Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ys Jagan Slams On Chandrababu Govt Over Kuppam Woman Incident1
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళపై పచ్చ సైకోల అరాచకంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్‌ గవర్నెన్స్‌, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు..@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025

Pak Army Chief Asim Munir Faces Protests In America2
అసిమ్‌ మునీర్.. యూఎస్‌ పర్యటనకు వస్తావా?, నీకు సిగ్గుందా?

వాషింగ్టన్‌ డీసీ: పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌.. జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌. నియంతగా, అత్యంత కఠినాత్ముడిగా పేరుంది. పాకిస్తాన్‌లో ప్రధాని పేరు కంటే కూడా అసిమ్‌ మునీర్‌ పేరే ఎక్కువగా వినిపిస్తుందనేది కాదనలేని సత్యం. ఇదంతా ఒకటైతే, ఇప్పుడు మునిర్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. అధికారిక అమెరికా పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు మునీర్‌. అయితే మునీర్‌కు అమెరికాలో నిరసన సెగ మామూలుగా లేదు. పెద్ద ఎత్తును మునీర్‌ అమెరికా పర్యటనపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. భారీగా హోర్డింగ్‌లు వెలవడంతో పాటు నిరసనకారులు కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు అమెరికా పర్యటనకు రావడానికి నీకు సిగ్గుందా..? అని మనీర్‌ బస చేస్తున్న చోట నిరసనకారులు ఆందోళన చేపట్టారు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘పాకిస్తాన్‌ ప్రజలు ప్రాణాలు తీసే నీవు ఇక్కడ ఏం మాట్లాడాతావ్‌, ఇక తుపాకీలు మాట్లాడితే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్లే’ అని వెలసిన హోర్డింగ్‌లు మునీర్‌పై తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. WATCH: Failed Asim Munir gets humiliated by the Pakistani Diaspora during his trip to USA.He was called 'Murderer of Pakistanis'. pic.twitter.com/NSRKywNuh3— Sensei Kraken Zero (@YearOfTheKraken) June 17, 2025 pic.twitter.com/poIqJuGdnv Asim Munir has fallen into the hands of Pakistanis in America—exposed as the dictator, traitor, and butcher of his own people that he truly is!" From Pakistan #11YearsofInjustice Trump and Israel— ⁱᴵⁿˢᵃᶠ فکر (@shaoooohoor) June 17, 2025 ఐదు రోజుల అమెరికా పర్యటనపాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు.

Does Rat Hold Key In Plane Incident At Ahmedabad3
Air India Incident: దర్యాప్తులో RAT కీలక పాత్ర పోషించనుందా?

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్‌ 12వ తేదీన జరిగిన విమాన ప్రమాదం అతి పెద్ద విషాదంగా మారిపోయింది. ఆ విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అహ్మదాబాద్‌ విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది. అయితే ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో విమానంలో ఒకేసారి రెండు ఇంజన్‌లు పనిచేయకపోవడం ఆసక్తికరంగా మారింది. అసలు డ్యుయల్‌ ఇంజన్‌తో నడిచే విమానాల్లో ఒక ఇంజన్‌ పని చేయని పక్షంలో మరో ఇంజన్‌ పునరుద్ధరించబడుతోంది. ఇది సెకన్లలో జరిగే ప్రక్రియ. ఇందుకు RAT(Ram Air Turbine) దోహదం చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నెలకొంది. రెండు ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని అధిక శాతం మంది విమాన రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇలా జరిగినప్పుడు RAT ఎంతవరకూ పని చేసిందనేది మరో కోణంలో చర్చకు తెరలేపింది. ఎయిర్‌లైన్స్‌లో RAT అంటే ర్యామ్‌ ఎయిర్ టర్బైన్ (Ram Air Turbine). ఇది విమానంలో ఒక చిన్న టర్బైన్, ఇది విమానం యొక్క ప్రాథమిక శక్తి వనరులు విఫలమైనప్పుడు ఉపయోగించబడుతుంది. ఇది విమాన నియంత్రణ వ్యవస్థలతో పాట ఇతర ముఖ్యమైన భాగాలకు శక్తిని అందించి తిరిగి గాడిలో పడేందుకు ఉపకరిస్తుంది. విమానంలో ఆటోమేటిక్‌గా పని చేసే RAT.. డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం, విద్యుత్ వైఫల్యం లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు అది యాక్టివేట్‌ అవుతుంది. ఇక్కడ RAT ఎంతవరకూ పని చేసిందనేది ప్రధాన ప్రశ్న. గేర్‌లను విస్తరించడానికి లేదా ఉపసంహరించుకోవడంతో పాటు విద్యుత్ శక్తిని పునరుద్ధరిస్తుంది. కీలకమైన విద్యుత్ వ్యవస్థలను నిర్వహించడంలో సహాయపడటానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన RAT.. ఇప్పుడు దర్యాప్తులో కీలకం కానుంది. విమాన ప్రమాదం జరిగే సమయంలో RAT యాక్టివేట్‌ అయ్యిందనే చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రమాద ఘటన వీడియోల్లో కూడా కనిపించింది. అయితే విమానం గాల్లోకి టేకాఫ్‌ తీసుకున్న సెకన్ల వ్యవధిలోనే కూలిపోవడంతో RAT యాక్టివేట్‌ అయినా అది విఫలంగానే మిగిలిపోయిందనేది మరో వాదన. టెన్షన్‌.. టెన్షన్‌.. మరో ఎయిర్‌ ఇండియా విమానం రద్దు

