నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారమంతా పాలనాపరమైన వ్యవహారాలతో తనమునకలుగా గడిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో, క్యాంపు కార్యాలయంలో పలుశాఖల అధికారులతో సమీక్షలు చేశారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపే.. ‘జగన్ ఓ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను’ అని ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన రోజున ప్రకటించిన మాటలకు కట్టుబడి.. సుపరిపాలనా ఫలాలు ప్రజలకు వేగంగా అందించాలన్న తపనతో వివిధశాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. కొన్ని కీలకమైన సూచనలు చేశారు.