ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జననేత జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా దుబాయ్లో వైఎస్ఆర్సీపీ యూఏఈ ఆధ్వర్యంలో ‘వాక్ విత్ జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబాయ్లో నిసిస్తున్న ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జగనమోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
దుబాయ్లో ‘వాక్ విత్ జగన్’
Published Fri, Jan 26 2018 6:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement