Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Iran Khamenei Rejects Trump Ceasefire1
‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు’: ట్రంప్ ప్రకటనపై ఖమేనీ మండిపాటు

టెహ్రాన్‌: ఇరాన్- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేయడంపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ తప్పుడు ప్రకటన చేశారంటూ ఖమేనీ ఆరోపించారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణ సూచనను తిరస్కరిస్తూ, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే దేశం కాదని ఖమేనీ స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఈ ఇరు దేశాలు ఘర్షణలను ఆపేందుకు అంగీకారం తెలిపాయని ప్రకటించిన కొన్ని గంటల​కే ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ దీనిని తిరస్కరిస్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అబద్ధమని, అమెరికాకు ఇటీవల జరిగిన అవమానం నుండి దృష్టిని మళ్లించడానికే ట్రంప్‌ ఈ విధమైన ప్రకటన చేశారని పేర్కొంది. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు. ఇరాన్‌ చరిత్ర, ఇక్కడి ప్రజల గురించి తెలిసిన వారికి ఇరాన్ లొంగిపోయే దేశం కాదని స్పష్టంగా తెలుసన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రంప్‌.. ఇరాన్- ఇజ్రాయెల్ రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయని, సంఘర్షణతో నిండిన ఈ ప్రాంతంలో ఈ తాజా పరిణామం అభివృద్ధికి దారితీస్తుందని దానిలో పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం శాంతియుతంగా జరుగుతుందని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్‌? తుది నిర్ణయంపై తర్జనభర్జన

Air India Cancels All Middle East Europe And Us Flights2
ఎయిరిండియా కీలక నిర్ణయం.. గల్ఫ్‌ మీదుగా వెళ్లే విమానాలు రద్దు

గల్ఫ్‌ దేశాల్లో సైరెన్లు మోగుతున్నాయి. గల్ఫ్‌ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్‌ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్‌, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను ఎయిర్‌ ఇండియా నిలిపివేసింది.మరోవైపు, ఖతార్‌లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్‌ ఎంబసీ సూచించింది. ఖతార్‌ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని భారత్‌ తెలిపింది. కాగా, ఇరాన్‌ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్‌ రక్షణ శాఖ ప్రకటించింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నా ఖతార్.. ఇతర దేశాల పౌరుల భద్రతకు ముప్పులేదని తెలిపింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్‌ స్పష్టం చేసింది.కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్‌ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్‌లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్‌ ప్రకటించాయి.

Shubhanshu Shuklas Axiom Space Mission Likely Tomorrrow3
రేపే శుభాంశు శుక్లా రోదసి యాత్ర

న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు ఎట్టకేలకు కొత్త తేదీ ఖరారైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా జూన్​25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్​ సెంటర్​ నుండి ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల అనంతరం ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది. 14 రోజుల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్త​వేత్తలు ఈ నలుగురు వ్యోమగాములతో సంభాషించనున్నారు. ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్‌? తుది నిర్ణయంపై తర్జనభర్జన

chandrababu govt negligence taken more peoples Died: Andhra pradesh4
చంద్రబాబే యమకింకరుడు!

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచార కండూతికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి...! టీడీపీ అధినేత సభలకు జనం వెల్లువెత్తినట్లు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరీ...! బాబు సభలో చీరల పంపిణీకి మహిళలు భారీగా వచ్చారని నమ్మించే మాయాజాలానికి ముగ్గురు మృత్యువాత... చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో ఆరుగురు.. సింహాచలంలో ఏడుగురు దైవ సన్నిధిలో దుర్మరణం. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ‘పాద’ఘట్టం కింద నలిగిపోయిన ప్రాణాలు అనేకం..! గతంలో చంద్రబాబు కాన్వాయ్‌ ఢీకొనిఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రభుత్వ వైఫల్యాలతో అర్ధాంతరంగా ముగిసిన జీవితాలు ఎన్నో..! కానీ అవి ఏదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటనలు కావు. పరోక్షంగా చంద్రబాబు చేసిన హత్యలే!! అందుకు బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసులు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అడుగు పెడితే చాలు... యమపాశం పట్టుకుని యమకింకరుడు వచ్చినట్టుగా సామాన్యులు హడలిపోయే పరిస్థితులు కల్పించిన ఆ ఉదంతాలు ఇవిగో..పుష్కరాల్లో తొక్కిసలాట సమయంలో మృతదేహాలను పేర్చిన దృశ్యం(ఫైల్‌)గోదావరి పుష్కరాలు... బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను చూసేందుకు వస్తున్నట్లు డ్రోన్‌ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చేయాలని చంద్రబాబు భావించారు. తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు ఈ ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైన 2015 జూలై 15 ముందు రోజు అంటే 14వతేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసివేశారు. మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్‌లో పడిగాపులు కాశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి తదితరులు జూలై 15న ఉదయం 8 గంటలకు పుష్కర ఘాట్‌లో స్నానానికి వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్‌ వద్ద ఒక్క గేటును మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు. పెద్ద సంఖ్యలో తోసుకుని వచ్చే భక్తులు చంద్రబాబు కోసం వస్తున్నట్టుగా డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలని కుట్ర పన్నారు.రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదేమీ ప్రమాదవశాత్తూ జరిగింది కాదు. పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విషాదం చోటు చేసుకుంది. అంటే ఇవన్నీ ఆయన చేసిన హత్యలే! మరి ఆనాడు చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు పెట్టారా...? దీనిపై విచారణకు నియమించిన కమిటీ కాలయాపన చేయడం మినహా భక్తుల దుర్మరణానికి కారకుడైన చంద్రబాబును బాధ్యుడిని చేసిందా? కందుకూరులో తొక్కిసలాట క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌) ఎన్నికల ప్రచార ఆర్భాటానికి ఎనిమిది ప్రాణాలు హరీ..! పోలీసులు వారించినా కందుకూరు ఇరుకు రోడ్డులో సభతన సభలకు జనం రావడం లేదన్న వాస్తవం చంద్రబాబును తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కొందరి ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. తన కార్యక్రమాలకు జనం భారీగా వచ్చినట్టుగా నమ్మించాలని ఆయన ఎత్తుగడ వేశారు. దీని ఫలితం.. కందుకూరులో 8 మంది సామాన్యుల మృత్యువాత! 2022 డిసెంబరు 29న చంద్రబాబు ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. తన కార్యక్రమానికి భారీగా జనం వచ్చినట్లు చూపించాలని ఉద్దేశపూర్వకంగా ఓ ఇరుకైన రోడ్డులో సభ నిర్వహించారు. ఆ రోడ్డులో సభ నిర్వహించవద్దని పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు ఖాతరు చేయలేదు.ఆ రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారిపోయింది. కనీసం చంద్రబాబు ప్రసంగించే వాహనాన్ని అయినా ఆ రోడ్డు వద్ద వెడల్పుగా ఉన్న జంక్షన్‌లో నిలపాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. ఆ ఇరుకైన రోడ్డులోకే చంద్రబాబు వాహనాన్ని హఠాత్తుగా తీసుకెళ్లారు. దాంతో అలజడి రేగి తొక్కిసలాట జరిగింది. జనం పక్కన ఉన్న కాలువలో ఒకరిపై ఒకరు పడిపోయారు. అమాయకులు మృత్యువాత పడ్డారు. చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చినట్టు చూపించేందుకు వేసిన ఎత్తుగడ 8 మందిని బలితీసుకుంది. మరి దీన్ని దుర్ఘటన అంటారా...? చంద్రబాబు చేసిన హత్యలే కదా!! మరి అందుకు ఆయనపై హత్యానేరం కింద కేసు పెట్టాలి కదా? అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాటలో కింద పడిన భక్తులు తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణంచంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఎనిమిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. దాదాపు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 9వతేదీ తెల్లవారు జామున ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా తిరుపతి చేరుకున్నారు.వేచి ఉండేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో తీవ్ర చలిలో రోడ్లపైనే గంటల తరబడి నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో టికెట్లు జారీ చేస్తున్నామంటూ హఠాత్తుగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ⇒ 2018 మార్చి 31న వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట రాముల వారి కల్యాణం సందర్భంగా టెంపరరీ షెడ్‌ గాలికి కుప్ప కూలిన ఘటనలో నలుగురు మృతి చెందగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తొక్కిసలాటలో మరణించిన మహిళ (ఫైల్‌) గుంటూరులో చీరలు పంపిణీ... ముగ్గురు మహిళలు మృత్యువాతచంద్రబాబు తన ప్రచారార్భాటంతో మహిళలనూ వదిలిపెట్టలేదు. 2023 జనవరి 1న గుంటూరులో ఆయన సభ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున చీరలు పంచుతామంటూ మహిళలను తరలించి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఆ కార్యక్రమం ముగిస్తున్నట్టు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. దాంతో ఉన్న కొద్ది చీరలు తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించింది. చంద్రబాబు ప్రచారార్భాటం కోసం వేసిన చీప్‌ ట్రిక్‌తో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరి ఆ రోజు ముగ్గురు మహిళల మృతికి చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ ఆయనపై హత్యానేరం నమోదు చేయాలి కదా? అని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు. అప్పన్న చందనోత్సవంలో తీవ్ర నిర్లక్ష్యం... ఏడుగురు భక్తుల దుర్మరణంపవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నా... దైవ సన్నిధిలో భక్తుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు సర్కారు అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించింది. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నాసిరకంగా నిరి్మంచిన గోడ కుప్ప కూలడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాబు గద్దింపు ఇదీ..!ఏం కుంభమేళాలో చనిపోవడం లేదా..? జగన్నాధ రథ యాత్రలో చనిపోవడం లేదా..? యాక్సిడెంట్లలో చనిపోవడం లేదా...? బాబు కాన్వాయ్‌ ఢీకొని ఇద్దరు మృతిగతంలో చంద్రబాబు కాన్వాయ్‌ ఢీకొని ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 2015 జూలై 15న నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌ ఢీకొని పోలవరం పంచాయతీ యడ్లగూడెంకు చెందిన యడ్లపాటి మంగమ్మ (70) మృతి చెందింది. 2016 ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వాహనం ఢీకొని విజయవాడలో నాగేంద్ర వరప్రసాద్‌ అనే ఉద్యోగి మృతి చెందారు. యనమలకుదురుకు చెందిన ఆయన సైకిల్‌పై కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన చంద్ర బాబు కాన్వాయ్‌ బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలైన వరప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

India Becomes First Team In World After 70 Years To Rarest Of Rare Feats5
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ర‌స‌వత్త‌ర ముగింపున‌కు చేరుకుంది. ఇంగ్లండ్ త‌మ విజ‌యానికి 350 ప‌రుగులు దూరంలో ఉండ‌గా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మయానికి ఇంగ్లండ్ వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది.క్రీజులో జాక్‌ క్రాలీ (12 బ్యాటింగ్‌), బెన్‌ డకెట్‌ (9 బ్యాటింగ్‌) ఉన్నారు. అంత‌కముందు భార‌త్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శత‌క్కొట్టారు.ఈ టెస్టులో పంత్‌కు ఇది రెండో సెంచ‌రీ. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన 6 ప‌రుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండ‌డంతో మ‌రోసారి బౌల‌ర్ల‌కు మ‌రోసారి క‌ఠిన స‌వాలు త‌ప్ప‌దు. బుమ్రాకు తోడుగా సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.93 ఏళ్ల చరిత్రలోనే..ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంది.గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, రిషభ్‌ పంత్‌ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్, పంత్‌ శతకాలు బాదారు.అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్‌లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్‌ను అందుకున్నారు.చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత‌

12 Day War Ends: Trump Announces Israel Iran Ceasefire6
యుద్ధం ముగిసింది.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

కాల్పుల విరమణను ఇరాన్‌, ఇజ్రాయెల్‌ అంగీకరించాయంటూ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు.‌ కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. 12 రోజలు యుద్ధానికి ఇది ముగింపు.. యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో పోస్ట్‌ చేశారు.మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయన్న ట్రంప్‌.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు. కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ కొట్టిపారేసింది. ప్రస్తుతానికి కాల్పుల విరమనణ జరగలేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధంపై అనిశ్చితి ఏర్పడింది.కాగా, కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్‌ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్‌లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్‌–ఉదేయిద్‌ అమెరికా ఎయిర్‌బేస్‌పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్‌ ‘ఆపరేషన్‌ బేషరత్‌ ఫతాహ్‌’ అని పేరుపెట్టింది. ఇరాక్‌లోని అయిన్‌ అల్‌ అసద్‌ బేస్‌పై ఇరాన్‌ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది.

Mother Lost Her Life Because Of Her Daughter In Jeedimetla Hyderabad7
జీడిమెట్లలో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

సాక్షి, మేడ్చల్‌: జీడిమెట్ల పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్‌(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.ఎన్‌ఎల్‌బీ నగర్‌లో నివాసముండే 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ.. తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి(39) గొంతు పిసికి, తలపై రాడ్‌తో కొట్టి చంపేసింది జీడిమెట్ల పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Massive Robbery In Chengalpattu Express In Anantapur District8
చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. సిగ్నల్‌ కట్‌ చేసి...

సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ ఘటన జరిగింది.దుండగులు కోమలి సమీపంలో సిగ్నల్‌ కేబుల్‌ కట్‌ చేయడంతో రైలు నిలిచిపోయింది. ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకున్నారు. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Dilraju Once Again Reacts On Game Changer Failure9
'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గేమ్ ఛేంజర్'.. దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. తొలిరోజు తొలి ఆటకే ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే హీరో-నిర్మాత దీని గురించి పెద్దగా స్పందించలేదు కానీ దర్శకుడు, ఎడిటర్ మాత్రం కొన్నిరోజుల తర్వాత మాట్లాడారు. తమది తప్పు కాదన్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే 'తమ్ముడు' సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు 'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్పేశారు.దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో జడ్జిమెంట్, ఫిల్మ్ మేకింగ్‌లో అనుభవం అనే బ్రాండ్ ఉంది. మీరు తీసే సినిమాలో మీకు తెలియకుండా ఏమీ జరగదంటారు. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలా ఎందుకు జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100 శాతం ఆ సమస్య ఉంటుంది. దిల్ రాజుకే కాదు. అందరికీ ఆ ప్రాబ్లమ్ తప్పదు. సినిమాని నాలుగున్నర గంటలు తీశారని ఎడిటర్ చెప్పింది నిజమే. పెద్ద డైరెక్టర్‌తో చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేం'(ఇదీ చదవండి: థగ్‌ లైఫ్‌ డిజాస్టర్‌.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను: మణిరత్నం)'అయితే రోజూ కిచిడీ ఉంటుంది. రోజూ కావాలా.. మొత్తం అయిపోయాక ఒక్కసారి చూసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. తప్పు జరిగినప్పుడు ప్రొడ్యూసర్ ఆపాలి. దానిని ఆపలేకపోయానంటే అది నా వైఫల్యమే. అలాంటి ప్రాజెక్ట్‌ని నేను చేసి ఉండకూడదు. నా కెరీర్‌లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేదు. అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణంయం అదే. పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు ముందే కాంట్రాక్ట్‌లో క్లియర్‌గా పాయింట్లు పెట్టి సినిమాకు వెళ్లాలి. అలా చేయలేకపోయాను. అది నా తప్పు''ఆ తప్పుని అంగీకరించి దానిని అక్కడితో వదిలేశాను. అది మన స్కూల్ కాదు. అలా కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్' అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలానే చివరి నిమిషం వరకు మీరు సినిమా చూడలేదట కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అది మాత్రం తప్పు, తాను ముందే సినిమా చూశానని చెప్పారు. ఏదేమైనా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తప్పుని హుందాగా ఒప్పుకోవడం కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

YS Jagan Fire On CM Chandrababu Over Singaiah Incident10
మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతిపై విష ప్రచారంతో టీడీపీ, ఎల్లో బ్యాచ్‌ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ‘ఎక్స్‌’ వేదికగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడిగిపారేశారు. ‘‘ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది.ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరం..’ అని ధ్వజమెత్తారు. ‘మీ పర్యటనల సమయంలో.. మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మానవత్వం, నైతికత గురించి మీరా మాట్లాడేది?..’ అని సీఎం చంద్రబాబును సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా మారండి..! అని హితవు పలుకుతూ సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.అందులో ఏమన్నారంటే.. చంద్రబాబూ..! ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి చేశారు? గతంలో మీరుగానీ, మీ పవన్‌కళ్యాణ్‌గానీ తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా.. మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్‌ హక్కు కాదా? మాకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం..! లేదంటే మూడ్‌ రానప్పుడు మీకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వాని కైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా!! జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో పోలీసులు అయినా జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ అనుసరించి ఆమేరకు ఆ మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్‌ ఇది.మరి జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రామ్‌కు సంబంధించిన రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత.. పైలట్‌ వెహికల్స్, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమైనప్పుడు.. మరి మీ రోప్‌ పార్టీలకు జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌ పట్టుకుని, ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా.. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్‌ పార్టీని, పైలట్‌ వాహనాలను పెట్టడానికి కారణం. ⇒ మరి మీ పైలట్‌ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్‌ పార్టీలు.. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్‌ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్‌ కింద ఎవరూ పడలేదన్నదా? ⇒ జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్‌ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్‌ కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్‌. మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికల్‌ మీరు ప్రొవైడ్‌ చేయకపోవడంతో గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్‌ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్‌ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్‌ వెహికల్స్, మీ రోప్‌ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్‌. ⇒ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్‌ డైవర్షన్‌ రాజకీయాలు?⇒ ప్రతిపక్షంగా ఉన్నందున నేను ప్రెస్‌మీట్‌ పెట్టి గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే.. మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌పోజ్‌ చేస్తే... రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లల బతుకులు.. వీటన్నింటినీ నేను చెబితే... వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు డైవర్షన్‌ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. ⇒ ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు.. దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మా పార్టీ ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మావాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఆరి్థక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చా.ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మామీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement