ప్రధాన వార్తలు

‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడంపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తప్పుడు ప్రకటన చేశారంటూ ఖమేనీ ఆరోపించారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణ సూచనను తిరస్కరిస్తూ, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే దేశం కాదని ఖమేనీ స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఈ ఇరు దేశాలు ఘర్షణలను ఆపేందుకు అంగీకారం తెలిపాయని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ దీనిని తిరస్కరిస్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అబద్ధమని, అమెరికాకు ఇటీవల జరిగిన అవమానం నుండి దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఈ విధమైన ప్రకటన చేశారని పేర్కొంది. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు. ఇరాన్ చరిత్ర, ఇక్కడి ప్రజల గురించి తెలిసిన వారికి ఇరాన్ లొంగిపోయే దేశం కాదని స్పష్టంగా తెలుసన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్.. ఇరాన్- ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయని, సంఘర్షణతో నిండిన ఈ ప్రాంతంలో ఈ తాజా పరిణామం అభివృద్ధికి దారితీస్తుందని దానిలో పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం శాంతియుతంగా జరుగుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన

ఎయిరిండియా కీలక నిర్ణయం.. గల్ఫ్ మీదుగా వెళ్లే విమానాలు రద్దు
గల్ఫ్ దేశాల్లో సైరెన్లు మోగుతున్నాయి. గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది.మరోవైపు, ఖతార్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఖతార్ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని భారత్ తెలిపింది. కాగా, ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నా ఖతార్.. ఇతర దేశాల పౌరుల భద్రతకు ముప్పులేదని తెలిపింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్ స్పష్టం చేసింది.కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి.

రేపే శుభాంశు శుక్లా రోదసి యాత్ర
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు ఎట్టకేలకు కొత్త తేదీ ఖరారైంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్లో భాగంగా జూన్25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల అనంతరం ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 14 రోజుల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్తవేత్తలు ఈ నలుగురు వ్యోమగాములతో సంభాషించనున్నారు. ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన

చంద్రబాబే యమకింకరుడు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచార కండూతికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి...! టీడీపీ అధినేత సభలకు జనం వెల్లువెత్తినట్లు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరీ...! బాబు సభలో చీరల పంపిణీకి మహిళలు భారీగా వచ్చారని నమ్మించే మాయాజాలానికి ముగ్గురు మృత్యువాత... చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో ఆరుగురు.. సింహాచలంలో ఏడుగురు దైవ సన్నిధిలో దుర్మరణం. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ‘పాద’ఘట్టం కింద నలిగిపోయిన ప్రాణాలు అనేకం..! గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొనిఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రభుత్వ వైఫల్యాలతో అర్ధాంతరంగా ముగిసిన జీవితాలు ఎన్నో..! కానీ అవి ఏదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటనలు కావు. పరోక్షంగా చంద్రబాబు చేసిన హత్యలే!! అందుకు బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసులు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అడుగు పెడితే చాలు... యమపాశం పట్టుకుని యమకింకరుడు వచ్చినట్టుగా సామాన్యులు హడలిపోయే పరిస్థితులు కల్పించిన ఆ ఉదంతాలు ఇవిగో..పుష్కరాల్లో తొక్కిసలాట సమయంలో మృతదేహాలను పేర్చిన దృశ్యం(ఫైల్)గోదావరి పుష్కరాలు... బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను చూసేందుకు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చేయాలని చంద్రబాబు భావించారు. తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్కు ఈ ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైన 2015 జూలై 15 ముందు రోజు అంటే 14వతేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసివేశారు. మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్లో పడిగాపులు కాశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి తదితరులు జూలై 15న ఉదయం 8 గంటలకు పుష్కర ఘాట్లో స్నానానికి వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్ వద్ద ఒక్క గేటును మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు. పెద్ద సంఖ్యలో తోసుకుని వచ్చే భక్తులు చంద్రబాబు కోసం వస్తున్నట్టుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలని కుట్ర పన్నారు.రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదేమీ ప్రమాదవశాత్తూ జరిగింది కాదు. పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విషాదం చోటు చేసుకుంది. అంటే ఇవన్నీ ఆయన చేసిన హత్యలే! మరి ఆనాడు చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు పెట్టారా...? దీనిపై విచారణకు నియమించిన కమిటీ కాలయాపన చేయడం మినహా భక్తుల దుర్మరణానికి కారకుడైన చంద్రబాబును బాధ్యుడిని చేసిందా? కందుకూరులో తొక్కిసలాట క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఫైల్) ఎన్నికల ప్రచార ఆర్భాటానికి ఎనిమిది ప్రాణాలు హరీ..! పోలీసులు వారించినా కందుకూరు ఇరుకు రోడ్డులో సభతన సభలకు జనం రావడం లేదన్న వాస్తవం చంద్రబాబును తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కొందరి ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. తన కార్యక్రమాలకు జనం భారీగా వచ్చినట్టుగా నమ్మించాలని ఆయన ఎత్తుగడ వేశారు. దీని ఫలితం.. కందుకూరులో 8 మంది సామాన్యుల మృత్యువాత! 2022 డిసెంబరు 29న చంద్రబాబు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. తన కార్యక్రమానికి భారీగా జనం వచ్చినట్లు చూపించాలని ఉద్దేశపూర్వకంగా ఓ ఇరుకైన రోడ్డులో సభ నిర్వహించారు. ఆ రోడ్డులో సభ నిర్వహించవద్దని పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు ఖాతరు చేయలేదు.ఆ రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారిపోయింది. కనీసం చంద్రబాబు ప్రసంగించే వాహనాన్ని అయినా ఆ రోడ్డు వద్ద వెడల్పుగా ఉన్న జంక్షన్లో నిలపాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. ఆ ఇరుకైన రోడ్డులోకే చంద్రబాబు వాహనాన్ని హఠాత్తుగా తీసుకెళ్లారు. దాంతో అలజడి రేగి తొక్కిసలాట జరిగింది. జనం పక్కన ఉన్న కాలువలో ఒకరిపై ఒకరు పడిపోయారు. అమాయకులు మృత్యువాత పడ్డారు. చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చినట్టు చూపించేందుకు వేసిన ఎత్తుగడ 8 మందిని బలితీసుకుంది. మరి దీన్ని దుర్ఘటన అంటారా...? చంద్రబాబు చేసిన హత్యలే కదా!! మరి అందుకు ఆయనపై హత్యానేరం కింద కేసు పెట్టాలి కదా? అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాటలో కింద పడిన భక్తులు తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణంచంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఎనిమిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. దాదాపు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 9వతేదీ తెల్లవారు జామున ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా తిరుపతి చేరుకున్నారు.వేచి ఉండేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో తీవ్ర చలిలో రోడ్లపైనే గంటల తరబడి నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో టికెట్లు జారీ చేస్తున్నామంటూ హఠాత్తుగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ⇒ 2018 మార్చి 31న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రాముల వారి కల్యాణం సందర్భంగా టెంపరరీ షెడ్ గాలికి కుప్ప కూలిన ఘటనలో నలుగురు మృతి చెందగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తొక్కిసలాటలో మరణించిన మహిళ (ఫైల్) గుంటూరులో చీరలు పంపిణీ... ముగ్గురు మహిళలు మృత్యువాతచంద్రబాబు తన ప్రచారార్భాటంతో మహిళలనూ వదిలిపెట్టలేదు. 2023 జనవరి 1న గుంటూరులో ఆయన సభ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున చీరలు పంచుతామంటూ మహిళలను తరలించి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఆ కార్యక్రమం ముగిస్తున్నట్టు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. దాంతో ఉన్న కొద్ది చీరలు తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించింది. చంద్రబాబు ప్రచారార్భాటం కోసం వేసిన చీప్ ట్రిక్తో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరి ఆ రోజు ముగ్గురు మహిళల మృతికి చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ ఆయనపై హత్యానేరం నమోదు చేయాలి కదా? అని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు. అప్పన్న చందనోత్సవంలో తీవ్ర నిర్లక్ష్యం... ఏడుగురు భక్తుల దుర్మరణంపవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నా... దైవ సన్నిధిలో భక్తుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు సర్కారు అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించింది. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నాసిరకంగా నిరి్మంచిన గోడ కుప్ప కూలడంతో ఈ ఏడాది ఏప్రిల్ 30న ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాబు గద్దింపు ఇదీ..!ఏం కుంభమేళాలో చనిపోవడం లేదా..? జగన్నాధ రథ యాత్రలో చనిపోవడం లేదా..? యాక్సిడెంట్లలో చనిపోవడం లేదా...? బాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతిగతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 2015 జూలై 15న నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని పోలవరం పంచాయతీ యడ్లగూడెంకు చెందిన యడ్లపాటి మంగమ్మ (70) మృతి చెందింది. 2016 ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు కాన్వాయ్ వాహనం ఢీకొని విజయవాడలో నాగేంద్ర వరప్రసాద్ అనే ఉద్యోగి మృతి చెందారు. యనమలకుదురుకు చెందిన ఆయన సైకిల్పై కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన చంద్ర బాబు కాన్వాయ్ బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలైన వరప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ తమ విజయానికి 350 పరుగులు దూరంలో ఉండగా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.క్రీజులో జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్లు) శతక్కొట్టారు.ఈ టెస్టులో పంత్కు ఇది రెండో సెంచరీ. ఇక తొలి ఇన్నింగ్స్లో లభించిన 6 పరుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో మరోసారి బౌలర్లకు మరోసారి కఠిన సవాలు తప్పదు. బుమ్రాకు తోడుగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.93 ఏళ్ల చరిత్రలోనే..ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్ను అందుకుంది.గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు బాదారు.అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్ను అందుకున్నారు.చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

యుద్ధం ముగిసింది.. ఇరాన్-ఇజ్రాయెల్ వార్పై ట్రంప్ కీలక ప్రకటన
కాల్పుల విరమణను ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజలు యుద్ధానికి ఇది ముగింపు.. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు.మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయన్న ట్రంప్.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. ప్రస్తుతానికి కాల్పుల విరమనణ జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై అనిశ్చితి ఏర్పడింది.కాగా, కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది.

జీడిమెట్లలో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
సాక్షి, మేడ్చల్: జీడిమెట్ల పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ.. తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి(39) గొంతు పిసికి, తలపై రాడ్తో కొట్టి చంపేసింది జీడిమెట్ల పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ.. సిగ్నల్ కట్ చేసి...
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది.దుండగులు కోమలి సమీపంలో సిగ్నల్ కేబుల్ కట్ చేయడంతో రైలు నిలిచిపోయింది. ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకున్నారు. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గేమ్ ఛేంజర్'.. దారుణమైన ఫ్లాప్గా నిలిచింది. తొలిరోజు తొలి ఆటకే ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే హీరో-నిర్మాత దీని గురించి పెద్దగా స్పందించలేదు కానీ దర్శకుడు, ఎడిటర్ మాత్రం కొన్నిరోజుల తర్వాత మాట్లాడారు. తమది తప్పు కాదన్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే 'తమ్ముడు' సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు 'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్పేశారు.దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జిమెంట్, ఫిల్మ్ మేకింగ్లో అనుభవం అనే బ్రాండ్ ఉంది. మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100 శాతం ఆ సమస్య ఉంటుంది. దిల్ రాజుకే కాదు. అందరికీ ఆ ప్రాబ్లమ్ తప్పదు. సినిమాని నాలుగున్నర గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే. పెద్ద డైరెక్టర్తో చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం'(ఇదీ చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను: మణిరత్నం)'అయితే రోజూ కిచిడీ ఉంటుంది. రోజూ కావాలా.. మొత్తం అయిపోయాక ఒక్కసారి చూసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అది నా వైఫల్యమే. అలాంటి ప్రాజెక్ట్ని నేను చేసి ఉండకూడదు. నా కెరీర్లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేదు. అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణంయం అదే. పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు ముందే కాంట్రాక్ట్లో క్లియర్గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్లాలి. అలా చేయలేకపోయాను. అది నా తప్పు''ఆ తప్పుని అంగీకరించి దానిని అక్కడితో వదిలేశాను. అది మన స్కూల్ కాదు. అలా కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్' అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలానే చివరి నిమిషం వరకు మీరు సినిమా చూడలేదట కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది మాత్రం తప్పు, తాను ముందే సినిమా చూశానని చెప్పారు. ఏదేమైనా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తప్పుని హుందాగా ఒప్పుకోవడం కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంతో టీడీపీ, ఎల్లో బ్యాచ్ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ‘ఎక్స్’ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడిగిపారేశారు. ‘‘ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది.ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరం..’ అని ధ్వజమెత్తారు. ‘మీ పర్యటనల సమయంలో.. మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మానవత్వం, నైతికత గురించి మీరా మాట్లాడేది?..’ అని సీఎం చంద్రబాబును సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా మారండి..! అని హితవు పలుకుతూ సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.అందులో ఏమన్నారంటే.. చంద్రబాబూ..! ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి చేశారు? గతంలో మీరుగానీ, మీ పవన్కళ్యాణ్గానీ తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా.. మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా? మాకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం..! లేదంటే మూడ్ రానప్పుడు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వాని కైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా!! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించి ఆమేరకు ఆ మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్ ఇది.మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రామ్కు సంబంధించిన రూట్మ్యాప్ ఇచ్చిన తర్వాత.. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రొటోకాల్లో భాగమైనప్పుడు.. మరి మీ రోప్ పార్టీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని, ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా.. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. ⇒ మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీలు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? ⇒ జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోవడంతో గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. ⇒ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?⇒ ప్రతిపక్షంగా ఉన్నందున నేను ప్రెస్మీట్ పెట్టి గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే.. మీ పాలనా వైఫల్యాలను, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే... రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లల బతుకులు.. వీటన్నింటినీ నేను చెబితే... వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. ⇒ ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు.. దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మా పార్టీ ప్రత్తిపాడు ఇన్ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మావాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఆరి్థక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చా.ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మామీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం!
బ్యాటింగ్కు అంత ఈజీగా లేదు.. విజయం మాదే: కేఎల్ రాహుల్
రీల్స్ కోసం.. బైకుపై ఎనిమిది మంది
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఏఈ మనీషా
‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు
ఆటకు హాకీ స్టార్ లలిత్ బైబై
విరివిగా.. విదేశీ మద్యం
హైదరాబాద్.. తగ్గేదేలేద్..!
నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా నగలు, నగదు!
మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
రిషికేశ ఈజ్ బ్యాక్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
కోరలు చాచిన కుల వివక్ష
పనివేళల్లో ‘ఉపాధి’ విందు
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై?
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్
బ్యాటింగ్కు అంత ఈజీగా లేదు.. విజయం మాదే: కేఎల్ రాహుల్
రీల్స్ కోసం.. బైకుపై ఎనిమిది మంది
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఏఈ మనీషా
‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు
ఆటకు హాకీ స్టార్ లలిత్ బైబై
విరివిగా.. విదేశీ మద్యం
హైదరాబాద్.. తగ్గేదేలేద్..!
నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా నగలు, నగదు!
మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు
నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు
అలాగే లాడెన్ జిందాబాద్ అని కూడా అనమంటున్నార్సార్!
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేత
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
లంచం తీసుకుంటుంటే ఉద్యోగంలోంచి తీసేశారు. లంచం ఇచ్చి మళ్లీ చేరాను!
రిషికేశ ఈజ్ బ్యాక్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. భూలాభాలు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. నూతన ఉద్యోగాలు
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
కోరలు చాచిన కుల వివక్ష
పనివేళల్లో ‘ఉపాధి’ విందు
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై?
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్
సినిమా

మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్స్టార్ మహేశ్బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేశ్, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.షూటింగ్ అయిపోగానే..త్రిష మాట్లాడుతూ.. మహేశ్ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్. చాలా హార్డ్వర్క్ చేస్తారు. నాకేమో.. షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్కు వచ్చిన మహేశ్ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.ఎప్పుడూ మానిటర్ దగ్గరే..తను వానిటీ వ్యాన్కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా.. మానిటర్ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

తెలుగు సీరియల్ నటి సీమంతం వేడుక
తెలుగు సీరియల్ నటి అంజలికి సీమంతం వేడుకలు సందడిగా జరిగాయి. 'మొగలిరేకులు' సీరియల్తో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. తర్వాత పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఇప్పుడు తనకు సీమంతం జరిగిందని చెబుతూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?)'మొగలిరేకులు'లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ చేసింది. వీటితో పాటు మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ నటించింది. అలానే లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈమె.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు చందమామ అనే కూతురు కూడా ఉంది.కొన్నేళ్ల క్రితం సీరియల్స్ పూర్తిగా తగ్గించేసిన అంజలి.. భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. ఎక్కువగా కూతురు చందమామతో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ల ముందు ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన ఈమె.. ఇప్పుడు తనకు గ్రాండ్గా సీమంతం జరిగిన విషయాన్ని వీడియో రూపంలో ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకకు యాంకర్ స్రవంతితో పాటు అర్జున్ అంబటి, శ్వేతా నాయుడు, యష్మీ తదితరులు వచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Anjali Attota (@anjaliattota)

థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం
లెజెండరీ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అందులోనూ బ్లాక్బస్టర్ కాంబినేషన్ అంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన నాయకన్ (తెలుగులో నాయకుడు) ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమాయే థగ్ లైఫ్ (Thug Life Movie).క్షమించండిబోలెడు ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ రిజల్ట్పై మణిరత్నం (Mani Ratnam) స్పందిస్తూ సారీ చెప్పారు. మా నుంచి నాయకన్లాంటి సినిమా వస్తుందని ఎదురుచూసినవారికి నేనొక్కటే చెప్పగలను. మమ్మల్ని క్షమించండి. మేము గతాన్ని తిరగరాయాలనుకోలేదు. ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాం. కానీ మీరు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఊహించని ఫలితాల్సి అందుకున్నాం. ప్రేక్షకులు.. మేము ఇచ్చినదానికంటే పూర్తి భిన్నమైనదేదో ఎక్స్పెక్ట్ చేశారు అని పేర్కొన్నారు. జూన్ 5న విడుదలైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చదవండి: జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?

బీచ్లో కాజల్ అగర్వాల్ .. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్!
బీచ్లో ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్..పట్టాయాలో చిల్ అవుతోన్న రోహిణి..హీరోయిన్ నభా నటేశ్ గ్లామరస్ లుక్స్..జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్..మదర్తో మన్మధుడు హీరోయిన్ అన్షు చిల్.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (77) సోమవారం లండన్లో గుండెపోటుతో కన్నుమూశారు. 2 ఏళ్ల వయసులో ఆయనకు తొలిసారి భారత్ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. 1979–1983 మధ్య కాలంలో 33 టెస్టులు ఆడి 114 వికెట్లు పడగొట్టిన దిలీప్ దోషి...15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు.1981లో మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సుదీర్ఘ కాలం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్, నాటింగ్హామ్షైర్ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత లండన్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత్ జట్టులో బిషన్సింగ్ బేడి హవా నడుస్తుండటంతో దిలీప్కు ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. ‘స్పిన్ పంచ్’ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.కాగా ఆయన కుమారుడు నయన్ జోషీ సైతం సర్రే, సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దోషీ మృతికి సంతాపంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్స్ భుజానికి కట్టుకుని బరిలోకి దిగనున్నారు.

ముంబైని వీడిన పృథ్వీ షా
ముంబై: భారత క్రికెట్లో మెరుపులా వచ్చివెళ్లిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాజాగా ముంబై జట్టును వీడాడు. ఈ మేరకు మరో జట్టుతో ఆడేందుకు వీలుగా తనకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాల్సిందిగా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)ను అభ్యర్థించాడు. అతని క్రికెట్ భవిష్యత్తు కోసం పృథ్వీ షా అభ్యర్థనను మన్నించిన ముంబై సంఘం ఎన్ఓసీ జారీ చేసింది. ఇదివరకే మహారాష్ట్ర సంఘంతో సంప్రదింపులు జరిపిన అతను ఈ సీజన్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో టీమిండియా తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు. చివరిసారిగా ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ మాత్రమే ఆడాడు. అందులోనూ పెద్దగా మెరుపుల్లేకపోవడంతో ఎంసీఏ అతన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అలా ఓ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కళ్లు తెరిచిన పృథ్వీ షా ఈ సీజన్లో ముంబై తరఫున అవకాశం రాదని గుర్తించాడు. దీంతో మరో జట్టును సంప్రదించిన మీదట ఎన్ఓసీ కోసం ముంబై సంఘాన్ని కోరాడు. ఈ సందర్భంగా ఎంసీఏ కూడా హుందాగా వ్యవహరించి అతను తమ దేశవాళీ జట్టుకు అందించిన సేవల్ని కొనియాడింది. ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదప్ యువ క్రికెటర్ భవిష్యత్తులో రాణించాలని అభిలషించారు. దీనికి ప్రతిగా పృథ్వీ కూడా కృతజ్ఞత చాటుకున్నాడు. తనకెన్నో అవకాశాలచ్చిన ముంబై ద్వారానే నేను క్రికెట్కు పరిచయమయ్యానని చెప్పుకొచ్చాడు. ఏడాదిగా... ఖాళీగా... క్రికెట్లోకి వచ్చీరాగానే యువ కెరటంగా మారిన పృథ్వీ షా దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ సహా పలువురి మన్ననలు పొందాడు. ఎంత వేగంగా వెలిగాడో... కానీ ఆటపై కొరవడిన ఆసక్తి, ఫామ్పై అలసత్వం, క్రమశిక్షణ రాహిత్యం, ఫిట్నెస్ సమస్యలతో అంతే వేగంగా కుంగాడు. మొదట టీమిండియాకు ఎప్పుడో దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్కు భారమయ్యాడు. తాజాగా సొంత జట్టు ముంబైకి అవసరం లేకుండా పోయాడు. క్రమంగా ఏ జట్టు అక్కున చేర్చుకోలేకపోవడంతో పూర్తిగా ఏడాదికిపైగానే ఖాళీగా ఉంటున్నాడు. మితీమీరిన శరీర బరువుతో సతమతమవుతున్న పృథ్వీ షా ముంబై జట్టులో స్థానం కోల్పోయాక... ఇప్పుడు మహారాష్ట్ర పంచన చేరేందుకు సిద్ధమయ్యాడు.

నా లక్ష్యం... ‘టోక్యో స్వర్ణం’
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన ప్రధాన లక్ష్యం ప్రపంచ చాంపియన్షిప్ టైటిలే అని స్పష్టం చేశాడు. చోప్రా తను ఆశించిన 90 మీటర్ల మార్క్తో కాకపోయినా... పారిస్ డైమండ్ లీగ్లో 88.16 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఇక్కడ జరిగే ‘గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్’లో పాల్గొనేందుకు వచ్చిన భారత స్టార్ మరో విజయంపై కన్నేశాడు. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ తన ప్రదర్శనకు చెక్ రిపబ్లిక్ గ్రేట్ జాన్ జెలెజ్నీ కోచింగ్ ఎంతో దోహదం చేసిందని అన్నాడు. అతని శిక్షణలోనే రాటుదేలిన 27 ఏళ్ల భారత స్టార్ ఈ సీజన్లో జరిగిన ప్రారంభ దోహా డైమండ్ లీగ్లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో చోప్రా మాట్లాడుతూ ‘మేటి అథ్లెట్, కోచ్ అయిన జెలెజీ్నతో కలిసి పనిచేయడం చాలా సంతోషానిస్తోంది. ఆయన ఇచ్చిన సూచనలు, కిటుకులతోనే ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ను దాటేశాను. దీన్ని పునరావృతం చేయడంపై దృష్టిసారించాను. ఇక్కడి నైంబర్క్లో అహ్లాదకర వాతావరణంలో ట్రెయినింగ్ సెషన్ పూర్తిచేశాను. తప్పకుండా ఒ్రస్టావాలో నా శక్తి మేర రాణిస్తాను. అయితే నా ప్రధాన లక్ష్యం మాత్రం టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో నెగ్గడమే. ఇందుకోసమే క్రమం తప్పకుండా చెమటోడ్చుతున్నాను. తీరిక లేకుండా ఇటు ట్రెయినింగ్ సెషన్స్, అటు డైమండ్ లీగ్లలో పోటీపడుతున్నా’ అని అన్నాడు. ఈ సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు టోక్యోలో ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్లోనే స్వర్ణం గెలుపొందిన తొలి భారతీయ అథ్లెట్ అక్కడ మరో పతకాన్ని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఒ్రస్టావా మీట్కు రావడం చాలా ఆనందంగా ఉందని చోప్రా అన్నాడు. ఒకప్పుడు ఇక్కడ జరిగే పోటీల్లో గ్రేటెస్ట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పోటీని టీవీల్లో చూసి మురిసేవాడినని ఇప్పుడు అదే వేదికపై తాను పోటీ పడుతున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్ జరుగుతుంది.

భారత్ 13 మంగోలియా 0
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ 13–0 గోల్స్ తేడాతో మంగోలియా జట్టును చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ జక్సా ఐదు గోల్స్ (29వ, 45వ, 46వ, 52వ, 55వ నిమిషాల్లో)తో అదరగొట్టగా... తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (20వ, 59వ నిమిషాల్లో), ప్రియదర్శిని సెల్లాదురై (73వ, 86వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. సంగీత (8వ నిమిషంలో), రింపా హల్దర్ (67వ నిమిషంలో), మాళవిక (71వ నిమిషంలో), గ్రేస్ డాంగ్మె (75వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలోనే భారత జట్టుకిది అతిపెద్ద విజయం కావడం విశేషం. 1997లో, 2005లో గ్వామ్ జట్టుపై భారత్ 10–0 గోల్స్ తేడాతో గెలిచింది. తాజా ఫలితంతో భారత జట్టు తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గత సీజన్లో ‘భారత ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారిణి’ అవార్డు గెల్చుకున్న సౌమ్య అందించిన పాస్ను లక్ష్యానికి చేర్చి సంగీత భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రింపా క్రాస్ పాస్ను హెడర్ షాట్తో సౌమ్య గోల్గా మలిచింది. విరామ సమయానికి ముందు ప్యారీ జక్సా రెండు గోల్స్ చేయడంతో భారత్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 4–0 తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో భారత్ మరింత దూకుడును పెంచింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 29న తిమోర్ లెస్టె జట్టుతో ఆడుతుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది.
బిజినెస్

వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు

జియో కొత్త వైఫై.. ఏకంగా 6 రెట్లు అధికంగా..
రిలయన్స్ జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్ను భారత్లో లాంచ్ చేసింది. ఈ కొత్త వైఫై 6 రౌటర్ మెష్ టెక్నాలజీతో వస్తుంది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ద్వారా అందిస్తున్న గరిష్ట ఇంటర్నెట్ వేగం 1000 ఎంబీపీఎస్ కాగా ఇది 6,000 ఎంబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే 6 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్ను ఆనందివచ్చు. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. 4కే స్ట్రీమింగ్, గేమింగ్కు బాగా సరిపోతుంది.జియో కొత్త వైఫై రౌటర్ జీరో లాగ్ తో 100కు పైగా డివైజ్ లను హ్యాండిల్ చేస్తుందని, డేటా భద్రత కోసం డబ్ల్యూపీఏ3 సపోర్ట్ తో వస్తుందని చెబుతున్నారు. పెద్ద లేదా బహుళ అంతస్తుల ఇళ్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఈ రౌటర్ను రూపొందించారు. ఇది ఆన్లైన్ గేమర్లు, బింజ్ వాచర్స్, ఎక్కువ కనెక్టెడ్ పరికరాలను వినియోగించే స్మార్ట్ హోమ్ వినియోగదారులు, పెద్ద కుటుంబాలకు అనువైనది.కొత్త జియో ఏఎక్స్ 6000 యూనివర్సల్ రూటర్ ధర భారత్లో రూ.5,999. ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వంటి బహుళ పరికరాలను ఒకేసారి హైస్పీడ్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జియో ట్రూ ఏఐ మెష్ కవరేజ్, స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ ఐపీ ఓవర్ డీహెచ్సీపీ కనెక్టివిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుందని, ఐపీపీఓఈ, పీపీఓఈ కనెక్షన్ సెటప్ తో పనిచేయదని రిలయన్స్ తెలిపింది. కంపెనీ వెబ్సైట్తోపాటు ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ రౌటర్ను కొనుగోలు చేయవచ్చు.👉 జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. 👈

బ్యాంకులకు ఈ వారం వరుస సెలవులు
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. చివరి వారంలో అడుగు పెట్టేశాం. అయితే బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. జూన్ 23 నుంచి 29 వరకు బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, జాతీయ సంఘటనలు, మతపరమైన పండుగలు, ప్రాంతీయ ఆచారాలు, పరిపాలనా పరిగణనల ఆధారంగా ఈ సెలవులను నిర్ణయిస్తుంది.ఈ వారంలో బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవులతో సహా 3 సెలవులు ఉన్నాయి. జూన్ 27న ఒడిశాలో రథయాత్ర / కాంగ్ జరుగుతుంది. ఈ పండుగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తున్నారు. దీంతోపాటు జూన్ 28న నాల్గవ శనివారం, జూన్ 29న ఆదివారం కావడంతో ఎలాగూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో ఒడిశాలోని కస్టమర్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యక్షంగా బ్యాంకు శాఖల సేవలు అందుబాటులో ఉండవు. ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..జూన్ 27 శుక్రవారం: రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్ లలో బ్యాంకులకు సెలవుజూన్ 28 శనివారం: నాలుగో శనివారం - దేశం అంతటా బ్యాంకులకు సెలవుజూన్ 29 ఆదివారం: వీక్లీ ఆఫ్ - దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.జూన్ 30 సోమవారం: రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ప్రత్యక్షంగా బ్యాంకు శాఖలలో పనులు ఉన్నవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో భౌతిక శాఖలు మూసివేసినప్పటికీ, చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మార్గాల ద్వారా నిరాటంకంగా కొనసాగుతాయి. నగదు ఉపసంహరణ కోసం వినియోగదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్, మొబైల్ యాప్లు, యూపీఐ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు, ఇతర సాధనాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రం ఈ అధికారిక సెలవు దినాల్లో జరగవు.

8.49 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి ఏప్రిల్ నెలలో 19.14 లక్షల మంది చేరారు. ఈ ఏడాది మార్చి నెలలో చేరికతో పోల్చితే 31 శాతం, 2024 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది.ఏప్రిల్లో కొత్త సభ్యుల చేరిక 8.49 లక్షలుగా ఉంది. మార్చి నెలలో కొత్త సభ్యుల చేరిక కంటే 12.49 శాతం ఎక్కువ. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇందులో మహిళా సభ్యులు 2.45 లక్షల మంది ఉన్నారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 17.63 శాతం పెరిగారు. కొత్త సభ్యుల్లో 57 శాతం మేర అంటే, 4.89 లక్షల మంది వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది.మహిళా సభ్యుల నికర చేరిక మాత్రం మార్చి నెలతో పోల్చి చూస్తే 35 శాతం అధికంగా 3.95 లక్షలుగా ఉంది. ఏప్రిల్లో సుమారుగా 15.77 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 19 శాతం పెరిగింది. నికర చేరికలో అత్యధికంగా 21 శాతం సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు.
ఫ్యామిలీ

‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు
‘శ్వాస మీద ధ్యాస’.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించే ధ్యానానికి అద్భుత సాధనం అన్న విషయం మనకు తెలుసు. ఇది కేవలం నమ్మకం కాదని, అక్షరాలా సత్యమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం చూపే అధ్యయన ఫలితం వెలువడింది. ‘వేలి ముద్ర’ మాదిరిగానే ప్రతి మనిషికీ విలక్షణమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడిన ‘శ్వాస ముద్ర’ ఉంటుందట! ఆలోచనలపరంగా, ఆరోగ్యపరంగా మీరేమిటో చెప్పాలంటే మీ విలక్షణమైన ‘శ్వాస ముద్ర’ను చూస్తే చాలు అనే పరిస్థితి మున్ముందు రావచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు!!-సాక్షి సాగుబడిఇజ్రాయెల్లోని వీజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్ నోమ్ సోబెల్, ఆయన బృందం.. శ్వాస తీరుతెన్నులకు, వ్యక్తుల భావోద్వేగాలూ ఆరోగ్య స్థితిగతులకూ ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల ‘కరెంట్ బయాలజీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.96.8% ‘ప్రత్యేకం’ఈ అధ్యయనంలో భాగంగా 100 మందిని ఎంపిక చేసి, 24 గంటల పాటు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నమోదు చేసి, విశ్లేషించారు. నాసికా రంధ్రాల బయట పట్టుకొని ఉండే సెన్సార్లతో కూడిన పరికరాన్ని వారికి అమర్చారు. వారు నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా అనుక్షణం వారి శ్వాస తీరుతెన్నులను 24 గంటల పాటు నమోదు చేశారు. దీనితో పాటు వారికి ప్రశ్నావళిని కూడా అందించి, వారి అభిప్రాయాలను సేకరించి, విశ్లేషించారు. ప్రతి వ్యక్తీ 96.8% మేర తనదైన విలక్షణ శైలిలో శ్వాసిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కొందరు నిచ్ఛ్వాస తర్వాత తిరిగి శ్వాస తీసుకునే ముందు కొద్ది విరామం తీసుకున్నారు. మరికొందరు వెనువెంటనే లేదా ఇతరులకన్నా ముందే శ్వాస తీసుకున్నారు. ఎవరి తీరు వారిదే అన్నట్లు శ్వాస తీరుతెన్నులు ఉండటం విశేషం.అనారోగ్యాలు పసిగట్టేందుకూ..వ్యాకులత తదితర అంశాలపై వారు వ్యక్తపరచిన అభిప్రాయాలకు, వారి శ్వాస తీరుతెన్నులకు మధ్య సారూప్యత కనిపించింది. దీంతో, మనుషుల మానసిక స్థితిగతులను, అనారోగ్య సమస్యలను, రుగ్మతలను పసిగట్టేందుకు వారి శ్వాస తీరుతెన్నులు ఉపయోగపడతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఒక్కరి మెదడు మాత్రమే కాదు, వారి శ్వాస తీరుతెన్నులు కూడా విలక్షణమైనవే’ అనిపిస్తోందన్నారు వీజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్ నోమ్ సోబెల్. ఈ అధ్యయనంలో పాల్గొన్న వంద మందిలో 42 మంది శ్వాస ప్రక్రియను మరో 24 గంటలు అదనంగా అధ్యయనం చేశారు. ‘ఒకరు రన్నింగ్ చేస్తారు. మరొకరు చదువుకుంటుంటారు. ఇంకొకరు విశ్రమిస్తుంటారు. వీరి శ్వాస తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని గుర్తించటం చాలా కష్టమేమో అని ముందు అనుకున్నాం. అయితే, ఒకరి శ్వాస తీరుతెన్నులతో మరొకరిది చాలా విభిన్నంగా ఉండటం గమనించాం’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక విద్యార్థి తిమ్న సరోక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.వ్యాకులత.. తక్కువ గాలి!వారి శ్వాస తీసుకుంటున్న తీరు, నిద్రకు ఉపక్రమించటం–మేల్కొనటం, మనోవ్యథ, వ్యాకులతకు సంబంధించిన భావోద్వేగాలను బట్టి ఆయా వ్యక్తుల బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ)ను సైతం పరిశోధకులు అంచనా వేయగలగటం మరో విశేషం. అధ్యయనంలో భాగంగా ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసినప్పుడు వ్యాకులతను కనబరిచిన వ్యక్తులు చాలా తక్కువగా గాలి పీల్చుకున్నారు. అంతేకాదు, నిద్రలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య వచ్చిన విరామంలో చాలా హెచ్చు తగ్గుల్ని పరిశోధకులు గుర్తించారు. మనోవ్యథతో బాధపడుతున్న వారు మేల్కొని ఉన్నప్పుడు చాలా బలవంతంగా శ్వాసను తీసుకోవటం, గాలి వదిలిన తర్వాత తిరిగి శ్వాస తీసుకోవటానికి ముందు సుదీర్ఘంగా విరామం (పాజ్) ఇస్తుండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?ఆయురారోగ్యాలకోసం.. ‘ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడేవారి శ్వాస తీరుతెన్నులు మారి పోతున్నాయని మేం భావిస్తున్నాం. దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. మీరు శ్వాస తీసుకునే తీరును బట్టి మీకు ఒత్తిడి లేదా ఆందోళన వస్తున్నాయని కూడా అనుకోవచ్చు. అదేగనక నిజమైతే, ఆ రుగ్మతల నుంచి బయటపడేయటానికి శ్వాసించే తీరును మార్చితే సరిపోతుందని అనుకుంటున్నాం’ అన్నారు నోమ్ సోబెల్. శ్వాస మీద ధ్యాస పెడితే ఆయురారోగ్యాలు సమకూరుతాయంటే ఇదేనేమో!

అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..
ఒకప్పుడూ ఆర్మీలో ఉన్నతాధికారిగా సేవలందించింది. ఇప్పుడు వీధుల్లో ఫుడ్స్టాల్ నడుపుతూ లైఫ్ని లీడ్ చేస్తోంది. అయితే ఆమెలో అప్పుడలా..ఇప్పుడిలా అనే నైరాశ్యం అణువంతైనా తొణికిసలాడదు. నెట్టింట ఆమె కథ వైరల్లగా మారి ఎందరి మనసులనో కథిలించింది. ఎవరామె అంటే..79 ఏళ్ల ఈ వృద్ధురాలు ఒకప్పుడు ఆర్మీ మాజీ సైనికురాలు. అయితే ఆమె అస్సలు వివాహమే చేసుకోలేదట. ఆమె భారత సైన్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి పదవీవిరణమ చేసినట్లు తెలిపింది. అయితే ఆమెకు కుకింగ్ అంటే మహా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఇండోర్ వీధుల్లో ఒక ఫుడ్స్టాల్ని నడుపుతోంది. ఆమె ముంబైలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తిచేసినట్లు వెల్లడించింది. కొన్నేళ్లు జీవితంలో తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తన గత జీవితంలోనూ, ప్రస్తుతం ఎంతో ఆనందంగా సంతృప్తిగా జీవిస్తున్నానని ధీమాగా చెబుతోందామె. ఇక్కడ ఆ మహిళ ఈ వయసులో ఒంటరిగా ఈ వ్యాపారం ఎలా చేయగలను అనే సందేహానికి తావివ్వకుండా సాధికారత, సానుకూలతలను అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగడం ప్రశంసనీయం. అందుకు సంబంధించిన వీడియోని కాశీష్ సోని అనే సోషల్ మీడియా ఔత్సాహికురాలు నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. పైగా ఆ వీడియోకి లక్షకు పైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు సైతం ఒంటరిగా కూడా మహిళలు లైఫ్ని లీడ్ చేయగలరు అనడానికి ఈ మాజీ భారత ఆర్మీ హీరోనే ఉదాహరణ, ఎందరికో ఆ వృద్ధురాలు స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Kashish Soni (@tasty_trekk) (చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!)

అందానికి ఆధారం..నీరు, ఆహారం..!
ప్రతి వ్యక్తి అందానికీ దోహదం చేసేవాటిలో నీరు, ఆహారం ప్రధానమైనవని బ్యూటీ క్వీన్, నటి మనసా వారణాసి అన్నారు. కొత్తపేటలో నూతనంగా నెలకొల్పిన సికారా క్లినిక్స్లో సౌందర్య పోషణలో ఏఐ ఆధారిత ఉత్పత్తుల వినియోగం, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సంప్రదాయ ఆహారం, సౌందర్య సాధనాల విలువ అమూల్యమైనదని, అయితే ఆధునిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ట్రీట్మెంట్లు తప్పవని అన్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన హైడ్రో ఫేషియల్ వంటి చికిత్సలు తనకు ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సౌదర్య చికిత్స నిపుణులు, సంస్థ నిర్వాహకులు రాఘవేందర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య నిపుణులు సైతం కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు తాగమని సూచిస్తుంటారు. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే గాక, శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తుంది. తద్వారా చర్మం తాజాగా, కాంతిమంతంగా ఉంటుందనేది సౌందర్య నిపుణుల వాదన. ఇది ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే తేలికపాటి అందుబాటులో ఉన్న రెమిడీ. అంతేగాదు చల్లటి నీటిలో ముఖంపై పెట్టిన రక్తసరఫరా జరిగి మృతకణాలు పోతాయని కూడా అంటుంటారు నిపుణులు. అందువల్ల నీళ్లని తప్పనిసరిగా ఎక్కువగా తాగేలా ప్రయత్నిద్దాం. ఆరోగ్యంగానూ, అందంగానూ ఉందాం. (చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!)

Ooty టీ తోటలు తప్ప ఏముంది బ్యూటీ అనుకుంటున్నారా?
ఊటీలో తేయాకు తోటలున్నాయి. వందలాది గులాబీల తోట ఉంది. బొటానికల్ గార్డెన్లో శిలాజవృక్షం ఉంది. ఏడు వేల అడుగుల ఎత్తులో సరస్సు.ఎనిమిది వేల అడుగుల్లో పర్వత శిఖరం. ఊటీ అంటే... యాభై ఏళ్ల కిందటబాలీవుడ్ హీరో హీరోయిన్లు... యుగళగీతాలు పాడిన నేల.. టాలీవుడ్... పాటల తోట. రకరకాల టీల రుచిని ఆస్వాదిస్తూఊ... టీ తోటల్లో విహరిద్దాం.1వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నంబర్ 17230, శబరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ప్రయాణం రాత్రంతా సాగుతుంది. 2వ రోజు ఉదయం (07.57గంటలకు) రైలు కోయంబత్తూరుకి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ఊటీకి బయలుదేరాలి. హోటల్లో చెక్ ఇన్ అయ్యి, రిఫ్రెష్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్లో విహరించి రాత్రికి హోటల్కి చేరడం. రాత్రి బస ఊటీలోనే. 3వ రోజు: బేక్ఫాస్ట్ తరవాత దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శనం తర్వాత హోటల్కు చేరడం. ఆ రాత్రి బస కూడా ఊటీలోనే.4వ వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కూనూరు సైట్ సీయింగ్కి వెళ్లాలి. తిరిగి ఊటీకి వచ్చి హోటల్కి చేరి విశ్రాంతి. షాపింగ్ చేసుకోవచ్చు.5వ రోజు : బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంత సమయం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతిగా ఫొటో షూట్ చేసుకుంటూ గడిపిన తర్వాత మధ్యాహ్నం గది చెక్ అవుట్ చేసి కోయంబత్తూరుకు బయలుదేరాలి. ట్రైన్ నంబర్ 17229 శబరి ఎక్స్ప్రెస్ 15.55 గంటలకు కోయంబత్తూరు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు సికింద్రాబాద్కి ఆరవ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుతుంది. బ్రిటిష్ కాలం నాటి ఉద్యానవనం ఊటీకి ఎందుకెళ్లాలి? ఊటీలో టీ తోటలు తప్ప ఏమున్నాయ్ చూడడానికి? అనే పెదవి విరుపులు ఉంటాయి. కానీ ఊటీలో చూసి తెలుసుకోవాల్సినవి, ఆస్వాదించాల్సినవి చాలా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దీనిని కలయ తిరిగి చూడడం ఆహ్లాదంతోపాటు బోనస్గా విజ్ఞానం కలుగుతుంది. ఇది 54 ఎకరాల గార్డెన్స్ సముదాయం. బ్రిటిష్ పాలన కాలం నాటిది. తమిళనాడు ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తోంది. చెట్లలో ఆరు వందల రకాలున్నాయి. గార్డెన్స్ మధ్యలో ఫాజిల్డ్ ట్రీ ట్రంక్ (శిలాజ వృక్షం) ఉంది. రెండు కోట్ల సంవత్సరాల కిందట జీవించిన వృక్షం అది. ఔషధ వృక్షాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇటాలియన్ గార్డెన్, న్యూ గార్డెన్, లోయర్ గార్డెన్, ఫౌంటెయిన్ టెర్రస్ గార్డెన్ ఇలా రకరకాలుగా విభజించి ఉంటుంది. ఫాజిల్ ట్రీ ట్రంక్ లోయర్ గార్డెన్లో ఉంది.తెలుగు పాటల తోటకూనూరు పట్టణం ఊటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఒకప్పటి తెలుగు సినిమాపాటల చిత్రీకరణ కేంద్రం అనవచ్చు. సినిమా కథలో సన్నివేశాలు ఊటీలో చిత్రీకరించి, పాటలకు మాత్రం కూనూరుకు వచ్చేవాళ్లు తెలుగు దర్శకులు. అప్పట్లో ఊటీ, కూనూరు... ఈ రెండు ప్రదేశాలనూ ఊటీగానే పరిగణిస్తూ సినిమా పాటల చిత్రీకరణ కోసం ఊటీ వెళ్తున్నట్లు దర్శకులు చెప్పేవారు. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలనీని తలపించేది. యూరోపియన్ శైలి ఫుడ్ రెస్టారెట్లు ఇప్పటికీ ఉన్నాయి. వెయ్యి రకాల మొక్కలతో సిమ్స్ పఆర్క్ ఉంది. ఊటీ ప్రకృతి సౌందర్యానికి చిరునామా అయితే కూనూరు పాశ్చాత్య విలాసంగా కనిపిస్తుంది. గులాబీల తోట!ఊటీ బొటానికల్ గార్డెన్స్ అనగానే ఎక్కువ మందికి రోజ్ గార్డెన్ గుర్తు వస్తుంది. ఇక్కడ వందల రకాల గులాబీ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఏటా జరిగే నీలగిరి ఫ్లవర్ షోకి ప్రపంచ దేశాల నుంచి లక్షా యాభై వేల మంది సందర్శకులు వస్తారు. బొటానికల్ గార్డెన్స్లో మొక్కలతో ఏర్పాటు చేసిన భారత రాష్ట్రాల మ్యాప్ను నిశితంగా పరిశీలించి ఆస్వాదించాలి. అన్నట్లు బోన్సాయ్ వృక్షాలను చూడడం మరిచి΄ోవద్దు. ఈ గార్డెన్స్ పరిధిలో తోడా గిరిజన తెగ నివసించే చిన్న ప్రదేశం కూడా ఉంది. దానిని తోడా మండ్ అంటారు. వారి జీవనశైలి ప్రత్యేకం. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలు అందంగా ఉంటాయి.బాలీవుడ్ డ్యూయెట్లు ఇక్కడే!ఊటీలో మనం చూసే సరస్సు సహజసిద్ధమైనది కాదు. బ్రిటిష్ ΄ాలన కాలం నాటిది. చల్లటి నీలగిరుల్లో ఉన్న ఊటీ బ్రిటిష్ వారి వేసవి విడిది. విహారం కోసం సరస్సును తవ్వించారు. యాభై ఎకరాల బొటానికల్ గార్డెన్స్కు దీటుగా ఏడు వేల అడుగుల ఎత్తులో తవ్విన 65 ఎకరాల సరస్సు ఇది. బ్రిటిష్ అధికారులు సరదాగా వేటాడడం కోసం చేపలను పెంచేవారు. ప్రస్తుతం చేపల వేట లేదు. పర్యాటకుల వినోదం కోసం బోట్ షికారు ఉంది. సరస్సు చుట్టూ విస్తరించిన ఎత్తైన చెట్లను చూస్తూ పెడల్ బోట్లో నిదానంగా విహరించడం అనిర్వచనీయమైన అనుభూతి. వేగంగా ప్రయాణించే మోటర్ బోట్లు కూడా ఉంటాయి. సరస్సు చుట్టూ రౌండ్ కొట్టాలంటే సైకిళ్లు అద్దెకిస్తారు. ఈ సరస్సు దగ్గర అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అందులో పిల్లలను ఆకర్షించే టాయ్ ట్రైన్, హాంటెడ్ హౌజ్, హార్స్ రైడ్ ఉంటాయి. ఇక ఊటీ గొప్పదనాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సినిమా చిత్రీకరణ లొకేషన్. ఓ యాభై ఏళ్ల కిందట సినిమాల చిత్రీకరణ ఎక్కువ భాగం ఊటీ, కూనూరుల్లో జరిగేది. తెలుగు సినిమాలే కాదు, బాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఇక్కడే డ్యూయెట్లు పాడుకున్నారు. టెలిస్కోప్లో చూద్దాం!ఊటీ పేరు ఉదకమండలం. ఇది తూర్పు కనుమలలోని నీలగిరుల్లో విస్తరించిన ప్రదేశం. నీలగిరుల్లో ఎత్తైన కొండను దొడబెట్ట అంటారు. దొడబెట్ట అనేది కన్నడ పదం. పెద్ద కొండ అని అర్థం. ఈ ప్రదేశం ఊటీ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉంది. శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల అడుగులు. శిఖరాన్ని చేరడానికి ట్రెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు ఉంది, వాహనాలు వెళ్తాయి. ఈ శిఖరం మీద టెలిస్కోప్ హౌస్ ఉంది. సముద్ర తీరాల్లో లైట్ హౌస్లను చూస్తుంటాం. ఈ శిఖరం మీద ఉన్న టెలిస్కోప్ నుంచి నీలగిరుల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. టీ కప్పు తెచ్చుకుందాం!టీ మ్యూజియం ఊటీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో విస్తారమైన టీ తోటల మధ్య ఉంది. దొడబెట్ట రూట్లో∙వస్తుంది. నిజానికి ఇది పెద్ద టీ ఫ్యాక్టరీ. ఇక్కడ తేయాకును కట్ చేయడంతోపాటు ఆకును స్టీల్ కంటెయినర్లలో వేసి వేడితో ఎండబెట్టడం, క్రష్ చేసి ప్రాసెస్ చేయడం అన్నింటినీ చూడవచ్చు. రకరకాల టీలను రుచి చూడవచ్చు. అలాగే పొడులు కొనుక్కోవచ్చు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన గుర్తుగా టీ మ్యూజియం లోగో ముద్రించిన టీ కప్పులు, ప్లేట్లు, టీ షర్ట్లు కొనుక్కోవచ్చు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. టూర్ ప్యాకేజ్ నిర్వహకుల ఐటెనరీ ఈ సమయానికి అనుగుణంగానే ఉంటుంది.బోట్హౌస్లో షికారు!ఊటీకి 20 కిమీల దూరాన ఉంది పైకారా. ఇది తోడా గిరిజనుల ఆరాధ్య ప్రదేశం. నది పేరు, జలపాతం పేరు, జలపాతం ఉన్న ప్రదేశం పేరు అన్నీ పైకారానే. ఇక్కడ గిరిజనులు కొలిచే ఆలయంలో దేవతను కూడా పైకారా అమ్మ అని పిలుస్తారు. ఈ నది మీద డ్యామ్ ఉంది. రిజర్వాయర్లో బోట్ షికార్ చేయవచ్చు. ఇక్కడ మామూలు పడవలు కాదు, పైకప్పుతో బోట్ హౌస్లుంటాయి. ప్రశాంత పర్యటనహైదరాబాద్లో మొదలై హైదరాబాద్ చేరడంతో పూర్తయ్యే ఈ టూర్ ప్యాకేజ్ పేరు... ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ (ఎస్హెచ్ఆర్094)’. ఇది ఆరు రోజుల పర్యటన. గడియారంతో పరుగులు పెడుతూ ఎక్కువ ప్రదేశాలను చుట్టేసే పర్యటన కాదు. ప్రశాంతంగా ప్రకృతి సౌందర్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాగే చక్కటి విహారం. మూడు రోజులు ఊటీలో బస చేయవచ్చు. టూర్ కోడ్: ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు ప్యాకేజీ ధరలివి! కంఫర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ) సింగిల్ షేరింగ్లో ఒకరికి సుమారుగా 30 వేలవుతుంది. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 17 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి 16 వేలు, పిల్లలకు ఒక్కరికి పదివేలు సుమారుగా. స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్ క్లాస్) సింగిల్ షేరింగ్లో ఒకరికి 27 వేలకు పైగా, ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 15 వేలు, ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా అవుతుంది.రోడ్డు ప్రయాణానికి ఏసీ వాహనాలు, బసకు నాన్ ఏసీ హోటళ్లు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.హోటల్లో ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్యాకేజ్లో ఉంటుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలు వర్తించవు.బోటింగ్, హార్డ్ రైడింగ్, పర్యాటక ప్రదేశాల ఎంట్రన్స్ టికెట్లు కూడా ప్యాకేజ్ ధరలో వర్తించవు. వాతావరణం: ఈ నెలలో ఉష్ణోగ్రతలు 25–17 డిగ్రీల మధ్య ఉంటాయి. ఉలెన్ దుస్తులు తీసుకెళ్లాలి. స్వల్ప వర్షపాతం ఉండవచ్చు. కాబట్టి పిల్లలతో వెళ్లేవాళ్లు గొడుగు దగ్గర ఉంచుకుంటే మంచిది. పెద్దవాళ్లకు చిరు తుంపరలో ఊటీ గార్డెన్స్లో విహరించడం బాగుంటుంది. ఇదీ రూట్: సికింద్రాబాద్లో బయలుదేరిన తర్వాత నల్గొండ, మిర్యాల గూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జక్షన్, తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లలో ఎవరికి సౌకర్యమైన స్టేషన్లో వాళ్లు రైలెక్కవచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో ఏ స్టేషన్లోనైనా దిగవచ్చు కూడా. తెలుగు రాష్ట్రాలు దాటిన తరవాత రైలు తమిళనాడులో ప్రవేశిస్తుంది. ఇది వీక్లీ ట్రిప్. వారానికి ఒక టూర్ మాత్రమే. ప్రతి మంగళవారం ఉంటుంది. ఇదీ చదవండి: Beauty Tips ఆలూతో అందం : అదిరిపోయే చిట్కాలు– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు
అంతర్జాతీయం

మీరు ఇచ్చే సందేశం ఏమిటి? : అమెరికాపై చైనా ధ్వజం
ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులను చైనా తీవ్ర స్థాయిలో ఖండించింది. ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ పేరుతో ఇరాన్పై యూఎస్ చేస్తున్న దాడులు ఎంతమాత్రం సరికాదని హెచ్చరించింది. అసలు ఈ దాడులతో ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని చైనా ప్రశ్నించింది. ‘ మీరు చేస్తున్న దాడులతో ప్రపంచానికి తప్పుడు సందేశం పంపించారు. ఇది చెడు సంకేతాన్ని సృష్టించారు’ అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇప్పటికే యుద్ధం భీకర రూపం దాల్చిన తరుణంలో దాన్ని శాంతింప చేయాల్సింది పోయి.. అగ్నికి ఆజ్యం పోస్తారా? యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వాంగ్ యి ప్రశ్నించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న యుద్ధంతో భవిష్యత్లో పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోమవారం బీజింగ్లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో జరిగిన సమావేశంలో వాంగ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో టెహ్రాన్లో భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ప్రజలు కూడా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ సైతం.. టెహ్రాన్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. అటు రష్యాతో ఇప్పటికే చర్చలు జరిపిన ఇరాన్.. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్తో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాన్కు సాయం చేస్తాంఇరాన్పై అమెరికా దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్పై అమెరికా దాడులను తాము సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలకు సాయం చేయడానికి తాము అండగా ఉంటామన్నారు.

Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?
సాక్షి,అమరావతి: ఆంధ్ర అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనతను సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.జాహ్నవి అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీఎటెక్ పూర్తిచేసిన జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాల కొల్లులోనే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ.. ఉద్యోగ రిత్యా వాళ్లిద్దరూ కువైట్లో ఉంటున్నారు. అంతరిక్ష పట్ల అపారమైన ఆసక్తి ఉన్న జాహ్నవి, విద్యార్థులకు సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ (STEM) విద్యపై చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మన దేశంలో ప్రముఖ ఎన్ఐటీల్లో ప్రసంగాలు ఇచ్చారు. అంతేకాకుండా, అనాలోగ్ మిషన్లు, డీప్ సీ డైవింగ్, దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై ప్రపంచ సదస్సుల్లోనూ పాల్గొంటూ వచ్చారు.International Astronomical Search Collaboration లో ఆమె కృషి ద్వారా, పాన్-స్టార్స్ టెలిస్కోప్ డేటా ఆధారంగా ఓ ఆస్ట్రాయిడ్ను తాత్కాలికంగా గుర్తించారు. తద్వారా స్పేస్ ఐస్లాండ్లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగా పేరు సంపాదించారు. నాసా స్పేస్ అప్స్ చాలెంజ్లో పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇస్రో అందజేసే వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాతకమైన అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.

Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
టెహ్రాన్ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్ 23వ తేదీ) పారిస్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ(ఇరాన్) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు.

భీకర దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్.. దట్టంగా కమ్మేసిన పొగ
అమెరికా జోక్యంతో.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం 11వ రోజు కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. భారీ పేలుళ్లతో శబ్దాలు వినిపించాయి. ఆపై పొగ నగరాన్ని దట్టంగా అలుముకుంది. నష్టం వివరాలు తెలియ రావాల్సి ఉంది. నగరంలోని జన రద్దీ ఉండే ప్రాంతం నుంచే ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే.. టెల్ అవీవ్ మాత్రం ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. 🚨#UltimoMinuto | 🇮🇷 #Tehran pic.twitter.com/BWz8bA5NDW— INTERACTIVA NEWS (@interactivanew) June 23, 2025ఇరాన్ మీడియా సంస్థలు కూడా అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఐఆర్జీసీ, పోలీస్ నిఘా కేంద్రాలు, విద్యా సంస్థలు, విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ ఛానెల్ కథనాలు ఇస్తోంది. ఇవెన్ జైలు పూర్తిగా ధ్వంసమైందని ప్రకటించాయి.జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. తాజా సమాచారం ప్రకారం.. ఇరాన్లో 585 మంది మరణించారు. వీళ్లలో 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య సుమారు 1326గా ఉంది.👇జూన్ 13, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" ప్రారంభించింది.ఇరాన్లోని 12కు పైగా సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల దాడులు.మృతుల సంఖ్య 224కి చేరింది, వీరిలో 90 మందికిపైగా పౌరులు.👇జూన్ 14, 2025ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం – "టూ ప్రామిస్ 3" ఆపరేషన్దాదాపు 100 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి.టెల్ అవీవ్, జెరూసలెం, రమత్గాన్ వంటి నగరాల్లో పేలుళ్లు.ఇజ్రాయెల్ 70% క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్టు ప్రకటించింది.👇జూన్ 15, 2025ఇరాన్ 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది.ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు లక్ష్యంగా మారాయి.ఇరాన్ సైనిక జనరల్స్ బ్రిగేడియర్ మెహ్రబి, రబ్బాని మరణించారు.👇జూన్ 16, 2025ఇజ్రాయెల్ టెహ్రాన్పై గగనతల దాడులు కొనసాగించిందని నివేదికలు.ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చాయి.👇జూన్ 17, 2025ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది మృతి, 1326 మంది గాయాలు – మానవ హక్కుల సంఘాల నివేదిక.టెహ్రాన్లోని చమురు శుద్ధి కేంద్రాలు, అణు పరిశోధనా కేంద్రాలు ధ్వంసం.👇జూన్ 18, 2025ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణితో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసినట్టు ప్రకటించింది.టెల్ అవీవ్, హైఫా ప్రాంతాల్లో పేలుళ్లు.జెరూసలెంలోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసివేత.👇జూన్ 19, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ సైలెంట్ స్టార్మ్" ప్రారంభించింది.ఇరాన్ కమ్యూనికేషన్ హబ్లు, రాడార్ కేంద్రాలపై దాడులు.ఇరాన్ సైనికాధికారి బ్రిగేడియర్ హుస్సేన్ అబ్దోల్లాహీ మరణం.👇జూన్ 20, 2025ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరాలపై దాడి.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ 80% క్షిపణులను అడ్డుకుంది.ఇరాన్ 40 మంది సైనికులు మృతి చెందినట్టు ప్రకటించింది.👇జూన్ 21–22, 2025పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.ఇరాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అమీర్ హొసేన్ ఫెక్హీ హత్య.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు: “ఖమేనీ హతమైతేనే యుద్ధం ముగుస్తుంది” అని ప్రకటన.అమెరికా, జూన్ 22, 2025 (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:10 గంటలకు) ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులను "ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్" అనే కోడ్ పేరుతో నిర్వహించారు.📍 దాడి జరిగిన ముఖ్య ప్రాంతాలు:ఫోర్డో అణు కేంద్రం – పర్వతాల లోతులో ఉన్న ఈ కేంద్రంపై B-2 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించారు.నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం – జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్షిపణులు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం – ఇదే విధంగా టోమాహాక్ క్షిపణులతో ధ్వంసం చేశారు.✈️ దాడి వివరాలు:7 B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించాయి.30 టోమాహాక్ క్షిపణులు రెండు జలాంతర్గాముల నుంచి ప్రయోగించబడ్డాయి.మొత్తం 125కి పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.👇జూన్ 23, 2025టెహ్రాన్లో భారీ పేలుళ్లు, ప్రజలు నగరం విడిచి తరలింపు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ: “యుద్ధం మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో ప్రకటన.యుద్ధం మరింత తీవ్రతరమవుతుందన్న అంచనాలు.ఇరాన్ తరఫున మరణించిన ఉన్నతాధికారులు:మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ – ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) చీఫ్.మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ – ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.అలీ షమఖానీ – మాజీ జాతీయ భద్రతా చీఫ్.జనరల్ ఘోలం అలీ రషీద్ – ఖతమ్ అల్-అన్బియా రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధిపతి.వీళ్లతో పాటు ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. వీరిలో అబ్దొల్హమీద్ మినౌచెహ్ర్, అహ్మద్రెజా జోల్ఫాఘరీ, అమీర్హొస్సేన్ ఫెక్హీ తదితరులు ఉన్నారు. ఈ స్థాయి నాయకుల మరణం ఇరాన్కు వ్యూహపరంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇక.. ఇజ్రాయెల్ వైపు ప్రాణనష్టం వివరాలు స్పష్టంగా తెలియరావడం లేదు. కానీ ఇరాన్ క్షిపణి దాడుల వల్ల రాజధాని టెల్ అవీవ్ సహా చాలా ప్రాంతాల్లోప్రాణ నష్టం సంభవించి ఉంటుందనేది ఒక అంచనా.
జాతీయం

ఇరాన్ ఎఫెక్ట్.. భారత్కు గ్యాస్ సిలిండర్ టెన్షన్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్ టెన్షన్ మొదలైంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్ నుంచి భారత్కు 95 శాతం ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.మూడింట రెండు అటు నుంచే..దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎరువులపై ప్రభావం.. మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చమురు నిల్వలు ఓకే.. ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.రష్యా నుంచి..భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.

రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో రెండేళ్లుగా యాక్టివ్గా ఉన్న ఈ ముష్కరులు.. భారత భద్రతా దళాలపై జరిగిన మూడు ప్రధాన దాడులలో పాల్గొన్నారనే అనుమానాలున్నాయి. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి. ఈ ఉగ్రవాదులు పూంచ్లోని డెహ్రా కి గలి (డీకేజీ) ద్వారా భారత్లోనికి చొరబడి 2022 చివర లేదా 2023 ప్రారంభం నుండి జమ్ముకశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యింది. జమ్ము ప్రాంతంలో ఒక సంవత్సరానికి పైగా చురుకుగా ఉన్న ఈ బృందం 2024 ద్వితీయార్థంలో భారత భద్రతా దళాలపై దాడులకు తెగబడిందని తెలుస్తోంది.ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పూంచ్లోని సురాన్కోట్లోని బుఫ్లియాజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో పాల్గొంది. నాటి దాడిలో నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. 2024 మేలో బక్రాబల్ మొహల్లా వద్ద భారత వైమానిక దళ కాన్వాయ్పై జరిగిన మెరుపుదాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. పూంచ్లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలలో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బృందం 2024లో కశ్మీర్కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ దాడికి ముందు వీరు సమావేశమయ్యారని దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: ఇరాన్కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్ ఆగ్రహం

మళ్లీ సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట సీఎం అయ్యే అర్హత మళ్లీ ఎంకే స్టాలిన్కే ఉందని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సర్వేలో తేలింది. 77 శాతం మంది స్టాలిన్కే మద్దతు పలికారు. 67 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి/స్వామికి , 60 శాతం మంది తమిళగ వెట్రి కళగం నేత విజయ్కు ఓటు వేశారు.అయితే, విజయ్ కంటే ఒక అడుగు ముందు వరుసలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు 64 శాతం మంది మద్దతు ఇవ్వడం విశేషం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం దిశగా డీఎంకే కసరత్తుల వేగాన్ని పెంచింది. ఈసారి అధికార పగ్గాలు చేజిక్కించుకునే విధంగా అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. మార్పు అంటూ తొలిసారిగా ఎన్నికల కదన రంగంలోకి సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ సన్నద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉందో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో ప్రస్తుత ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల గురించి చెన్నైలోని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్వే వివరాలను ఆదివారం ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించారు. స్టాలిన్కే మద్దతు ఈ సర్వే మేరకు 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అర్హత స్టాలిన్కే ఉందని 77.83 శాతం మంది మద్దతు పలికారు. అలాగే 67.99 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సీఎం కావాలని మద్దతు ఇచ్చారు. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ సీఎం కావాలని 67.99 శాతంమంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సీఎం కావాలని 64.58 శాతం మంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, గత ఏడాది రాజకీయ పార్టీని ప్రకటించి ప్రస్తుతం దూకుడుగా వ్యూహాలకు పదును పెట్టిన విజయ్ సీఎం కావాలని 60.58 శాతం మంది మద్దతుగా ఓటు వేసినట్టు సర్వే వివరాలలో పేర్కొన్నారు. ఇక, ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో అన్న ప్రశ్నకు డీఎంకేకు 17.70 శాతం, అన్నాడీఎంకేకు 17.30 శాతం, 12.20 శాతం మంది తమిళగవెట్రి కళగంకు మద్దతుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పథకాల తీరు తెన్నులకు ఓట్లు అధికంగానే పడ్డాయి. ఇందులో అల్పాహార పథకానికి 72 శాతం మంది, మహిళా హక్కు పథకానికి 62 శాతం మంది, మహిళలకు ఉచిత బస్సు సేవలకు 56 శాతం మంది మద్దతు ఇచ్చారు. తమిళనాడు ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించే పార్టీ డీఎంకే అని 25.30 శాతం మంది, అన్నాడీఎంకే అంటూ 22.80 శాతం మంది, 15.70 శాతం బీజేపీ, 11.72 శాతం తమిళగ వెట్రి కళగం అంటూ తమ మద్దతును తెలియజేసి ఉండడం గమనార్హం. ఈ శాతాన్ని బట్టి చూస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీ అన్నట్టుగా సాగడం స్పష్టమవుతోంది.

‘వందే భారత్’లో విండో ఓపెన్ అవుతుందని..
న్యూఢిల్లీ: ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ‘వందేభారత్’లో ప్రయాణించాలని పలువురు భావిస్తుంటారు. అయితే ఈ రైలు అధునాతనమైనది కావడంతో కొందరు ప్రయాణికులు గందరగోళానికి గురవుతుంటారు. ఇటువంటి ఉదంతమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వందే భారత్ ఎక్స్ప్రెస్లో తనకు ఎదురైన అనుభవాన్ని @AiSenpaiyt అనే రెడిట్ యూజర్ 'r/IndianRailways' ఫోరమ్లో వివరించారు. ఈ పోస్టును చూసినవారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో తాను కూర్చున్న విండో సీటును అడిగేందుకు ఒక మహిళ అనారోగ్యాన్ని సాకుగా చూపిందని, దానిని తాను ఎలా తిరస్కరించాననేది ఆయన ఆ పోస్టులో తెలిపారు. ఆ రెడిట్ యూజర్ తాను రిజర్వు చేసుకున్న విండో సీటులో హాయిగా కూర్చున్నారు.రెండు స్టాప్ల తరువాత 40 ఏళ్ల ఒక మహిళ అతని పక్క సీటులో కూర్చుంది. రెండు పెద్ద బ్యాగులు కూడా ఆమె దగ్గరున్నాయి. ఆమె మర్యాదపూర్వకంగా నవ్వుతూ పలుకరించింది. కిటికీలోంచి బయటకు చూసేందుకు కొద్దిగా ముందుకు వంగింది. తరువాత ఈ సీటు తనకు కావాలని, కడుపులో వికారంగా ఉందని తెలిపింది. అయితే అతను క్షమాపణలు కోరుతూ, ఆ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆమె తనకు కేటాయించిన సీటులోనే కూలబడింది. వందేభారత్ రైలులో విండో సీటు తెరుచుకోదని తెలియని ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని ఆ రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
ఎన్ఆర్ఐ

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట'
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్లోని శియావాసీ పార్క్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్ను పూలతోటలా మార్చారు. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు. (చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్)

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.
క్రైమ్

బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. ఒకరోజు తనకు న్యూడ్ వీడియో కాల్ చేయాలని, లేదంటే చాటింగ్ అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరించాడు. ఆ బాలిక ఒకరోజు న్యూడ్ కాల్చేసి మాట్లాడుతుండగా వీడియోను స్క్రీన్ రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు పంపించాడు. వారు వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఓ యువకుడు ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షీటీం పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు.

బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కర్నూలు: కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమలరావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్ను ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమలరావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గొంతు కోసి.. మృతదేహాన్ని పడేసి పాణ్యం: తేజేశ్వర్ను అత్యతం కిరాతకంగా హత్య మార్చారని పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. కారులోనే తేజేశ్వర్ను గొంతు కోసి హత్య చేశారని, నన్నూరు టోల్ప్లాజా మీదుగా పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పిన్నాపురం రస్తాలో పడేశారన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కారు కోసం గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు ఉండగా మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

అంతుచూసిన అక్రమ సంబంధం
మైసూరు: చామరాజనగర జిల్లా కొళ్లేగాలలోని హలె హంపాపురలోని సువర్ణవతి నది ఒడ్డున పాతిపెట్టిన మహిళ శవం వర్షాలకు బయటకు వచ్చింది. ఆమె హత్యకు గురైనట్లు గుర్తించారు. కొళ్లేగాల పట్టణంలో నివసించే విజయ్కుమార్ భార్య సోనాక్షి (29) గా గుర్తించారు. పోలీసులు విచారణ జరిపగా, వారి ఇంటి దగ్గరే ఉండే మహేష్ బాబు ఈ హత్య చేశాడని తేలింది. సోనాక్షితో మహేష్బాబు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి సోనాక్షి భర్త గొడవ పడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసులు నిందితున్ని విచారించారు. ఇటీవల సోనాక్షిని బయటకు తీసుకెళ్లిన నిందితుడు ఆమెను హత్య చేసి శవాన్ని చిన్నపాటి గుంత తీసి పాతిపెట్టి వెళ్లిపోయాడు. వర్షాలు రావడంతో పాటు కుక్కలు శవాన్ని లాగడంతో బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని చామరాజనగర సిమ్స్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితున్ని అరెస్టు చేశారు.

‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది’
సాక్షి, హైదరాబాద్: ‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఈ కేసు నుంచి మీ కూతుర్ని తప్పించాలంటే మేం చెప్పిన ఫోన్పే నంబర్కు రూ.50 వేలు వెంటనే పంపండి’అంటూ బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే వారి వలకు చిక్కకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు నగరవాసి శ్రీనివాస్రెడ్డి. కేసు వివరాల్లోకి వెళితే..సరూర్నగర్కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను నడిపే శ్రీనివాస్రెడ్డికి ఈనెల 19న ఒక వాట్సప్ కాల్ వచ్చింది. అందులో పేరు సీబీఐ విక్రమ్గా..డీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉంది. అవతలి నుంచి ఒక మహిళ ఇంగ్లిష్ లో మాట్లాడుతూ.. మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది అని చెప్పింది. వెంటనే డబ్బులు పంపితే ఆమెను ఈ కేసు నుంచి వదిలేస్తామని లేదంటే థర్డ్ డిగ్రీ తప్పదని బెదిరించడం ప్రారంభించింది. ఫోన్ పే చేయాలంటూ ఒక నంబర్ ఇచ్చింది. పదేపదే డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించిన శ్రీనివాస్రెడ్డి ఆ వాట్సప్ కాల్ను కట్ చేసి, కెనడాలో ఉన్న కూతురుకు ఫోన్ చేశారు. ఇంట్లోనే నిద్రపోతున్నానని..తాను క్షేమంగానే ఉన్నానని...ఎలాంటి సమస్య లేదని కూతురు చెప్పింది. దీంతో తన అనుమానం నిజమైందని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు చేసిన ఫోన్ నంబర్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. తనను మోసగించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. టీజీ సీఎస్బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.