2 Machetes, A Signal: Crime Scene Recreation Reveals Shocking Details In Raja Raghuvanshi Case4
మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌

షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్‌ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్‌ బృందం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్‌ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్‌డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వివేక్‌ వివేక్‌ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్‌ సైగ.. రాజాపై విశాల్‌ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్‌కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్‌ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్‌ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్‌ చౌహాన్‌ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్‌ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్‌ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్‌ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్‌దాంగ్‌ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్‌లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్‌ 23న రాజా రఘువంశీ,సోనమ్‌ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్‌ తన ప్రియుడు సాయంతో విశాల్‌ చౌహాన్‌,ఆనంద్‌ కుమార్‌,కాష్‌ రాజ్‌పుత్‌లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్‌డాంగ్ హిల్స్‌లో పడేశారు. జూన్‌ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

BJP MLA Raja Singh Says Stand For Unity Of Work In Party5
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన

హైదరాబాద్‌: గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తాజాగా సంచలన ప్రకటనతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ఇక ఐక్యంగా కలిసి పని చేద్దామంటూ రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం(జూన్‌ 17) రాజాసింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. ‘పార్టీలో ఐక్యత, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కానీ నన్ను టార్గెట్‌ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పార్టీ కోసమే పని చేశా. ఒక పార్టీ కార్యకర్తనైన నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం?. కిషన్‌రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తాను. సమస్యలు, పార్టీలో మా స్పష్టతను వివరిస్తాను. సమయం నిర్ణయించే చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. విభజించడానికి కాదు.. ఐక్యత కోసం ఇక్కడ ఉన్నా. వ్యక్తిగత విభేధాలను విడిచిపెట్టి ఐక్యంగా పని చేద్దాం’ అని రాజాసింగ్‌ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

Suryakumar Yadav travels to England for surgery: Reports6
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌?

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ పర్యటనకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశముంది.సూర్యకుమార్ యాదద్ మ‌రో శస్త్రచికిత్స లండ‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. న్యూస్24 రిపోర్టర్ వైభవ్ భోలా ప్రకారం.. సూర్య‌కుమార్ కుడివైపున స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో సూర్య‌ త‌న గాయానికి శ‌స్త్ర‌చికిత్స చేసుకోవ‌డానికి ఇప్ప‌టికే లండ‌న్‌కు వెళ్లిన‌ట్లు వైభ‌వ్ భోలా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా ఈ ముంబై ఆట‌గాడు స్పోర్ట్స్ హెర్నియా బారిన ప‌డ‌డం ఇది రెండో సారి. గతేడాది జ‌న‌వరిలో ఎడమ వైపున నొప్పి రావ‌డంతో జ‌ర్మ‌నీలో స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. కానీ ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌తో పాటు, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో భాగ‌మ‌య్యాడు.ఇప్పుడు కుడివైపు నొప్పి రావ‌డంతో మ‌ళ్లీ శ‌స్త్ర‌చికిత్స చేయించుకోనున్నాడు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మిస్ట‌ర్ 360 దాదాపు రెండు నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉండ‌నున్నాడు. బంగ్లా టూర్‌కు సూర్య సూర్య‌దూర‌మైతే భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంది. ఐపీఎల్‌-2025లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో సెల‌క్ట‌ర్ల దృష్టిని ఆకర్షించిన అయ్యర్‌.. తిరిగి టీ20 జట్టులోకి రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు.చదవండి: ICC Odi Rankings: వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా టీమిండియా స్టార్ ఓపెన‌ర్‌

Nara Lokesh Rule Chandrababu Became Blind7
ధృతరాష్ట్ర పాలన.. ‘మమ్మల్ని ఎవడ్రా ఆపేది!’

ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనపాలన ఎలా ఉందో అర్థమవుతోందా? సూచాయిగా బాబుకు రాష్ట్రంలో సీను అర్థమైందా?.. తమ్ముళ్ల అరాచకాలు కనిపిస్తున్నాయా?.. వారిని కంట్రోల్ చేయలేక తమలపాకుతో కొడుతున్నారా? అసలిది ఆయన ప్రభుత్వమేనా.. లేక లోకేష్ మొత్తం పాలనను.. ప్రభుత్వాన్ని హైజాక్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తున్న పరిపాలనా ?..రాష్ట్రంలో పరిపాలన కన్నా కక్షలు.. కార్పణ్యాలు తీర్చుకోవడమే లక్ష్యంగా పడుతున్న తప్పుబడుగులను బాబు సరిదిద్దే పని చేయడం లేదా? దుర్యోధనుడి మాదిరిగా లోకేష్ అరాచకాలు సాగిస్తుంటే చంద్రబాబు కూడా పుత్రవాత్సల్యంతో దృతరాష్ట్రుడిలా చూడలేకపోతున్నారా ? ఇలాంటి సందేహాలు రాష్ట్రప్రజలను చుట్టుముడుతున్నాయి. గెలిచింది మొదలు లోకేష్ చేస్తున్న ప్రకటనలు, ప్రతిపక్ష నేతలు.. సోషల్మీడియా కార్యకర్తలమీద చట్టాన్ని అడ్డంపెట్టుకుని చేస్తున్న దాడులు .. కేసులు బాబుకు లీలగా కనిపిస్తున్నాయా ? వినిపిస్తున్నాయా ? అదే అనిపిస్తోంది.బాబుపాలనకు వచ్చి ఏడాదైన సందర్భంగా పలు ప్రయివేటు జిల్లాల్లో చేపట్టిన సర్వేల్లో ఘోరమైన ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. టీడీపీ నేతల అరాచకాలు.. దొమ్మీలు .. దోపిడీలు బాబు ప్రభుత్వ ప్రతిష్టను ఎలా దిగజారుస్తున్నదీ ఆ సర్వేలో వెల్లడింది.. ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం పెచ్చుమీరిన అవినీతిలో మునిగితేలియాడుతున్నారు. ఇదంతా ఇంటెలిజెన్స్ .. ఇతర సర్వే సంస్థల ద్వారా బాబు చెవిన పడిందా ?. ఇసుక.. గనులు.. వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఎమ్మెల్యేలు కార్యకర్తల రుబాబు ఆకాశాన్ని తాకింది. ఈ వ్యతిరేకత అంతా తాజా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఇది బాబు దృష్టికి వెళ్లిందని.. అందుకే విశాఖలో యోగా కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అయన కార్యకర్త్తలను సున్నితంగా హెచ్చరించారని అంటున్నారు. గట్టిగా వార్ణింగ్ ఇవ్వలేక సుతిమెత్తగా తమలపాకుతో .. నెమలీకతో కొట్టినట్లుగా మెత్తని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే అయన 'ఎమ్మెల్యేల పని తీరుపై మొన్న సర్వే చేయించా.. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్.. లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. కార్యకర్తలే అధినేత.. ఇది సాధ్యం కావడం కోసం ఎమ్మెల్యేలు పని చేయాలి.. కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా.. వాళ్ల మద్దతు లేకపోతే పక్కన పెడతా' అంటూ హెచ్చరికలు చేసారు. ఇలా చెబితే ఎవరు వింటారు.. మళ్ళా ఎవరి దందాల్లో వాళ్ళుంటారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ టీడీపీ నాయకులు... కార్యకర్తలు తల ఎగరేస్తున్నారు. ::: సిమ్మాదిరప్పన్న

US Prez Trump real End Comments Amid Israel Iran Conflict Escalates8
కాల్పుల విరమణ కాదు.. ట్రంప్‌ రియల్‌ ఎండ్‌ వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం ఐదో రోజు కొనసాగుతోంది. యుద్ధం తీవ్రతరం కావొచ్చని.. పశ్చిమాసియా నుంచి ఈ ఉద్రిక్తతలు మిగతా ప్రపంచానికి విస్తరించవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వరుస ప్రకటలను, చేష్టలను, చర్యలను అన్వయించుకుంటున్నారు. అయితే..ట్రంప్‌ మాత్రం ఊహకందని రీతిలో స్పందిస్తున్నారు. జీ7 సదస్సు నుంచి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో బయల్దేరే ముందు తాను కాల్పుల విరమణ కోసం ప్రయత్నించడం లేదని.. అంతకు మించి ఉత్తమమైన మార్గం కోసం ప్రయత్నిస్తున్నానని మీడియా ప్రతినిధులతో అన్నారు. కాల్పుల విరమణ కాదు.. నిజమైన ముగింపు కోసం ప్రయత్నిస్తున్నాం. అది నిజమైన ముగింపుగా ఉండనుంది అని ట్రంప్‌ పేర్కొన్నట్లు బీబీసీ ఒక కథనం ప్రచురించింది.ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించడంపై ట్రంప్‌కు ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇరాన్‌ ఎట్టి పరిస్థితుల్లో అణు ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారాయన. ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతాయన్న ట్రంప్‌.. రాబోయే రెండు రోజుల్లో మీరే చూస్తారని, అప్పటిదాకా ఎవరూ వెనక్కి తగ్గకపోవచ్చని సీబీఎస్‌ జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలను బట్టి అమెరికా నుంచి దౌత్య వేత్తలను ఇరాన్‌తో చర్చలకు పంపించవచ్చని రాయిటర్స్‌ ఓ కథనం ఇచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ లేదంటే పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్‌ విట్‌కాఫ్‌లలో ఎవరో ఒకరిని పంపొచ్చని ఆ కథనం ఉటంకించింది.ఇరాన్‌ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట జూన్‌ 13వ తేదీ నుంచి దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్‌. ప్రతిగా ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలతో ఒకవైపు ఇరుదేశాల్లో ప్రాణ నష్టంతో పాటు మరోవైపు చమురు మార్కెట్‌ కుదేలు అవుతోంది. ఈ క్రమంలో..జీ7 సదస్సును కుదించుకుని మరీ హడావిడిగా వాషింగ్టన్‌ బయల్దేరారు అధ్యక్షుడు ట్రంప్‌. అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్‌ ప్రతిపాదన చేశారంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ప్రకటించగా.. కాసేపటికే అందులో వాస్తవం లేదని ట్రంప్‌ కొట్టిపారేశారు. జరగబోయేది మేక్రాన్‌కు తెలియదని.. అది కాల్పుల విరమణకు మించే ఉంటుందని ట్రంప్‌ సోషల్‌ ట్రూత్‌ వేదికగా ప్రకటించారు.న్యూక్లియర్‌ ఎలాంటి అణ్వాయుధాలను కలిగి ఉండడానికి వీల్లేదంటున్న ట్రంప్‌.. టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈలోపు.. ఆయన సిట్యుయేషన్‌ రూమ్‌లో జాతీయ భద్రతా మండలితో భేటీ అవుతుండడంతో ‘ఏదో జరగబోతోందంటూ’ చర్చ నడుస్తోంది.ఇదీ చదవండి: టైం లేదు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

Air India crash UAE doctor pledges rs 6 crores to families of Medical students victims9
Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు

Air India plane crash అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం 171 ప్రమాదంలో ఘోర ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాంలో విమాన ప్రయాణికులతోపాటు, అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత వైద్య విద్యార్థులు ,వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్ (Indian doctor Shamshir Vayalil) ముందుకొచ్చారు. సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్‌ సహాయాన్ని ప్రకటించారు..కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , VPS హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్‌లను "భవిష్యత్ ఫ్రంట్‌లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్‌లో చదువుకున్న ఆయన వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. భోజనం తింటున్న సమయంలో హాస్టల్‌లో జరిగిన ప్రమాదంలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా డా. షంషీర్‌ ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది.They were future frontline heroes.Manav, Aaryan, Rakesh, and Jaiprakash were preparing to save lives, not lose their own. The AI171 crash took them from us. Pledging ₹6 crore to support their families and others affected.#AirIndia171 #AI171 #BJMedicalCollege pic.twitter.com/Jh0vivpstJ— Dr. Shamsheer Vayalil (@drshamsheervp) June 16, 2025ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట. తాను హాస్ట్‌లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృ‍శ్యాలను చూసి చలించిపోయారట. వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు (Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్‌ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని M.A. యూసుఫ్ అలీ తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన వాయలిల్‌ తన దాతృత్వాన్ని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.ఇదీ చదవండి: Cancer Risk ఈ ఫుడ్స్‌తో ముప్పే..!డాక్టర్‌ వార్నింగ్‌కాగా లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 ,జూన్​ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతుల్య హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. ఈఘటనలో మెడికల్ కాలేజీ (BJMC) మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్యను BJMC జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JDA) ధృవీకరించింది . ప్రమాదంలో మరో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన చికిత్స పొందుతున్నారని DA అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. విద్యార్థుల ప్రాణనష్టంతో పాటు, "అతుల్యం" నివాస గృహాలలో నివసిస్తున్న సూపర్-స్పెషాలిటీ వైద్యుల నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక నివాస వైద్యుడి భార్య గాయపడి చికిత్స పొందుతోంది.

Smriti Mandhana becomes ICC No. 1 Ranked ODI batter for first time in six years10
వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా టీమిండియా స్టార్ ఓపెన‌ర్‌

ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన సత్తాచాటింది. తాజాగా ఐసీసీ ప్రక‌టించిన ర్యాకింగ్స్‌లో మంధాన త‌న ఆరేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ.. అగ్ర‌స్ధానాన్ని కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌ల శ్రీలంక‌, ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ముక్కోణ‌పు సిరీస్‌లో అద్బుత‌ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో మంధాన తిరిగి త‌న టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.మంధాన ప్ర‌స్తుతం 727 రేటింగ్ పాయింట్లతో నెం1 ర్యాంక్‌లో కొన‌సాగుతోంది. ఆ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్‌, ఇంగ్లండ్ సార‌థి నాట్ స్కైవర్-బ్రంట్ 719 రేటింగ్ పాయింట్లతో రెండో స్దానంలో సంయుక్తంగా ఉన్నారు.స్మృతి విష‌యానికి వ‌స్తే గ‌తేడాది అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. 2024 ఏడాదికి గానూ ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే క్రికెటర్ ఆఫ్‌ది ఇయ‌ర్‌గా మంధాన నిలిచింది. గ‌తేడాదిలో 13 మ్యాచ్‌ల‌లో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. అందులో నాలుగు సెంచ‌రీలు ఉన్నాయి.వ‌న్డేల్లో ఒకే క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన మ‌హిళా క్రికెట‌ర్‌గా మంధాన రికార్డుల‌కెక్కింది. ఈ స్టార్ ఓపెన‌ర్ ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు స‌న్న‌ద‌మ‌వుతోంది. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2025 స‌న్న‌హాకాల్లో భాగంగా ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత మహిళా జట్టు..భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హస్బానిస్, దీప్తి శర్మ, స్నేహి రాణా, శ్రీ చరణి, శ్రీ చరణి, స్నేహి రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రానా, రాధా యాదవ్‌, , అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.చదవండి: WI vs AUS: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క మార్పు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement