బీఆర్ఎస్‌ విలీనం.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Union minister Bandi Sanjay fires on congress party over runa mafi | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్‌ విలీనం.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Mon, Aug 19 2024 11:54 AM | Last Updated on Mon, Aug 19 2024 1:35 PM

Union minister Bandi Sanjay fires on congress party over runa mafi

సాక్షి, కరీంనగర్‌: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.  ఇవాళ ఆయన మీడియాతో  మాట్లాడారు. 

‘‘నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. రుణమాఫీపై  కాంగ్రెస్  ప్రభుత్వం శ్వేత పత్రం  వడుదల  చేయాలి. రైతులకు  క్లియరెన్స్  సర్టిఫిటికెట్ ఇవ్వాలి.  చనిపోయిన  రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్  పార్టీపై  ఉంది. సోనియాగాంధీ  బర్త్ డే రోజున కూడా  కూడా మోసం  చేశారు.  ప్రజలను అయోమయానికి  గురి చేస్తోంది కాంగ్రెస్.  రుణమాఫీ  చేస్తే  రైతులు  ఎందుకు  రోడ్ల  మీదకు  వస్తున్నారు?. రైతుల పక్షాన పోరాడుతాం. విలీనాలు వద్దు..  దండం పెడుతా. 

..గతంలో రేవంత్  రెడ్డి  బీజేపీ అని  బీజేపీలోకి పోతారని ప్రచారం చేశారు. 30 వేల  ఉద్యోగాలు  ఏ  దేశంలో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలె. నోటిఫికేషన్ ఇవ్వలేదు.  బీఆర్ఎస్‌ను చేర్చుకోవాల్సిన  అవసరరం బీజేపీకి  లేదు. కాంగ్రెస్  వాళ్ళకు  మాత్రమే  ఉంది. బీఆర్ఎస్‌ను  కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి.  కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు  వేయలేదు?. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్నీ అటకెక్కాయి.  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక  చేరికలు మాత్రమే ఉన్నాయ్. ప్రజలు కోరితే తప్ప అధికారులు, నాయకులూ  స్పందించే పరిస్థితి లేదు. సాగు, తాగు నీటి వంటివాటిపై రివ్యూ లేదు’అని అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement