సాక్షి, ప్రకాశం: జిల్లాలోని రాచర్ల మండలం సోమిదేవిపల్లెలో కొండచిలువ దర్శనమివ్వడంతో కలకలం రేగింది. వరిగడ్డి వాములో నక్కిన 12 అడుగులకు పైగా ఉన్న కొండచిలువ గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసింది. వెంటనే గ్రామస్తులు గిద్దలూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ కొండచిలువను దిగువమెట్ట అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
ప్రకాశం జిల్లాలో కొండచిలువ కలకలం
Published Sun, Sep 13 2020 8:36 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement