామానికి చెందిన 20 నుంచి 30 మంది రైతులు ఇతర గ్రామాల రైతులకు భిన్నంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే దోసకాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మిగిలిన పంటల కంటే తక్కువ సమయంలో సాగయ్యే దోస కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. రైతులు తాము పండించిన దోసకాలను స్వయంగా జాతీయ రహదారిపై కిలోకు రూ.60 నుంచి రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడితో దోస పంటను సాగు చేస్తున్నామని కనకాపూర్ రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. మధ్య దళారీలు లేకపోవడంతో రైతులు పండించిన దోస కాయలను నేరుగా తమ గ్రామంలోని బస్టాండ్లో అమ్ముతున్నారు. ఎకరాకు ఖర్చులు పోనూ రూ.80 వేల నుంచి లక్ష వరకు లాభాలు వస్తున్నాయని రైతులు తెలిపారు. – రాజు, యువ రైతు, కనకాపూర్ సేంద్రియ ఎరువులతో సాగు దోస పంట సాగుకు ఇక్కడి రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. మంచి ఆదాయం.. ఎకరా విస్తీర్ణంలో దోస పంట సాగు చేశా. సాగు ఖర్చులు పోనూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట. – రఘు, యువ రైతు, కనకాపూర్ ఇవి చదవండి: Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది -
వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య..
ఇబ్రహీంపట్నం: తన భర్త కొడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీస్స్టేషన్కు వచ్చిన ఓ యువతిని ట్రాప్ చేశాడు ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్య. అంతటితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటో తీయించుకున్నాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఇదే మండలం వర్షకొండకు చెందిన ఓ యువకుడితో గతంలోనే పెళ్లయ్యింది. వారికి కొడుకు, కూతురు సంతానం. ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరిగాయి. దీంతో భార్యాభర్తలు వేరుకాపురం పెట్టారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థాలు వచ్చాయి. భర్త తనను వేధిస్తున్నాడని, కొడుతున్నాడని సదరు యువతి కొద్దిరోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఏఎస్ఐ రామయ్య ఆమెనుంచి ఫిర్యాదు స్వీకరించాడు. విచారణ పేరుతో ఆమెతో సన్నిహితం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడి మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే ఆ యువతితో ఓ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని యువతితో కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. న్యాయం కోసం వెళ్లిన యువతిని కాపాడాల్సిన పోలీసే ట్రాప్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయ.ుమై ఎస్సై అనిల్ను వివరణ కోరగా.. ఏఎస్ఐ రామయ్య విషయాన్ని చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్ జగిత్యాలక్రైం: ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్యను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు చేపడతామని తెలిపారు. -
కేసీఆర్ ఎక్కడున్నా ‘రజాకార్’ చూడాలి
కరీంనగర్ టౌన్: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు, గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘రజాకార్’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్లోని మమత థియేటర్లో రజాకార్ చిత్ర యూనిట్, బీజేపీ కార్యకర్తలతో కలిసి సినిమా చూసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియంత నిజాం, రజాకార్ల రాక్షస పాలనపై తెలంగాణ ప్రజ లు చేసిన పోరాటాల చరిత్రను అద్భుతంగా తెరపై చూపించారని కొనియాడారు. ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను ప్రజలకు అందించిన దర్శక, నిర్మాతలు యాట సత్యనారాయణ, గూడూరు నారాయణరెడ్డిని అభినందించారు. కేసీఆర్ ఎక్కడున్నా రజాకార్ సినిమా చూడాలన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా నిజాం గొప్పోడు, రజాకార్లు మంచోళ్లని అనిపిస్తే నిరభ్యంతరంగా కేసీఆర్ ‘ట్వీట్’చేయొచ్చు అని సూచించారు. అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కేసీఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయవచ్చని పేర్కొన్నారు. -
మంత్రి పొన్నం కు నిరసన సెగ
-
‘పెడితే పెళ్లి లేదంటే చావు కోరే వ్యక్తి కేసీఆర్’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సమాజం చీదరించుకుని ఒడగొట్టిన కేసీఆర్కు బుద్ధిలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ కేసీఆర్.. నిస్సిగుగా అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేందుకు సహకరించిందే కేసీఆర్. ఆఫ్ట్రాల్ ఏడు మండలాలు పోతే పోనీ అన్నాడు కేసీఆర్. పెడితే పెళ్లి లేదంటే చావు కోరే వ్యక్తి కేసీఆర్. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి వినోద్ కుమార్. అయినా ఆయన్ని నిజయితీ పరుడు అంటూ ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్పై సహారా, ఈఎస్ఐ కేసులు కూడా ఉన్నాయి. అందుకే నాడు కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ని తొలగించారు. కనీసం పార్లమెంట్ కూడా రాకపోతే.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేసీఆర్ రాజీనామా చేయమన్నారు’ అని సంజయ్ అన్నారు. -
‘పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలి’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఆశలు అడియాశలు అయి.. దిక్కుతోచని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంట్ కోతలతో ఆత్యహత్యలు, వలసలకు ఆలవాలమైన తెలంగాణ.. ఇగ ఎక్కడైతది తెలంగాణ అని ఆనాడు అన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. ఆయన ఇవాళ కరీంనరగర్లో నిర్వహించిన కదనభేరి బహిరంగసభలో మాట్లాడారు. దిశదశ లేకుండా.. అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్న తెలంగాణ కోసం.. హైదరాబాద్లోని జల దృశ్యం నుంచి ఆనాడు పిడికెడు మందితో జైతెలంగాణ అని బయలుదేరానని చెప్పారు. ‘బ్రహ్మాండమైన చైతన్యవంతమైన ప్రజలు ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా.. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభించాలని భావించా. ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుంచి మే 17న తెలంగాణ ఉద్యమం కోసం నమ్మి వస్తే.. ఆనాడు తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ.. ఈ కరీంనగర్ గడ్డ. ఆనాడు ఎంపి పదవి విసిరికొట్టి రారా నాకొడకా అంటూ కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చాను. ఉద్యమాన్ని ఉదృతం చేశాను. మొన్న మీరు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారు. ఆరు చందమామలను చూపెట్టాడు. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నాడు ఓ మంత్రి. రైతుల చెప్పులు బందోబస్తుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయి లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు తిడుతా. ఉద్యమ సమయంలో మాట్లాడిన నేను.. అంతే తప్ప ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి లాగా మాట్లాడలేదు. లంకె బిందెల కోసం వచ్చాను అని నేను ఏనాడైన అన్నమా?. మాతో పోటీ పడేలా పాలన చెయ్, కానీ చేరుతాం, బొంద పెడతాం అంటావా. ... అహోరాత్రులు కష్టపడి ఆలోచన చేసి 2014 నుంచి 19 వరకు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాను. మిషన్ భగీరథ నడిపే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా?. రెప్ప పాటు కూడా కరెంట్ కూడా పోకుండా ఇచ్చాను. మేము అమలు చేసిన పథకాలు సక్కగా అమలు చేసే దమ్ము లేదా?. కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి. లేదంటే పథకాలు అడిగితే నిజంగానే చెప్పుతో కొడతారు’ అని కేసీఆర్ అన్నారు కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చినా. ఈ చవట దద్దమ్మలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా మేము అభివృద్ధిపై పోరాడుతాం. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?. ఐదు రూపాయల పని చేయని బండి సంజయ్ కి ఎందుకు ఓటెయ్యాలి?. బండి సంజయ్కి, వినోద్కి మధ్య అసలు పోలిక ఉందా?’ అని మండిపడ్డారు. దయచేసి ఆలోచన చేయాలి తెలంగాణాలో వ్యవసాయ స్థిరీకరణ చేయాలని ఆలోచించాం. చరణ్ సింగ్ లాంటి రైతుబిడ్డలు కూడా పెట్టని పథకాలు మనం రైతుల కోసం పెట్టుకున్నాం.ఈ విషయాలన్నీ కరీంనగర్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. అసమర్థ కాంగ్రెస్ నాయకుల పాలనలో బోనస్ బోగస్ గా మారిపోయింది. మేడిగడ్డలో చిన్న కాంపోనెంట్ లో ఏదో జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు.రెండు పిల్లర్లు కుంగితే భారతే మునిగిపోతున్నట్టు బొబ్బలు పెడుతున్నారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు, పశువులను మేపుతున్నారు. గ్రామాల్లో మీరంతా చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ తెలంగాణా గళం, దళం, బలం’ అని కేసీఆర్ తెలిపారు. .. నేను సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయిన ఎండి పోయిందా?. ఇప్పుడేం రోగం వచ్చింది. నేను రెండు రోజుల్లో ఓ టీవీలో కూర్చుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి ఇంటింటికి చేరేలా చేస్తా. రెండు పిల్లర్లు మునిగిపోతే మొత్తం భారత దేశమే మునిగి పోయినట్టు చేస్తున్నారు’ అని కేసీఆర్ దుయ్యబట్టారు. -
కలిసొచ్చిన కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ శంఖారావానికి భారీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిన పార్టీ యంత్రాంగంలో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమాయత్తమవుతు న్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఇటీవలి కాలంలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టు లను అప్పగించే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హాజరైన ఆయన తరువాత తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే ఊపులో రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల సమావే శంలో కరీంనగర్ వేదికగా భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తూ ఈనెల 12న కరీంనగర్లోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా... నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభ కృష్ణా జలాల అంశంపైనే కాగా, కరీంనగర్ సభను మాత్రం ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమనే వాయిస్ను జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నికల సభలను కరీంనగర్ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కలిసొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాన్ని ఇందుకు మరోసారి వేదికగా ఎంచుకున్నారు. ఈ సభకు సంబంధించి సన్నాహక సమావేశం శుక్రవారం జరగ్గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ యంత్రాంగంలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నా యకులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించగా, ప్రజలు అన్నీ గమనిస్తు న్నారని, తగిన సమయంలో బుద్ధి చెపుతారని కేటీ ఆర్ వ్యాఖ్యానించారు. కాగా కరీంనగర్లో బీఆర్ ఎస్ కార్పొరేటర్ల అరెస్టులు, నాయకులపై కేసులు నమోదు అంశంపైన కూడా శుక్రవారం నాటి సమా వేశంలో చర్చ జరిగింది. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారికి భరోసా ఇవ్వడం పైనా... బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలల వ్యవధిలోనే రాజకీయాలు వేగంగా మారుతున్నా యి. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి నప్పటికీ, కొందరు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్క ర్నూలు), బీబీ పాటిల్ (జహీరాబాద్) ఇప్పటికే వేరే పార్టీల్లోకి జంప్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిట్టింగ్లు భయపడు తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇవ్వగా, మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండరని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం కేటీఆర్ను కలిసి చెప్పారు. దీంతో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు కరీంనగర్లో భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని నిర్ణయించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి గంగుల కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లో జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ కూడా శుక్రవారం గ్రౌండ్స్కు వెళ్లి పరిశీలించారు. ఏయే నియోజకవర్గాల నుంచి ఎంత మంది జనం వస్తారో లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్ష మందికి పైగా జనాలు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్కు తరలివస్తారని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తాను మరోసారి చాటుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి చెప్పారు. -
రేవంత్ సర్కార్ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్
-
రేవంత్ సర్కార్ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్పైనా మండిపడ్డారు. .. కరీంనగర్ నుంచే పార్లమెంట్ జంగ్ సైరన్ మోగబోతోంది. కేసీఆర్కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. నాటి ఉద్యమ కాలాన సింహగర్జన సభకు కరీంనగరే వేదికైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై కూడా కదనభేరి సభ కరీంనగర్ నుంచే మొదలు కాబోతోంది. ప్రధాని వచ్చి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలో ఉండి ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు తెలీదు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతాననేటోడు మన ముఖ్యమంత్రి. ఓ జేబు దొంగలా మాట్లాడుతున్నాడు. అవి సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా..? ‘‘రేవంత్రెడ్డి బీపీ పెంచుకోకు. మా వైపు నుంచి నీకు నష్టం లేదు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ .. మానవబాంబులైతామంటున్నాడు రేవంత్. కానీ, ఆయన పక్కనే బాంబులున్నై, అది ఆయన గమనించుకుంటే చాలు. ప్రజలకు కూడా అర్థం కావాలి గాడిదేదో, గుర్రమేదో. చార్సవ్ బీస్ హామీలు అమలు కాకపోతే నిలదీస్తాం. రైతుబంధును రైతుభరోసా అన్నాడు. వచ్చిందా మరి..?. రైతులే ఇప్పుడు రేవంత్ పాలనపై చర్చకు పెడుతున్నారు.. మగాడివైతే రా నువ్వు నిలబడ్డ మల్కాజిగిరికి రా.. నేను వస్తానని సవాల్ విసిరా. కానీ, ఆ ఊసే మాట్లాడుతలేడు. మగాడివైతే ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపాలని రేవంత్ కు సవాల్ విసురుతున్నా.. ఆత్మగౌరవం కల్గిన ఏ తెలంగాణా బిడ్డ మాట్లాడని మాటలు మోడీ ఎదుట సాగిలబడి రేవంత్ మాట్లాడుతుండు. రాహూల్ ఏమో గుజరాత్ మాడల్ ను తిడితే.. నువ్వేమో పొగుడ్తావా..?. 90 రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయింది రేవంత్ ప్రభుత్వం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. పైనున్న ప్రాంతాలకు నీళ్లు తెచ్చే ఒక విజన్ తో కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం కట్టాడు. రేవంత్, సంజయ్ వంటి పిచ్చోళ్లకు ఇవన్నీ తెల్వవ్. ప్రాజెక్ట్ లో చిన్న సమస్య వేస్తే రిపేర్ చేయకుండా కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కరువు మీద కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్. మహానుభావులు ఎంపీలుగా గెలిచిన ఈ ప్రాంతం నుంచి బండి అడ్డిమారిగా గెల్చిండు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదు. దమ్ముంటే బండి సంజయ్ కరీంనగర్ కమాన్ దగ్గరకు రా. మా వినోద్ అన్న ఏం చేసిండో.. నువ్వేం చేసినావో తేల్చుకుందాం. బండి సంజయ్ ఓ సైకో లెక్క తిట్లు తప్ప చేసిందేమీ లేదు. శివలింగం మీద తేలులాగా పైన రాముడు కింద బండి సంజయ్. పొన్నంను మీ అమ్మకే పుట్టినావా అనే చిల్లరగాడు ఎంపీగా అవసరమా అంటూ సంజయ్ పై ఫైర్. బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ ఐతే కవితపై అసలు కేస్ ఎందుకు అయ్యేది..? కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేస్తే అది బీజేపీ గెలుపుకు కారణమవుతుందనేది అంతా గమనించాలి. ఎన్నికల తర్వాత రేవంత్ మరొక ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వాస్ శర్మ కాబోతున్నాడనేది గ్యారంటీ’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
కరీంనగర్ లోని ఆదర్శ నగర్ లో అగ్నిప్రమాదం
-
KNR: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాత్రి ప్రభుత్వ మతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన నిర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలా దేవిని ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు మంచం దగ్గర తన ఏడేళ్ల కొడుకును తండ్రి భర్త మనోజ్ రామ్ కాపాలా ఉంచారు. ఆ తర్వాత తమ పాప కనిపించడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అంతా వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పసికందు అపహరణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ లో కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు -
పెళ్లికి పిలుస్తలేరు.. చావుకు చెప్తలేరు!
మానకొండూర్ రూరల్: ఊరిలో ఆ కులానివి దాదాపు 50 గడపలు. శుభకార్యమైనా.. అశుభ కార్యమైనా అందరూ కలసికట్టుగా హాజరవుతారు. అయితే పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినలేదని, వారి తీర్పును తిరస్కరించారని కులం నుంచి ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఏడాదికాలంగా గ్రామంలో పెళ్లయినా, చావైనా వీరిని పిలవడంలేదు. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాదాసు సంపత్ కుటుంబానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.03 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి కొమురయ్య పేరున ఉంది. 2014లో సంపత్ తండ్రి కొమురయ్య మరణించాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అడప శ్రీనివాస్ ఆ భూమి విషయంలో సంపత్తో గొడవకు దిగాడు. స్థానిక కోర్టుకు వెళ్లడంతో తీర్పు సంపత్కు అనుకూలంగా వచ్చింది. దీంతో తమ భూమిని సాగు చేసేందుకు అతను వెళ్లాడు. అయితే.. అడప శ్రీనివాస్, సంపత్ను అడ్డుకుని.. దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో ఇరువురూ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరూ ఏడాది క్రితం గ్రామంలోని పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. వారు ఇరువర్గాలు రూ.50 వేలు డిపాజిట్ పెట్టాలని సూచించారు. సంపత్ తనవద్ద అంతమొత్తం లేవని, రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో తాము చెప్పినట్లు వినలేదని పంచాయితీ పెద్దలు సంపత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వారి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలోని తమ కులస్తులు ఏడాదికాలంగా తమను ఎలాంటి కార్యాలకు పిలవకపోవడంతో మనోవేదనకు గురవుతున్నట్లు సంపత్ కుటుంబం వెల్లడించింది. కుల బహిష్కరణ చేసిన 11 మంది పంచాయితీ పెద్దలపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయన ఇటీవల సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు. -
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం
కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం -
నేటి నుంచి ‘బండి’యాత్ర
కరీంనగర్ టౌన్: ‘మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఈ మహాయాగంలో మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నా.. ఆశీర్వదించండి’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యా త్రను విజయవంతం చేయాలని కోరారు. శనివారం ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రారంభమయ్యే తొలివిడత యాత్ర ఈనెల 15 వరకు కొనసాగనుంది. తొలిరోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కథలాపూర్ గ్రామాల్లో జరగనుంది. రాత్రి కథలాపూ ర్లో సంజయ్ బసచేస్తారు. తొలివిడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనం వాడతారు. గ్రామాల్లో మా త్రం పాదయాత్రగా ముందుకు సాగుతారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్మ్యాప్ రూపొందించారు. నియోజకవర్గం మొత్తం పర్యటించేలా రూట్మ్యాప్ ప్రజాహిత యాత్ర పేరిట కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసేలా ఇప్పటికే సంజయ్ రూట్మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మొదట కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి సంజయ్ తనయాత్రను ప్రారంభించనున్నారు. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి తంగళ్లపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.మీ. మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ మండలం కవర్ చేస్తూ.. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు యాత్రను కొనసాగించేలా షెడ్యూల్ను రూపొందించారు. -
జనారణ్యంలోకి ఎలుగుబంటి
మానకొండూర్ రూరల్: జనారణ్యంలోకి చొరబడిన ఎలుగుబంటి ఎనిమిది గంటలు హైరానా చేసి ఎట్టకేలకు బోనులో చిక్కింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్లోని చెరువుకట్ట సమీపంలో కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూరేందుకు యత్నించింది. కుక్కలు అరవడంతో ఇంటి పక్కనున్న వేపచెట్టు ఎక్కింది. ఇంటి యజమాని ఉదయం ఎలుగుబంటి అరుపులు విని, భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. గ్రామస్తుల సందడితో ఎలుగుబంటి చెట్టుదిగి చెరువు పక్కనున్న పొదల్లోకి దూరింది. పొదల్లో ఎలుగుబంటి కనిపించడంతో టపాసులు పేల్చి బయటకు రప్పించారు. అక్కడి నుంచి అది పంటపొలాల వెంట పరుగెత్తి సమీప ముంజంపల్లి గ్రామం వైపు వెళ్లింది. అటవీ అధికారులు మత్తు ఇంజక్షన్ను ఫైర్ చేయడంతో కిలోమీటర్ దూరం పరుగెత్తి పొలాల్లో సొమ్మసిల్లి పడిపోయింది. స్పృహ తప్పిన ఎలుగుబంటిని వలలో బంధించి వ్యాన్లో ఎక్కించి వరంగల్కు తరలించారు. -
ఎలుగుబంటి హల్చల్.. టెన్షన్లో ప్రజలు..!
-
ఇంటింటికీ ‘అయోధ్య’ చిత్రపటాలు
హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఇంటికే అయోధ్య రామయ్య రానున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును.. ఎంపీ బండి సంజయ్కుమార్ లోక్సభ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు రాములోరి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు తమ ఇళ్లల్లోనే స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? వారిలో రామయ్యను కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు. మొత్తం 5 లక్షల కుటుంబాలకు పైగా ఉండగా.. వాటిలో నాలుగు లక్షలకు పైగా కుటుంబాలు హిందువులని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, 4.21 లక్షల అయోధ్య రాముని చిత్రపటాలను తయారు చేయించే పనిలో ఎంపీ నిమగ్నమయ్యారు. ఇప్పటికే లక్షకు పైగా సిద్ధమవడంతో ఇంటింటికీ చేరవేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంజయ్ మంగళవారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. -
కారుచౌక జర్నీ
నగరానికి చెందిన అఖిల్ అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాలి. బస్సుల్లో రద్దీ చాలా ఉంది. రిజర్వేషన్లోనూ సీట్లు లేవు. వెంటనే తన వద్ద ఉన్న ఓ కార్పూలింగ్ యాప్ ఓపెన్ చేసి, సీటు బుక్ చేసుకుని రాజధానికి వెళ్లిపోయాడు. బదిలీల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు సైతం నలుగురు లేదా ఐదుగురు ఎంప్లాయీస్ కలిసి కార్ పూలింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే ఆఫీసులో పనిచేయడం, కారు అయితే స్టాపుల్లేకుండా నేరుగా ఆఫీసుకే వెళ్లే వీలుండటంతో కార్ పూలింగ్కు మొగ్గు చూపుతున్నారు. అద్దెకారు జర్నీ ఖరీదైంది. ఇద్దరు కలిసి కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే రూ.5వేలకు తక్కువ ఖర్చవడం లేదు. పెరిగిన ఇంధన ధరలు, ఖర్చుల నేపథ్యంలో అంతకన్నా తక్కువ తీసుకుంటే తమకు గిట్టుబాటు కాదని చెప్పేస్తున్నారు. బస్సుల్లో రద్దీ, సమయం వృథా, సిటీలో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో సరే అని వెళ్లిపోతున్నారు. అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారు ప్రయాణాన్ని చౌకకే అందిస్తోంది. కార్ పూలింగ్కు కొన్నియాప్లు అందుబాటులో ఉండగా ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు కార్ పూలింగ్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ధరకే షేరింగ్ జర్నీ చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. కారు నిర్వాహకులకు సైతం ఇం‘ధన’ం ఆదా అవుతోంది. అసలేంటీ కారు‘చౌక’ జర్నీ అనుకుంటున్నారా..? చదవండీ సండే స్పెషల్..!! సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కార్ పూలింగ్ కల్చర్ పెరిగిపోతోంది. పెరిగిన రద్దీ కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఈ విధమైన ప్రయాణానికి పెద్దపీట వే స్తున్నారు. జిల్లాకేంద్రాలైన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల నుంచి ప్రతిరోజూ రాజధానితో పాటు వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని, నిజా మాబాద్ ఇలా ఏ ప్రాంతానికై నా కార్ పూలింగ్కే జై కొడుతున్నారు. హైదరాబాద్, వరంగల్ తరువాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాదిమంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చైన్నె తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, కార్పొరేట్ తదితర మల్టీనేషనల్ కంపెనీల్లో కొలువు చేస్తున్నారు. వారాంతానికి ఉమ్మడి జిల్లాకు రావడం, తిరిగి సోమవారం ఉదయానికి వారి ఉద్యోగస్థానాలకు వెళ్లడం రివాజుగా మారింది. దీనికితోడు ప్రతిరోజూ కోర్టు కేసులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, రకరకాల అవసరాల రీత్యా రాజధానికి వెళ్లేవారి సంఖ్యకు లెక్కేలేదు. ఓనర్, రైడర్కు మేలు ఈ యాప్లు కార్లు లేని వారికి మాత్రమే కాదు సొంత వాహనాలు ఉన్న వారికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజూ చాలామంది ఉమ్మడి జిల్లాకు వివిధ పనులు, పండగలు, సెలవులకు వచ్చి, కుటుంబ సభ్యులను దింపి తిరిగి ఒంటరిగా వెళ్తుంటారు. అంటే గంటల కొద్దీ ప్రయాణం ఒంటరిగా చేయాలి. అదే సమయంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కొలీగ్స్ రానప్పుడు ఈ యాప్స్ను ఆశ్రయిస్తున్నా రు. పెట్రోల్ ఖర్చు ఆదా కోసం బ్లాబ్లాకార్, క్విక్రైడ్ యాప్లో రైడ్ వివరాలు పోస్టు చేస్తున్నారు. క్షణాల్లో కారు ఖాళీ సీట్లు నిండిపోతున్నాయి. ఓనర్ ఆర్టీసీ చార్జీలే తీసుకుంటుండడం, అతనికి ప్రయాణంలో టైంపాస్.. పైగా పెట్రోల్ చార్జీలు కలిసొస్తున్నాయి. నచ్చిన చోట పికప్.. డ్రాప్ ఈ యాప్తో మరో సదుపాయం ఏంటంటే.. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లినప్పుడు ముందు రైల్వేస్టేషన్/బస్టాండ్లో దిగుతాం. అక్కడి నుంచి మనం అనుకున్న స్థానాలకు వెళ్లాలంటే క్యాబ్లకు రూ.200, 300 పెట్టాలి. ట్రాఫిక్తో గంటలపాటు ఇరుక్కుపోతుంటారు. కానీ, ఈ యాప్ ద్వారా ఓనరు ప్రయాణించే మార్గంలో మనకు నచ్చిన చోట దిగవచ్చు. ఉదా: నిమ్స్ వెళ్లాలనుకుంటే మెహదీపట్నం వెళ్లే కారును ఎంచుకోవచ్చు. హైటెక్ సిటీ వెళ్లాలనుకుంటే కొండాపూర్ వెళ్లే కారును సెలెక్ట్ చేసుకుని, అక్కడే దిగిపోవచ్చు. చాలా కార్లు ఓఆర్ఆర్ మీదుగా వెళ్తుండటంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. సమయానికి చేరుకోవచ్చు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కార్ పూలింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోని ప్రయాణించడం ద్వారా సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా గమ్యానికి అనుకున్న సమయంలోనే చేరుకునే వెసులుబాటు ఉంది. వివిధ వ్యాపారాల రీత్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కార్ పూలింగ్ యాప్ను ఎక్కవగా వినియోగించుకుంటున్నారు. – శనిగరపు రవీందర్, ప్రభుత్వ ఉద్యోగి టోల్గేట్ల వద్ద తాకిడి పాత జిల్లాలో రెండు ప్రధాన టోల్గేట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద కాగా, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ వద్ద రెండోది ఉంది. ఈ టోల్గేట్ల మీదుగా ప్రతీరోజూ రాకపోకలు సాగించే కార్ల వివరాలు (కిలోమీటర్లలో) ఇలా ఉన్నాయి. టోల్గేట్ హైదరాబాద్ వైపు హైదరాబాద్ నుంచి రేణిగుంట 5,500 సుమారు 5,000 సుమారు బసంత్నగర్ 1,500 సుమారు 1,100 సుమారు ఉమ్మడి జిల్లాలో కార్ల సంఖ్య ఇలా.. జిల్లాలో కార్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బ్యాంకుల సులభ వాయిదా రుణాలు, మార్కెట్లోకి కొత్త కార్లు వస్తుండటం, కరోనా తరువాత భౌతిక దూరానికి ప్రాధాన్యం పెరగడంతో సెకండ్హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా ఊపందుకుంది. ఇందుకు ఉమ్మడి జిల్లాలో రిజిష్టర్ అయిన కార్ల వివరాలే నిదర్శనం. కరీంనగర్: 47,023 సిరిసిల్ల: 11,911 జగిత్యాల: 12,824 పెద్దపల్లి: 10,400 -
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత
-
కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
సాక్షి, కరీంనగర్: కేసీఆరే సీఎం అనుకుంటూ కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నాడని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. పదేళ్లు అబద్ధాలతో మోసం చేస్తూ కాలం గడిపారని దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో బీఆర్ఎస్కు మూడోస్థానం. కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారో కేటీఆర్ చెప్పాలి. యాదిగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత కేసీఆర్ది. కేసీఆర్ కొడుకుతోనే పార్టీ భ్రష్టుపట్టింది’’ అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పక్క జిల్లా నుంచి ఓ మేధావి ఇక్కడికొచ్చి మొరుగుతుంటడంటూ మాజీ ఎంపీ వినోద్పై మండిపడ్డారు. వినోద్ టిప్పర్ లోడు దరఖాస్తులు పంపడం తప్ప.. కరీంనగర్లో ఒక తట్టెడు మట్టి కూడా పోయలే అంటూ ఆయన ఎద్దేవా చేశారు. సిద్ధిపేట ఎల్కతుర్తి రోడ్డు పనులు ఎవరు చేయించారు? మేధావి వినోదా.. నేనా..?. శాతవాహన యూనివర్సిటీకి 12 బీ గుర్తింపు తెచ్చింది నేను కాదా..?’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్నాథ్ షిండే రేవంత్రెడ్డినే అవ్వొచ్చని అన్నారు. తెలంగాణ ప్రజలు మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ వైపు చూసే మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీని ఓడించేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. ఆయన బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, చాలా చోట్ల బీఆర్ఎస్పై గెల్చిన ఎమ్మెల్యేలంతా కేవలం నాలుగైదుసార్లు ఓడిపోయిన సానుభూతితో మాత్రమే గెల్చారని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చాలా చిన్న దెబ్బ మాత్రమేనని, అయినా ప్రజులు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. చాలా స్వల్ప మెజార్టీతో 14 స్థానాలను కోల్పోయామని అన్నారు. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్లో కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లదని తెలిపారు. తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్ అని చెప్పారు. 2009లో అల్గనూరులో అగ్గిపుట్టించి తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పారు. రేవంత్రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ, ఇవాళేంటి పరిస్థితి? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారు, బిల్లులు కట్టొద్దని మంత్రి వెంకట్ రెడ్డి అన్నరని గుర్తుచేశారు. దాన్నే తాను చెప్పుకొచ్చానని అన్నారు. వంద అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయాలంటారు.. అలా అబద్ధాలను నమ్ముకునే రేవంత్ సీఎం, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. వాళ్లవన్నీ 420 హామీలని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేసేందుకు అనుభవముందా అని అడిగితే రేవంతేమన్నాడు? అదేం ఉంది అన్నారు. ఇప్పుడు తెలుస్తోంది అనుభవం ఎంత అవసరమో? అని కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధు పేరు మార్చి రైతుభరోసా అని రేవంత్రెడ్డి దావోస్లో చెప్పారని విర్శించారు. మరి రైతుబంధు వచ్చిందా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రైతుబంధు పడలేదంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పుతో కొడతానన్నాడు. మరి రైతుబంధు రాని రైతులు ఇప్పుడు ఆలోచించాలి. వారిని చెప్పుతోని కొట్టాలా? లేదా ఓటుతోని కొట్టాలా అనేది ఆలోచన చేయాలన్నారు. చదవండి: ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు! -
నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. కారణం ఇది..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్ల అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భూ కబ్జాలకు సంబంధించిన కేసులో భాగంగానే వారికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కరీంనగర్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18వ డివిజన్కు చెందిన సుధగోని కృష్ణాగౌడ్, 21వ డివిజన్కు చెందిన జంగిల్ సాగర్, 41వ డివిజన్కు చెందిన భూమాగౌడ్ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పటికే భూ కబ్జా కేసులో 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములుతో పాటు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక.. తోట రాములు, చీటీ రామారావును ఇప్పటికే 24 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తోట రాముడు, చీటి రామారావుపై హైదరాబాద్ ప్రజాదర్బార్లో రాజిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన రెండు గుంటల భూమిని కబ్జా చేసి, హద్దులు మార్చాలంటూ 2019 నుంచి పోరాటం చేస్తున్నట్టు రాజిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు. రాజిరెడ్డితో సుమారు 120 మంది నుంచి భూ అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ భూ కబ్జాలు, ఫైనాన్షియల్ అఫెన్సెన్పై పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి విచారణ చేపట్టారు. మరోవైపు కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. -
ఒకే ఆధార్, పాన్కార్డు.. పాస్పోర్టులెన్నో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల: తీగ లాగితే పాస్పోర్టుల డొంకంతా కదులుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలోనే ఈ రాకెట్కు ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు రోహింగ్యాలు విదేశాలకు వెళ్లారన్న విషయాన్ని గుర్తించిన సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారికి పలు నిర్ఘాంతపోయే విషయాలు తెలుస్తున్నాయి. స్థానికులు, విదేశీయులు అన్న తేడా లేకుండా.. ఎవరికి పాస్పోర్టులు కావాలన్నా.. కేవలం కొన్నిరోజుల్లోనే వచ్చేలా చేయడంలో వీరిది అందెవేసిన చేయి. ఇప్పటివరకూ 92 మందిని దేశం దాటించగలిగారు. ఇలా వెళ్లిన వారిలో విదేశీయులు ఉండటంతో విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైగా ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరించారన్న విషయాన్నీ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. నాంపల్లి టు జగిత్యాల ఈ రాకెట్కు నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారి. ఇతను నాంపల్లిలోని బడే మజీదు వద్ద నివసించే ఇతను డీటీపీ గ్రాఫిక్స్లో సిద్ధహస్తుడు. ఈ పనితోపాటు పాస్పోర్టు బ్రోకర్గాను పనిచేసేవాడు. నకిలీ విద్యార్హతలు, ఆధార్, పాన్కార్డు ఇలా కీలక నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్పోర్ట్లకు కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. ఈ గ్యాంగ్ వద్ద దగ్గర దొరకని పత్రం అంటూ ఏదీ ఉండదు. విద్యార్హత, ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా నిమిషాల్లో రెడీ చేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో వీరి పని మరింత సులువై, పాస్పోర్టులు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్పోర్టుల్లో అత్యధిక పాస్పోర్టులకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నంబరు ఉండటంతో విషయం వెలుగుచూసింది. ఈసీఎన్ఆర్ కేటగిరీలోనే.. ఇమిగ్రేషన్లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్ఆర్ (ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్) కేటగిరీలోనే పాస్పోర్టులు ఇప్పించారు. ఇందుకు వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. చాలా పాస్పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నంబరునే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేసిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేసి, ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్పోర్ట్ యాక్ట్తోపాటు పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏజెంట్లు రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్వర్క్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి (హైదరాబాద్)కి చెందినవాడు కాగా.. మిగిలిన మహ్మద్ ఖమ్రుద్దీన్, చాంద్ఖాన్, దేశోపంతుల అశోక్ రావు (కోరుట్ల), పెద్దూరి శ్రీనివాస్ (తిమ్మాపూర్, కరీంనగర్), గుండేటి ప్రభాకర్ (జగిత్యాల), పోచంపల్లి దేవరాజ్ (వేములవాడ, సిరిసిల్ల), అబ్దుల్ షుకూర్ (రాయికల్, జగిత్యాల). వీరంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా కలిసి ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు..? ఎంతమంది విదేశీయులకు పాస్పోర్టులు ఇప్పించారు..? అన్న విషయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు కెనడా, మలేసియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్లాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు..? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు..? అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పదేళ్ల తర్వాత మళ్లీ... 2014లోనే డబుల్ పాస్పోర్ట్లు, వాటికి అవసరమైన నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో కోరుట్లకు చెందిన ఖమరోద్దీన్, అశోక్రావు, చాంద్పాషాపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. శుక్రవారం సీఐడీ అధికారుల దాడులతో వీరంతా పాస్పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది. -
భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల
సాక్షి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెరుగుతుండటంతో ఇక్కడి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్న కార్పొరేటర్లను ఉద్దేశించి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందంటూ కార్పొరేటర్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తనతో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మారిపోతారంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈనెల 24వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో కేటీఆర్ భేటీ అవుతారని గంగుల చెప్పారు. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంఐఎం బీఆర్ఎస్తోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్యే సీట్లలో పెద్ద తేడా లేదని, బీజేపీ, ఎంఐఎంను కలుపుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదీచదవండి.. కళ్యాణ కానుకేది..? -
కరీంనగర్ పందెం కోడి వేలంలో ట్విస్ట్..
సాక్షి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. మూడు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని వేలం ముందు ట్విట్ నెలకొంది. కోడి వేలం పాటను ఆపాలంటూ ఓ వ్యక్తి.. ఆర్టీసీ డిపో అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఆ పందెం కోడి తనదేనని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మహేష్ అనే వ్యక్తి తెలిపాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అతడు సిరిసిల్లలోని రుద్రంగి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. బంధువులు ఇచ్చిన పందెం కోడిని తీసుకొని రుద్రంగి నుంచి మహేష్ నెల్లూరుకి వెళ్తూ ఉండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్ చేరుకోగానే నిద్రమత్తులో బస్సు దిగి పోయానని తెలిపాడు. తన వెంట కోడి లేదన్న విషయాన్ని గ్రహించి వెంటనే బస్సు వద్దకు వెళ్లగా.. అప్పటికే బస్సు వెళ్లిపోయిందని బాధితుడు చెప్పాడు. ఆర్టీసీ అధికారులు పందెం కోడిని వేలం పాట వేస్తున్నారని తెలవడంతో ఆ కోడి తనదేనంటూ చెప్పాడు. అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు ఈ లోపు కోడి తనదేనంటూ ఓ వ్యక్తి రావడంతో మరి దానిని అతనికి అందిస్తారో లేదో అనేది తెలియాల్సి ఉంది. -
బస్సులో కోడిపుంజు మర్చిపోయిన ప్రయాణికుడు.. అధికారులు ఏం చేశారంటే!
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్లో మర్చిపోయిన కోడిపుంజును డిపో అధికారులు జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అయితే మూడు రోజులుగా కోడింపుజును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోడంతో తాజాగా అధికారులు దానిని వేలంపాట వేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం కోడిపుంజును వేలం వేయనున్నట్లు, ఆసక్తిగలవారు పాల్గొనాలని కరీంనగర్-2 డిపో మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. జనవరి 9న వరంగల్ నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వేములవాడ వెళ్లింది. అక్కడ ప్రయాణికులను దించేసి తిరిగి కరీంనగర్ డిపోకు చేరుకోగా బస్సులో కోడిపుంజు ఉండటాన్ని డ్రైవర్, కండక్టర్ గుర్తించాడు. ఓ ప్రయాణికుడు సంచిలో ఉన్న కోడిపుంజును మరిచిపోయినట్లు తెలుసుకొని దానిని కంట్రోలర్కు అప్పగించారు. కోడిపుంజును డిపోలోని 2డిపో భద్రత విభాగం ఆర్టీసీ అధికారులు ఓ జాలిలో బంధించారు. మూడు రోజుల నుంచి బస్టాండ్ డిపోలోనే కోడిపుంజు బంధీగా ఉంటుంది. అయితే పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో దానిని వేలం వేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు కరీనంగర్-2 డిపో మేనేజర్ పేరిటా పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 12న మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజుకు సంబంధించి కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు, ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని తెలిపారు. చదవండి: పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం? -
బీఆర్ఎస్లో దడ మొదలైంది: మంత్రి పొన్నం
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులవుతుంది. గ్యారంటీ స్కీమ్లపై దరఖాస్తులు స్వీకరించాం. చిత్తశుద్ధితో అమలు చేస్తాం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జెన్ కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలి. భూ అక్రమార్కులపై చర్యలు చేపడుతాం’’ అని మంత్రి హెచ్చరించారు. ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా?: మాజీ ఎంపీ వినోద్
సాక్షి, కరీంనగర్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపేరు ఒకటైతే బంధువులు అవుతారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ తనపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సీరియస్ అయ్యారు. కాగా, వినోద్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జెన్కో ప్రభాకర్రావు ఉద్యోగం ఇచ్చిన బోయినపల్లి సరితకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారు. ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా?. అలాగైతే ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?. నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడూ తప్పులను ప్రోత్సహించలేదు. చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పను. బండి సంజయ్ కావాలనే నాపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం ఆపాలి. ఆ అమ్మాయి నా బంధువు అని రుజువు చేయగలరా?’ అని ప్రశ్నించారు. -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చీకటి వస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అధికారంలో ఉండగా పొరపాట్లు, లోటు పాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, ప్రభు త్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని కొంతనిర్లక్ష్యం చేశామని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కా దని, పది పదిహేనేళ్లు కాకపోతే 20 ఏళ్లకైనా పదవి నుంచి దిగాల్సిందేనని, అదే జీవితమని వ్యాఖ్యా నించారు. శాసనసభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించిందని, మన పార్టీ యంత్రాంగం కూడా సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం తెలంగాణ భవన్లో కరీంనగర్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి పునర్జన్మనిచ్చింది కరీంనగరే ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలి. ప్రత్యర్థి పార్టీలు సాగించే దుష్ప్రచారాలను ఎప్పటి కప్పుడు దీటుగా తిప్పికొట్టాలి. విద్యార్థి, యువ జన, మైనార్టీ సమ్మేళనాలతో పాటు సోషల్ మీడియా టీం సమావేశం నిర్వహించాలి. వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. ప్రతి ఓటు కీలకం. కాబట్టి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ నేతలపై ప్రజలకు విశ్వాసం లేదు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదమే 23 ఏళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం. పార్టీకి జన్మనిచ్చి, కష్టకాలంలో పునర్జన్మ నిచ్చింది కూడా కరీంనగరే. కేసీఆర్ను ఉద్యమ సమయంలో కాపాడుకుని, తెలంగాణను సగర్వంగా నిలిపింది కూడా కరీంనగరే..’ అని కేటీఆర్ కొనియాడారు. ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పదేళ్లు అకుంఠిత దీక్షతో పనిచేశాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాం. రెండుసార్లు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు తలెత్తుకునే పనులే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేశారు తప్ప తలదించుకునే పని చేయలేదు. ప్రభుత్వం, పార్టీ వేరు కాదనే ఉద్దేశంతో పనిచేశాం. సంస్థాగత నిర్మాణంపై అంతగా దృష్టి పెట్టలేదు. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలకు జిల్లా అధ్యక్షులను నియమించినా, పూర్తి కమిటీలు వేయలేదు. అనుబంధ కమిటీల నిర్మాణం చేయలేకపోయాం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కార్యకర్తలకు పనులు ఇవ్వలేదు. పనులిస్తే దుష్ప్రచారం చేస్తారని భావించామే తప్ప, చిన్న చూపుతో కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సర్పంచ్ మొదలుకొని అన్ని పదవుల్లో బీఆర్ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ, మనోడు గెలవాలనే కసితో పని చేయలేదు. ఇతర పార్టీల్లో నలుగురైదుగురే ఉన్నా కసితో పని చేశారు. అందుకే వారు విజయం సాధించారు..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరికీ భయపడొద్దు ‘నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్లు గర్వంతో విర్రవీగుతారు. కొత్త బిచ్చగాళ్ల తీరుగా పట్టించుకోవద్దు. కేసుల పేరుతో బెదిరించినా భయపడొద్దు. మేము అండగా ఉంటాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పోలింగ్ ఏజెంట్లను కూడా ప్రభావితం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్లోని ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను చూస్తే ఇతర పార్టీల కన్నా బీఆర్ఎస్కే అధిక్యం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఎక్కువ వేయిస్తే లక్ష ఓట్లతో విజయం సాధిస్తాం. ప్రశ్నించే గొంతుక వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. మాజీమంత్రి హరీశ్రావు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఎంపీ కె.కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి ఎన్నికల సన్నద్ధత విషయంలో పార్టీ వ్యూహాన్ని వివరించారు. -
TS: కరోనా కలకలం.. రెండు జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో పాజిటివ్ కేసుల కలకలం చోటుచేసుకుంది. రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నలుగురికి పాజిటివ్గా తేలింది. రేకుర్తికి చెందిన ఓ మహిళకు, 18 నెలల బాలుడికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక, మహబూబ్నగర్ జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు ఇప్పటి వరకు 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్కు సంబంధించినవిగా గుర్తించారు. -
మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. వీడియో వైరల్
సాక్షి, కరీంనగర్: ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. నియోజకవర్గంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు న్యూ ఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిలిపి చేష్టలు. pic.twitter.com/wvyvurebqp — Telugu Scribe (@TeluguScribe) January 2, 2024 కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సత్యనారాయణ చిలిపి చేష్టలు చేశారు. కేక్ కటింగ్ సందర్భంగా అక్కడున్న మహిళా కార్యకర్త ముఖానికి ఆయన కేక్ పూయగా, ఆమె పక్కకు తప్పుకుంది. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను పక్కకు జరిపి మరీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆ మహిళా కార్యకర్తకు కేక్ పూశారు. దీంతో సదరు మహిళ కాస్తా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మానకొండూరు ఎమ్మెల్యేపై నెటిజన్లు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కాంగ్రెస్ నాయకుల అసలు నైజం...! సభ్య సమాజం తలదించుకునేలా మహిళతో మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ అసభ్య ప్రవర్తన. దేశం మొత్తం నీతులు బోధించే ప్రియాంక గాంధీకి ఈ విషయం పట్ల స్పందించే ధైర్యం ఉందా...? pic.twitter.com/4wwNVCO9Qb — Sumiran Komarraju (@SumiranKV) January 2, 2024 -
కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చే దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు త్వరలో అందిస్తామన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాపాలన, గ్రామసభల నిర్వహణపై జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఉమ్మడి జిల్లా అధికారులందరూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ స్వీకరించాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించరాదని తెలతిపారు. ప్రజా పాలన, ఆరు గ్యారంటీల విషయంలో అధికారులు ఏమైనా సందేహం ఉంటే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన తమ ప్రభుత్వం పూర్తి పారదర్శక పాలన అందిస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మెడిగడ్డ అన్నారం వైఫల్యాలపై 29వ తేదీన పరిశీలన కోసం వెళ్తున్నామని, పరిశీలన అనంతరం విచారణ చేయిస్తామన్నారు. జిల్లాలో రైస్ మాఫియా నడుస్తుందని, వారిని వెంటనే అపాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ వెళ్ళాలి అన్నదే మా ప్రభుత్వ ద్వేయమని తెలిపారు. చదవండి: ఆరు గ్యారంటీలకు ‘రేషన్ కార్డు’ మస్ట్: సీఎం రేవంత్ -
తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసుల కలకలం
-
TS: కొత్త వేరియంట్ కలకలం.. నర్సుకు పాజిటివ్!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా పాజిటివ్ కేసులు జిల్లాల్లో సైతం నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో, వారికి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ కలకలం చోటుచేసుకుంది. కొత్త వేరియంట్ జేఎన్-1కు సంబంధింంచి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక ఆసుపత్రి నర్సు, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళకు పాజిటివ్గా తేలింది. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారి శాంపిల్స్ను జీనోమ్ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. వారి సన్నిహితుల సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ నగరంలో 9, కరీంనగర్లో ఒక్క కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి ఒకరు కోలుకున్నారు. మరో 55 మంది ఐసోలేషన్లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్ సూచించారు. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్లో ఉన్నారు. యాదమ్మ కుటుంబసభ్యులు భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఇంట్లోనే ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారు. -
IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్!
ముస్తాబాద్(సిరిసిల్ల): క్రికెట్ అండర్–19 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికై , సంచలనం సృష్టించాడు 18 ఏళ్ల ఎరవెల్లి అవనీష్రావు. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుకు ఆడబోతున్నాడు కూడా! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవనీష్రావును.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది. దుబాయ్లో గత మంగళవారం జరిగిన ఐపీఎల్-2024 వేలంలో అతడిని సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసులో ఆట ప్రారంభం వికెట్ కీపర్గా, లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్గా రాణిస్తున్న అవనీష్రావు.. నెల రోజుల వ్యవధిలో ఆసియా కప్, ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ట్రై సీరిస్తోపాటు.. జనవరి 19 నుంచి జరగనున్న అండర్–19 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐపీఎల్లో పెద్ద జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడు పోతుగల్కు చెందిన ఎరవెల్లి బాలకిషన్రావు సబ్రిజిస్ట్రార్గా రిటైరయ్యారు. ఆయన కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ లక్ష్మణ్రావు–సుష్మ దంపతుల కుమారుడు అవనీష్రావు బాల్యం హైదరాబాద్లోనే గడిచింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించగా తండ్రి ప్రోత్సహించారు. నిత్యం జింఖానా మైదానంలో 10 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడు. పాఠశాల చదువు సమయంలోనే అవనీష్రావు హైదరాబాద్ అండర్–14, 16కు ఎంపికయ్యాడు. హెచ్సీఏ సైతం అతని ప్రతిభ చూసి, చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బీసీసీఐ దృష్టిలో పడగా, అండర్–19 భారత జట్టుకు ఎంపిక చేసింది. తక్కువ వయసులో క్రికెట్లో రాణిస్తున్న అవనీష్రావు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ స్ఫూర్తి.. చిన్నప్పటి నుంచి తనకు ఆడమ్ గిల్క్రిస్ట్ అంటే ఇష్టమని అవనీష్రావు తెలిపాడు. ఎడమ చేతివాటంతో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో.. తాను కూడా అలా కావాలనుకున్నానని తెలిపాడు. తాను మొదట హైదరాబాద్లోని హిందూ మహావిద్యాలయలో చేరి, కోచ్ చందు ఆధ్వర్యంలో ఆటపై పట్టు సాధించానని, అనంతరం ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అకాడమీలో చేరి, మరింత రాటుదేలినట్లు తెలిపాడు. పలు టోర్నీల్లో అవకాశాలు వచ్చాయని, అండర్–19 వరల్డ్ కప్కు ఎంపికవ్వాలనే లక్ష్యంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేశానన్నాడు. తన లక్ష్యం భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడమేనని పేర్కొన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్న్యూస్!.. కెప్టెన్ దూరం! -
కరీంనగర్: ముసలమ్మ నాకొద్దు!
నవ మాసాలు మోసి కనాలి. పాలిచ్చి పెంచాలి. అడిగివన్నీ చేసి పెట్టాలి. అపురూపంగా చూసుకోవాలి. కానీ, వయసు మీద పడితే.. ఆ తల్లి భారమైపోతుందా?.. అలాగే అనుకున్నాడు ఇక్కడ ఓ కొడుకు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోలేనంటూ చలిలో రోడ్డు పక్కన పడేశారు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్తతోపాటు పెద్ద కొడుకు రాజయ్య, ఓ కూతురు కొన్నాళ్ల కిందట చనిపోయారు. వయసు పైబడడంతోపాటు ఇళ్లు పాడుబడి పోయింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకుల కుటుంబాలు వంతులవారీగా లచ్చమ్మను చూసుకుంటూ వస్తున్నారు. రాజయ్య కుటుంబం మహారాష్ట్రంలో ఉంటోంది. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్ తీసుకొచ్చి దిగబెట్టింది. అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చిన్న కొడుకు కుటుంబం అడ్డుకుంది. రాజయ్య కొడుకు వెళ్లిపోయే దాకా చూసి.. ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేశాడు. చలిలో రోడ్డు మీద వణుకుతూ కనిపించిన లచ్చమ్మను స్థానికులు చూశారు. డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు చిన్న కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే యత్నం చేశారు. కానీ, అతను ముసలి అమ్మ వద్దంటూ కరాకండిగా చెప్పేశాడు. కావాలంటే పాత ఇంట్లో ఆమె ఉండొచ్చని.. తిండి కావాలంటే అక్కడికే తీసుకెళ్లి ఇస్తానని చెప్పాడు. దీంతో.. చేసేది ఏం లేక ఆ 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు ఆమె పాత ఇంటి వద్ద దిగబెట్టారు. -
కరీంనగర్-తిరుపతి రైలు: ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో నాలుగు రోజులపాటు నడవనుంది. కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ చొరవతో ఇది సాధ్యమైంది. అయితే, బండి సంజయ్ ఈరోజు ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణీకులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను సమీక్షించిన అనంతరం రెండు, మూడు రోజుల్లో ఏయే రోజు రైలును నడపాలనే దానిపై ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్-హసన్పర్తి రైల్వేలైన్.. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్-హసన్పర్తి కొత్త రైల్వేలైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వేలైన్ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జమ్మికుంటలో ఆగనున్న ఎక్స్ప్రెస్ రైళ్లు! ఇక, రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం వ్యాపారులు, సామాన్య ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారి సౌకర్యార్థం పలు ఎక్స్ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్లో ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సంజయ్ కోరారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నుండి వెళ్లే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్(12590-89), యశ్వంతపూర్ నుండి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (12592-91 ), హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ (12723-23), సికింద్రాబాద్ నుండి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ (12791-92), చెన్నై నుండి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ (12656-55) రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంటలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అల్లుడయ్యాడు!
సాక్షి, కరీంనగర్ జిల్లా: ప్రేమకు హద్దులు కుల, మత ప్రాంత, భాష బేధాలు ఏమీ ఉండవని నిరూపించింది. ఈ జంట దేశాలు వేరైనా ప్రేమించుకొని పది సంవత్సరాల తర్వాత గురువారం అలుగునూర్లో ఒక్కటయ్యారు.. వివరాలలోకి వెళితే... కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్కు చెందిన దాసం అరుణ్ కుమార్ తిమ్మాపూర్లోని జ్యోతిశ్మతి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ 2014లో ఇద్దరు ఒకరి ఒకరు పరిచయమయ్యారు. ఇలా వారి మధ్య ప్రేమ మొదలై ఇద్దరు మనసులు కలిశాయి. తల్లిదండ్రులు కూడా వారి ప్రేమకు అంగీకరించడంతో అజ్జురా శ్రీలంక నుండి తల్లిదండ్రులతో అలుగునూర్ వచ్చారు. అరుణ్ కుమార్ పెళ్ళి అజ్జురాతో పెద్దల సమక్షంలో గురువారం అంగరంగ వైభోగంగా వివాహ వేడుక జరిగింది. ఇదీ చదవండి: TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్? -
సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ.. కేసీఆర్పై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. కాగా, సీఎం రేవంత్కు రాసిన లేఖలో బండి సంజయ్..‘ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మిడ్ మానేరు ప్రాజెక్టును ప్రారంభించింది. లక్షలాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూములు త్యాగం చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12 వేల 500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005-06లో నాటి ప్రభుత్వం చేపట్టిన జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇండ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. అయితే వీటి అమలులో మాత్రం తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్(మాజీ ముఖ్యమంత్రి) ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇండ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు. 12 గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో వారికి నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం 2015 జనవరి నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామని చెప్పారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు (రేవంత్ రెడ్డి), నేను (బండి సంజయ్) హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి మీరు తక్షణమే పెంచిన ఇండ్ల నిర్మాణ పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం. అదే విధంగా 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు సైతం ప్యాకేజీని వర్తింపజేయాలి. అదే సమయంలో ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని, అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం: గంగుల కమలాకర్
-
ఆ 32 నియోజకవర్గాల్లో.. గల్ఫ్ కార్మికులు, చెరకు రైతులది కీలకం
చెరకు సాగు.. నిజాం షుగర్స్ సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని తారుమారు చేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్ రాసిచ్చిన నేపథ్యంలో ఎంపీగా ప్రజలు పట్టం కట్టారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదనే చెప్పాలి. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స్ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో (మొత్తం 32 నియోజకవర్గాలు) సుమారు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో గల్ఫ్కు వలస వెళ్లారు. ఈ కార్మిక కుటుంబాలు తమ సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ(స్వతంత్ర), వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్ నుంచి స్వదేశ్ పరికిపండ్ల, ధర్మపురి నుంచి భూత్కూరి కాంత, కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాసరావు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. గల్ఫ్ జేఏసీ నాయకులు గల్ఫ్ దేశాల్లో పర్యటించి వలస కార్మికులతో సమావేశమై ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా గల్ఫ్యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్ మృతుల విషయంలో మాత్రం వివక్ష కనిపిస్తోందన్న విమర్శ ఉంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆ కార్మికులు చెబుతున్నారు. నిజాం షుగర్స్ అంశాన్ని సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. తాము గెలిస్తే నిజాం షుగర్స్ యూనిట్లను తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో చెరకు రైతులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి. చెరకు పంట విస్తీర్ణం పెంపు విషయమై రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంగనర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం ప్రకటించారు. గల్ఫ్ బోర్డు ద్వారానే సమస్యలు పరిష్కారం.. గల్ఫ్ బోర్డు ద్వారానే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. వలస కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. గల్ఫ్ ప్రవాసులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. గల్ఫ్ ప్రవాసుల ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు లభిస్తోంది. – మంద భీమ్రెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలి.. ఏళ్ల తరబడి చెరకు పంట పండిస్తున్నాం. మా ప్రాంత భూములు చెరకు పంటకు అనుకూలమైనవి. ఈ సీజన్లోనూ 5 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాను. బోధన్ నిజాం షుగర్స్ను మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని మూసినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్స్కు తరలించి అమ్ముతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తే మాకు మేలు కలుగుతుంది. కొత్త ప్రభుత్వం నిజాం షుగర్స్నూ పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నాం. – పల్లె గంగారాం, రైతు, హున్స గ్రామం, సాలూర మండలం -
పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్కు సినిమా చూపిస్తారు: మోదీ
సాక్షి, కరీంనగర్: పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని చెప్పారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారే సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యన్నతి బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కరీంనగర్ షోడశమహాజనపదాల్లో ఒకటిగా ఉండేదని ప్రధాని మోదీ చెప్పారు. పదేళ్ల పిల్లల్ల భవిష్యత్ కోసమే తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తారు.. అలాగే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేయాలని కోరారు. కరీంనగర్ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. దేశం కోసమే ఓటు వేయాలంటే అది బీజేపీకి మాత్రమే ఓటేయాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గమనించినట్లు మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ జరిగింది? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమని వెల్లడించారు. కాంగ్రెస్కు ఓటేయడమంటే అది బీఆర్ఎస్కేనని ప్రజలు గుర్తించాలని చెప్పారు. కేసీఆర్ను వద్దనుకుంటే కాంగ్రెస్కు ఓటేయొద్దని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు పిల్లల భవిష్యత్ను నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీని చేస్తామంటే కేసీఆర్ అడ్డుపడ్డారని పేర్కొన్న మోదీ.. కరీంనగర్ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. పీవీ నరసింహారావుని కాంగ్రెస్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. రైతులకు నీళ్లిచ్చేందుకు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. కుటుంబ పాలకులు వారి పిల్లల గురించే ఆలోచిస్తారు.. ప్రజల పిల్లల గురించి ఆలోచించబోరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్ఐ వంటి సంస్థలు పెరిగిపోయాయని తెలిపారు. ఫిలిగ్రి కళకు కరీంనగర్ పెట్టింది పేరు.. అలాంటి కళలను ప్రోత్సహించేందుకు కేంద్రం విశ్వ కర్మ యోజనను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా లక్షలాది రూపాయలు గ్యారెంటీ లేకుండానే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ నీడ పడితే కలలన్నీ చెదిరిపోతాయని భయం.. అందుకే తనను సీఎం కేసీఆర్ కలవట్లేదని విమర్శించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్ -
మంత్రి కేటీఆర్ కు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కౌంటర్
-
హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి ప్రచారంలో రుణమాఫీ కాలేదన్న రైతు
-
బీజేపీ వైపే ప్రజాతీర్పు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చేలా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ‘పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీనికి కారణమెవరో అన్నివర్గాల ప్రజలు, మేధావులు విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తారని గట్టిగా నమ్ముతున్నాం. ఈ పీకల్లోతు అప్పులు తీరి సజావుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు..’ అని చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో ఏటీఎంగా మారుతుంది. బీఆర్ఎస్ గెలిస్తే మరిన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇక ఎన్నడూ కోలేకోలేనంత స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టే మెజారిటీ సీట్లలో బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చేలా కీలకమైన తీర్పు ఇవ్వబోతున్నారు..’ అని పేర్కొన్నారు. ‘అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లడం పక్కా. కేసీఆర్ కూడా అదే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి చెబుతోంది కానీ గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లబోరనే గ్యారంటీ మాత్రం ఇవ్వడం లేదు..’ అని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో..ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ ప్రచార సరళి తదితర అంశాలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో బండి సంజయ్ తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏయే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి? ఉద్యోగఖాళీలు భర్తీ కాకపోవడం, టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన 17 పేపర్లు లీక్ కావడంపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వరుసగా అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోలేదు. ధాన్యం క్వింటాల్కు 5 నుంచి 10 కేజీల తరుగు, రుణమాఫీ హామీ పూర్తిగా చేయకపోవడం ఇతర సమస్యలు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తమ కుటుంబాల్లోని మగవారు.. భర్తలు, కొడుకులు మద్యానికి, గంజాయికి, డ్రగ్స్కు బానిసలై కుటుంబాలు చిన్నాభిన్నం కావడంపై మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొక్కుబడిగా కొన్ని తప్ప డబుల్ బెడ్రూం ఇళ్లు మెజారిటీ పేదలకు అందలేదు. హామీలే తప్ప కొత్త పింఛన్లు ఇవ్వలేదు. గత పదేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కొత్త రేషన్కార్డు జారీ చేయలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒకవర్గం ఓట్ల కోసమే తహతహలాడుతున్నాయి. 80 శాతమున్న హిందూ సమాజం ఓట్ల గురించి ఆలోచించడం లేదు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలన చూశాక, అందుతున్న ఫలితాలను గురించి తెలుసుకున్నాక రాష్ట్ర ప్రజల్లో ఆలోచన మొదలైంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమని డిసైడ్ అయ్యారు. మెజారిటీ సీట్లలో గెలిచి రాష్ట్రంలో బీజేపీ అధికారానికి రావడం ఖాయం. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరుద్యోగ యువకులు, రైతులు, ఉద్యోగులు, ఆడపడుచులు ఒక్కొక్కరు ఇతరుల ద్వారా కనీసం మూడేసి ఓట్లు బీజేపీకి పడేలా చూడాలని కోరుకుంటున్నా. ప్రజల కోసం పోరాడిన బీజేపీ పక్షాన నిలుస్తారా? ప్రజాధనాన్ని కొల్లగొట్టే బీఆర్ఎస్, కాంగ్రెస్ల వైపు ఉంటారా? అన్నది ప్రజలు ఆలోచించాలి. బీజేపీ బీసీ నినాదం ఏ మేరకు పనిచేస్తుంది? ఉమ్మడి ఏపీ చరిత్రలో, తెలంగాణ ఏర్పడ్డాక ఏనాడూ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి సీఎం కాకపోవడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దేశంలోని ఏ జాతీయ పార్టీ కూడా బీసీని సీఎంను చేయాలని ఆలోచించలేదు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సందర్భం లేదు. గతంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాల్లోని పేదలు కూడా బీసీల్లోని పేదవర్గం వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 19 సీట్లే బీసీలకు కేటాయిస్తే బీజేపీ 36 కేటాయించింది. కేంద్ర కేబినెట్లో మునుపెన్నడూ లేని విధంగా 27 మంది ఓబీసీ, 12 ఎస్సీ, 8 ఎస్టీ వర్గాల వారు మంత్రులయ్యారు. బీసీ వర్గానికి చెందిన పేద వ్యక్తి మోదీప్రధాని కావడం వల్ల దేశంలోని అన్ని వర్గాల పేదలకు న్యాయం (ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో సహా) జరుగుతోంది. అందువల్ల బీజేపీ బీసీ నినాదం అన్నివర్గాల ప్రజల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ అగ్రనేతల ప్రచారానికి స్పందనెలా ఉంది? రాష్ట్రంలో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అమిత్షా, జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు, ఆదివాసీ మహిళ ద్రౌపదీముర్మును రాష్ట్రపతి చేయడంతో ఎస్టీ వర్గాల ఓట్లు, ఇలా వివిధ వర్గాల నుంచి ఊహించని విధంగా వస్తున్న స్పందనను చూశాకే బీజేపీ వైపు ప్రజలు నిలవబోతున్నారని, తెలంగాణలోనూ మోదీ నాయకత్వాన్ని బలపరచబోతున్నారనే విషయం స్పష్టమౌతోంది. కాంగ్రెస్లోని నేతలంతా సీఎం అభ్యర్థులే కాబట్టి వారు పార్టీ పరంగా లేదా సొంతంగా ప్రచారం చేసేందుకు అంతగా మొగ్గుచూపడం లేదు. బీజేపీ నేతలు మాత్రం ఒక ప్లాన్ ప్రకారం ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు, సమస్యలు వివరించి వారి మద్దతు కూడగట్టగలుగుతున్నారు. కేసీఆర్ సర్కార్ అన్నింటినీ తనవిగా ప్రచారం చేసుకోవడం, సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా కేంద్రం చేస్తే తాను చేసినట్టు చెప్పుకోవడం గురించి బీజేపీ చెబుతుంటే ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఉత్తర తెలంగాణలో ఎలా ఉండే అవకాశం ఉంది? ఉత్తర తెలంగాణలో మూడు ఎంపీ సీట్లు గెలిచిన పార్టీగా ఈ ప్రాంతంలో బీజేపీ బలంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కరీంనగర్లో మంత్రిగా గంగుల కమలాకర్కు బీఆర్ఎస్ ఆలస్యంగా బీఫామ్ ఇచ్చింది. ఇక్కడ పోటీలో ఉన్న నేను ప్రజలను నమ్ముకుంటే, మంత్రి పైసలను నమ్ముకున్నారు. ఆయన మంత్రిత్వ శాఖ పరిధిలోనిదే అయినా ఒక్కరికి కూడా కొత్త రేషన్కార్డు ఇవ్వలేదు. ధాన్యం కొనుగోలు విషయంలో తరుగు లేకుండా చేయలేకపోయారు. ఈ–కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేను ఎంపీగా గెలిచాక రూ.9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. కేసీఆర్ను గడగడలాడించిన వ్యక్తి సంజయ్ అనే పేరు ప్రజల్లో వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్లో వార్ వన్సైడ్ అన్నట్టుగా పరిస్థితులున్నాయి. మంచి మెజారిటీతో నేను గెలవబోతున్నా. కర్ణాటకలో గెలుపే తెలంగాణలో కాంగ్రెస్ కొంప ముంచబోతోంది. అక్కడ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో, ఐదారు నెలలు కూడా తిరగకుండానే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిలదీస్తున్న పరిస్థితులున్నాయి. దీనిని చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు గుర్తించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి మోదీ ప్రభుత్వం రాబోతోంది కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే మళ్లీ అవినీతికి తలుపులు తెరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్లో సీఎం అయ్యే అవకాశం లేని వారు, ఇతర నేతలు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా దీనిని గుర్తించారు. -కె.రాహుల్ -
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
-
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట
-
వరల్డ్కప్ ఫీవర్.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్ఈడీ స్క్రీన్..
సాక్షి, కరీంనగర్: క్రికెట్పై భారతదేశ ప్రజలకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం దేశమంతా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా నేడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న వేళ.. క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు సెటిలైపోయారు. అందులోనూ ఈరోజు ఆదివారం సెలవు దినం కావటంతో.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ భారతీయులంతా ప్రార్థిస్తున్నారు. వరల్డ్కప్ ఫీవర్ ఇతర కార్యక్రమాలకు అంటుకుంది. ఈ సందర్భంగా కరీంనగర్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఫంక్షన్ హల్లో ఆదివారం పెళ్లి జగుతుండగా.. ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథుల కొసం పెళ్లి వారు క్రికెట్ లైవ్ ప్రసారం చేశారు. దీంతో పెళ్లి పనుల హడావిడీలోనూ అందరూ తమకెంతో ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ను కూడా వీక్షించారు. ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టోర్నీలో అత్యుత్తమ జట్లలో విజేతగా నిలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్ఈడీ స్క్రీన్
-
హిందువులు ఓటుబ్యాంకుగా మారాలి
నిర్మల్: రాష్ట్రంలో 12 శాతం మంది ఓట్లను బీఆర్ఎస్, ఎంఐఎం నమ్ముకున్నాయని, కాంగ్రెస్ మతపెద్దలను నమ్ముకుందని, ఇక హిందువులు ఓటు బ్యాంకుగా మారి సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ముధోల్ నియోజకవర్గ అభ్యర్థి రామారావు పటేల్ తరఫున శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారని, వాళ్ల మేనిఫెస్టో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ 1,400 మందిని బలితీసుకుందని, నాటి బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పార్లమెంటులో పోరాడిన తర్వాతే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని సంజయ్ గుర్తుచేశారు. భైంసాను మైసాగా మారుస్తాం.. బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం భైంసాను మైసాగా మారుస్తామని, ముధోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని బండి సంజయ్ తెలిపారు. నాందేడ్ నుంచి భైంసా–నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వేలైన్ వేయిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర నిధులతో భైంసాలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ముధోల్లో గత ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్ మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల సభకే వచ్చారని, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. భైంసాలో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు కళ్లముందు ఇంకా మెదులుతున్నాయని... అల్లర్ల బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను దాచిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. ముస్లిం సమాజం ఆలోచించాలి... ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారు. టోపీలు పెట్టుకొని నమాజ్ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ముస్లిం సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఎక్కడా మతకలహాలు జరగలేదు’అని బండి సంజయ్ గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మితే మోసపోతారని హెచ్చరించారు. టవర్ సర్కిల్ వద్దకు రా... కరీంనగర్టౌన్: ‘ముస్లిం ఓట్ల కోసం సిగ్గులేకుండా టోపీ పెట్టుకుని మసీదుల్లోకి వెళ్లి నమాజ్ చేస్తున్న గంగుల, కేసీఆర్లు నిజమైన హిందువులైతే ఒవైసీ సోదరులను హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చి చాలీసా చదివించే దమ్ముందా?’అంటూ బండి సంజయ్ మరోసారి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను అవినీతిపరుడినంటూ గంగుల చేసిన ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎటువంటివాడనో కరీంనగర్ ప్రజలకు తెలుసు. నేను నోరు విప్పితే నువ్వు, కేసీఆర్ బిస్తర్ సర్దుకుని రాష్ట్రం విడిచిపోతారు జాగ్రత్త’అంటూ హెచ్చరించారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రానికి కేసీఆర్, కరీంనగర్కు గంగుల కమలాకర్ చేసిందేమీ లేదన్నారు. గంగుల.. కేసీఆర్ను ఒప్పించి కరీంనగర్కు ఎన్ని నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు. టవర్ సర్కిల్ వద్దకు రా.. స్మార్ట్సిటీ నిధులు ఎవరు ఇచ్చారో తేల్చుకుందాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగులకు టిక్కెట్ ఇవ్వకపోతే దారుస్సలాం వెళ్లి మోకరిల్లితే ఎంఐఎం సాయంతో టిక్కెట్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. -
ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు: కేసీఆర్
-
కాంగ్రెస్ మోసకారి పార్టీ : సీఎం కేసీఆర్
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ మోసకారి పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 60 ఏండ్లు గోస పెట్టిన పార్టీ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటువేసేటపుడు ఆలోచించి వేయాలని కోరారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దని సూచించారు. ఓటు వేసేటపుడు ప్రజలు కాంగ్రెస్ చరిత్రను కూడా ఆలోచించి ఓటు వేయాలన్నారు. 24 గంటల కరెంట్ వద్దని, 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ అంటోందని తెలిపారు. 3 గంటల కరెంటుతో పొలం పారుతదా అని సీఎం ప్రజలను ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్ గడ్డ కేంద్ర బిందువైంది. తెలంగాణ ఉద్యమానికి, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిన కరీంనగర్ గడ్డకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్కు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2011, మే 17న మొట్టమొదటి సింహగర్జన సభ ఈ కాలేజీ వేదికగానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం తేకపోయినా, ఉద్యమాన్ని విరమించినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని అప్పుడు చెప్పిన. ఆ సభకు ఎవరూ ఊహించనంత మంది వచ్చి జయప్రదం చేశారు. దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్ వేదిక నుంచే ప్రారంభించుకున్నాం తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్. 2004లో మనతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు మోసం చేశారు. 14 ఏండ్లు పోరాటం చేస్తే తెలంగాణ ఇచ్చారు. తర్వాత మళ్లీ వెనుకకు పోయారు. అంతేగాక టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. దీంతో కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. ఆ దీక్షకు కూడా ఈ కరీంనగరే వేదికైంది. నన్ను అలుగునూరు చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఇలాంటి అనేక ఉద్యమ ఘట్టాల్లో ప్రథమ స్థానంలో కరీంనగర్ ఉంటుంది. ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా.. లేదా..? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు ఎక్కడో ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నది. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఇయ్యాల ఈ స్థాయికి వచ్చినం. అభివృద్ధికి రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగం. 2014లో తెలంగాణ వచ్చినంక తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లు. ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం’అని కేసీఆర్ వివరించారు. ఇదీ చదవండి..తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్తా కేసీఆర్: రాహుల్ -
ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్ ఇవ్వండి
కరీంనగర్ టౌన్: అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీగా పోరు సాగిస్తున్నానని బీజేపీ కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్కుమార్ తెలిపారు. నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. సోమవారం మధ్యాహ్నం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్ విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్సింగ్తో కలసి కరీంనగర్ కలెక్టరేట్లోకి కారు నడుపుకుంటూ వెళ్లిన సంజయ్.. ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అవినీతికి, అక్రమాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటివరకు ప్రజలు అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఇస్తున్నా ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దారిమళ్లించారని ఆరోపించారు. పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇళ్లు మంజూరు చేసినా పేదలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఒకట్రెండు పథకాలు అమలు చేసి అదేదో గొప్ప పని చేసినట్లు భూతద్దంలో చూపుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? అని ప్రశ్నించారు. కమీషన్లు ముట్టజెబితే తప్ప పనులు అయ్యే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి శాంతిభద్రతలకు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్లో ప్రశాంత వాతావరణం ఉండాలన్నా, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, అవినీతికి తావులేని పాలన కావాలన్నా బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. డబ్బు వైపా లేక ధర్మం వైపా ప్రజలు తేల్చుకోవాలి: రాజాసింగ్ కరీంనగర్ ప్రజలు ధర్మం కోసం నిరంతరం పోరాడుతున్న బండి సంజయ్ పక్షాన ఉంటారో లేక అవినీతి, అక్రమాలతో రూ.వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ. 20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్లో సంజయ్ పోటీ చేస్తున్నారని తెలియగానే గంగుల కమలాకర్ దారుస్సలాం వెళ్లి ఎంఐఎం అధినేతకు సలాం చేశారని... అయినా సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ట్రిపుల్ తలాక్ తెచ్చి ముస్లిం మహిళలు గర్వపడేలా చేసింది బీజేపీయేనని మైనారిటీలు గుర్తించాలన్నారు. బండి సంజయ్పై 35 కేసులు.. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ సోమవారం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై పలు సందర్భాల్లో 35 కేసులు (గత అసెంబ్లీలో కేవలం 5 కేసులు) ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయన్నారు. సంజయ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి భూములు, గృహాలు లేకపోవడం గమనార్హం. మొత్తంమీద సంజయ్ దంపతుల ఆస్తుల విలువ రూ.79.51 లక్షలు మాత్ర మే. ఇక తనకు రూ.5.44 లక్షల రుణాలు, తన భార్యకు రూ.12.40 లక్షల రుణాలు ఉన్నాయని ఆయన అఫిడవిట్లో పొందుపరిచారు. -
సుధాచంద్రన్ వీడియో కాల్..ఎమోషనల్ అయిన అంజన శ్రీ
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తోంది జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ. నాట్యమయూరి సుధాచంద్రన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అంజనా శ్రీ టాలెంట్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సుధాచంద్రన్ వీడియో కాల్ చేసి మాట్లాడగా, ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అని అంజనాశ్రీ రుజువు చేస్తుంది. వివరాల ప్రకారం.. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు-గౌతమి కూతురు అంజనశ్రీ నాలుగేళ్ల ప్రాయంలో రహదారి ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయింది. ఏడాది కూడా గడవక ముందే రెండో కాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుని భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇప్పటికే త్యాగరాజు గానసభతో పాటు, పలుచోట్ల భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొని ఔరా అనిపించింది. అంజన ప్రతిభకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు దక్కాయి. కాలు లేకున్నా తన లక్ష్యం వైపు సాగుతున్న చిన్నారి అంజనా శ్రీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంగవైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని నిరూపించింది. అంజనా శ్రీ ప్రతిభ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్ వీడియోకాల్ ద్వారా అభినందించారు. కుత్రిమకాలుతోనూ అంజనశ్రీ నాట్యంలో రాణించడం గర్వంగా ఉందని, భరతనాట్యంలో మరింత రాణించాలని సూచించింది. తన గురువు దగ్గర్నుంచి కాల్ రావడంతో భావోద్వేగానికి గురైన అంజన ఎమోషనల్ అయ్యింది. ఇక సుధాచంద్రన్ స్వయంగా ఫోన్ చేయడంతో అంజనా శ్రీ కుటుంబసభ్యులు సైతం ఎంతో సంతోషించారు. -
కరీంనగర్లో సంతోష్కుమార్కు సీనియర్ల మొగ్గు..?
-
ఈసీ ఫేవరేట్ మహంతి: ప్యామిలీలో ఐపీఎస్లు ఎందరో..!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీ–1గా పనిచేస్తున్న 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కరీంనగర్ పోలీసు కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తున్న సుబ్బారాయుడిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ పోస్టులో నియమించే అధికారులకు సంబంధించి వచ్చిన జాబితాను పరిశీలించిన ఈసీ అభిషేక్ మహంతి పేరును ఖరారు చేసింది. ఎన్నికల సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఈసీ ఆయా అధికారులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి సమర్థతతో పాటు నిజాయతీ తదితరాలను చూసిన తర్వాతే ఖరారు చేస్తుంది. గత ఏడాదే తెలంగాణ కేడర్కు వచ్చిన అభిషేక్ మహంతి 2019లో ఆంధ్రప్రదేశ్ కేడర్లో ఉన్నారు. 2019 నాటి ఏపీ ఎన్నికల సమయంలో ఈయన తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్నారు. అప్పట్లో ఏపీలో పనిచేసిన ఎస్పీలపై ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వివిధ జిల్లాల వారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం కడప ఎస్పీగా అభి మహంతిని నియమించింది. ఆ కుటుంబంలో ఎన్నో ‘ఎన్నికల పోస్టింగ్స్’ అభిషేక్ మహంతితో పాటు ఆయన కుటుంబంలో కూడా ‘ఎన్నికల పోస్టింగ్స్’ సాధారణ అంశంగా మారడం గమనార్హం. అభిషేక్ తండ్రి అజిత్ కుమార్ మహంతి (ఏకే మహంతి) 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్గానూ పని చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసిన ఈసీ ఆ స్థానంలో ఏకే మహంతిని నియమించింది. ఇక అభిషేక్ మహంతి సోదరుడు అవినాష్ మహంతి కూడా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం సైబరాబాద్లో పరిపాలన విభాగం సంయుక్త పోలీసు కమిషనర్గా ఉన్నారు. అవినాష్ మహంతికి కూడా గతంలో ఇదేవిధంగా ఎన్నికల పోస్టింగ్ వచ్చింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్లోని రేవంత్ ఇంటిపై పోలీసులు చేసిన దాడి తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేసింది. ఆ స్థానంలో నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) డీసీపీగా పనిచేస్తున్న అవినాష్ మహంతిని నియమించింది. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసిన ఆయన సీసీఎస్కే తిరిగి వచ్చారు. మహంతి ఫ్యామిలీలో ఎందరో ఐపీఎస్లు ఏకే మహంతి మామ (భార్య తండ్రి) దామోదర్ చోట్రాయ్ తొలి సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అయిన 1948 బ్యాచ్ ఒడిషా కేడర్ అధికారి. డీజీపీగా పదవీ విరమణ చేశారు. ఏకే మహంతి బావమరిది పీకే సేనాపతి 1967 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఒడిషా కేడర్లోనే డీజీపీగా రిటైర్ అయ్యారు. -
Karimnagar: విమానం ఎగిరేనా? ఏళ్లుగా పరిష్కారం నోచుకొని సమస్యలు ఇవే..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 31,12,283 లక్షల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్ల సంఖ్య రాష్ట్రం మొత్తం ఓటర్లలో 10వ శాతం కావడం గమనార్హం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కరీంనగర్.. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచే తన ఘనత చాటుకుంటోంది. రాజకీయంగా ప్రభావం చేయగలిగిన ఈ జిల్లాలో కొన్ని సమస్యలు ఏళ్లుగా పరిష్కారం నోచుకోకుండా మిగిలిపోయాయి. గోదా‘వర్రీ’ పెద్దపల్లి జిల్లాలో ప్రవహించే గోదావరి నదీజలాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. రామగుండం కార్పొరేషన్ డ్రైనేజీ నీరు, రసాయనాలను నేరుగా నీటిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీల నిర్మాణంతో ఏడాది పొడువునా నీరు నిల్వ ఉంటుంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోజుకు సుమారు 70మిలియన్ లీటర్ల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు. అందులోంచి రోజుకు 40మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తుంది. ఆదాయపన్ను, మారుపేర్లు, ప్రైవేటీకరణ భూతం రామగుండం సింగరేణిలో రెండున్నర దశాబ్దాల కాలంగా మారుపేర్ల మార్పిడికి చట్టబద్ధత కోసం కోసం కార్మికులుఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోలేదు. మరోవైపు తమకు ఆదాయపు పన్ను మినహాయించాలని డిమాండ్ కోరుతున్నారు. అలాగే కోల్ బ్లాకులను ప్రైవేటు పరం చేయవద్దని కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. విమానం ఎగిరేనా..? 1980లో కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా వచ్చేందుకు 294 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మా ణం చేపట్టారు. 21 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి. 2009లో దీన్ని రామగుండం ఎయిర్పోర్టు పేరిట అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా అవి అటకెక్కాయి. 2016లో ఉడాన్ పథకంలో భాగంగా 2020లో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో పలు భౌగోళిక సర్వేలు నిర్వహించినా అడుగు ముందుకు పడలేదు. నాలుగోసారి నిర్వాసితులు.. కరీంనగర్ జిల్లాలో అదనపు టీఎంసీ కాలువ పనుల్లో భాగంగా రామడుగు, గంగాధర మండలాల్లో పలువురు నిర్వాసితులు నాలుగోసారి భూమిని కోల్పోతున్నారు. ఎవరైనా ఒకసారి కోల్పోవడం సాధారణం, రెండుసార్లు కోల్పోవడమే అరుదు. కానీ, ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వల్ల ఈ మండలాల్లో కొన్ని గ్రామాలవారు నాలుగు తరాలుగా నిర్వాసితులుగా మారిపోయారు. ఈఎస్ఐ ఆస్పత్రి కావాలి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది బీడీ కారి్మకులు ఉన్నారు. మున్సిపల్, పలు పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రతి నెలా వేతనం నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది. కానీ, ఈఎస్ఐ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాలో రామగుండంలో ఉంది. అసలు రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అత్యవసరాల్లో శస్త్రచికిత్స సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని లక్షలాది మంది కార్మికులు కోరుతున్నారు. తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కొనసాగగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. ఆ రకంగా అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం విశేషం. ఆ కుటుంబం పదిమార్లు లోక్సభకు సలావుద్దీన్ 1962 నుంచి అయిదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎంపీగా హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరుసగా అయిదు సార్లు గెలిచారు. 1999 లో తండ్రి లోక్సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారన్నమాట. తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నేండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. చదవండి: -
కాళేశ్వరం: పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించింది. అయితే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎంతో కీలకమైంది. కాగా, మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వివరాల ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో, అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు ఎల్అండ్టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించిన ఈఈ తిరుపతిరావు మాట్లాడుతూ.. చీకటిగా ఉండటంతో ఏం జరిగిందనేది స్పష్టత లేదని తెలిపారు. 10.17 టీఎంసీల జలాలు 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’ -
Rahul Gandhi: విమర్శల బాణం.. ఆత్మీయ రాగం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్పై వాగ్బాణాలు.. బీజేపీకి చురకలు.. ఎంఐఎం పార్టీపై విమర్శలు. అసలా మూడు పార్టీలూ ఒక్కటేనంటూ ఆరోపణ లు. మరోవైపు ఇందిర, రాజీవ్, సోనియాగాంధీల పేర్లను ప్రస్తావిస్తూ..తనది తెలంగాణతో కుటుంబ బంధమంటూ ఆత్మీయత పంచే ప్రయత్నం. అంతేకాదు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో మమేకం. సింగరేణి కార్మికులకు భరోసా.. టీ షాపు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులతో కులాసా కబుర్లు.. సమ స్యలపై ఆరా.. ఎక్కడ కనబడితే అక్కడ చిన్నారుల కు చాక్లెట్లు..ఇదీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో మూడురోజుల పర్యటన సాగిన తీరు. ఆశలు రేపిన రాహుల్.. రాష్ట్రంలో రాహుల్ తొలివిడత విజయభేరి యాత్ర శుక్రవారంతో ముగి సింది. ఎన్నికల వేళ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు రాహుల్ ప్రయత్నించారు. ములుగు, భూపా లపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, బోధన్, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదు గా ఆయన మూడురోజుల బస్సుయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు, వ్యవహార శైలి, సామాన్యుడిలా కలిసి పోయేందుకు ప్రయత్నించడం మంచి ప్రభావం చూపుతుందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రజలను ఆకట్టుకోవడంలో రాహుల్ సఫలీకృతులయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బలంగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ పర్యటన స్థానిక కాంగ్రెస్ కేడర్లో నూతనోత్సాహాన్ని నింపిందని అంటున్నారు. నేతల్లోనూ ఆయన జోష్ నింపారని, ఇదే ఊపు కొనసాగిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు! ఇటు ‘యుద్ధం’.. అటు ‘బంధం’ రాహుల్ ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి పెట్టారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా ఇది దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించగలిగారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం పెంచే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు తెలంగాణతో తమ కుటుంబానికి ఉన్నది కేవలం ఎన్నికల బంధం, రాజకీయ బంధమే కాదని, ప్రేమానురాగాల అనుబంధమని, అందుకే చెల్లి ప్రియాంకను తెలంగాణకు తీసుకువచ్చానని చెప్పిన రాహుల్..తెలంగాణపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని బలంగా చెప్పే ప్రయత్నం చేశారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సామాజిక న్యాయం అంశాన్ని కూడా రాహుల్ చర్చకు తెచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలోని మెజార్టీ బీసీ వర్గాలకు కేవలం 3 మంత్రి పదవులే ఇచ్చారని, 18 శాఖలు కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. కులగణన దేశానికి ఎక్స్రే లాంటిదంటూ తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతామంటూ గట్టి హామీ ఇవ్వడం ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే రాహుల్తో పాటు వచ్చిన ప్రియాంకా గాంధీ కేవలం ఒక్కరోజు మాత్రమే రాష్ట్రంలో ఉండడం పార్టీ శ్రేణులను కొంత నిరుత్సాహానికి గురి చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసేలోపు మరో రెండు దఫాలుగా యాత్ర సాగుతుందని, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. -
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడూ ఒక్కటే
-
కాంగ్రెస్ బస్సు యాత్ర.. రైతులకు రాహుల్ కీలక హామీ
Updates.. తెలంగాణలో ముగిసిన రాహుల్ తొలి విడత బస్సు యాత్ర ►ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ►మూడు రోజులపాటు సాగిన యాత్ర ►18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించిన రాహుల్, ప్రియాంక.. ►ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకు సాగిన యాత్ర ►ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో సాగిన యాత్ర ►ఆర్మూర్ నుంచి హైదరాబాద్కు రోడ్ మార్గంలో రాహుల్ ►శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న రాహుల్ ఆర్మూర్లో రాహుల్ కార్నర్ మీటింగ్ ►ఒక్క కుటుంబం వద్ద తెలంగాణ బందీ అయింది: రాహుల్ గాంధీ ►కేసీఆర్ లూటీ చేసిన డబ్బును వెనక్కి రప్పిస్తా ►కాంగ్రెస్ బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతోంది.. ►జగిత్యాలలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరగబోతోంది. దొరలు తెలంగాణను రాజ్యమేలుతున్నారు.. దీన్ని సహిద్దామా?. దోపిడీ సొమ్మంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒక్కటే. ఈ మూడు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం ఎంఐఎం పోటీ చేసి సాయం చేస్తోంది. ►కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభిస్తాం. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం. తెలంగాణతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు, ఇల్లు లాక్కున్నారు. పసుపు పంటకు 12వేల నుంచి 15వేల మద్దతు ధర ఇస్తాం. బడ్జెట్ కేటాయింపుల్లో ఓబీసీలకు ఎన్ని నిధులు ఇస్తున్నారు. కుల గణన చేయడానికి మోదీ, కేసీఆర్ ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. ►నేడు మూడోరోజు కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కరీంనగర్ వీపార్క్ హోటల్ నుంచి రాహుల్ గాంధీ బయలుదేరనున్నారు. మొదట చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అయితే, మల్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉండగా.. పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం, జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్లో రాహుల్ ప్రసంగించనున్నారు. షెడ్యూల్ ఇలా.. ►మధ్యాహ్నం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో కార్నర్ మీటింగ్ ►మధ్యాహ్నం కోరుట్లలో సమావేశం ►ఆ తర్వాత ముక్కాస్ కన్వెన్షన్లో భోజన విరామం ►అనంతరం నిజామాబాద్ జిల్లాకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ►ఆర్మూర్ బహిరంగ సభ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్న రాహుల్ గాంధీ. కోదండరామ్తో రాహుల్ భేటీ.. కరీంనగర్ వీపార్క్ హోటల్లో రాహూల్ గాంధీని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినట్టు కోదండరామ్ తెలిపారు. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ తొలి జాబితా.. 70 స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్! -
కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఫోకస్ ఎందుకు లేదు: రాహుల్ ఫైర్
Updates.. ►కాటారంలో ర్యాలీ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అవినీతిని పక్క రాష్ట్రాలకు విస్తరించారు. మీ ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు దర్యాప్తు జరపడం లేదు. తెలంగాణలో కుటుంబ పాలన సాగింది. అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోంది. సీఎం కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు. జన గణన చేయాలని మేం అడుగుతున్నాం. పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వచ్చారు. పార్లమెంట్లో కుల, జన గణన మీద మాట్లాడాను. దేశంలో పెద్ద అంశం కులాలవారీగా జన సమీకరణ. #WATCH | "The whole control of Telangana state is in the hands of one family and corruption is highest in the state in the country...Look at BJP-BRS-AIMIM, these three parties attack the Congress party," says Congress MP Rahul Gandhi during 'Vijayabheri Yatra' in Telangana's… pic.twitter.com/49kCSvV0js — ANI (@ANI) October 19, 2023 ►నాపై 24 కేసులు పెట్టారు. 90 మంది కీలక అధికారుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారని అడిగా?. ఎస్సీ, ఎస్టీ అధికారులు ఎంతమంది ఉన్నారని అడిగా. దేశాన్ని నడిపించే వారిలో మెజార్టీ ఎవరని అడిగాను. కేవలం ముగ్గురే ఓబీసీ అధికారులున్నారు. దేశంలో బడా వ్యాపారులకు అప్పులు మాఫీ చేస్తున్నారు. ►కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాటారంలో రైతులతో భేటీ అయ్యారు. ►అనంతరం, కేటీకే 5వ బొగ్గు గని నుంచి బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో రాహుల్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ►తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఇక, గురువారం కాంగ్రెస్ నేతలు సింగరేణి కార్మికులతో సమావేశమై.. వారితో చర్చించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ►భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో భేటీ సందర్బంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి దివాళా తీయడానికి విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డ వేలాది కోట్లే కారణం కాదా?. ఉచిత విద్యుత్తో జెన్కో, ట్రాన్స్కో కు ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించడం లేదు. జెన్కోకు ఎనిమిదేళ్లు సీఎండిగా ఒక్కడే ఉన్నాడు. ఐఏఎస్ల్లో సమర్థులు లేరా?. ఎందులో అయినా కేసీఆర్ దోస్తులు, కుటుంబ సభ్యులే ఉంటారు. ►ప్రధాని మోదీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నాడని కేసీఆర్ అంటున్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే బిల్లు 2015లో వచ్చింది. అప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఎంపీగా ఉన్న కవిత మద్దతు తెలిపారు. సింగరేణి ప్రైవేట్ పరం కావడానికి కారణం ఏవరో అర్థం చేసుకోవాలి. లోపాయికారీ ఒప్పందంతో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ప్రైవేట్ పరం చేశారు. జెన్కో నుంచి రావాల్సిన బకాయి ఇప్పించడంలో విఫలం కావడంతోనే సింగరేణి ఎన్నికలను వాయిదా వేయించారు. రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైతే జానారెడ్డి ఇంట్లో అన్ని పార్టీలు సమావేశమై జేఏసీ ఏర్పడింది. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఏర్పడింది. ►సింగరేణి కార్మికుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. కార్మికుల వైపు వాళ్ళే ఉంటారు.. ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు. ఎంపీగా ఓడిన కవిత సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. వినోద్ కుమార్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయ్యాడు. అఆలు సరిగా రాయలేని దద్దమ్మ దయాకర్ రావు మంత్రి అయ్యాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ►మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్ ఓసీపీలను మూసివేయాలని చూస్తున్నారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది. సింగరేణి ని కాపాడటానికి, కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ►పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల పేరు మార్పిడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలో పూర్తి చేస్తాం. ఆదాయ పన్ను పరిమితి పెంచుతాం. పెన్షన్తోపాటు సొంత ఇంటి కల నెరవేర్చుతాం. సీఎం కేసీఆర్ చైనా బార్డర్లో ఉండే సైనికులతో సింగరేణి కార్మికులను పోల్చి మాటలతో బోల్తా కొట్టిస్తాడు.. కానీ కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇవ్వరు. వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్ను గెలిపించండి. ►మధు యాష్కీ మాట్లాడుతూ.. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారు. -
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో కరీంనగర్లో ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మంత్రి కేటీఆర్ సహా గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు రమణ, భాను ప్రసాదరావు, ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మన్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. ప్రవల్లిక విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రవల్లిక తల్లిదండ్రులు ఈరోజు నన్ను కలిశారు. ఒకడు మా అమ్మాయిని వేధించి చంపాడని చెప్పారు. న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చాను.ప్రవల్లిక సోదరుడికి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పాను. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఉద్యోగాలు కోరుకుంటున్నవాళ్లకు న్యాయం చేస్తాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. రాహుల్, ప్రియాంక గాంధీ వంటి వారు వచ్చి మాయమాటలు చెబుతారు జాగ్రత్త అని అన్నారు. ఇదే సమయంలో అద్భుతమైన మెజారిటీతో మళ్లీ ఎమ్మెల్యే కాబోయే గంగుల కమలాకర్కు అభినందనలు. ఒక్క గంగులకే కాదు ఎంపీ ఎన్నికల్లో వినోద్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి. గత ఎన్నికల్లో మోసం జరిగింది. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కోసం ఏం చేశాడు. బడి లేదు.. గుడి లేదు ఏమీ తేలేదు. ప్రధాని మోదీ ఎందుకు దేవుడో బండి సంజయ్ చెప్పాలి. మోదీ చెప్పినట్టు రూ.15లక్షలు వచ్చినవాళ్లంతా బీజేపీకి ఓటు వేయండిన. రానివాళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయండి. కేసీఆర్ అందరివాడు.. ఏ ఒక్క మతానికో లేక వర్గానికో చెందిన వ్యక్తి కాదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ క్రిమినల్. ఓటుకు నోటు కేసులో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన వ్యక్తి. ఓటు విషయంలో ఆలోచించి వేయండి. తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది కరీంనగర్లోనే. ఓటుతో బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలి. మతం పేరుతో చిచ్చు పెట్టే కొందరు వ్యక్తులు మళ్లీ కరీంనగర్ వచ్చారు. వారితో జాగ్రత్త అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా రెడీ.. విడుదల ఎప్పుడంటే? -
అసంతృప్తిపై వారు..అభివృద్ధిపై వీరు..
భాషబోయిన అనిల్ కుమార్ : గోదావరి నది ఒడ్డున సింగరేణి కార్మికక్షేత్రం, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు వంటి ధార్మిక క్షేత్రాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలయం. ఉద్యమాలకు, పోరాటాలకు పురిటిగడ్డగా ఉంటూనే సెంటిమెంటుకు ఆలవాలంగా, విలక్షణ తీర్పులకు వేదికగా ప్రసిద్ధికెక్కింది. ఉద్యమాల ఖిల్లా, మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన కరీంనగర్లో 2014 నుంచి నేటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ హవా సాగుతోంది. అభ్యర్థుల ప్రకటనతో దాదాపుగా నెలరోజులు ముందుగానే అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ప్రచారం ప్రారంభించారు. ఈసారి కూడా సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్ ధీమాగా ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత తమను విజయతీరాలకు చేరుస్తుందని నమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ మేరకు గెలుపు వ్యూహాలు రచిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్.. అభివృద్ధి జపం! తెలంగాణకు ముందు– తరువాత పరిస్థితులను చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రణాళికలను రచిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మునుపెన్నడూలేని భారీ నీటి ప్రాజెక్టు కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన వేల ఎకరాలు, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, జాతీయ రహదారులు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, దళితబందు, రైతబంధు, రైతుబీమా, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు తమను ఉమ్మడి జిల్లాలో మరోసారి గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో 13 అసెంబ్లీ స్థానాలున్న కరీంనగర్ జిల్లా పాత్ర కీలకం. ప్రతిసారీ 12 స్థానాలు గెలుస్తుండగా..పార్టీని వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి గెలవడంతో ఇక్కడ బలం 11 స్థానాలకు చేరింది. అయితే ఈసారి మొత్తం 13 సీట్లూ తన ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పథక రచన చేస్తోంది. విపక్షాల ప్రచారాస్త్రాలు ♦ తమ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ♦ ప్రజావ్యతిరేకత, పాలనపై ఉద్యోగుల్లో అసంతృప్తి, యువ ఓటర్లలో సానుకూలత తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. ♦మైనార్టీ రుణాలు, బీసీబంధు కేటాయింపులో కొన్నిచోట్ల అర్హులకు చోటు దక్కకపోవడాన్ని విపక్షాలు ప్రచారా్రస్తాలుగా చేసుకునే అవకాశం ఉంది. అధికార పార్టీ ఆయుధాలు..! ♦ సంక్షేమ పథకాలు, దళితబంధు, పైలట్ ప్రాజెక్టులు.. ♦ ఉమ్మడి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం, సిరిసిల్లలో ఆక్వా హబ్, కరీంనగర్లో మానేరు రివర్ ♦ ఫ్రంట్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి, కాళేశ్వరం ప్రాజెక్టు. ♦ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్, స్మార్ట్సిటీ నిర్మాణం, కొండగట్టు, వేములవాడ మాస్టర్ప్లాన్లు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై తకరారు..! కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలను కొందరు నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జగిత్యాల, మంథని, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మానకొండూరు, పెద్దపల్లి స్థానాలు తమ ఖాతాలోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ దీమాతో ఉంది. అయితే పార్టీలో అంతర్గత కలహాలు, ప్రతి స్థానానికీ పదుల సంఖ్యలో ఆశావహులు (అధికారికంగా 85 మంది) పోటీపడటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయా స్థానాల్లో నేతలు ప్రజా ఆశీర్వాద యాత్రలతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇక బీజేపీ విషయంలో సంజయ్, ఈటల రాజేందర్ మినహా మిగిలిన వారి విషయంలో స్పష్టత రాలేదు. వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మానకొండూరులకు అభ్యర్థులు దొరికినా ఇంకా ఖరారు కాలేదు. కారుకు స్పీడ్బ్రేకర్లు ఇవే..! ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు బలమైన పునాదులు ఉన్నా.. కొన్ని విషయాలు పార్టీని కలవరపెడుతున్నాయి. పెద్దపల్లిలో పార్టీ రెబెల్ నల్ల మనోహర్రెడ్డి బరిలోకి దిగితే కారు ఓట్లు చీలే అవకాశముంది. రామగుండంలో రెబెల్ కందుల సంధ్యారాణి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యతిరేక వర్గం పార్టీకి ప్రతికూలంగా తయారయ్యారు. వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్బాబు స్థానంలో చెలిమెడ లక్ష్మీ నరసింహారావుకు పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో రమేశ్ ఎంతమేరకు సహకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కుమారుడు సంజయ్కు పోటీగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలో దిగితే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఓటమికి బీఆర్ఎస్ చెమటోడ్చాల్సి ఉంటుంది. మంథనిలో శ్రీధర్బాబును ఓడించడానికి కారు పార్టీ ప్రత్యేక వ్యూహం రూపొందించింది. ఎంపీ బండి సంజయ్ బలమైన నాయకుడు అయినప్పటికీ.. కరీంనగర్లో పోటీపై అనాసక్తిగా ఉన్నారని సమాచారం. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్కు సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి. చొప్పదండిలో సొంత పార్టీ నేతల అసంతృప్తి కలవరపెడుతోంది. -
బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఖాయం: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: కేసీఆర్ కుటంబంలో లొల్లి మొదలైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ను సీఎం చేయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిర్గతం చేయడంతో బీఆర్ఎస్లో చీలికలు మొదలయ్యాయని అన్నారు. ఈ మేరకు కరీంనగర్లో బుధవారం ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ భ్రష్టు పట్టడానికి కేటీఆర్ అహంకార వైఖరి, మాటతీరే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్ పాల్గొన్నది నిజం కాదా? గత 15 రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కనిపించడం లేదని, కేసీఆర్ మిస్సింగ్ తమను ఆందోళనకు గురిచేస్తోందని సెటైర్లు వేశారు. కేసీఆర్ దగ్గరకు ఎవరనీ వెళ్లనీయడం లేదని, చివరికి ఎంపీ సంతోష్ కుమార్ను కూడా దూరం పెట్టారని విమర్శించారు. సీఎం కనిపించకపోవడానికి కొడుకు కేటీఆర్ సతాయింపే కారణమా అనేది బహిర్గతం కావాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ సభలో చేసిన మోదీ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2009లో ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్ పాల్గొన్నది నిజం కాదా అని నిలదీశారు. అప్పుడు, ఇప్పుడూ మీ ఆస్తులెంత! ‘ఉద్యమ సమయంలో తండ్రిని చంపేస్తారా మాకేమొస్తుందని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు జై తెలంగాణా అని మంత్రి పదవిలో కూర్చుండు. ఇంతకంటే చీటర్ ఇంకెవరుంటారు. ఉద్యమ సమయంలో మీ ఆస్తులెంత..? ఇప్పుడు మీ ఆస్తులెంత..? తెలంగాణా సమాజం కేసీఆర్ కుటుంబం ఆస్తులు కొల్లగొడుతున్న విధానాన్ని గమనించాలి’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. చదవండి: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్ మోదీ చెప్పింది అంతా నిజమే కేసీఆర్ కలిసిన డేట్స్తో సహా ప్రధాని మోదీ వెల్లడించారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కేసీఆర్తో బీజేపీ ఎప్పుడు కలవదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అనేకసార్లు బయటపడిందన్నారు.కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారని అన్నారు. ప్రధాని పర్యటనలకు రాకుండా కేసిఆర్ ప్రోటోకాల్ పక్కనే పెట్టేశాడని విమర్శించారు. మోదీ చెప్పింది అంతా నిజమేనని, కేసీఆర్ ఎన్డీయేలో కలవాలని మోదీని కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు. -
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆఫీస్ ముందు MIM నేతల బైక్ ర్యాలీ
-
ఇక నా దృష్టి కరీంనగర్ ‘పార్లమెంట్’పైనే
కరీంనగర్టౌన్: ఇకపై కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంపైనే ప్రత్యేక దృష్టి సా రించనున్నట్లు బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువ సమయం నియోజ కవర్గానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపిస్తామని, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. గురువారం ఆయన కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాలులో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతల తో సంస్థాగత బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, త్వరలో చేపట్టబోయే బస్ యాత్ర వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అన్నిజిల్లాలు తిరగాల్సి రావడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని అన్నారు. పార్టీ ఆదేశిస్తే కరీంనగర్తోపాటు ఎక్కడైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 16న బైక్ ర్యాలీలు నిర్వహించాలని, 17న ఉదయం అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగరేయాలని సమావేశంలో తీర్మానించారు. -
జీ20 సమ్మిట్: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు అరుదైన గౌరవం
ఢిల్లీ: ఢిల్లీ జీ-20 సదస్సులో మన తెలంగాణ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. సమ్మిట్లో 20 దేశాల డెలిగేట్స్ చొక్కాలకు బ్యాడ్డీలను మన కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులే తయారుచేశారు. కోణార్క్ సూర్యదేవాలయంలోని రథచక్ర నమూనాలో సిల్వర్తో బ్యాడ్జీలను తయారు చేశారు. జీ20 సందర్భంగా రెండు వందల బ్యాడ్జీలను భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. జీ-20 సమ్మిట్లో స్టాల్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మన తెలంగాణ కళాకారులకు అనుమతి లభించింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో జీ-20లో స్టాల్ నిర్వహణ కొనసాగుతోంది. గతంలో ఇవాంకా ట్రంప్తో పాటు పలు దేశాల డెలిగేట్స్ పర్యటన నేపథ్యంలోనూ కరీంనగర్ ఫిలిగ్రీకి ఈ తరహా గౌరవం దక్కింది. దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇదీ చదవండి: జీ-20 సదస్సు... ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
కూరగాయల సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు సోదరులు
-
మానేరు డ్యామ్ కు భారీ వరద..
-
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
-
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్మ్యాన్
-
ఈటల రాజేందర్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూరు వద్ద ఈటల కాన్వాయ్లోని ఒక కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. ఈటల రాజేందర్ ఆదివారం హుజురాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మంలంలోని లలితాపూర్ వద్ద గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. దీంతో, ఈటల కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సందర్భంగా ఈటల కాన్వాయ్లోని మిగతా కార్లు ఒక్కదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సిబ్బంది, నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..